BJP Leaders Detained by Police in Zahirabad
బీజేపీ నాయకులను అదుపులోకి తీసుకున్నపోలీసులు
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గంలో బీజేపీ నాయకులను పోలీసులు చిరగ్పల్లి వద్ద సోమవారం అదుపులోకి తీసుకున్నారు.ముందస్తు జాగ్రత్త చర్యగా ఈ అరెస్టులు చేసినట్లు ఎస్సై నరేష్ తెలిపారు. ఈ చర్యలను ఖండించిన జిల్లా ప్రధాన కార్యదర్శి నౌబాద్ జగన్నాథ్, ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కును అణచివేస్తున్నారని, అక్రమ అరెస్టుల ద్వారా ప్రభుత్వంపై ప్రశ్నలు లేవనెత్తకుండా అడ్డుకునే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. జిల్లా కార్యవర్గ సభ్యులు నౌబాద్ జగన్నాథ్ హిందూస్, జగన్, వడిగార్పల్లి డిప్యూటీ సర్పంచ్ పాండు, యువ మోర్చా జి.ఎస్ మడివాలయ స్వామి తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
