కొవ్వొత్తుల ర్యాలీ ద్వారా పాత్ ఫైండర్ ఐనవోలు పాఠశాల సంతాపం.

School School

విమాన ప్రమాద మృతులకు ఘన నివాళి • కొవ్వొత్తుల ర్యాలీ ద్వారా పాత్ ఫైండర్ ఐనవోలు పాఠశాల సంతాపం

అయినవోలు నేటి ధాత్రి:

అహ్మదాబాద్ లో ఇటీవల జరిగిన ఘోర విమాన ప్రమాదంలో అనేక అమాయక ప్రజలు తమ ప్రాణాలను కోల్పోయిన విషయం అత్యంత హృదయవిదారకమైనది. ఈ విషాద ఘటనలో మృతి చెందిన వారి ఆత్మలకు శాంతి చేకూర్చేలా అయినవోలు ఫాత్ పైండర్ పాఠశాలలో శనివారం విద్యార్థులతో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించబడింది.ఈ కార్యక్రమంలో విద్యార్థులు,డైరెక్టర్ ఎన్ వెంకటేశ్వర్ రావు మరియు ప్రిన్సిపాల్ సుభహనోద్దీన్ ఉపాధ్యాయులు మరియు సిబ్బంది పాలుపంచుకుని, మౌనంగా కాంతి ప్రదీపాలు చేతబట్టి ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ బాధిత కుటుంబాలకు ధైర్యం, ఆదరణ కలగాలని ప్రార్థించారు.మానవత్వాన్ని ప్రతిబింబించే విధంగా నిర్వహించిన ఈ కాండిల్ ర్యాలీ ద్వారా, శాంతి, ప్రేమ, మరియు ఐక్యత సందేశం సమాజానికి అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని పాఠశాల డైరెక్టర్ ఎన్ వెంకటేశ్వరరావు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!