vithanthu dinostavanni vijayavantham cheyali, వితంతు దినోత్సవాన్ని విజయవంతం చేయాలి

వితంతు దినోత్సవాన్ని విజయవంతం చేయాలి ఈనెల 23న జరిగే అంతర్జాతీయ వితంతు దినోత్సవాన్ని విజయవంతం చేయాలని బాలవికాస ప్రతినిధి గోర్కటి రాజ్‌కుమార్‌ పిలుపునిచ్చారు. దుగ్గొండి మండలంలోని పొనకల్‌, రేబల్లె గ్రామాలలో ఆదర్శ గ్రామ నిర్మాణంలో భాగంగా బాలవికాస ఆధ్వర్యంలో ఈనెల 23న జరిగే అంతర్జాతీయ వితంతువుల దినోత్సవాన్ని ఉద్దేశించి గ్రామాలలో ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భర్త చనిపోయిన మహిళలకు బొట్టు, పూలు, గాజులు తీసివేయడం ప్రపంచంలో ఏ దేశంలో లేని మూఢాచారం భారతదేశంలోనే…

Read More

ఎన్నికల ఖర్చుల్లో గోల్‌మాల్‌ : ఎన్నికల విధుల్లో పనిచేసిన అన్ని వ్యవస్థల్లోనూ ఇదే తంతు….

కమీషన్లే ఆయన ప్రధాన కర్తవ్యం. విధులు నిర్వహించే శాఖలోనైనా, అతని భాద్యత నిర్వహించే ఏ పనిలోనైనా ఆయనకు వ్యవస్థను అవినీతిమయం చేయడం వెన్నతో పెట్టిన విద్య. పైకి మాములూగా నవ్వుతూ అంతా సవ్యంగానే చేస్తున్నట్లు కనిపించినా ఆ నవ్వు మాటున అవినీతి అర్రులు చాచుకుని ఆనంద తాండవం చేస్తుంది. గత 7నెలలుగా జరుగుతున్న ఎన్నికల్లో కీలక పాత్ర పోషించేది రెవెన్యూశాఖ. ఈ శాఖలోనూ పనిచేస్తున్న ఈయన ఈ వ్యవహారంలోనూ ఆయన వ్యవహారశైలిని మార్చుకోలేదు. ఇంకే ముంది ఎన్నికల…

Read More

అవినీతి ఉద్యోగుల భరతం పట్టేనా…?

అవినీతి ఉద్యోగుల భరతం పట్టేనా…? వరంగల్‌ అర్బన్‌జిల్లా ఇంటర్మీడియట్‌ క్యాంపు కార్యాలయంలో పేపర్‌ వాల్యుయేషన్‌ పేరుతో అవినీతికి పాల్పడి, ప్రభుత్వ సొమ్మును మెక్కేసిన సూపరింటెండెంట్‌ సాయిబాబా, డిఐఈవో లింగయ్యలను ఎట్టి పరిస్థితిలోను వదలొద్దని, వారి అవినీతిని బయట పెట్టడానికి తక్షణమే విచారణ కమిటిని వేసి కాజేసిన సొమ్మును రికవరీ చేయడంతో పాటు వెంటనే సస్పెండ్‌ చేయాలని జిల్లా ప్రజలు, ప్రజిసంఘాలు, విద్యార్థి సంఘాలు, ప్రజాస్వామికవాదులు, సీనియర్‌సిటిజన్లు, మేధావి వర్గం కోరుకుంటున్నారు. ఇప్పటికే దీనిపై కొందరు అన్ని ఆదారాలు…

Read More

nega vargalu melkovali, నిఘా వర్గాలు మేల్కొనాలి….

నిఘా వర్గాలు మేల్కొనాలి…. వరంగల్‌ అర్బన్‌జిల్లా ఇంటర్మీడియట్‌ డిఐఈవో కార్యాలయంలో పేపర్‌ వాల్యుయేషన్‌ క్యాంపులో భారీ అవినీతి జరిగిందని విద్యార్థి సంఘాలు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాయి. క్యాంపులో పనిచేయని భాయ్స్‌ పేర్లను పనిచేసిట్టుగా నమోదు చేసి, వారి వద్ద నుండి అకౌంట్లను సేకరించి దొంగదారిన, అక్రమంగా వారి అకౌంట్లలో వేసి తిరిగి వారి నుండి వసూలు చేసుకొని దొంగ అకౌంట్లు ఇచ్చిన వారికి కమీషన్‌ ముట్టజెప్పారని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ట్రావెలింగ్‌, స్టేషనరీ, పేపర్‌ వాల్యుయేషన్‌ చేసిన…

Read More

pattapagale veluguthunna vididepalu, పట్టపగలే వెలుగుతున్న విధిదీపాలు

పట్టపగలే వెలుగుతున్న విధిదీపాలు వరంగల్‌ ఆరో డివిజన్‌ బెస్తంచెరువు మిట్టమధ్యాహ్నం వెలుగుతున్న విద్యుత్‌ దీపాలు. సబ్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలో విద్యుత్‌ దీపాలు వెలుగుతున్నా విద్యుత్‌శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని డివిజన్‌వాసులు అంటున్నారు. అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్న సబ్‌స్టేషన్‌ ఎఇ పట్టించుకోవడం లేదని డివిజన్‌వాసులు విమర్శిస్తున్నారు.

Read More

hospital eduta darna, హాస్పిటల్‌ ఎదుట ధర్నా

హాస్పిటల్‌ ఎదుట ధర్నా పరకాల పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఎస్‌ఎఫ్‌ఐ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ మంద శ్రీకాంత్‌, మడికొండ ప్రశాంత్‌ పట్టణ అధ్యక్షుడు మడికొండ ప్రశాంత్‌ తెలిపారు. గురువారం ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో హాస్పిటల్‌ ముందు ధర్నా చేపట్టామని అన్నారు.

Read More

vidyuth thigalu thagili okari mruthi, విద్యుత్‌ తీగలు తగిలి ఒకరి మృతి

విద్యుత్‌ తీగలు తగిలి ఒకరి మృతి వరంగల్‌ అర్బన్‌ జిల్లా ఐనవోలు మండలం కక్కిరాలపల్లి గ్రామంలో ప్రమాదవశాత్తు వ్యవసాయ భూమి ఫినిషింగ్‌ తీగలు గుచ్చుకుని ఒకరు మృతిచెందారు. మృతుడు ఎండి యాకూబ్‌ (40) అని, అతడు నందనం గ్రామవాసిగా గుర్తించారు.

Read More

raithula darna, రైతుల ధర్నా

రైతుల ధర్నా జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలకేంద్రంలో రైతులు ధర్నా చేపట్టారు. చిట్యాల మండలంలోని నవాబుపేట గ్రామానికి చెందిన రైతు నేరెళ్ల ఓదెలుపై రెవెన్యూ అధికారులు పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని మండలకేంద్రంలో ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ కసిరెడ్డి సాయిసుధా, రైతులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

Read More

ramjan shubakankshalu telipina cp, రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపిన సీపీ

రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపిన సీపీ పవిత్ర రంజాన్‌ పర్వదినాన్ని పురస్కరించుకుని వరంగల్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ వి.రవీందర్‌ ముస్లీంలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పోలీస్‌ కమిషనర్‌ వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌తో కలసి హన్మకొండ లోని బోక్కలగడ్డ ఈద్గాలో రంజాన్‌ పండుగ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గోన్నారు. ఈ సందర్బంగా పోలీస్‌ కమిషనర్‌ మాట్లాడుతూ ఈద్‌-ఉల్‌-ఫితర్‌ పండుగను ముస్లీంలు అత్యంత భక్తిశ్రద్దలతో జరుపుకుంటారని తెలిపారు. నెలరోజులపాటు కఠినమైన ఉపవాస దీక్షలు చేస్తారని అన్నారు. ప్రార్థనల్లో చిన్న,…

Read More

gananga ramjan vedukalu, ఘనంగా రంజాన్‌ వేడుకలు

ఘనంగా రంజాన్‌ వేడుకలు ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండలకేంద్రంలో రంజాన్‌ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బుధవారం మండలకేంద్రంలోని స్థానిక గెస్ట్‌హౌజ్‌లో ముస్లీంలు ప్రార్థనలు చేశారు. ఈ ప్రార్థనల్లో అధికసంఖ్యలో ముస్లీంలు పాల్గొన్నారు. అనంతరం ఒకరికొకరు అలాయ్‌బలాయ్‌ చేసుకుని పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

Read More

kalushya nivaranaku krushi cheyali, కాలుష్య నివారణకు కృషి చేయాలి

కాలుష్య నివారణకు కృషి చేయాలి ప్రజలందరూ కాలుష్య నివారణకు కృషి చేయాలని వరంగల్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ వి.రవీందర్‌ తెలిపారు. బుధవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి వరంగల్‌ విభాగం ఆటవీశాఖ అధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి సీపీ డాక్టర్‌ వి.రవీందర్‌ జెండా ఊపి ప్రారంభించారు. హన్మకొండ పబ్లిక్‌గార్డెన్‌ నుండి ర్యాలీ ప్రారంభమైంది. ఈ సందర్భంగా పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ వి.రవీందర్‌ మాట్లాడుతూ పీల్చే గాలి కాలుష్యం కావడంతో…

Read More

carlu dee, కార్లు ఢీ

కార్లు ఢీ – ఒకరు మృతి జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం జనగామ బైపాస్‌ రోడ్డుపై (ఇందిరమ్మ కాలనీ వద్ద) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీకొనడంతో ఒకరు మతిచెందారు. జనగామ సీఐ, పోలీసు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ని క్రమబద్దీకరిస్తూ ప్రమాద వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు.

Read More

ఎమ్మెల్యే నరేందర్‌ను అభినందించిన కేటీఆర్‌

ఎమ్మెల్యే నరేందర్‌ను అభినందించిన కేటీఆర్‌ వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ను టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కే.టీ.రామారావు అభినందించారు. బుధవారం వరంగల్‌ ప్రజాప్రతినిధులు ఎమ్మెల్సీ ఎన్నికలలో పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి విజయం, పరిషత్‌ ఎన్నికల్లో ఏకపక్ష విజయం సాధించిన సందర్బంగా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్బంగా వారిని కేటీఆర్‌ అభినందించారు. జడ్పీటిసి, ఎంపిటిసి ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ పార్టీ అఖండ విజయం సాధించినందుకు కేటిఆర్‌కు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ములుగు ఎన్నికల ఇంచార్జ్‌గా వ్యవహరించి…

Read More

పూర్తిస్థాయి పోలీసు బందోబస్తు : జడ్పీటిసి, ఎంపిటిసి ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద పటిష్ట పోలీస్‌ బందోబస్తు

పూర్తిస్థాయి పోలీసు బందోబస్తు జడ్పీటిసి, ఎంపిటిసి ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద పటిష్ట పోలీస్‌ బందోబస్తు నిర్వహిస్తున్నామని వరంగల్‌ నగర్‌ పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ వి.రవీందర్‌ తెలిపారు. మంగళవారం వరంగల్‌ ఆర్బన్‌ జిల్లాకు సంబంధించి మడికొండలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, ధర్మసాగర్‌లోని వియంఅర్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన జడ్పీటీసీ, ఎంపిటిసి ఓట్ల లెక్కింపు కేంద్రాలను పోలీస్‌ కమిషనర్‌ సందర్శించారు. ఈ సందర్భంగా ఓట్ల లెక్కింపు జరుగుతున్న కేంద్రాల్లో పోలీస్‌ బందోబస్తు ఏర్పాట్లను పోలీస్‌ కమిషనర్‌ పర్యవేక్షించారు….

Read More

నర్సంపేట డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీ హవా..

నర్సంపేట డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీ హవా.. నర్సంపేట డివిజన్‌లోని ఆరుమండలాల్లో 50ఎంపిటిసి స్థానాల్లో టిఆర్‌ఎస్‌ పార్టీ అత్యధిక స్థానాల్లో గెలుపొందింది. టిఆర్‌ఎస్‌ పార్టీ దుగ్గొండి, నెక్కొండ, నల్లబెల్లి, చెన్నారావుపేట, ఖానాపురం మండలాల్లో టిఆర్‌ఎస్‌ పార్టీ ఎంపిపి స్థానాల మెజారిటీని కైవసం చేసుకోగా, నర్సంపేట మండలంలో ఎంపీపీ స్థానానికి మెజారిటీతో కాంగ్రెస్‌ పార్టీ తన సత్తా చాటుతూ పరువు నిలబెట్టుకుంది. డివిజన్‌వ్యాప్తంగా 70స్థానాలు ఉండగా టీఆర్‌ఎస్‌ పార్టీ 50స్థానాలలో అత్యధికంగా గెలుపొందగా, కాంగ్రెస్‌ పార్టీ 19స్థానాలను గెలుచుకుంది. డివిజన్‌వ్యాప్తంగా…

Read More

సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా

సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా కాజీపేట్‌ రైల్వేస్టేషన్‌లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కషి చేస్తానని బీజేపీ వరంగల్‌ అర్బన్‌ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ అన్నారు. కాజీపేట్‌ రైల్వేస్టేషన్‌లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి మంగళవారం బీజేపీ వరంగల్‌ అర్బన్‌ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ కాజీపేట్‌ రైల్వేస్టేషన్‌ ఏఓ రాజేందర్‌, స్టేషన్‌ మేనేజర్‌ వెంకటేశ్వర్లు, హెల్త్‌ ఇన్‌స్పెక్టర్‌ అజయ్‌లతో చర్చించారు. దీనికి సానుకూలంగా స్పందించిన అధికారులు కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలను 15రోజులలో పరిష్కరించడానికి కషి…

Read More

lekinpu kendralanu parishilinchina collector, లెక్కింపు కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్‌

లెక్కింపు కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్‌ నర్సంపేట డివిజన్‌లోని అన్ని మండలాల జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు కేంద్రాలను వరంగల్‌ రూరల్‌ జిల్లా కలెక్టర్‌ ఎం.హరిత పరిశీలించారు. లెక్కింపు కేంద్రాలలో లెక్కింపు జరిగేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. తొలుతగా ఎంపిటిసి, జడ్పీటీసీ ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని మొదలుపెట్టి సజావుగా జరిగేలా చూడాలని అధికారులకు సూచించారు. జనరల్‌ ఎన్నికల అబ్జర్వర్‌ పరిశీలన …. జనరల్‌ ఎలక్షన్‌ అబ్జర్వర్‌ బి.శ్రీనివాస్‌ జడ్పీటిసి ఓట్ల లెక్కింపు జరుగుతున్న సందర్భంలో లెక్కింపు…

Read More

వరంగల్‌ రూరల్‌ జిల్లాలో కారుదే పైచేయి

వరంగల్‌ రూరల్‌ జిల్లాలో కారుదే పైచేయి వరంగల్‌ రూరల్‌ జిల్లాకు చెందిన ఎంపిటిసి ఫలితాలు నర్సంపేట మండలంలో… 1) రాజుపేట – కాంగ్రెస్‌ 2) ముత్తోజిపేట – కాంగ్రెస్‌ 3) చంద్రయ్యపల్లి – టీఆర్‌ఎస్‌ 4) లక్నేపల్లి – కాంగ్రెస్‌ 5) బాంజీపేట – కాంగ్రెస్‌ 6) ముగ్దుంపురం – కాంగ్రెస్‌ 7) మహేశ్వరం – టీఆర్‌ఎస్‌ 8) మాధన్నపేట – కాంగ్రెస్‌ 9) కమ్మపెల్లి – టీఆర్‌ఎస్‌ 10) గురిజాల – టీఆర్‌ఎస్‌ 11) ఇటుకాలపల్లి…

Read More

greaterlo dongala gang, గ్రేటర్‌లో దొంగల గ్యాంగ్‌

గ్రేటర్‌లో దొంగల గ్యాంగ్‌ గ్రేటర్‌ నగరంలో దొంగల గ్యాంగ్‌ భయపెడుతోంది. 8మంది సభ్యులున్న ఈ గ్యాంగ్‌ తాళం వేసి ఉన్న, ఒంటరిగా ఉన్న ఇళ్లను టార్గెట్‌ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. రెండురోజుల క్రితం కాజీపేట చైతన్యపురి ప్రాంతంలో అర్థరాత్రి ఓ ఇంటి కిటికి ఊచలు కట్‌ చేస్తుండగా అప్రమత్తమైన ఇంటి యజమానులు గట్టిగా అరవడంతో దొంగలు పారిపోయినట్లు సమాచారం. వెంటనే తేరుకున్న ఇంటి యజమాని స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆ ప్రాంతానికి హుటాహుటిన చేరుకున్న ఈలోపే…

Read More

dieo officelo padakagada…siggu…siggu, డిఐఈవో ఆఫీసులో పడకగదా…సిగ్గు..సిగ్గు

డిఐఈవో ఆఫీసులో పడకగదా…సిగ్గు..సిగ్గు వరంగల్‌ అర్బన్‌జిల్లా ఇంటర్మీడియట్‌ కార్యాలయంలో కొందరు రాత్రి వేళలో కార్యాలయాన్ని పడకగదిగా మార్చుకొని ఉంటున్న విషయాన్ని ‘నేటిధాత్రి’ ప్రభుత్వకార్యాలయమా..? పడకగదా..? అనే శీర్శికతో పాఠకుల ముందుకు తీసుకువచ్చింది. రాత్రి వేళలో కార్యాలయాన్ని పడకగదిలా మార్చుకొని ఉంటుండడాన్ని ప్రజలు, ఉద్యోగ సంఘాల నేతలు, విధ్యార్థి నాయకులు, ప్రజాసంఘాల బాధ్యులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. బాధ్యతగా, హుందాగా వ్వవహరించాల్సిన డిఐఈవో ఈ విదంగా కార్యాలయానికి చెడ్డ పేరు తేవడంతో కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులు సైతం కార్యాలయానికి వెళ్లాలంటేనే…

Read More