రాష్ట్ర బి సి పొలిటికకల్ జె ఏ సి చైర్మన్ రాచాల కా రుపై రాళ్లతో దాడి.

రాష్ట్ర బి సి పొలిటికకల్ జె ఏ సి చైర్మన్ రాచాల కా రుపై రాళ్లతో దాడి

జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన రాచాల

వనపర్తి నెటిదాత్రి :

ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నానని. అది నచ్చని వారు ఇలాంటి దాడులకు దిగుతున్నారని వారికి భయపడబోనని.ప్రజల సమస్యలపై పోరాటాన్ని ఆపేది లేదని బీసీ పొలిటికల్ జేఏసీ స్టేట్ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ స్పష్టం చేశారు
గురువారం రాత్రి 12 గంటల సమయంలో తన స్వగ్రామమైన వడ్డెవాటకు వెళ్తుండగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తన కారుపై రాళ్లతో దాడి చేశారని, కారు డ్రైవర్ చాకచక్యంతో కారు ముందుకు వేగంగా పోనివ్వడంతో తృటిలో తనకు ప్రాణాపాయం తప్పిందన్నారు డాడీ సంఘటన పై శుక్రవారం జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ను కలిసి ఫిర్యాదు చేశామని రాచాల యూగంద ర్ గౌడ్ తెలిపారు
దాడి చేసిన వారు ఎవరైనా సరే వారిని వదిలిపెట్టొద్దని చట్టరీత్యా వారిపై చర్యలు తీసుకోవాలని ఎస్పీ ని కోరారు.

BC Political.

ఎన్ని దాడులు చేసినా అదిరేది లేదు, బెదిరేది లేద.నిప్రజల కోసం ప్రాణ త్యాగానికైనా తాను సిద్ధమని రాచాల స్పష్టం చేశారు.
రాచాల వెంట బీసీ పొలిటికల్ జెఎసి నాయకులు పాండురంగ యాదవ్, వివి గౌడ్, నరసింహ యాదవ్, స్వప్న, దేవర శివ, అంజన్న యాదవ్, మహేందర్ నాయుడు, అరవింద చారి, బత్తుల జితేందర్, ధర్మేంద్ర సాగర్, అస్కని రమేష్, నాగరాజు, చెలిమిల్ల రామన్ గౌడ్, బీసీ కుల సంఘాల జెఎసి నాయకులు రాములు యాదవ్, సత్యం యాదవ్, వెంకటన్న గౌడ్, నజీర్, తిరుపతన్న గౌడ్, కొత్త గంగాధర్ తదితరులు ఉన్నారు

ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇందిరమ్మ ఇల్లు.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం చేపట్టాలి..

హౌసింగ్ ఏఈ అభినయ్ గౌడ్.

కేసముద్రం/ నేటి ధాత్రి

 

 

 

 

ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టాలని హౌసింగ్ ఏఈ బొమ్మగాని అభినయ్ గౌడ్ అన్నారు. శుక్రవారం పెనుగొండ గ్రామంలోని రైతు వేదికలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో లబ్ధిదారులకు మంజూరి పత్రాలు వచ్చినటువంటి వారు మాత్రమే ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించాలని, ప్లానింగ్ ముగ్గు పోసిన అనంతరం గ్రామంలోని కార్యదర్శి ద్వారా ఫోటోను యాప్ లో అప్లోడ్ చేయడం జరుగుతుందని ప్రభుత్వ నిబంధనల ప్రకారం 400పీట్ల నుండి 600 ఫీట్ల లోపు మాత్రమే ఇంటి నిర్మాణం చేపట్టాలని, ఇంటి నిర్మాణ లబ్ధిదారులకు ఉచిత ఇసుక కూపన్లు మంజూరు చేయబడతాయని ఎటువంటి రుసుములు లేకుండా పూర్తిగా ఉచితంగా 8 ట్రాక్టర్లు అందజేయడం జరుగుతుందన్నారు. 150 బస్తాల సిమెంటు, 8 క్వింటాల స్టీల్ (సలాక), 20 ఎంఎం కంకర నాలుగు ట్రాక్టర్లు, 40 ఎంఎం కంకర రెండు ట్రాక్టర్లు, బేసుమెంటు రాయి మూడు ట్రాక్టర్లు , సిమెంట్ ఇటుకలు 2,150 లతో నిర్మాణం చేయాలని తప్పనిసరిగా గృహ నిర్మాణంలో టాయిలెట్ నిర్మాణం చేపట్టాలని, మేస్త్రీలు గోడ కొలతల ప్రకారం చదరపు అడుగుకి 300 చొప్పున మాత్రమే తీసుకోవాలని,ప్రభుత్వ నిబంధనలు ప్రకారమే నిర్మాణ పనులు చేపట్టాలని సూచించారు.

ఎన్నికలు ఏవైనా ముదిరాజ్ లే పైచేయి సాధించాలి.

ఎన్నికలు ఏవైనా ముదిరాజ్ లే పైచేయి సాధించాలి.

స్థానిక సంస్థల ఎన్నికలు కాగానే పోరాటం ఆగదు.

ముదిరాజులను బీసీ.డి నుండి ఏ మార్పించడమే లక్ష్యం

శాసన మండలి డిప్యూటీ స్పీకర్,ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు బండా ప్రకాష్

దుగ్గొండి మండలంలో ముదిరాజ్ మహాసభ వరంగల్ జిల్లా విస్తృతస్థాయి సమావేశం

నర్సంపేట నేటిధాత్రి:

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు ఏ ఎన్నికలైనా ముదిరాజ్ కులస్తులు ప్రజా ప్రతినిధులుగా పై చేయి సాధించాలని తెలంగాణ శాసన మండలి డిప్యూటీ స్పీకర్,ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు బండా ప్రకాష్ రాష్ట్ర ముదిరాజ్ కులస్తులు పిలుపునిచ్చారు.తెలంగాణ ముదిరాజ్ మహాసభ వరంగల్ జిల్లా విస్తృతస్థాయి సమావేశం దుగ్గొండి మండలంలోని గిర్నిబావి గ్రామాల్లో గల వందన గార్డెన్ లో ముదిరాజ్ మహాసభ వరంగల్ జిల్లా అధ్యక్షులు,నర్సంపేట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పొన్నం మొగిలి అధ్యక్షతన జరిగింది.ముఖ్య అతిథులుగా ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు,శాసన మండలి వైస్ చైర్మన్ బండా ప్రకాష్ ముదిరాజ్ ,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లేబోయిన అశోక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాసన మండలి డిప్యూటీ స్పీకర్ బండా ప్రకాష్ మాట్లాడుతూ గత కొన్ని దశాబ్దాలుగా ముదిరాజ్ కులస్తులను బీసీ.డీ నుండి బీసీ.ఏ లోకి మార్చడం కోసం అనేక ప్రయత్నాలు జరిగాయని ఆనాటి దిగంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ప్రత్యేక జీవో ద్వారా అమల్లోకి తీసుకచ్చామని ఐనప్పటికీ హైకోర్టులో వేసిన పిటిషన్ ద్వారా సాధించుకోలేకపోయామని తెలిపారు.స్థానిక సంస్థల ఎన్నికలు కాగానే ముదిరాజ్ కులస్తుల రిజర్వేషన్ కోసం పోరాటం మరోసారి కొనసాగిస్తామని ఆయన పేర్కొన్నారు.

గతంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సకల జనుల సర్వేతో పాటు ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఇంటింటికి కులగణన సర్వేలో కూడా
ముదిరాజ్ జాతి అత్యున్నత స్థాయిలో ఉన్నదని సర్వేలు చెప్పుతున్నాయని
బండ ప్రకాష్ వివరించారు.రాష్ట్రంలో ముదిరాజ్ కులస్తులు పటిష్టంగా ఉన్న ప్రజా ప్రతినిధులుగా ప్రాతినిధ్యం లేని పరిస్థితి నెలకొన్నదని రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో ఉన్న ముదిరాజ్ బిడ్డలు ఏకమైతే అన్ని పంచాయితీలు మనవే అని స్పష్టం చేశారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో ముదిరాజ్ ల సంఖ్యను పెంచుకోవడానికి ఏపార్టీ ఐనా ఐక్యతతో సీట్లు సాధించుకోవాలని తెలిపారు.రాజకీయ పార్టీలు సీట్లు ఇవ్వకున్న ముదిరాజ్ జెండాతో ప్రజా ప్రతినిధులుగా గెలువాలే అని శాసన మండలి డిప్యూటీ స్పీకర్ బండా ప్రకాష్ పిలుపునిచ్చారు.
సర్పంచులు,జెడ్పీటీసీలు,ఎంపీటీసీ కోసం గెలిపించుకోవడం కోసం ప్రధాన బిఆర్ఎస్,కాంగ్రెస్ పార్టీలతో పాటు అన్ని రాజకీయ పార్టీల నుండి సీట్లు సాధించుకోవాలన్నారు.మహిళా రిజర్వేషన్ ప్రకారం మహిళలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం ఎక్కువగా ఉన్నాయని ఈ నేపథ్యంలో ఆకాశాలను కల్పించుకోవాలని సూచించారు.పట్టణాలలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ముదిరాజ్ బిడ్డలు పొటీచేయాలన్నారు.గతంలో 150 మత్స్య శాఖ సొసైటీలు ఉంటే తెలంగాణ వచ్చాక 6 వేల సొసైటీలను తీసుకువచ్చామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ముదిరాజ్ కులస్తుల రిజర్వేషన్ అమలు కోసం ప్రధాన,ప్రతిపక్ష పార్టీలలో ఉన్న ముదిరాజ్ ప్రజా ప్రతినిధులతో హైదారాబాద్ లో సమావేశం పెట్టబోతున్నట్లు తేల్చిచెప్పారు. ఇలాంటి కార్యక్రమాలు చేయాలన్న ఒక్క పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా ముదిరాజ్ కులస్తులు ముందుకొస్తున్నారని ఇదే తరహాలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ముదిరాజ్ కులస్తుల ఐక్యతచాటాలని శాసనమండలి డిప్యూటీ స్పీకర్ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు బండ ప్రకాష్ తెలియజేశారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లెబోయిన అశోక్ మాట్లాడుతూ ఐక్యతతో ఉంటే అన్ని హక్కులకు సాధించుకోవచ్చని తెలిపారు. కులబలం ఉంటేనే రాజకీయ పార్టీల్లో సీట్లు సాదించుకోవచ్చని ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఎన్నారై సెల్ కన్వీనర్ శానబోయిన రాజ్ కుమార్ ముదిరాజ్ రాష్ట్ర ముదిరాజ్ కులస్తులు పిలుపునిచ్చారు.తెలంగాణ రాష్ట్రంలో 13 వేల గ్రామ పంచాయితీ ఉంటే ముదిరాజ్ కులస్తులు ముదిరాజ్ సొసైటీలతో పటిష్టంగా ఉన్నారన్నారు.
తెలంగాణలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్న ముదిరాజ్ కులస్తులు కీలకమని పేర్కొన్నారు. ఏ ఎన్నికలు వచ్చినా ఆ ఎన్నికల్లో కులబలం ఉంటేనే రాజకీయ పార్టీల్లో సీట్లు లభిస్తాయి.సీట్లు సాధించి ప్రజా ప్రతినిధులుగా ఎదగచ్చని తెలిపారు.

సామాజికంగా,ఆర్థికంగా ఎదగాలన్న సమిష్టిగా ఉండాలి.గత వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ముదిరాజ్ లకు బీసీ డి నుండి బీసీ ఏ కు మార్చాలని ప్రత్యేక జీఓను ప్రస్తుత శాసన మండలి వైస్ చైర్మన్ బండా ప్రకాష్ తెప్పించారు.నేడు ఆయన వెంటే ఉంటూ హక్కులను సాధించుకోవాలని ముదిరాజ్ కులస్తులు వివరించారు.
ఈ కార్యక్రమంలో ముదిరాజ్ మహాసభ రాష్ట్ర నాయకులు, వరంగల్ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గొనెల రవీందర్, వరంగల్ జిల్లా మహిళా అధ్యక్షురాలు గోనెల పద్మ, జిల్లా మత్స్య శాఖ ప్రమోటర్ సోమయ్య, ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షుడు బుస మల్లేశం జిల్లా గౌరవాధ్యక్షుడు జిలుకల కొమ్మాలు, నీరటి సదానందం, గుంటిక సోమయ్య పోలు అమర్ చందు,గుండా రాకేష్, ముద్రపోయిన సుధాకర్,భీమ్ రాజ్, దుగ్గొండి మండల అధ్యక్షుడు పల్లె రమేష్, నూనె నర్సయ్య హంస విజయరామరాజు ముద్రబోయిన వెంకన్న రావుల రాజు తోట సాంబయ్య పిట్టల భాస్కర్ అన్నబోయిన లింగయ్య పంబాల కోటి కెవ్వు శివకాశి బోనాల భరత్, జిల్లా పరిధిలోని మాజీ జెడ్పిటిసిలు ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

వ్యవసాయ బావుల వద్ద రైతులు ఎదుర్కొంటున్న.

వ్యవసాయ బావుల వద్ద రైతులు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యలపై గత ఆరు నెలల నుండి పొలం బాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని డిఈ బిక్షపతి అన్నారు.

వర్దన్నపేట (నేటిధాత్రి):

 

 

 

వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో వ్యవసాయ క్షేత్రాలలోని పలు ట్రాన్స్ఫార్మర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు రైతులకు పలు సూచనలు చేశారు. విద్యుత్ సరఫరా పైన ఎలాంటి సమస్యలున్న తమ దృష్టికి తీసుకురావాలని దీంతో వెంటనే సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. స్తంభాలు కుంగిపోవడం, ట్రాన్స్ఫార్మర్ మీద లోడు ఎక్కువగా ఉండడం లాంటి సమస్యలు ఏమైనా ఉంటే వెంటనే తెలియజేయాలన్నారు. రైతులు ఎట్టి పరిస్థితుల్లో విద్యుత్ అధికారుల ప్రమేయం లేకుండా స్టార్టర్లను, వైర్లను, ట్రాన్స్ఫార్మర్లను, ఫీజులను ముట్టుకోరాదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏడిఈ నటరాజ్, ఏఈ తరుణ్, ఎస్ ఎల్ ఐ చంద్రమోహన్ రాజు, విద్యుత్ సిబ్బంది, రైతులు ఎల్లగౌడ్, వీరన్న తదితరులు పాల్గొన్నారు.

రామ సమ్మక్క కుటుంబానికి 50 కిలోల బియ్యం వితరణ.

రామ సమ్మక్క కుటుంబానికి 50 కిలోల బియ్యం వితరణ

అంబాల చంద్రమౌళి మాదిగ

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

టేకుమట్ల మండలం సోమనపల్లి గ్రామంలో ఇటీవలే అనారోగ్యం వల్ల అకస్మాత్తుగా మరణించిన రామ సమ్మక్క జరిగింది 9వ రోజు వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్చార్జి అంబాల చంద్రమౌళి మాదిగ సమ్మక్క కుటుంబానికి 50 కిలోల బియ్యాన్ని ఇచ్చారు అనంతరం వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేయసి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కల్పించిన చంద్రమౌళి మాదిగ రాబోయే రోజుల్లో మీ కుటుంబానికి అండగా ఉంటానని కుటుంబ సభ్యులందరికీ హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జి గాజుల బిక్షపతి మాదిగ జిల్లా ఉపాధ్యక్షులు దోర్నాల రాజేందర్ మాదిగ జిల్లా సీనియర్ నాయకులు రామ్ రామ్ చందర్ మాదిగ వికేసి విముక్త చిరుతల పార్టీ రాష్ట్ర యూత్ అధ్యక్షులు అంబాల అనిల్ కుమార్ ఎమ్మార్పీఎస్ గ్రామ అధ్యక్షులు మారపల్లి చిన్న రాయకొమూరు గ్రామ సభ్యులు బండ బిక్షపతి రామ యాకుబ్ రామ్ సమ్మక్క కుటుంబ సభ్యులు రామ్ కృష్ణ కుమార్ రామ్ ధనుష్ రామ్ వర్ధన్ బొట్ల రవి రామ్ దేవేందర్ రామ్ ప్రశాంత్ బోట్ల కేశవులు బొట్ల అఖిల్ ఎలుకటి అన్వేష్ గ్రామ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

రోడ్లు విస్త‌రించి ఇబ్బందులు లేకుండా చూస్తా ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు.

రోడ్లు విస్త‌రించి ఇబ్బందులు లేకుండా చూస్తా ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు

తిరుప‌తి(నేటి ధాత్రి) జూన్ 27:

న‌గ‌రంలోని 44, 43 డివిజ‌న్ ప‌రిధిలోని రోడ్ల‌ను ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు శుక్ర‌వారం ఉద‌యం ప‌రిశీలించారు. ముఖ్యంగా 44వ డివిజ‌న్ ప‌రిధిలోని న‌ర్శ‌రీ వీధిని ఇంజినీరింగ్ అధికారులు, టౌన్ ఫ్లానింగ్ అధికారుల‌తో క‌లిసి వీధి మొత్తం ప‌రిశీలించారు. రోడ్డు ఆక్ర‌మ‌ణ‌ల‌తో అంబులెన్స్ వ‌చ్చే ప‌రిస్థితి వీధిలో లేక‌పోవ‌డంతో ఇటీవ‌ల ఇద్ద‌రు చ‌నిపోయిన‌ట్లు స్థానిక మ‌హిళ‌లు ఎమ్మెల్యే దృష్టి తీసుకు వ‌చ్చారు. అలాగే డ్రైనీజీ స‌మ‌స్య‌తో దుర్వాశ‌న‌కు తోడు దోమ‌ల బెడ‌ద ఎక్కువుగా ఉన్న‌ట్లు వారు ఎమ్మెల్యేకి చెప్పారు. వ‌ర్షం ప‌డితే డ్రైనేజీ నీరు నిల్వ ఉండిపోతుండ‌టంతో ఇబ్బందులు ప‌డుతున్న‌ట్లు ఆ ప్రాంతవాసులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువ‌చ్చారు.మ‌రోవైపు రోడ్డును పూర్తిస్థాయిలో విస్త‌రిస్తే త‌మ ఇళ్ళు దెబ్బ‌తింటాయ‌ని న‌ర్శ‌రీ వీధి వాసులు ఎమ్మెల్యే కి తెలిపారు. న‌ర్శ‌రీ వీధిలో రోడ్డు,డ్రైనేజీ నిర్మాణం కోసం 76 ల‌క్ష‌లు మంజూరు చేసిన‌ట్లు ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు తెలిపారు. రోడ్డు విస్త‌ర‌ణ ఎలా చేయాలి అనేది ఇంజినీరింగ్, టౌన్ ఫ్లానింగ్ అధికారుల‌తో చ‌ర్చిం నిర్ణ‌యం తీసుకుంటామ‌ని ఆయ‌న చెప్పారు. ప్ర‌జ‌ల‌కు అసౌక‌ర్యం క‌ల‌గుండా రోడ్డు, డ్రైనేజి స‌మ‌స్యను ప‌రిష్క‌రిస్తామ‌ని ఆయ‌న తెలిపారు. 43వ డివిజ‌న్ లో డ్రైనీజి స‌మ‌స్య‌ను త్వ‌ర‌లో ప‌రిష్క‌రిస్తామ‌ని ఆయ‌న చెప్పారు.ఈ కార్య‌క్ర‌మంలో డిప్యూటీ మేయ‌ర్ ఆర్సీ మునికృష్ణ‌, కార్పోరేట‌ర్లు వ‌రికుంట్ల నారాయ‌ణ‌, న‌ర‌సింహాచ్చారి, న‌రేంద్ర‌, సికే రేవ‌తి, శైల‌జ‌, దూది కుమారి, రాధ‌,రాజా రెడ్డి,మహేష్ యాదవ్, దూది శివ, కార్పొరేషన్ ఎస్ ఈ శ్యామ్ సుందర్, డీసీపీ మహబూబ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

చేవెళ్ల మున్సిపల్ కమిషనర్ కలిసిన CITU నాయకులు.

చేవెళ్ల మున్సిపల్ కమిషనర్ కలిసిన సిఐటియు నాయకులు

శంకరపల్లి, నేటి ధాత్రి :-

 

 

 

 

చేవెళ్ల నూతన మున్సిపల్ కమిషనర్ ని తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో కలిసి శాలువాతో సన్మానించి, శుభాకాంక్షలు తెలపడం జరిగింది. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని నూతన కమిషనర్ ని కోరడం జరిగింది. కార్మికులకు ఏ సమస్య ఉన్న తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కారం చేస్తామని నూతన కమిషనర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి అల్లి దేవేందర్, సిఐటియు చేవెళ్ల డివిజన్ ఉపాధ్యక్షులు ముంజ గళ్ళ ప్రభుదాస్, చేవెళ్ల మున్సిపల్ యూనియన్ నాయకులు నరసింహ జనార్ధన్ దస్తగిరి విమలమ్మ తదితరులు పాల్గొన్నారు

జూరాల ప్రాజెక్టు పై అసత్య ఆరోపణలు తగవు.

“జూరాల ప్రాజెక్టు పై అసత్య ఆరోపణలు తగవు’

బీఆర్ఎస్ నాయకుల దొంగ ఏడుపు మానుకోవాలి.

ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ కుట్రలు

ఎమ్మెల్యేలు జి.మధుసూదన్ రెడ్డి, మేఘారెడ్డి

మహబూబ్ నగర్/ నేటి ధాత్రి

 

 

 

 

జూరాల ప్రాజెక్ట్ గురించి పని పాట లేని బీఆర్ఎస్ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఇష్టం వచ్చినట్లు, రేపే ప్రాజెక్టు కూలిపోతుందాన్ని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. కాంగ్రెస్ ను పార్టీ ప్రతిష్టను దెబ్బ చేసేందుకు, BRS పార్టీకి చెందిన నమస్తే తెలంగాణ పత్రిక తప్పుడు రాతలు రాసిందన్నారు. జూరాల ప్రాజెక్టు నిర్మాణంను కాంగ్రెస్ హయంలో 1981లో ప్రారంభిస్తే.. 1995లో ప్రాజెక్ట్ పూర్తి అయ్యిందన్నారు.
62 గేట్లతో నిర్మించిన ప్రాజెక్టు జూరాల ఇప్పటికీ చెక్కు చెదరలేదన్నారు. బీఆర్ఎస్ నాయకులకు మాట్లాడటానికి సబ్జెక్ట్ లేక, జూరాల గేట్ల అంశాన్ని గోరంతది కొండంత చేసి చూపిస్తున్నారన్నారు.
పని పాటా లేకుండా ఖాళీ తిరుగుతున్న కేటీఆర్ వాస్తవాలకు సంబంధం లేకుండా, ఏదీ దొరికితే దాన్ని ట్విట్టర్ లో పెట్టి శునకానందం పొందుతున్నారన్నారు.
జూరాల పైన మాట్లాడే నైతిక అర్హత బీఆర్ఎస్ నాయకులకు లేదన్నారు. జూరాల ప్రాజెక్టు గేట్లు తుప్పు పట్టినట్లు 2019లో బయటపడ్డ, బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు.
2021లో గేట్ల నుంచి పెద్ద ఎత్తున నీళ్లు లీక్ అయిన అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.
గేట్లకు మరమ్మతులు చేపట్టాలని అధికారులు 2018లో రూ.19 కోట్ల అంచనాలతో అధికారులు నివేదికను ప్రభుత్వానికి పంపించారు, అయిన అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు.
అధికారుల నుంచి ఒత్తిడి తీవ్రంగా పెరగడంతో 2022లో రూ.11 కోట్లతో టెండర్లు అప్పటి ప్రభుత్వం పిలిచి, చేతులు దులుపుకుందన్నారు.
గత రెండేళ్ల నుంచి కృష్ణా ప్రాజెక్టులన్నీ కళకళలాడుతున్నాయి. ఇప్పటికిప్పుడు జూరాల గేట్ల కు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని, 10 లక్షల క్యూసెక్ ల వరద నీరు వచ్చినా గేట్ల కు ఏమీ కాదని ఇంజనీర్లు తెలియజేశారు. ఇకనైనా బీఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారాన్ని మానుకోవాలన్నారు.
ప్రస్తుతం ప్రాజెక్ట్ కు లక్ష క్యూసెక్ ల వరద మాత్రమే వస్తోంది.. జూరాల పైన బీఆర్ఎస్ నాయకులు దొంగ ఏడుపులు ఆపాలన్నారు. 10 ఏళ్ల పాటు జూరాలను పూర్తిగా నిర్లక్ష్యం చేసి ఇప్పుడు దొంగ ఏడ్పులు ఏడుస్తున్నారు. బీఆర్ఎస్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు దావత్ చేసుకోవడానికి వెళ్లి, జూరాల వద్ద షో చేశారు. ప్రాజెక్ట్ వద్ద అసలు మోటర్లే బిగించలేదు, పైగా కరెంటు బిల్లు వస్తుందన్న కారణంతో కాంగ్రెస్ ప్రభుత్వం మోటార్లు ప్రారంభించడం లేదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించడం  తగదన్నారు.

కామ్రేడ్ గాజర్ల రవి మృతి సమాజానికి తీరని లోటు

కామ్రేడ్ గాజర్ల రవి మృతి సమాజానికి తీరని లోటు

కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు పోలినేని లింగారావు

భూపాలపల్లి నేటిధాత్రి:

కామ్రేడ్ గాజర్ల రవి అలియాస్ గణేష్ అలియాస్ ఉదయ్ మృతి సమాజానికి, వెలిశాల గ్రామానికి తీరని లోటని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు పోలినేని లింగారావు అన్నారు. ఈనెల 18న జరిగిన ఎన్కౌంటర్ లో మావోయిస్టు పార్టీ అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యులు, ఏఓబి కార్యదర్శి గాజర్ల రవి అలియాస్ గణేష్ అలియాస్ ఉదయ్ తో పాటు మరో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందిన సంఘటన తెలిసిందే. కాగా వెలిశాల గ్రామానికి చెందిన మావోయిస్టు అగ్రనేత గాజర్ల రవి గత 35 సంవత్సరాల క్రితం ఉద్యమంలో చేరి..పీడిత ప్రజల విముక్తి కోసం నిరంతరం పోరాటం చేసిన అమరుడు గాజర్ల రవి అని పోలినేని లింగారావు అన్నారు. శుక్రవారం ఆయన గాజర్ల రవి స్వగ్రామమైన వెలిశాలకు చేరుకొని గాజర్ల రవి చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన సోదరుడు గాజర్ల అశోక్ అలియాస్ ఐతు, కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఆయన వెంట వెంగల రమేష్, పెరుమాండ్ల మహేందర్, కుమార్ గౌడ్, తిరుపతిరెడ్డి, రామస్వామి తదితరులున్నారు.

అర్హులందరికీ ఇండ్లు మంజూరు చేస్తాం.

అర్హులందరికీ ఇండ్లు మంజూరు చేస్తాం.

#ములుగు ప్రజల రుణం తీర్చుకుంటాం.

#అభివృద్ధి చేయడమే మా లక్ష్యం.

రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి,
గ్రామీణ నీటి సరఫరా, మహిళాశిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క.

ములుగు జిల్లా నేటిధాత్రి:


ములుగు నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ప్రజల రుణం తీర్చుకుంటామని, అర్హులందరికీ కచ్చితంగా ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళాశిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు.
శుక్రవారం ములుగు మండల కేంద్రం నుండి జీవింతరావు పళ్లి గ్రామం మీదుగా గణేష్ పళ్లి వరకు మూడు కోట్ల యాభై లక్షల రూపాయలతో ఏర్పాటు చేయనున్న రోడ్డు విస్తరణ పనులు, డివైడర్, సెంట్రల్ లైటింగ్ పనులను మహబూబాబాద్ పార్లమెంటు సభ్యులు పోరిక బలరాం నాయక్, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ బానోతు రవిచంద్రలతో కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వం అర్హులైన పేదలందరికీ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని ఉద్దేశంతో మొదటి దఫాగా ప్రతి నియోజకవర్గానికి ఐదువేల ఇండ్లను కేటాయించి పనులు ప్రారంభించడం జరిగిందని, ములుగు నియోజకవర్గానికి సంబంధిత మంత్రి మరో వెయ్యి ఇండ్లను అదనంగా కేటాయించనున్నారని వివరించారు. ఎక్కడ అభివృద్ధి చెందని ప్రాంతాలను గుర్తించి దశలవారీగా అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని, ప్రతి గ్రామానికి రోడ్లు వేయడం, రోడ్లు విస్తరణ పనులు చేపట్టడం ముఖ్యమంత్రి ఆదేశాలతో జరుగుతున్నాయని తెలిపారు. తాము ఇచ్చిన హామీ మేరకు ములుగును మున్సిపాలిటీగా, మల్లంపల్లి గ్రామాన్ని జేడి మల్లంపల్లిగా మండలం గా ఏర్పాటు చేశామని అన్నారు. తాము అధికారికంగా ఆమోదం పొంది ఇచ్చిన హామీలను చూపిస్తున్నామని అన్నారు.
తాను ఎంపీ బలరాం నాయక్ కలిసి ఈ ప్రాంత ప్రజల రుణం తీర్చుకుంటామని, జిల్లాను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడానికి ప్రత్యేక నిధులను కేటాయించడం జరిగిందని అన్నారు.
ఎంపీ బలరాం నాయక్ మాట్లాడుతూ తాను గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన సమయంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని, నేడు మంత్రి సీతక్కతో కలిసి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సంపత్ పంచాయతీరాజ్ ఈఈ అజయ్ కుమార్, ప్రజా ప్రతినిధులు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

వెదజల్లే పద్దతిలో తక్కువపెట్టుబడితో అధిక దిగుబడి.

వెదజల్లే పద్దతిలో తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి వస్తుంది…

నేటి ధాత్రి -గార్ల :-

 

 

వెదజల్లే పద్దతిలో విత్తనాలు నేరుగా పొలంలో చల్లడం ద్వారా, నారు తీసి నాటడం అవసరం ఉండదని కూలీల ఖర్చు, విత్తనాల అవసరం తగ్గి తక్కువ పెట్టుబడి తో అధిక దిగుబడి సాధించవచ్చు అని గార్ల వ్యవసాయధికారి కావటి రామారావు అన్నారు.శుక్రవారం దుబ్బగూడెం గ్రామం లో రైతులకు నేరుగా విత్తనాలు వెధజల్లే పద్ధతి పై అవగాహన కల్పించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ,తక్కువ పెట్టుబడితో నాటు అవసరం లేకుండా నారు మడి ఖర్చు లేకుండా నేరుగా విత్తనాలు వేదజల్లుకోవాలని సూచించారు.ఈ విధానం లో కూలీల అవసరం ఉండదని ఎకరాకు 6 వేల నుండి 8 వేల వరకు పెట్టుబడి ఆదా అవుతుందని,రైతులకు ఎంతో శ్రేయస్కరం లాభదయాకమని అందరూ ఈ విధానాన్ని అవలంభించి లాభాలు గడించాలని సూచించారు.ఈ పద్దతిలో విత్తనాలు చల్లిన 2 రోజుల్లో ఒక ఎకరాకు పెండిమెతలిన్ ఒక లీటర్ పిచికారీ చేయాలనీ,విత్తనాలు చల్లిన 25 రోజుల తర్వాత నామినీ గోల్డ్ కానీ కౌన్సిల్ యాక్టీవ్ గాని వివాయ గాని పిచికారీ చేసి కలుపు నివారించుకోవాలని తెలిపారు.ఎరువులు ఆఖరి దుక్కిలో డిఏపి ని 20 రోజులు తర్వాత యూరియా తో పాటు పొటాస్ 20కేజీ లు వేసుకోవాలని అన్నారు.చిరుపొట్ట దశలో 30 కేజీ లు యూరియా తో పాటు 15 కేజీ ల పొటాష్ వాడాలని, అవసరం మేరకే క్రిమిసంహారక మందులు వాడాలని సూచించారు.ఈ పద్ధతి లో నాటు పద్ధతి కంటే 10 రోజులు ముందుగా వరి కోతకు వస్తుందని అన్ని కంకులు ఒకే సారి ఈనిక దశకు వస్తాయని, చీడ పీడల నివారణ సాధ్యమవుతుందని సూచించారు.ఈ కార్యక్రమం లో ఏఈఓ మేఘన,రైతులు తదితరులు పాల్గొన్నారు.

ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు.

ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు

మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తయారు చేస్తామని రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.

శుక్రవారం కాటారం మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన లైబ్రరీని ప్రారంభించి, సబ్ డివిజన్ పరిధిలోని ఐదు మండలాల ప్రాథమిక పాఠశాలలకు సిఎస్ఆర్ నిధుల ద్వారా విద్యార్థుల కోసం 600 డ్యూయల్ డెస్క్ బెంచీలు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా పాఠశాలలకు కావలసిన అవసరాలు గురించి మంత్రి ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా తయారు చేస్తామని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉచితంగా రెండు జతల బట్టలు, పుస్తకాలు, అందిస్తున్నామని తెలిపారు.

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతాన్ని పెంపొందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు.

ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్లు పెంచేందుకు మొట్టమొదటి సారిగా కాటారం మండలం నుండి ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులను, ఉపాధ్యాయులను సంక్రాంతి, దసరా సెలవుల్లో హైదరాబాద్, ఢిల్లీ లాంటి నగరాలకు తీసుకువెళ్ళే కార్యక్రమం చేపడతామని తెలిపారు.

ప్రైవేట్ పాఠశాలను తలదన్నేలా విద్యార్థులు విద్యను అభ్యసించాలని స్పష్టం చేశారు.

ప్రతి ఒక్క విద్యార్ధి ఇంగ్లీషులో మాట్లాడాలని చక్కగా చదువుకొని మంచి ఉద్యోగాలు సాధించాలని మంత్రి ఆకాంక్షించారు.

జిల్లా, మండల స్థాయి విద్యా శాఖ అధికారులు ప్రతి పాఠశాలను పరిశీలించాలని ఆదేశించారు. పాఠశాలలకు కావలసిన సౌకర్యాలు, అవసరాలు గురించి తెలుసుకొని నివేదికలు అందించాలని అన్నారు.

ప్రభుత్వ పాఠశాలలను అధునాతంగా తీర్చి దిద్దడానికి సహకరించాలని ఆదేశించారు.

కాటారాం జెడ్పీహెచ్ఎస్ పాఠశాల అధ్యాపకులు కోరిన విధంగా ప్రహరీ గోడ పునర్నిర్మాణం, సైన్స్ ల్యాబ్ కెమికల్స్ ను అందిస్తామని అన్నారు.

లైబ్రరీ లో పుస్తకాలు, బెంచీలు, కంప్యూటర్ లను సమకురుస్తామని మంత్రి తెలిపారు.

హై స్కూల్ లలో కూడా డ్యూయల్ డెస్క్ బెంచీలు అందించడానికి విద్యాశాఖ అధికారులు నివేదిక ఇవ్వాలని మంత్రి శ్రీధర్ బాబు ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, సబ్ కలెక్టర్ మాయాంక్ సింగ్, జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయునీ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ..

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ..

రామాయంపేట జూన్ 27నేటి ధాత్రి (మెదక్)

 

 

 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇల్లు పథకంలో భాగంగా శుక్రవారం రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డులో మంగలి నర్సమ్మ ఇంటి నిర్మాణానికి టీ పి సి సి కార్యదర్శి చౌదరి సుప్రభాతరావు చేతుల మీదుగా భూమి పూజ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఇండ్లు లేని నిరుపేదలు ఉండకూడదు అనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ కార్యక్రమాలు చేపట్టడం ఈ అవకాశాన్ని నిరుపేదలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో , మాజీ కౌన్సిలర్ దేమే యాదగిరి, చింతల స్వామి, ప్రసన్నకుమార్, వార్డు ఆఫీసర్ శంకర్ , శరత్, మంగలి సత్యం మేస్త్రి నర్సింలు తదితరులు పాల్గొన్నారు.

దివ్యాంగులకు ప్రభుత్వం అండగా ఉంటుంది.

దివ్యాంగులకు ప్రభుత్వం అండగా ఉంటుంది
మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

మహాదేవపూర్ నేటిధాత్రి

 

 

 

దివ్యాంగులకు ప్రభుత్వం ఎల్లపుడు అండగా ఉంటుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.

శుక్రవారం మహాదేవపూర్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అలీం కో సంస్థ ద్వారా అందిస్తున్న దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని దివ్యాంగులకు ట్రై సైకిళ్ళు, ఇతర ఉపకరణాలు అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ దివ్యాంగులు సమాజంలో అన్ని రంగాల్లో రాణించేందుకు అవసరమైన సౌకర్యాలు కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.

దివ్యాన్గులకు అవసరమైన ఉపకరణాలను అందించడం ద్వారా వారి జీవన ప్రమాణాలు మెరుగవుతాయన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని దివ్యాంగుల సంక్షేమానికి అన్ని విధాల కృషి చేస్తుందన్నారు.

మహదేవ్ పూర్ మండలంలో సుమారు 200 మంది దివ్యాంగులను గుర్తించడం జరిగిందని వారిలో మొదటి విడతలో 50 మంది దివ్యాంగులకు వివిధ రకాలైన బ్యాటరీ ట్రై సైకిళ్ళు, సాధారణ ట్రై సైకిళ్ళు, వినికిడి పరికరాలు, చేతి కర్రలు, స్టాండ్ లు వారి వారి వైకల్యాన్ని బట్టి అందిస్తున్నామన్నారు.

ఇచ్చిన మాట ప్రకారం ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నామని ఇల్లు లేని దివ్యాంగులకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని తెలిపారు.

అతి త్వరలో నూతన పెన్షన్లు మంజూరు చేస్తామని తెలిపారు.

నిరుపేదలకు ప్రభుత్వం అండగా ఉంటుందని 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్, సన్న బియ్యం పంపిణీ, ఉచిత బస్సు సౌకర్యం, ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకు వడ్డీ లేని రుణాలు వంటి అనేక సంక్షేమ పథకాలను అందిస్తున్నామని తెలిపారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి ఒకొక్క హామీని నెరవేరుస్తున్నామని తెలిపారు.

అనంతరం మహదేవ్ పూర్ మండలానికి చెందిన 89 మంది లబ్ధిదారులకు సుమారు 90 లక్షల రూపాయల విలువగల కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.

అంతకు ముందు ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో 20 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన డా బి.ఆర్ అంబేద్కర్ చిల్డ్రన్ పార్క్ ను రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మెన్ అయిత ప్రకాష్ రెడ్డి, కూడా చైర్మెన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి లతో కలిసి ప్రారంబించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, సబ్ కలెక్టర మయాంక్ సింగ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయ లక్ష్మీ, సంక్షేమ అధికారి మల్లీశ్వరి, సీడీపిఓ రాధిక తదితరులు పాల్గొన్నారు.

నేషనల్ ఫ్యామిలీ హెల్త్ స్కీ మ్ నుప్రజలందరు సద్వినియోగం చేసుకోవాలి.

నేషనల్ ఫ్యామిలీ హెల్త్ స్కీ మ్ నుప్రజలందరు సద్వినియోగం చేసుకోవాలి.

తహసిల్దార్ ఇమాం బాబా షేక్.

చిట్యాల నేటిధాత్రి:

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చిట్యాల మండల తహశీల్దార్ ఇమామ్ బాబా షేకు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి నేషనల్ ఫ్యామిలీ హెల్త్ స్కీ మ్ కింద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టినటువంటి స్కీం లో మండల ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కుటుంబంలో ఎవరైనా పెద్ద ఏదైనా కారణం చేత మరణించిన చో అతని వయసు 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల వరకు ఉండవలెను మరియు మరణ ధ్రువీకరణ పత్రము ఆధార్ కార్డు రేషన్ కార్డు తీసుకువచ్చి రెవెన్యూ కార్యాలయంలో ఇవ్వగలరు దీని ద్వారా 20వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేయడం జరుగుతుందని చిట్యాల తహసిల్దారు తెలియజేశారు అవకాశాన్ని చిట్యాల మండల ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించి విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి.

విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించి విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి

#ఏ బి ఎస్ ఎఫ్ ఆధ్వర్యంలో వరంగల్ విద్యాశాఖ అధికారి జ్ఞానేశ్వర్ కి వినతి పత్రం.

హన్మకొండ నేటిధాత్రి:

అనంతరం ఏ బి ఎస్ ఎఫ్ బోట్ల నరేష్ మాట్లాడుతూ వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో నూతనంగా అడ్మిషన్ పొందిన విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించాలని విద్యాశాఖ అధికారి కోరారు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో నెలకొన్న మంచినీటి సమస్య, మరుగుదొడ్ల మరమ్మతు మరియు, ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న మధ్యాహ్న భోజనం మెనూ అమలు చేసే విధంగా అధికారులు నిరంతరం పర్యవేక్షించి విద్యార్థులకు నాణ్యతమైన భోజనం అందించే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. వరంగల్ జిల్లా వ్యాప్తంగా కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాలలో నెలకొన్న సమస్యలతో పాటు కస్తూర్బా గురుకుల పాఠశాలలో అదనపు సెక్షన్లు ఏర్పాటు చేయాల్సిందిగా వరంగల్ జిల్లా విద్యాశాఖ అధికారి కోరునట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రమోద్ బన్నీ తదితరులు పాల్గొన్నారు.

బహుజన్ సమాజ్ పార్టీ వరంగల్ జిల్లా ఇన్చార్జిగా.

బహుజన్ సమాజ్ పార్టీ వరంగల్ జిల్లా ఇన్చార్జిగా వస్కుల ప్రవీణ్ కుమార్

హన్మకొండ, నేటిధాత్రి:

 

 

 

బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట అధ్యుక్షులు మంద ప్రభాకర్ బి.యస్.పి వరంగల్ ఇంచార్జ్ గా వస్కుల ప్రవీణ్ కూమార్ ని నియమించారు
ఈ సందర్భంగా వస్కుల ప్రవీణ్ కూమార్ మాట్లడుతూ బహుజన ఉద్యమాన్ని మరింత నిబ్బద్దతో నిర్వహిస్తానని చెప్పడం జరిగింది.ఈ కార్యక్రామంలో రాష్ట్ర నాయకులు ఉపేంద్ర సహు,శనిగరపు రాజు
,జిల్లా నాయకులు ,తదితర బహుజన నాయకులు పాల్గొన్నారు.

ఉపాధ్యాయుల సమస్యలపై సీఎం తో చర్చిస్తాం ప్రొ.కోదండరాం.

ఉపాధ్యాయుల సమస్యలపై సీఎం తో చర్చిస్తాం ప్రొ.కోదండరాం

మంచిర్యాల నేటి ధాత్రి:

తెలంగాణ ఉద్యమకారుడు,ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం మంచిర్యాల జిల్లా రెవిన్యూ డివిజనల్ ఆఫీసుకు విచ్చేసిన సందర్భంగా వారికి రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ జి.శ్రీనివాసరావు టీఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి శుక్రవారం మర్యాదపూర్వకంగా స్వాగతం పలికి ఘనంగా సన్మానం చేయడం జరిగినది.ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా టీఎన్జీవో అధ్యక్షుడు గడియారం శ్రీహరి ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం తో ఉద్యోగ,ఉపాధ్యాయులకు సంబంధించిన సమస్యలపై చర్చించారు.ప్రస్తుత స్థితిగతులను,పరిస్థితులను వివరంగా ప్రొఫెసర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది.వారు సానుకూలంగా స్పందిస్తూ ప్రత్యేక చొరవ తీసుకొని ఉద్యోగ,ఉపాధ్యాయుల సమస్యలపై ముఖ్యమంత్రి తో చర్చించడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శివాజీ,ఆర్డిఓ ఆఫీస్ పరిపాలన అధికారి బి.రామచందర్ రావు,కార్యాలయ సిబ్బంది పద్మశ్రీ,అరుణ,లక్ష్మి ,రవి కిషోర్,జనార్ధన్,సతీష్,మహేందర్,సదయ్య,స్వప్న రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సివిల్ ఇంజనీరింగ్ లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్.

సివిల్ ఇంజనీరింగ్ లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్.

చిట్యాల, నేటిధాత్రి ;

 

 

 

 

 

చిట్యాల మండల కేంద్రంలోని కాకతీయ హైస్కూల్లోటిజి సెట్ పాలిటెక్నిక్ 2025 ఎంట్రన్స్ టెస్ట్ లో సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ మరియు ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ స్టేట్ 9వ ర్యాంక్ సాధించి జేఎన్టీయూ హైదరాబాదులో సివిల్ ఇంజనీరింగ్ లో సీటు సంపాదించిన మా పాఠశాల పూర్వ విద్యార్థి గోల్కొండ నిఖిల్ కౌశిక్ ను పాఠశాల అధ్యాపక బృందం శాలువతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ మహమ్మద్ రాజ్ మహమ్మద్ మాట్లాడుతూ చిన్నప్పటినుండి నిఖిల్ కౌశిక్ చదువులో చురుకుగా ఉండేవాడు కష్టపడి చదవడం వల్ల ఈరోజు తల్లిదండ్రులకు పాఠశాలకు మా మండలానికి పేరు తీసుకొచ్చి హైదరాబాదులోని జేఎన్టీయూలో సివిల్ ఇంజనీరింగ్ లో సీటు పొందినందుకు సంతోషిస్తూ ఈ సందర్భంగా సన్మానించడం జరిగింది ఇంకా మా పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థులు దేశ విదేశాలలో సాఫ్ట్వేర్లుగా ప్రభుత్వ ఉద్యోగులుగా సేవ చేస్తూ సమాజానికి పాఠశాలకు తల్లిదండ్రులకు పేరు తెస్తున్నందుకు చాలా గర్వంగా సంతోషంగా ఉన్నదని తెలియజేశారు ఈ విధంగా విద్యార్థులు కష్టపడి చదివి నిఖిల్ కౌశిక్ ను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు ఈ సమావేశంలో విద్యార్థులు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.

వర్షాకాల వ్యాధులను అరికట్టేందుకు జిల్లా.

వర్షాకాల వ్యాధులను అరికట్టేందుకు జిల్లా వైద్యాధికారి సమీక్ష

సిరిసిల్ల టౌన్ :(నేటి ధాత్రి)

 

 

 

 

సిరిసిల్ల జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారులకు మరియు మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్(MLHP) లకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రజిత సమీక్ష సమావేశం ఏర్పాటు చేసినారు. ఈ సమీక్ష సమావేశంలో వర్షాకాలంలో వ్యాపించే వ్యాధుల నివారణ కార్యక్రమంలో డెంగ్యూ, మలేరియా, చికెన్ గునియా జ్వరాల పై దోమలు పుట్టకుండా కు ట్ట కుండ పరిసరాల పరిశుభ్రత పై మరియు కేంద్ర ఆరోగ్య పథకాల లో ఉచిత సమగ్ర వ్యాధి నిర్ధారణ పరీక్షల ఆరోగ్య శిబిరం ప్రగతి నివేదిక, డయేరియా నివారణ కార్యక్రమం రోజువారి నివేదిక, మాతా శిశు సంరక్షణ కార్యక్రమం సాధారణ ప్రసవాలు, వ్యాధి నిరోధక టీకాలపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సమీక్షించినారు.

 

Medical Officer Review.

ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ సంపత్ కుమార్, డాక్టర్ రామకృష్ణ, డాక్టర్ అనిత, డాక్టర్ నహీం మరియు ప్రాథమిక కేంద్ర వైద్యాధికారులు, ఎం ఎల్ హెచ్ పి లు పాల్గొన్నారు.

error: Content is protected !!
Exit mobile version