ఆపరేషన్ కగార్ ను నిలిపివేయాలి .

Operation Kagar Operation Kagar

ఆపరేషన్ కగార్ ను నిలిపివేయాలి

మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలి..

సిపిఐ,సిపిఎం జిల్లా కార్యదర్శిలు కొరిమి రాజ్ కుమార్, బందు సాయిలు

వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్లో ధర్నా, నిరసన

భూపాలపల్లి నేటిధాత్రి :

 

దేశంలో మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఆపరేషన్ కగారును వెంటనే నిలిపివేయాలని సిపిఐ, సిపిఎం జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్, బందు సాయిలు డిమాండ్ చేశారు. గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఆపరేష న్ కగార్ ను నిలిపివేయాలని కోరుతూ సిపిఐ, సిపిఎం లిబరేషన్ పార్టీ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్లో నిరసన ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వామపక్ష నాయకులు మాట్లాడుతూ.. దేశంలో ఉగ్రవాదులతో చర్చలు జరిపిన ప్రభుత్వం అసమానతల కోసం పోరాటం చేస్తున్న మావోయిస్టులను అతి కిరాతకంగా ఎన్కౌంటర్ లో చంపడం దుర్మార్గం అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని మార్చుకొని మావోయిస్టుల తో శాంతి చర్చలు జరిపి జనజీవన స్రవంతిలో కలిసే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం అటవీ ఖనిజ సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టే అందుకే మావోయిస్టులను అంతం చేయాలని చూస్తుందని అన్నారు. 2026 లో ఆపరేషన్ కాగర్ పేరుతో మావోయిస్టు లను అంతం చేయాలనే దురుద్దేశంతో బిజెపి ప్రభుత్వం అత్యంత దుర్మార్గమైన చర్యకు పాల్పడుతుందని ఆరోపించారు. మావోయిస్టులు ఈ దేశ పౌరులేనని భారత రాజ్యాంగంలో జీవించే హక్కు ప్రతి మనిషికి కల్పించిందని రాజ్యాంగాన్ని ఉల్లంఘించి మనిషిని మనిషి చంపుకోవడం ఏంటని ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తన మొండి వైఖరిని విడనాడి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని కోరుతున్నారు.
ఈ ధర్నా కార్యక్రమంలో వామపక్ష నాయకులు సోతుకు ప్రవీణ్ కుమార్, క్యాతరాజు సతీష్,వెలిశెట్టి రాజయ్య కన్నూరి దానియల్ నేరెళ్ల జోసెఫ్ మాతంగి రామచందర్,శేఖర్, పొన్నగంటి లావణ్య,గోమాత,శ్రావణి,స్వరూప ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!