పరకాల నేటిధాత్రి
పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశానుసారం మండలం కామారెడ్డి పల్లె పోచారం, వెల్లంపల్లి గ్రామాలలో లక్ష డప్పులు వెయ్యి గొంతుల సంఘీభావ ప్రచార యాత్ర మరియు గోడ కరపత్రాలను కొయ్యడ కుమార్ మాదిగ ఎమ్మార్పీఎస్ మండల నాయకుడు ఆధ్వర్యంలో విడుదల చేశారు.గ్రామ గ్రామాన మాదిగ పల్లెలో ప్రచారం నిర్వహిస్తూ మాదిగ జాతి ఆత్మగౌరవం నిలబెట్టేందుకు ప్రతి మాదిగ ఇంటి నుంచి కదలిరావాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి ఏకు శంకర్ మాదిగ పిలుపునిచ్చారు.కార్యక్రమంలో డప్పు కళాకారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొయ్యడ విష్ణు మాదిగ,కామరెడ్డి పల్లె పోచారం గ్రామాల అధ్యక్షులు కొయ్యడ చిరంజీవి,ఇనుముల కృష్ణ మాదిగలు,ఎంఆర్పిఎస్,ఎంఎస్పి మాదిగ ఉద్యోగులు,కళాకారులు మాదిగ కుల పెద్దలు పాల్గొన్నారు.
లక్ష డప్పులు వెయ్యి గొంతుల గోడపత్రికల ఆవిష్కరణ
