కాప్రా నేటిధాత్రి 31:
మీర్పేట్ హెచ్ బి కాలనీ డివిజన్ హెచ్ బీ కాలనీ ఫేజ్-1 గ్రౌండ్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున యునైటెడ్ క్రిస్మస్ వేడుకలు స్థానిక కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం హౌసింగ్ బోర్డు పాస్టర్స్ ఫెలోషిప్ పాస్టర్ లతో కలిసి కేక్ కట్ చేసారు. అనంతరం కార్పొరేటర్ మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్ర గత ప్రభుత్వం అన్ని మతాల పండుగలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వమే ముందుండి అధికారికంగా పండగలు నిర్వహించిందని, అదే క్రమంలో ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆ సాంప్రదాయన్ని కొనసాగించడం మత సామరస్యానికి నిదర్శనమని అన్నారు. ఇక ముందు ఆ యేసు ప్రభు మనందరిని కరుణించి ఎలాంటి ఆపద రాకుండా, అందరూ సుఖ సంతోషాలతో ఉండేలా చూడాలని కోరారు. ముఖ్య ప్రసంగీకులు పాస్టర్ పవన్ కుమార్ వేమూరి, బిషప్ రెవరెండ్ డాక్టర్ జేకరయ్య, బిషప్ రెవరెండ్ డాక్టర్ దేవదానం, రఘుయెల్ రాబర్ట్, మరియు డివిజన్ చర్చిల పాస్టర్లు విచ్చేసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న సుమారుగా 750 డివిజన్ పరిధిలోని చర్చిల సంఘ సభ్యుల కోసం భోజన సదుపాయం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మల్లాపూర్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ గొల్లూరి అంజయ్య, మరియు స్థానిక కాలనీల నాయకులు పాల్గొన్నారు.