Fuel Shortage Sparks Outrage
పెట్రోల్ బంకుల్లో నోస్ట్రాక్ బోర్డులు
మోడీ ప్రభుత్వం వైఫల్యం
సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి బందు సాయిలు
భూపాలపల్లి నేటిధాత్రి
పెట్రోల్ బంకుల్లో ‘నో స్టాక్’ నివారించండి మోడీ ప్రభుత్వ కుట్రలను ఎండగట్టండిని
సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి బందు సాయిలు
విమర్శించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
తెలంగాణలో నెలకొన్న పెట్రోల్, డీజిల్ కొరతతో నో స్టాక్ బోర్డులు కన్పడుతున్నాయి. దీంతో ప్రజలు, రైతులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేవలం లాభాపేక్షతోనే ఈ ఆయిల్ కంపెనీలు ఈ కృత్రిమ కొరతను సృష్టిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం, చమురు సంస్థలు కలిసి సామాన్యుడిని దోచుకునేందుకు పన్నిన కుట్రలో భాగమే ఇది. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి పెంచి, చమురు సంస్థల ద్వారా అన్ని బంకులకు ఆయిల్ సరఫరాను పునరుద్దరించాలని సీపీఐ ఎం జిల్లా కార్యదర్శి బందు సాయిలు డిమాండ్ చేశారు
