"MLA Inaugurates 5th & 6th Ward Offices in Bhoopalapally"
5.6వార్డులలో కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎస్ఆర్
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని 5, 6 వార్డులలో ఎన్నికల ప్రచారంని నిర్వహించిన ఎమ్మెల్యే జిఎస్సార్ అనంతరం
భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు 5, 6 వార్డులకు సంబంధించిన వార్డు కార్యాలయాన్ని ఎమ్మెల్యే జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బట్టు కరుణాకర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు ఇంతర ముఖ్య నేతలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ అని, ప్రజల సమస్యల పరిష్కారమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. వార్డు స్థాయిలో పార్టీ కార్యాలయాల ద్వారా ప్రజలకు మరింత దగ్గరగా ఉండి, వారి సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కరించేలా పనిచేస్తామని తెలిపారు.మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ 6వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి ఉడుత సరోజన రాయమల్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు బౌత్ ఉడుత మహేందర్ మహేందర్ తదితరులు పాల్గొన్నారు
