నేటిధాత్రి దినపత్రిక కాలెండర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే జి.ఎస్.ఆర్

భూపాలపల్లి నేటిధాత్రి

నిఖార్సైన వార్తల నిజరూపం నేటిధాత్రి దినపత్రిక నిజాలు నిర్భయంగా రాసే పత్రిక ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పత్రికలు పని చేయాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని 23 వార్డుల ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు చేతుల మీదుగా నేటిధాత్రి దినపత్రిక 2025 నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ. ప్రజల సమస్యలు అధికారుల దృష్టికి తీసుక వచ్చి ప్రజల సమస్యలను పరిష్కరించడంలో నేటి ధాత్రి ముందు వరుసలో ఉంటుందని అన్నారు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ పత్రికలు పనిచేయాలి వ్యక్తిగత దూషణలతో వార్తలు రాసి పత్రికలు పేరు చెడగొట్టొద్దని అన్నారు
కొత్త సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని నేటి నేటిధాత్రి పత్రిక ప్రజల మన్ననలు పొందుతూ, మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నేటిధాత్రి దినపత్రిక భూపాలపల్లి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ మారపేల్లి చంద్రమౌళి కాంగ్రెస్ పార్టీ పట్టణ కార్యదర్శి పిప్పాల రాజేందర్ 16 వ వార్డు కౌన్సిలర్ దాట్ల శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి కోమల మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు కమల ఇర్ఫాన్ లారీ లోడింగ్ అన్ లోడింగ్ అధ్యక్షుడు విజయ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అశోక్ తోట రంజిత్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!