Minister Invited for Temple Event
శ్రీ రేణుక ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్టాపన ఆహ్వాన పత్రిక ఐ టీ శాఖ మంత్రికి అందజేసిన అడవి శ్రీరాంపూర్ గౌడ సంఘ నాయకులు
ముత్తారం :- నేటి ధాత్రి
ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్ గ్రామంలో గౌడ కులస్తుల ఆరాధ్య దైవమైన శ్రీ జమదగ్ని ముని సమేత శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి యంత్ర ప్రతిష్టాపన మే 9 వ తారీకు శనివారం రోజున జరుపబడును ఇట్టి కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు హైదరాబాదులోని మంత్రి నివాసంలో ఆహ్వాన పత్రిక అందజేసి ప్రతిష్టాపనకు రావలసిందిగా కోరారు ఈ కార్యక్రమంలో ముత్తారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొడ్డ బాలాజీ తో పాటు గౌడ సంఘం నాయకులు కూనూరి. సత్యనారాయణ గౌడ్, గట్టు సదయ్య గౌడ్, వీరగోని సంతోష్ గౌడ్, బండి క్రాంతి కుమార్ గౌడ్ మరియు వార్డు సభ్యులు వీరగోని అంజి గౌడ్. అడవి శ్రీరాంపూర్ గౌడ సంఘం తరఫున ఆహ్వాన పత్రిక అందచేశారు ఈ సందర్భంగా దేవాలయం ఆవరణలో సెంట్రల్ లైట్స్ మంత్రి మంజూరు చేయడం జరిగింది. అడవి శ్రీరాంపూర్ గ్రామ గౌడ సంఘం తరఫున మంత్రి కి కృతజ్ఞతలు మరియు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది
