మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండలంలోని నాన్ చెరువు తండా గ్రామపంచాయతీ నుంచి శనివారం రోజు పలువురు యువకులు కాంగ్రెస్ పార్టీ నుంచి కొందరు యువకులు బీఆర్ఎస్ పార్టీలోకి యువనేత చించోడ్ అభిమన్యు రెడ్డి, సమక్షంలో .. శంకర్ నాయక్, రోడ్డ శ్రీను, జటావత్ సంతోష్ నాయక్, ఏర్పుల నరేష్, ఎరుపుల యాదగిరి, మరియు యువకులు బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది.
పార్టీలో చేరిన యువకులు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న సంక్షేమ ఫలాలకు అభివృద్ధికి ఆకర్షితులై లక్ష్మారెడ్డి ని జడ్చర్ల ఎమ్మెల్యే గా భారీ మెజార్టీతో గెలిపిస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ గౌరి రవి నాయక్, యూత్ వింగ్ అధ్యక్షుడు బంగారి వెంకటేష్, శంకర్ నాయక్, వార్డ్ మెంబెర్ రోడ్డ రమేష్, యువ నాయకులు గణేష్ నాయక్, రాము నాయక్, పాల్గొన్నారు.