ఆపరేషన్ సింధూర్ విజయవంతం పై మందమర్రి.!

Sindhu

ఆపరేషన్ సింధూర్ విజయవంతం పై మందమర్రి పట్టణంలో బీజేవైఎం రాష్ట్ర నాయకుల సంబరాలు

మందమర్రి నేటి ధాత్రి:

జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ టూరిస్టుల పై ఉగ్రవాదుల దాడికి నిరసనగా ఆపరేషన్ సింధూర్ విజయవంతం పై మందమర్రి పట్టణంలో బీజేవైఎం రాష్ట్ర నాయకులు ధార రవి సాగర్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి రాష్ట్ర నాయకులు అందుగుల శ్రీనివాస్ పాల్గొన్నారు.పాత బస్టాండ్ ఏరియాలో ర్యాలీ నిర్వహించి భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు.అనంతరం నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

Sindhu
Sindhu

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత ప్రభుత్వ ఉగ్రవాద స్థావరాలపై చేసిన దాడి ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడం పై గట్టి చప్పట్లతో అభినందనలు తెలుపుతూ రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలకు పూర్తి మద్దతు ఇవ్వాలని కోరారు.

Sindhu
Sindhu

ప్రజలందరూ ఉగ్రవాదుల చర్యలకు బుద్ధి చెప్పే విధంగా సైనిక చర్యలు ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు అని అన్నారు.దేశ సమగ్రతకు పాటుపడుతున్న సైనిక చర్యలకు మద్దతు ఇస్తు వారికి మానసిక ధైర్యం ఇచ్చే విధంగా కార్యక్రమాలు చేయాలని ప్రజలకు కోరారు. ఈ కార్యక్రమంలో మార్తా కుమార్, దీక్షితులు,వినయ్,రంగు శ్రీనివాస్,జకుల కంకయ్య,బస్టాండ్ వ్యాపార సంఘం నాయకులు తదితరు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!