భూ కబ్జాదారుడు పై చర్యలు తీసుకోవాలి.
స్థానిక వాసులను భయ భ్రాంతులకు గురిచేస్తున్న బొమ్మినేని తిరుపతిరెడ్డి
హౌసింగ్ బోర్డ్ మేనేజింగ్ డైరెక్టర్ కు ఫిర్యాదు చేసిన స్థానికులు.
కాశిబుగ్గ నేటిధాత్రి:
వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 16వ డివిజన్ పరిధి కీర్తి నగర్ లోని హౌసింగ్ బోర్డ్ కాలనీ కు సంబంధించిన భూములను భూ కబ్జాదారుడు బొమ్మనేని తిరుపతిరెడ్డి ప్రభుత్వ భూములను కబ్జా చేయడం జరుగుతుంది. కబ్జాదారునిపై చర్యలు తీసుకోవాలని హోసింగ్ బోర్డు కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ కు స్థానిక వాసులు విద్యార్థు చేయడం జరిగింది. అనంతరం కీర్తి నగర్ మరియు గరీబ్ నగర్ వాసులు మాట్లాడుతూ హౌసింగ్ బోర్డ్ కాలనీ కు సంబంధించిన భూములను స్థానికంగా ఉంటున్న బొమ్మినేని తిరుపతి రెడ్డి నేను కీర్తి నగర్ కాలనీ అధ్యక్షుడిని అని స్తానిక వాసులను భయబ్రాంతులకు గురి చేస్తూ, తప్పుడు పత్రాలను సృష్టిస్తూ, హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఎంఐజి,ఎల్ఐజి లోని కొన్ని ఇండ్లకు సంబంధించిన యజమానులు స్థానికంగా లేకపోవడంతో వారి సంతకాలను ఫోర్జరీ చేస్తూ కొంతమంది వ్యక్తులతో కలిసి తప్పుడు పత్రాలు సృష్టించి హౌసింగ్ బోర్డ్ కాలనీలోని భూములను మరియు ఇండ్లను ఆక్రమించుకోని లక్షల రూపాయలను సొమ్ము చేసుకోవడం జరుగుతుందన్నారు.ఇదేంటని అని ప్రశ్నిస్తే ఖాళీ స్థలాల దగ్గర రౌడీల సహాయంతో,రాజకీయ అండ దండలతో ప్రశ్నించిన స్థానికులను, మహిళలను అని చూడకుండా, అసభ్య పదజాలంతో దూషిస్తూ, తిరుపతిరెడ్డి అతని అనుచరులు కలిసి స్థానికులను బెదిరించి ఇబ్బందులకు గురిచేస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి రెడ్డి అనే వ్యక్తి అతని ఇంటి వద్ద ఉన్న హౌసింగ్ బోర్డ్ కాలనీ కి సంబంధించిన రోడ్డును సైతం కబ్జా చేసి రోడ్డు మూసివేసి ప్రహరీ గోడను నిర్మించుకొని ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి అతను సొంత స్థలంగా వాడుకోవడం జరుగుతుందన్నారు.

అది సుమారు 100 గజాలకు పైనే ఉంటుంది.అంతే కాకుండా పక్క భూమిని కబ్జా చేయాలనే ఆలోచనతో ఉన్న తిరుపతిరెడ్డి ఖాళీ స్థలానికి ప్రహరీ గోడ నిర్మిస్తున్న క్రమంలో స్థానికులు వద్దని ఎంత చెప్పిన వినకుండా ప్రశ్నించే వారిని అతని అనుచరులతో బెదిరించడం జరుగుతుందన్నారు. స్థానికులు అంతా కుల, మతాలకు అతీతంగా కబ్జాకి గురవుతున్న ప్రభుత్వ స్థలం కాలనీ వాసులకు అందరికి ఉపయోగపడే విధంగా చూడాలని సంబంధిత అధికారులను కోరడం జరిగింది . గతంలో కూడా హౌసింగ్ బోర్డ్ కాలనీ కీర్తి నగర్ నందు తప్పుడు పత్రాలతో, కొంతమంది రౌడీల అండ దండలతో, రాజకీయ బడా బాబులతో చేతులు కలిపిన తిరుపతిరెడ్డి హౌసింగ్ బోర్డ్ కాలనీలోని భూములను కబ్జా చేస్తూ హౌసింగ్ బోర్డ్ కాలనీ ని సర్వనాశనం చేస్తున్నారని స్థానిక మహిళలు దుమ్మెతిపోస్తున్నారు.
అంతా నేనే ఈ హౌసింగ్ బోర్డ్ కాలనీకి అధ్యక్షుడనని నాకు ఎదురు చెప్పే వారు లేరని, నాకు ఎదురు చెప్పితే వారు కాలనీ లో ఉండరని,వాళ్ల సంగతి ఎట్లా చెప్పాలో మాకు బాగా తెలుసు అని స్థానికులను, మహిళలను, ఒంటరిగా ఉన్న సమయంలో వారి వద్దకు వచ్చి రౌడీల సహాయంతో వారిని భయభ్రాంతులకు గురిచేసి ఇబ్బంది పెడుతున్నాడని స్థానికులు వాపోతున్నారు.స్థానికులకు,మహిళలకు ఏదైనా జరిగితే పూర్తిగా తిరుపతి రెడ్డి,అతని అనుచరులే బాధ్యత వహించాలని ఈ సందర్భంగా తెలియజేశారు.వారితో స్థానికులకు ప్రాణభయం ఉందని అన్నారు. తిరుపతి రెడ్డి ఆగడాలు రోజురోజుకీ అత్యంత ప్రమాదకరంగామారుతుందని అన్నారు.హౌసింగ్ బోర్డ్ కాలనీలోని ఖాళీ స్థలాలను కబ్జా చేస్తున్న తిరుపతి రెడ్డి, రౌడీ ముకల పై చర్యలు తీసుకోవాలని హౌసింగ్ బోర్డు ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ కు స్థానికులు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు.