కామారెడ్డి జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి :
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలో రెండు సంవ్సరాల క్రితం పోగొట్టుకున్న చరవాణిని
సబ్ ఇన్స్పెక్టర్ భువనేశ్వర్ సంబంధిత బాదితునికి అందజేశారు. ఈ సందర్భంగా సబ్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ పోగొట్టుకున్న సెల్ ఫోన్ ను
సిఈఐఆర్ ద్వారా కనుక్కొని ఫోన్ యజమాని రాథోడ్ షలాజీ అందించినట్లు తెలిపారు. ఎవరైనా తమ యొక్క సెల్ ఫోన్ పోగొట్టుకున్నచో మీ సేవా ఆన్లైన్ ద్వారా గాని లేదా పోలీస్ స్టేషన్ కు నేరుగా వచ్చి ఫిర్యాదు చేసినచో సిఈఐఆర్ పద్ధతిలో వారి యొక్క ఫోన్ ను వెతికి అప్పగించడం జరుగుతుందని పేర్కొన్నారు.