Kollur Government School Gets Fresh Look
నూతన అంగులతో కొల్లూరు పాటశాల మరియు గ్రామ పంచాయతీ కార్యాలయం :
జహీరాబాద్ నేటి ధాత్రి:
ప్రైవేట్ పాటశాలకు ధీటుగా ఝరాసంగం మండల కొల్లూరులో ప్రభుత్వ పాటశాలకు నూతన పెయింటింగ్ వేయించడం జరిగింది,ఎన్నో రోజులుగా పాటశాలకు పెయింటింగ్ లేక బోషి పోయిన పాటశాలకు నూతన పాలకవర్గం పగ్గాలు చేపట్టినవేంటనే గ్రామ పంచాయతీ కార్యాలయానికి మరియు పాటశాలకు ప్రభుత్వా కార్యాలయాలకు నూతన వరువడి సృష్టించాలనే మంచి ఉద్ధ్యేశంతో పెయింటింగ్ వేయించడం జరిగింది.బడిని దేవాలయం గా బావించే మనము మన పిల్లలకు చక్కని వాతవరణంలో విద్యను అందజేయాలనే మంచి సంకల్పంతో పాటశాలకు పెయింటింగ్ వేసి ప్రైవేట్ పాటశాలకు ధీటుగా ప్రభుత్వా పాతశాలను రూపుదిద్దడం జరిగింధని నూతన పాలకవర్గం అభిప్రాయపడింది,అలాగే గ్రామంలో గల విద్యార్థుల తల్లితండ్రులు ఆనందం వ్యక్తం చేసారు…ఈ కార్యక్రమము గ్రామ పెద్దలు మరియు గ్రామ నూతన పాలకవర్గం అధ్వర్యంలో నిర్వహించారు..
