కరీంనగర్ జిల్లా కేంద్రంలో రాష్ట్ర స్థాయి బీసీ మేధోమథన సదస్సు.

కరీంనగర్ జిల్లా కేంద్రంలో జాతీయ బీసీ విద్యార్థి సంఘం అధ్వర్యంలో బీసీ మేధోమథన సదస్సు నిర్వహించడం జరిగింది,
రెండు రోజుల పర్యటన లో భాగంగా బీసీ, ఎస్సీ విద్యార్థి వసతి గృహాలు సందర్శించి విద్యార్థులతో ముఖ ముఖి నిర్వహించడం జరిగింది, శాతవాహన విశ్వ విద్యాలయంలో సందర్శించి విశ్వ విద్యాలయ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమిస్తామని తెలిపారు,

అనంతరం రాష్ట్ర స్థాయి బీసీ మేధోమథన సదస్సు నిర్వహించడం జరింగింది.
ఈ కార్యక్రమంలో అల్ ఇండియా ఓబీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షులు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నాయకులు జి కిరణ్ కుమార్, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కో ఆర్డినేటర్ జక్కని సంజయ్ కుమార్ లు ముఖ్య అతిధులుగా హాజరై మాట్లాడారు.

కింది డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
1. 2021 జనాభా లెక్కలలో కుల గణన చేపట్టాలి.

2. చట్ట సభల్లో బీసీలకు 53% రిజర్వేషన్లు కల్పించాలి.

3. పెండింగ్ లో ఉన్న పూలే ఓవర్సీస్, అంబెడ్కర్ ఓవర్సీస్ (విదేశీ విద్య), స్కాలర్షిప్, రియంబర్స్మెంట్, హాస్టల్ మెస్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి.

4. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో నూతన పోస్ట్ మెట్రిక్ వసతిగృహాలు నెలకొల్పాలి.

5. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రంలో 1000 మంది సమర్థంగల ఓబిసి వసతి గృహాలు ఏర్పాటు చేయాలి.

6. వసతి గృహాలకు, గురుకులకు పక్క భవనాలు నిర్మించాలి.

7. రాష్ర్టంలో ఉద్యోగాల క్యాలెండర్ ను అమలు పరచాలి, నోటిికేషన్లు విడుదల చేయాలి.

8. కరీంనగర్ లో మెడికల్ కళాశాల, సైన్స్ సెంటర్ ను వెంటనే నిర్మించాలి.

9. ఫీజుల రీయింబర్స్మెంట్ పథకం ద్వారా మెడికల్, ఇంజనీరింగ్, డిగ్రీ, పిజి, డిప్లొమా కోర్సులకు పూర్తి స్థాయి ఫీజులను ప్రభుత్వమే చెల్లించాలి.

10. పెరిగిన ధరలకు అనుగుణంగా వసతి గృహాలలో, గురుకులలో, మెస్ చార్జీలు పెంచాలి.

11. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ లో విద్యా రంగానికి ప్రాధాన్యత కల్పించాలి.

పై డిమాండ్లను పరిష్కరించాలని, వాటి సాధన కోసం నిరంతరం ఉద్యమిస్తామని తెలిపారు, అణగారిన వర్గాలపై వివక్ష దోరణి మార్చుకోవాలని సూచించారు లేని పక్షంలో గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో అల్ ఇండియా ఓబీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షులు జి. కిరణ్ కుమార్, జాతీయ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కో ఆర్డినేటర్ జక్కని సంజయ్ కుమార్, జాతీయ సహలదారులు మండే అంజి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓ. కొండల్, ముక్తిష్వర్, పవన్ నాయక్, బీసీ విద్యార్థి సంఘం నాయకులు లెంకల అనిల్, ఎర్ర బాలకృష్ణ, బోయినపల్లి సాయి చంద్, బీర్పుర్ వివేక్, కల్వ అజయ్, దుబాసి ప్రణీత్,
తదితరులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *