కాకిరాల నరసింహారావు ను మరో 3 సంవత్సరాల పాటు గవర్నమెంట్ ప్లీడర్ గా నియమించిన ప్రభుత్వం:-
– ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం:-
హనుమకొండ, నేటిధాత్రి (లీగల్):-
తెలంగాణ ప్రభుత్వం హనుమకొండ జిల్లా ప్రభుత్వ న్యాయవాదిగా కాకిరాల నర్సింహారావు ను మరో మూడేళ్ళ పాటు కొనసాగిస్తూ తేది:- నాడు ఉత్తర్వులు జారీ చేసింది. ఇట్టి నియామకానికి సంబంధించిన ఉత్తర్వులను హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సోమవారం జారిచేసారు.
నర్సింహా రావు ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రస్తుత మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం కుందూరు సోమారం గ్రామంలో మధ్యతరగతి వ్యవసాయ కుటుంబానికి చెందిన కాకిరాల రామారావు అనసూయమ్మ దంపతులకు ప్రథమ సంతానం గా 1967 లో జన్మించారు. చినప్పటి నుండే న్యాయవాది వృత్తి లోకి రావాలనే పట్టుదలతో 1992 లో ఆంధ్రా యూనివర్సిటీ నుండి గోల్డ్ మెడల్ తో లా పట్టాను పొందారు, ఆతర్వాత ఎల్ ఎల్ ఎం కాకతీయ యూనివర్సిటీ లో చేశారు. గత 33 సంవత్సరాలుగా న్యాయవాద వృత్తిని కొనసాగిస్తు పలు సివిల్ మరియు క్రిమినల్ కేసుల వాదించారు. గతంలో నిట్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కు స్టాండింగ్ కౌన్సిల్ గా పని చేసిన అనుభవం ఉండటం తో ఆయనను తెలంగాణ ప్రభుత్వ హనుమకొండ జిల్లా ప్రభుత్వ న్యాయవాదిగా నియమించింది. ఆయన నియామకం పట్ల పలువురు న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు.