*వివరాలు వెల్లడించిన రూరల్ ఎస్ ఐ మారుతీ
వేములవాడ, నేటి ధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వ్యక్తుల ను వేములాడ కోర్ట్ లో ప్రవేశ పెట్టగ అందులో 5గురుకి శిక్ష ఖరారు జరిగింది అని వేములవాడ రూరల్ ఎస్ ఐ మారుతీ తెలిపారు. ఇందులో పులి మధు అనే వ్యక్తి కి 1 రోజు జైలు మరియు రూపాయలు .2000/- జరిమానా,పిట్ల బాల మల్లేశం అనే వ్యక్తి కి 7 రోజులు జైలు శిక్ష మరియు రూపాయలు.2000/- జరిమానా, ఎక్కల్ దేవి మధు, నల్లగొండ మహేష్, పత్యం బాలరాజు అనే ముగ్గురికి రూపాయలు 2000/- జరిమానా విధించటం జరిగింది అని తెలిపారు.ఈ సందర్బంగా ఎస్ ఐ మారుతీ మాట్లాడుతూ ప్రజలు మద్యం సేవించి వాహనాలు నడుపరాదని, దాని వాళ్ళ వాహనం నడిపే వ్యక్తి కి మరియు ఎదురు గా వస్తున్న వ్యక్తుల కు కూడా ప్రమాదం అని అనవసరం గా ప్రాణాల మీద కి తెచ్చుకోవద్దు అని,ట్రాఫిక్ నియమాలు పాటించి గమ్యానికి క్షేమం గా చేరుకోవాలి అని కేసు లు చేసుకొని అనవసరం గా జైలు పాలు కావద్దు అని శిక్ష అనుభవించేవారిని చూసి అయినా మార్పు రావాలి అని ప్రజల ను కోరారు.