ప్రకటనల కోసం పచ్చని చెట్లను నరికి వేయడం బాధాకరం.

Trees

ప్రకటనల కోసం పచ్చని చెట్లను నరికి వేయడం బాధాకరం

మందమర్రి నేటి ధాత్రి:

మందమరి మార్కెట్ బస్టాండ్ చౌరస్తాలో ప్రకృతిని నాలుగోసారి బలిచేశారు. ప్రకటనల ప్రాధాన్యతకి ప్రకృతి విలువ తక్కువ అన్నట్లు, ఈ ఎండాకాలంలో పదిమందికి నీడనిచ్చే రాళ్ల చెట్టును రాత్రికి రాత్రే కోమ్మలు నరికి వేశారు. ఈ చెట్టు కొమ్మలను కనీస ఆనవాళ్లు కనిపించకుండా చెట్టు ఉన్న ప్రాంగణాన్ని శుభ్రంగా చేసి వేయడం వెనుక చెట్టును మళ్లీ ఎదగకుండా తుదిముట్ట ఇవ్వాలన్న ఉద్దేశమే ఉన్నట్లు ప్రత్యక్షదర్శులు చెబుతున్నారు.

Trees
Trees

ఈ చెట్టు వయస్సు సుమారు 20 సంవత్సరాలు. మున్సిపాలిటీ పరిధిలో పని చేసే కొందరి మాటల ప్రకారం… ఇదే చెట్టును గతంలో మూడు సార్లు కోసి గాయపర్చారు. కానీ ప్రతిసారీ అది మళ్లీ కోల్పోయిన కొమ్మలను పుట్టించుకుంటూ నిలబడింది. ఈసారి మాత్రం నిండా నీడాను అందించే కొమ్మలానే నరికి వేసినట్లు ప్రజలు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.ముఖ్యం గా ఆటో డ్రైవర్లు మాట్లాడుతు”మేము ఆటోలో రోజంతా తిరిగి వేసవి వేడిలో అలసిపోయి ఇక్కడే ఆగుతాం. ఇప్పుడు ఆ నీడ కూడా పోయింది” అంటూ కొందరు ఆటో డ్రైవర్స్ బాధతో చెప్పుకొచ్చారు. “అదే చెట్టుకింద మా సోడాబండి పెట్టుకుంటే కాస్త నీడలో పనిచేస్తాం. ఇప్పుడు మేము ఎండల్లో కాలిపోతున్నాం” అంటూ ఓ చిన్న వ్యాపారి వాపోయాడు.ప్రత్యక్షంగా చూసినవారూ, చెట్టు నీడను అనుభవించినవారూ ఆ కోపం, బాధ, అసహనం కలగలిపిన మాటలతో చెట్టు గాయాన్ని కళ్లకు కట్టినట్లు వివరిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!