ముందస్తు బడిబాట అవగాహన సదస్సు
జైపూర్ నేటి ధాత్రి:
ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చేర్పించాలని తల్లిదండ్రులను జాగ్రత్తపరిచి,వారిలో చైతన్యం తీసుకువస్తూ,కుందారం ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అనురాధ ముందస్తు బడిబాట కార్యక్రమం చేపట్టారు.ఈ క్రమంలో శుక్రవారం స్థానిక గ్రామ శివారులో ఉపాధి హామీ కూలీలు పని చేస్తున్న చోట ప్రభుత్వ పాఠశాల ప్రయోజనాల పై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా హెచ్ఎం అనురాధ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు చదువుకుంటే మంచిది అనే అభిప్రాయాన్ని వెళ్లబుచ్చారు.ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన జరుగుతుందన్నారు.ఉచిత పాఠ్యపుస్తకాలు,డిజిటల్ బోధన,యూనిఫామ్స్, మధ్యాహ్న భోజనం,అటల్ టింకరింగ్,ల్యాబ్ అత్యాధునికమైన సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తున్నట్లు వివరించారు.వేలకు వేల ఫీజులు కట్టి ప్రైవేటు పాఠశాలలకు వెళ్లే బదులు ప్రభుత్వ పాఠశాలలకు తమ పిల్లలను పంపించాలని కోరారు.అమ్మ ఆదర్శ పాఠశాల పథకంలో భాగంగా బాత్రూములతో పాటు వివిధ వసతులను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేశారన్నారు. ప్రభుత్వ పాఠశాల ప్రయోజనాలను సహా వివరంగా వివరించడంతో పిల్లల తల్లిదండ్రులు సానుకూలంగా స్పందించారని తెలిపారు.