4వ రోజుకు చేరిన సివిల్ హమాలీ కార్మికుల నిరవధిక సమ్మె

అర్దనగ్న ప్రదర్శనతో నిరసన తెలిపిన కార్మిక సంఘం నాయకులు

ప్రభుత్వం హామీలను నెరవేర్చాలని కార్మికుల డిమాండ్

ప్రభుత్వం స్పందించకపోతే సమ్మెలను ఉద్రిక్తం చేస్తాం

పరకాల నేటిధాత్రి
సివిల్ సప్లై హమాలీల ఎగుమతి దిగుమతి రేట్ల ఒప్పందం ప్రకారం జీవో విడుదల చేయాలని సివిల్ సప్లై కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేపట్టిన నేపథ్యంలో పరకాల పట్టణంలోని సివిల్ సప్లైగోదాం వద్ద యూనియన్ కార్మికులు చేస్తున్న నిరవధిక సమ్మె 4వ రోజుకు చేరింది.ఈ సందర్బంగా పలువురు కార్మిక నాయకులు మాట్లాడుతూ హమాలీల వేతన పందాన్ని వెంటనే అమలు చేయకపోవడం తో 2025 జనవరి 1నుండి రాష్ట్రవ్యాప్తంగా సివిల్ సప్లై మరియు జిసిసి హమాలీల కార్మికుల ఎగుమతి దిగుమతి రేట్ల ఒప్పందం 2023 డిసెంబర్ తో ముగిసింది 2024,2025 నూతన రేట్ల ఒప్పందాన్ని కోసం హమాలీ కార్మిక సంఘాలు ఆధ్వర్యంలో ప్రభుత్వానికి అనేక సందర్భాలలో వినతి చేసుకున్నప్పుడు నూతన రేట్లు మరియు ఇతర సమస్యల పరిష్కారానికి 10 నెలల తర్వాత 3అక్టోబర్ 2024 న అన్ని కార్మిక సంఘాల సమక్షంలో చర్చలు జరిపి ఎగుమతి దిగుమతి నూతన రేట్లు ప్రస్తుతం ఉన్న 26 నుండి 29 రూపాలుగా అనగా 3రూపాయలు పెంచారని ఈ పెరిగిన రేట్లు 2024 జనవరి నుండి అమలు చేస్తామని ఏరియాస్ తో సహా చెల్లిస్తామని,మహిళా కార్మికులకు గోధుమల సామర్ధ్యాన్ని బట్టి ప్రస్తుతం ఇస్తున్నా వేతనం పైన 1000అదనంగా పెంచుతామని,బోనస్ 6,500 నుండి 7500కు,యూనిఫామ్ స్టిచ్చింగ్ చార్జి 1300 నుండి 1600 వరకు పెంచుతామని కమిషనర్ సంబంధిత అధికారులు అంగీకరించడం జరిగిందన్నారు.మూడు నెలలు గడిచిన ఒప్పందం ప్రకారం నేటికీ కనీసం జీవో విడుదల చేయలేదని గత ఒప్పందాల సందర్భంలో చర్చలు జరిగిన తర్వాత జీవో విడుదల చేసి వెంటనే పెరిగిన రేట్ల ప్రకారం ఏరియర్స్ అందించడం జరిగేదని గత ఒప్పందాలకు భిన్నంగా సంవత్సరం కాలం గడిచిన నేటికి హమాలీల సమస్యల పైన రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం హమాలీలను ఆర్థికపరంగా నష్టపరచడమేనని అన్నారు.ఈ కార్యక్రమంలో హమాలీ యూనియన్ అధ్యక్షులు గడ్డం సురేష్,కార్యదర్శి మచ్చ సందీప్,ఉపాధ్యక్షులు సర్వేషం,మచ్చ శంకర్,బొచ్చు కృష్ణ,బొచ్చు బిక్షపతి,జూపాక చంద్రమౌళి,కొమ్ముల మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!