కరీంనగర్, నేటిధాత్రి:
ఈనెల 27న స్వేరోస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో జరిగే స్వేరోస్ నేషనల్ కన్వెన్షన్ వాల్ పోస్టర్లను కరీంనగర్ జిల్లా రామడుగు మండలం షానగర్ గ్రామంలో స్వేరోస్ జిల్లా అధ్యక్షులు పర్లపెల్లి మనోజ్ కుమార్ ఆవిష్కరించడం జరిగింది. ఈకార్యక్రమంలో స్వేరోస్ షానగర్ గ్రామ అధ్యక్షులు పర్లపెల్లి కిరణ్, గ్రామ మాజీ ఉపసర్పంచ్ లు తోట రవి, గునుకొండ వెంకటనర్సయ్య, ప్రజాసంఘ నాయకులు సైండ్ల కరుణాకర్, చిరుత ఎల్లయ్య, పెంటి శంకర్, స్వేరోస్ నాయకులు వెంకటేష్, గోపిచంద్, వినోద్, తదితరులు పాల్గొన్నారు.