ముగిసిన బొడ్రాయి, పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన…..

ఆనందోత్సవాల మధ్య సంబరాలు జరుపుకు న్నారు

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండలం కొప్పుల గ్రామంలో మూడు రోజులు బొడ్రాయి ప్రతిష్ట పోచమ్మ తల్లి విగ్రహమహోత్సవాలు వైభవంగా నిర్వహించారు కవితా-శ్రీనివాస్ ఆధ్వర్యంలో మూడు రోజులుగా వేద పండితులతో పూజలు నిర్వహించారు మొదటి రోజు అనగా విగ్రహాల ఊరేగింపు రెండవ రోజు గణపతి హోమం సామూహిక పూజలు కుంకుమ పూజలు మూడవరోజు పోచమ్మ తల్లి బొడ్రాయి విక్రమ ప్రతిష్ట వైభవోపేతంగా నిర్వహించారు అనంతరం పూర్ణాహుతి పూజలు మంగళ హోమం తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించారు. బొడ్రాయి పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి మాజీ జెడ్పిటిసి వంగాల రమ- నారాయణ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. వంగాల నారాయణరెడ్డి మాట్లాడుతూ ఫిబ్రవరి నెల 15,16, 17 తేదీల్లో గ్రామ ప్రజలు దంపతులతో పూజలు నిర్వహించి పోచమ్మ తల్లి, బొడ్రాయి ప్రతిష్టాపన వైభవంగా జరిగాయి ఈ పూజల్లో పాల్గొన్న పండితులు వేదమంత్రాలు ,పూర్ణాహుతి హోమం, గణపతి హోమం గ్రామ క్షేమాల కోసం ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రతి ష్టాపన వైభవంగా నిర్వ హించారు. అనంతరం కూడా గ్రామంలో పండుగ వాతావ రణం నెలకొంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ నిర్వాహకులు అన్ని రకాల వసతులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, ఆలయ అర్చకులు, వేద పండితులు అందరూ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!