`‘‘కేసీఆర్’’ ఆరోగ్యానికి ఔషదం ‘‘సంతోషే’’!
`చెదిరిపోని చిరునవ్వుతో ‘‘కేసిఆర్’’ ఆనందానికి కారణం ‘‘సంతోషే’’!
`పాతిక సంవత్సరాలకు పైగా ‘‘కేసీఆర్’’ కు సేవ చేస్తున్నాడు.

`అనుక్షణం ఆసరాగా వుంటున్నాడు.
`కుడి భుజమై కాపాడుకుంటున్నాడు.
`సహాయకుడుగా నిరంతర సేవలందిస్తున్నాడు.
`నిరంతరం ‘‘కేసీఆర్’’ వెన్నంటే వుంటాడు.

`ఉద్యమ సమయంలో ప్రతి సందర్భంలోనూ ‘‘సంతోష్’’ కనిపిస్తారు.
`కన్న తండ్రికి మించి సపర్యలు చేస్తూ వుంటాడు.
`సంతోషమైనా, ఆపదైనా ‘‘కేసీఆర్’’ వెనకాలే వుంటాడు.
`ఆసుపత్రిలో వున్నా కన్నపిల్లలకన్నా ఎక్కువగా ‘‘కేసీఆర్’’ను చూసుకుంటాడు.
`అలాంటి ‘‘సంతోష్’’ సేవలను శంకించడం తగదు.
`అనుక్షణం ‘‘కేసీఆర్’’ తన వద్ద ‘‘సంతోషే’’ వుండాలని కోరుకుంటాడు.
`‘‘కేసీఆర్’’ నిద్ర లేవక ముందే అక్కడుంటాడు.
`‘‘కేసీఆర్’’ నిద్రపోయిన తర్వాత ఇంటికెళ్తాడు.
`‘‘కేసీఆర్’’ ను దైవం కన్నా మిన్నగా ప్రేమిస్తాడు.
`జీతం కోసం పని చేసే వారు జీవితం త్యాగం చేయరు.
`తన వ్యక్తిగత జీవితమంతా ‘‘కేసీఆర్’’ కోసం త్యాగం చేస్తున్నాడు.
`ప్రతి వ్యక్తికి కుటుంబం వుంటుంది.
`జీవితంలో ప్రతి వ్యక్తి రాణించాలనే అనుకుంటాడు.
`ఆస్థులు, అంతస్తులు కోరుకోని వారుండరు.
`‘‘సంతోష్’’ స్థానంలో ఎవరూ ఒక్క రోజు కూడా వుండలేరు.
`‘‘సంతోష్’’ లాగా ‘‘కేసీఆర్’’ ను కంటికి రెప్పలా ఎవరూ చూసుకోలేరు.
`కన్న పిల్లల కన్నా ‘‘సంతోష్’’ ను ‘‘కేసీఆర్’’ చూసుకోవడానికి కారణం అదే.
`అయినా రాజకీయ వారసత్వం ‘‘కేటీఆర్’’ దే.
`కూతురుగా కుటుంబంలో కీలక స్థానం ‘‘కవిత’’దే.
`ఎంతగా ‘‘కేసీఆర్’’ కు సేవ చేసినా ‘‘సంతోష్ ఎప్పటికీ చుట్టమే’’!
హైదరాబాద్, నేటిధాత్రి:
జోగిన పల్లి సంతోష్రావు. ఈ పేరు పన్నెండేళ్ల క్రితం వరకు తెలంగాణ ప్రజలకు పెద్దగా పరిచయం లేని పేరు. తెలంగాణ కీలక ఉద్యమకారులకు, బిఆర్ఎస్ నాయకులకు, మీడియాలో కూడా కీలకమైన జర్నలిస్టులకు తప్ప పేరు తెలియని నాయకుడు. అలాంటి నాయకుడు తెలంగాణ వచ్చిన తర్వాత కేసిఆర్ సిఎం. అయ్యాక సంతోష్ పేరు నిత్యం వినిపిస్తూ వచ్చింది. సంతోష్ గురించి కేసిఆర్ ఆమరణ దీక్ష చేపట్టిన సమయంలో చాలా మందికి పరిచయం అయ్యారు. కేసిఆర్ ఆమరణ దీక్ష చేపట్టి నిమ్స్లో చికిత్స తీసుకుంటూ దీక్ష చేస్తున్న సమయంలో సంతోష్ ఏమిటో? ఆయనకు పార్టీలో వున్న ప్రాదాన్యత ఏమిటో? ఆయన ఎవరో? ఆయనకు కేసిఆర్ కు వున్న బంధుత్వం గురించి తెలంగాణ ఉద్యమకారులకు తెలిసింది. తెలంగాణ ప్రకటన వచ్చిన తర్వాత కేసిఆర్ తెలంగాణ ప్రజలకు అభివాదం చేస్తూ, ప్రజలనుద్దేశించి మాట్లాడుతున్న సమయంలో కేసిఆర్ వెనుకే నిలబడిన వ్యక్తి సంతోష్ అని అందరూ తెలుసుకున్నారు. అప్పటి నుంచి ముఖ్యంగా బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ఉన్నతోద్యోగులు సంతోష్ గురించి చర్చించుకోవడం అందరం విన్నదే. ఎప్పుడైతే సంతోష్ రాజ్యసభ అయిన తర్వాత తెలంగాణ ప్రజలకు కూడా ఆయనెవరో పూర్తిగా తెలిసింది. అప్పటి వరకు కల్వకుంట్ల కుటుంబానికి చెందిన బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంటు కేటిఆర్, కేసిఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి హరీష్రావుల తర్వాత నాలుగో వ్యక్తిగా రాజకీయాల్లో సంతోష్ పేరు ప్రముఖంగా వినిపిస్తూ వచ్చింది. ఒక దశలో సంతోష్ పేరే రాజకీయ, ఉద్యోగ వర్గాలలో ఎక్కువగా వినిపిస్తూ వచ్చింది. అంతలా సంతోష్ గొప్పదనమేముంది? అనే చర్చ కూడా తెలంగాణ రాజకీయాల్లో పెద్దఎత్తున చర్చ జరిగింది. బిఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి రావడానికి ముందు సంతోష్కు అప్పటి ముఖ్యమంత్రి కేసిఆర్ రాజ్యసభకు ఎంపిక చేశారు. అందరూ అవాక్కయ్యారు. ప్రతిపక్షాలు విరుచుకుపడ్డాయి. అసలు సంతోష్కు రాజకీయాలకు ఏం సంబంధం అంటూ అనేక ప్రశ్నలు లేవనెత్తాయి. అప్పుడు కేసిఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి సంతోష్ గురించి చెప్పడం జరిగింది. సంతోష్ కూడా ఆదినుంచి ఉద్యమంలోనే వున్నారనే విషయం వెల్లడిరచారు. అంతే కాకుండా ఉద్యమ నాయకుడుగా తనను కాపాడుకునే బాద్యత తీసుకున్నాడు కేసిఆర్ చెప్పారు. కేసిఆర్ను తెలంగాణ ఉద్యమం మొదలై, 2004 ఎన్నికల సమయం నుంచి సంతోష్ డిల్లీలో కేసిఆర్కు తోడుగా వుండడం మొదలు పెట్టారు. తెలంగాణలో హరీష్రావు, డిల్లీలో కేసిఆర్ వున్నప్పుడు సంతోష్ చూసుకుంటూ వచ్చారు. ఇలా ఇరవై ఐదు సంతవ్సరాలుగా కేసిఆర్ యోగ క్షేమాలు చూసుకుంటూ వస్తున్నారు. కేసిఆర్ ఎప్పుడు ఎవరిని కలవాలి. ఎవరితో ఎప్పుడు మాట్లాడాలి. కేసిఆర్ ఎప్పుడు ఏం తినాలి. మందులు వేసుకోవాలి. అని ప్రతిపతి క్షణం కనిపెట్టుకుంటూ, కేసిఆర్ను జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చారు. కేసిఆర్ తనకు ఎప్పుడు ఏ మందులు కావాలో, ఇవ్వాలో చూసుకుంటాడు. అని చెప్పినప్పటినుంచి ప్రతిపక్షాలు సంతోష్ను అనేక రకాలుగా ఎగతాళి చేస్తూ వచ్చారు. వివాదాలు సృష్టిస్తూ వచ్చారు. అయితే బిఆర్ఎస్ రెండోసారి అదికారంలోకి వచ్చిన తర్వాత సంతోష్ మీద కుట్రలు చేసిన వారు కూడా చాల మంది వున్నారు. కవిత లాంటి వారు కూడా తమకు కేసిఆర్ అప్పాయింటు మెంటు ఇవ్వకుండా సంతోష్ను అడ్డుకుంటున్నాడంటూ కూడా సన్నిహితుల వద్ద చెప్పిన సందర్భాలున్నాయి. ఇలా అనేక విమర్శలు కూడా సంతోష్ ఎదుర్కొన్నారు. కేసిఆర్ ముఖ్యమంత్రిగా వున్న సమయంలోనే సంతోష్ ఇక్కడ ఆస్ధులు సంపాదించాడు. అక్కడ ఆస్ధులు కొనుగోలు చేశాడంటూ కూడా అనేక వర్తాలు వచ్చేవి. వాటిని ఎవరు లీక్ చేసేవారో ఇప్పుడు తేలిపోయింది. ఎందుకంటే కవిత నేరుగా సంతోష్ను టార్గెట్ చేస్తూ మాట్లాడుతోంది. సంతోష్ను వేలెత్తి చూపిస్తోంది. కాని తన తండ్రి ఇప్పటికీ ఇంత సంతోషంగా, ఇంత ఆనందంగా, ఆరోగ్యంగా వుండడానికి కారణం సంతోష్ అని తెలియదా? సంతోషంగా వున్నప్పుడు ఎవరి గురించి తెలియదు. కాని బాదల్లో వున్నప్పుడే మనిషి విలువ తెలుస్తుంది. బిఆర్ఎస్ అదికారంలో వున్న పదేళ్లకాలంలో సంతోష్ రావు తన కుటుంబంతో కలిసి ఎక్కడికైనా వెళ్లినట్లు గాని, కుటుంబంతో కలిసి ఏవైనా ఫంక్షన్లకు వెళ్లినట్లు గాని ఒక్క ఫోటో బైటకు రాలేదు. కాని కవిత కుటుంబం గురించి అనేక వార్తలు వచ్చాయి. కేసిఆర్ సిఎం. అయిన తర్వాత ఏ అనారోగ్య సమస్య వచ్చినా ఆసుపత్రిలో కనిపించే ఏకైక నాయకుడు సంతోష్. కేసిఆర్ ఎన్ని రోజులు ఆసుపత్రిలో వుంటే అన్ని రోజులు కూడా ఆసుపత్రిలోనే వుంటూ ప్రతి క్షణం కాపాడుకునే నాయకుడు సంతోష్. ఈ మధ్య అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా కేసిఆర్ ఆరోగ్యానికి ఏ ఇబ్బంది ఎదురైనా ఆయనను కన్న తండ్రికన్నా ఎక్కువగా చూసుకుంటున్న ఏకైక వ్యక్తి సంతోష్. తన తండ్రి కేసిఆర్ను ఇంత గొప్పగా, ఇంత జాగ్రత్తగా కేటిఆర్, కవితలు కూడా చూసుకునేవారు కాదు. ఎవరికైనా వ్యక్తిగత జీవితం వుంటుంది. పుట్టిందే జీవితాన్ని గొప్పగా అనుభవించడానికి, కాని సంతోష్ లాంటి వ్యక్తికి అన్నీ కళ్లముందు వున్నా అనుభవించలేని జీవితాన్ని గడుపుతున్నాడని ఎంత మందికి తెలుసు. అది అనుభవించేవారికే తెలుస్తుంది. మన కుటుంబ సభ్యులు, కన్న తల్లిదండ్రులైనా సరే ఒక్క రోజు ఆసుపత్రిలో వుంటే చూసుకోవాలంటే చిరాకు పడిపోతాము. అలాంటిది ఒక కేసిఆర్ను పట్టుకొని పాతిక సంవత్సరాలుగా కాపాడుకుంటూ వస్తున్న సంతోష్పై ఎమ్మెల్సీ కవిత ఆరోపణలు చేయడాన్ని తెలంగాణ సమాజం కూడా జీర్ణించుకోలేకపోతోంది. ఇది కవిత గమనించాలి. సంతోష్ను విమర్శించి కవిత తప్పు చేసిందని బిఆర్ఎస్ నాయకులు అంటున్నారు. కుటుంబ సమస్యను కవిత బజారున పడేయడమే కాకుండా కేసిఆర్ను కంటికి రెప్పలా కాపాడుకునే సంతోష్ను విమర్శిండం సరైంది కాదంటున్నారు. అంటే కేసిఆర్ సంతోషంగా వుండడం కవితకు ఇష్టం లేదా? కేసిఆర్కు సంతోష్ను దూరుం చేస్తారు? సరే..మరి కేసిఆర్ను సంతోష్లగా చూసుకునే వ్యక్తిని తేగలరా? రాజకీయాలు వదిలేసి కవిత తండ్రి కేసిఆర్ను చూసుకోగలరా? ఇవి ఇప్పుడు బిఆర్ఎస్లో జరుగుతున్న చర్చ. కేసిఆర్ ఆరోగ్యానికి రక్షణగా నిలుస్తున్న సంతోషే అసలైన ఔషదం అని బిఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. రోజూ ఎంత పని ఒత్తిడిలో వున్న చెరగని చిరునవ్వుతో కనిపించే సంతోష్ వల్లనే కేసిఆర్ ఆర్యోగంగా ఆనందంగా వుండగలుగుతున్నాడని అంటుంటారు. దేవుడికైనా గుడిలో సేవ చేసే పూజారి కూడ కొంత సమయమే వెచ్చిస్తాడు. కాని కేసిఆర్ను కంటికి రెప్పలా కాపాడుకునే సంతోష్ ఇరవైనాలుగు గంటుల కేసిఆర్ వెంటే వుంటారు. కేసిఆర్ వెన్నంటే వుంటారు. కేసిఆర్ కోసం జీవితమే త్యాగం చేశారు. తనను కన్న తండ్రిలా చూసుకున్న సంతోష్ను కన్న కొడుకు కన్నా ఎక్కువగా కేసిఆర్ చూసుకుంటూ వస్తున్నారు. అదేదో సినిమాలో చెప్పినట్లుగా కంటేనే అమ్మ అని అంటే ఎలా? అన్నట్లు కేసిఆర్ను ఎంతో ప్రేమతో సేవలు చేస్తున్న సంతోష్ అంటే కూడా కేసిఆర్కు అంత ప్రేమ వుంటుంది. ప్రతి వ్యక్తికి ఒక జీవితం వుంటుంది. కుటుంబం వుంటుంది. కాని సంతోష్కు జీవితం, కుటుంబం కూడా కేసిఆరే అయ్యారు. కేసిఆర్ను దేవుడిగా కొలుస్తూ సేవలు చేస్తున్నాడు. ప్రతి వ్యక్తికి జీవితంలో ఏదో ఒక రకంగా రాణించాలనే వుంటుంది. ఎక్కడో జీవితం ఆగిపోవాలని ఎవరూ అనుకోరు. ఆస్ధులు, అంతస్ధులు సంపాదించుకోవాలని అనుకుంటారు. కాని కేసిఆర్కు సేవ చేయడమే తన జీవితానికి గొప్ప అనుకోవడం సామాన్యమైన విషయం కాదు. అయినా సంతోష్ ఎప్పుడూ కేసిఆర్కు రాజకీయ వారసుడు కాదు. కుటుంబంలో కవిత కన్నా కీలకమైన స్దానం కూడా కాదు. కేసిఆర్కుఎంతసేవ చేసినా సంతోష్ ఎప్పటికీ చుట్టమే తప్ప, వారసుడు కాలేడు. ఈ సత్యం సంతోష్కు తెలియంది కాదు. కవితకుతెలియంది కాదు. అయినా సంతోష్ను వేలెత్తి చూపి ఆయన మనసు గాయపర్చడం అంటే కేసిఆర్ మనసు కష్టపెట్టడమే అవుతుంది. ఇప్పటికైనా కవిత ఈ సంగతి తెలుసుకోకపోవడం విడ్డూరం. ఏది ఏమైనా సంతోష్ లాగా కేసిఆర్కు సేవలు చేయడం అనేది ఎవ్వరి వల్ల కాదు. అంత ఓపిక వున్న వారు ఎవరూ వుండరు. ఈ విషయంలో సంతోష్ ఈస్ గ్రేట్ అని అందరూ అనాల్సిందే.