సేవారత్న అవార్డు అందుకున్న గజెల్లీ మోహన్..

Ghazelli Mohan, recipient of the National Ugadi Award and the Seva Ratna Ghazelli Mohan, recipient of the National Ugadi Award and the Seva Ratna

జాతీయ ఉగాది పురస్కారం, సేవారత్న అవార్డు అందుకున్న గజెల్లీ మోహన్.

బెల్లంపల్లి నేటిధాత్రి :

బెల్లంపల్లి బాబు క్యాంప్ బస్సుకి చెందిన గజెల్లీ మోహన్ కు జాతీయ ఉగాది పురస్కారం, సేవారత్న అవార్డు.తార ఆర్ట్స్ అకాడమీ హైదరాబాద్ తెలంగాణ ఆధ్వర్యంలో తేదీ 14 మార్చి 2025 రోజున హైదరాబాదులోని రవీంద్ర భారతిలో భారతీయ సాంప్రదాయ సాంస్కృతిక కలోత్సవంలో భాగంగా జాతీయ ఉగాది పురస్కారాలను అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగ సినీ యాక్టర్ సుమన్ పరికి పండ్ల నరహరి ఐఏఎస్ ప్రిన్సిపల్ సెక్రెటరీ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ మధ్యప్రదేశ్ ప్రముఖ రచయిత నందిని సిద్ధారెడ్డి. వకులాభరణం కృష్ణమోహన్. ex బిసి కమిషన్ చైర్మన్. అనేకమంది రచయితలు అతిథులు పాల్గొన్నారు ఈ కార్యక్రమం రూపకర్త తార ఆర్ట్స్ అకాడమీ ఫౌండర్ ప్రెసిడెంట్ సంకె రాజేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు చేయడం జరిగింది. ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ ఇతర రాష్ట్రాల నుండి సాంప్రదాయ నృత్యాల ప్రదర్శన జరిగినది. సందర్భంగా వివిధ రంగాలలో సేవలందిస్తున్న వారిని జాతీయ ఉగాది పురస్కారం కింద అవార్డులను అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా గత 30 సంవత్సరాలుగా సామాజిక సేవలో, సంఘమిత్ర. ఎన్ ఎస్ ఎస్ కార్యక్రమాల ద్వారా అనేక సంఘ సంక్షేమ కార్యక్రమాలు . ప్రభుత్వ కార్యక్రమాల అమలులో భాగస్వాములవుతూ గతంలో జిల్లాస్థాయిలో రాష్ట్రస్థాయిలో ప్రభుత్వం చేత ప్రభుత్వ ఇతర సంస్థల చేత బహుమతులు అవార్డులు స్వీకరించి నారు. గతంలో చేసిన సేవలను ఆధారంగా చేసుకుని గజెల్లీ మోహన్ సంఘ సేవకులు. లెక్చరర్ అయిన నాకు జాతీయ ఉగాది పురస్కారం కింద సేవా రత్న అవార్డును ముఖ్య అతిథులు సినీ యాక్టర్ సుమన్ చేతుల మీదుగా అవార్డును స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా నాకు అవార్డునందించిన తార ఆర్ట్స్ అకాడమీకి నాకు అభినందనలు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!