వనపర్తి / నేటి ధాత్రి.
వనపర్తి జిల్లాల్లో మైనార్టీ యువతకు ఉచితంగా గ్రూప్-1,2,3,4 ఆర్ఆర్ బి, ఎస్ఎస్సి, బ్యాంకింగ్ వంటి పరీక్షలకు నాలుగు నెలల పాటు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి సుబ్రహ్మణ్యం శనివారం తెలిపారు. నిరుద్యోగులు ఈనెల 17వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తుదారులు ఎస్ఎస్సి, ఇంటర్, డిగ్రీ, మెమో, ఆధార్ కార్డు జిరాక్స్, రెండు ఫోటోలతో వనపర్తి కలెక్టర్ కార్యాలయంలోని ఐడిఓసి కార్యాలయం నందు దరఖాస్తులను అందజేయాలన్నారు.