శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణానికి ముత్యాల తలంబ్రాల కొరకు నగదు అందజేత
ఆలయ అభివృద్ధి కొరకు 10116నగదు అందజేత
గణపురం నేటి ధాత్రి:
గణపురం మండల కేంద్రంలోని ప్రసిద్ధిగాంచిన శ్రీ పట్టాభి సీతారామచంద్ర స్వామి దేవాలయంలో ఏప్రిల్ ఆరవ తారీకు ఆదివారం నిర్వహించనున్న సీతారాముల కళ్యాణం కొరకు గణపురం వాస్తవ్యులు అయినా విశాఖపట్నంలో వెహికల్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న తాళ్లపల్లి కిరణ్మయి రాజన్న దంపతులు స్వామివారి కళ్యాణానికి ముత్యాల తరంబ్రాల కొరకు 10116 రూపాయలను ఆలయ కమిటీ చైర్మన్ తాళ్లపల్లి గోవర్ధన్ కు అందజేయడం జరిగింది అదేవిధంగా రాజన్న మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నిర్వహించనున్న సీతారామ కళ్యాణానికి ముత్యాల తలంబ్రాల ను పంపిస్తానని తెలపడం జరిగింది అదేవిధంగా గణపురం మండల కేంద్రానికి చెందిన కీర్తిశేషులు మేడిపల్లి ప్రమీల కొమరయ్య జ్ఞాపకార్థం వారి కుమారులు శ్రీనివాస్ శ్రీకాంత్ ఆలయ అభివృద్ధి కొరకు10116 రూపాయలను ఆలయ కమిటీ అధ్యక్షులకు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు ముసునూరి నరేష్ ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు