MLA Opens Paddy Procurement Centers
రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యం ఎమ్మె ల్యే జీఎస్సార్
పలు గ్రామాల్లో వడ్ల కొను గోలు కేంద్రాలుప్రారంభం
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండలంలోని నేరేడుపల్లి,ప్రగతి సింగారం, కాట్రపల్లి,వసంతాపూర్ గ్రామా లలో పి.ఎ.సి.ఎస్ మరియు ఐకెపి, రైతు సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రా లను ప్రారంభించారు ఈ సం దర్భంగాఎమ్మెల్యే గండ్ర సత్య నారాయణరావు మాట్లాడు తూ రైతులు పండించిన సన్న ధాన్యానికి మద్దతు ధర 2389/- రూపాయలు ప్రభు త్వం ఇస్తుందని తెలిపారు, వ్యవసాయశాఖ అధికారులు కోత మిషన్ల యొక్క ఆర్పి ఎం 18 నుండి 20 వరకు మరి యు బ్లోయర్ ఆన్ లో ఉంచే విధంగా కోత మిషన్ యజ మానులకు తెలియజేయాల ని ఇలా చేయడం వల్ల ధాన్యం లో తాలు ఉండదని అన్నారు. రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ పంటను నేరు గా కొనుగోలు కేంద్రాలకు తీసు కువచ్చి విక్రయించాలని సూ చించారు. మధ్యవర్తి జోక్యం లేకుండా పారదర్శకంగా ధా న్యం కొనుగోలు జరుగుతుం దని రైతుల కు సమయానికి డబ్బులు చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పా రు అలాగే కొనుగోలు కేంద్రాల్లో తేమ ప్రమాణాలు, కొలతలు సక్రమంగా పాటిం చాలని అధికారులను ఆదేశిం చారు. రైతులు ఎలాంటి సమ స్యలు ఎదుర్కొన్న వెంటనే అధికారుల దృష్టికి తీసుకురా వాలని ప్రభుత్వం రైతు సంక్షే మానికి ఎల్లప్పుడూ అండగా ఉంటుం దని తెలిపారు.ఈ కార్యక్ర మంలో సివిల్ సప్లై అధికారులు, సంబంధిత అధికారులు, మండల పార్టీ అధ్యక్షుడు, మండల వ్యవసా య అధికారి ప్రియదర్శిని, స్థానిక ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
