పరకాల నేటిధాత్రి
హన్మకొండ జిల్లా పరకాల మండల అధ్యక్షులు దేవేందర్ రెడ్డి జన్మదిన పురస్కరించుకొని కాంగ్రెస్ పట్టణ నాయకుల ఆధ్వర్యంలో శనివారం రోజున స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదల పెన్నిధి నిత్యం ప్రజల కోసం తపన పడే మంచి మనసున్న వ్యక్తి పరకాల మండల అధ్యక్షులు దేవేందర్ అని కాంగ్రెస్ పార్టీ కోసం ఆహర్నిశలు కృషి చేస్తున్న వ్యక్తి అని అన్నారు.ఈ కార్యక్రమంలో నడికుడ మండల అధ్యక్షులు బుర్ర దేవేందర్ గౌడ్,ఎస్సీ సెల్ అధ్యక్షులు బొమ్మ కంటి చంద్రమౌళి,కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఏకూ రవికుమార్, దావు పరమేశ్వర్ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ మంద నాగరాజు యూత్ పట్టణ అధ్యక్షులు మచ్చ సుమన్, కాంగ్రెస్ నాయకులు బొచ్చు మోహన్,ఉడుత సంపత్, మహమ్మద్ అలీ,కందుకూరి రాంప్రసాద్ పాల్గొన్నారు.
ఘనంగా దేవేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు
