బిఆర్ఎస్ తోనే అభివృద్ధి సాధ్యం

◆ కాంగ్రెస్ కు ఓటు వేస్తే కరెంటు కోతలే

◆ బిఆర్ఎస్ గెలిస్తేనే గొప్పగా అభివృద్ధి

◆బిఆర్ఎస్ పాలనలో ఎర్రబెల్లి గ్రామానికి రూ. 29.94కోట్ల నిధులను అందించిన ప్రభుత్వం

◆కాంగ్రెస్ వాళ్ళ మాటలు నీటిమూటలు

◆ పచ్చని తెలంగాణలో చిచ్చు పెట్టాలని చూస్తున్న కాంగ్రెస్,బీజేపీ

◆హుస్నాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్

వేలేరు:నేటి ధాత్రి

బిఆర్ఎస్ తోనే అభివృద్ధి సాధ్యమని హుస్నాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వేలేరు మండలంలోని ఎర్రబెల్లి గ్రామంలో శనివారం వారు పర్యటించి కార్ గుర్తుకే ఓటు వేసి నన్ను అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.తమ ఓటు కారు గుర్తుకే అంటూ ప్రజలు సంతోషంతో మద్దతు పలికారు. ఈ సందర్భంగా సతీష్ కుమార్ మాట్లాడుతూ…కొట్లాడి తెచ్చుక్కున్న తెలంగాణ సుభిక్షంగా ఉండాలంటే మరోసారి కేసీఆర్ చేతులను బలోపేతం చేయాలనీ, తెలంగాణ ను కాపాడుకోవాల్సిన బాధ్యత మీదేనన్నారు.ప్రజలు ఓటు వేసే ముందు సమైక్య పాలనలో జరిగిన అన్యాయాన్ని, కరెంటు కోసం,సాగునిటీ కోసం, కష్టపడ్డా రోజులను గుర్తుంచుకొని ఓటు వేయాలని కోరారు.కాంగ్రెస్ హయాంలో పింఛన్ ఇవ్వలేదని,కొత్తగా పింఛన్ కావాలంటే మరో లబ్దిదారు చావు కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉండేదన్నారు.కరెంటు, సాగు, తాగునీరు లేక అభివృద్ధి కాక అరిగోసపడ్డమన్నారు.స్వరాష్ట్రంలోఅభివృద్ధిసాధించిన పచ్చని తెలంగాణలోచిచ్చు పెట్టాలని తెలంగాణ వ్యతిరేకులంతా ఒక్కటై కేసీఆర్ ను ఓడగొట్టేందుకు కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు.ఇక్కడి సంపదను దోచుకొని రాష్ట్రాన్ని గుడ్డి దీపం చేసేందుకే యత్నిస్తున్నారని,అంద్రోళ్ల మాటలు నమ్మి మోసపోతే మన నీళ్లు,నిధులు దోచుకుంటారని చెప్పారు.అధికారాన్ని ఢిల్లీ పాలకులు, అంద్రోళ్ల చేతుల్లో పెట్టొద్దని విజ్ఞప్తి చేసారు.బిఆర్ఎస్ అధికారంలోకి రాకుంటే రాష్ట్రం కుక్కలు చింపిన విస్తారిలా మార్చివేస్తానన్నారు.కర్ణాటక ప్రజలను మోసం చేసిన ఘనత కాంగ్రెస్ దని, వారి మాటలు నమ్మి మన బిడ్డల బంగారు భవిష్యత్తును అంధకారంలోకి నెట్టవద్దని సూచించారు.బిఆర్ఎస్ పాలనలో ఎర్రబెల్లి గ్రామా అభివృద్ధి, సంక్షేమానికి రూ. 29.84 కోట్ల రూపాయల నిధులను మన ప్రభుత్వం మన గ్రామానికి అందించిది అని అన్నారు.అర్హులైన వారందరికీ ఆసరా పింఛన్లు,రైతు బంధు,కల్యాణ లక్ష్మి, రైతు భీమా, అమ్మఒడి,కేసీఆర్ కిట్ ను అందించమన్నారు.కొందరు కొత్త నాయకులు వచ్చి మాయమాటలు చెప్పి తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని,ప్రజలు వారిని నమ్మి మోసపోవద్దు సూచించారు.కాంగ్రెస్ వాళ్ళ మాటలు ఉత్త జూట మాటలని వారి పాలనలో ప్రజలకు చేసిన అభివృద్ధి ఏంటో ఇప్పటి మన తెలంగాణ పాలనలో చేసిన అభివృద్ధి ఏమిటో మీరే చూస్తున్నారని అన్నారు. ఆ అభివృద్ధి ని చూసి మీరే ఓటు వేయాలని అన్నారు. ఎన్నికల సమయంలోనే కాంగ్రెస్ నాయకులకు ప్రజలు గుర్తుకు వస్తారని,ఇలా వచ్చి ఆలా పోయే కాంగ్రెస్ నాయకులకు ఓటు వేసి ఆగం కావొద్దన్నారు. పొన్నం ప్రభాకర్ మాటలు నమ్మి ఓటు వేస్తే రైతులకు మళ్ళీ చీకటి రోజులు వస్తాయాన్నారు.వ్యవసాయ రంగానికి పెద్ద పిటా వేస్తున్న సీఎం కేసీఆర్ ను మూడోసారి హైట్రిక్ విజయంతో గెలిపించి సీఎం చేసుకోవాలని, తనను కూడా మూడో సారి హైట్రిక్ విజయంతో గెలిపించగలరని కోరారు.ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ డాక్టర్ సుధీర్ కుమార్, మాజీ మంత్రి సీనియర్ నాయకులు ఇనుగాల పెద్దిరెడ్డి,భీమదేవరపల్లి ఎంపీపీ జక్కుల అనిత, జడ్పీటీసీ వంగ రవీందర్, వైస్ ఎంపీపీ హిజ్రా,భీమదేవరపల్లి బిఆర్ఎస్ మండల అధ్యక్షులు మారుపాటి మహేందర్, గ్రామ సర్పంచ్ గూడ కవిత రాజు కుమార్,ఉప సర్పంచ్ అల్లం సతీష్, గ్రామ శాఖ అధ్యక్షులు గుత్పల సతీష్, యూత్ అధ్యక్షులు గుడికందుల సంజీవ్, కొత్తకొండ దేవస్థానం డైరెక్టర్ నాగపూరి సతీష్, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కాలేరు శివాజీ,వార్డు సభ్యులు భూక్య అర్జున్, చిలుక భాస్కర్, గుత్పల కల్పన,బిఆర్ఎస్ నాయకులు రేణ రజినీకాంత్, గూడ అనిల్ గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!