వీలీన సభను జయప్రదం చేయండి

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి :
వివిధ కారణాలతో విడిపోయిన రెండు సిపిఐ (ఎంఎల్ )న్యూ డెమోక్రసీ పార్టీలు ఈనెల 28వ తేదీన సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వీలీన సభ జరిపి ఐక్యం కానున్నాయని ఈ సభను జయప్రదం చేయాలని మండలంలోని కాచనపల్లి, ముత్తాపురం,గుండాల, చెట్టుపల్లి,యాపలగడ్డ, కొడవటంచ తదితర గ్రామాలలో ఈ వీలిన సభ పోస్టర్ ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు ఆల్ ఇండియా ట్రైబల్ ఫోరం (ఏఐటిఎఫ్) జాతీయ కన్వీనర్ ముక్తి సత్యం,గుండాల మండల కార్యదర్శి ఆరేం నరేష్, జిల్లా నాయకులు పూనెం రంగన్నలు మాట్లాడుతూ విప్లవోద్యమం చీలికలకుగురైన సందర్భంలో పేద ప్రజలకు అనేక నష్టాలు కలిగించిందని, శత్రు వర్గాలు కలిగించే నష్టం కన్నా, చీలికల ద్వారా విప్లవోద్యము ఎక్కువ నష్టపోయిందని దీనిని గ్రహించి 2013 సంవత్సరంలో వివిధ కారణాల రీత్యా చీలిపోయిన రెండు న్యూ డెమోక్రసీ పార్టీలు ఈ నెల 28వ తేదీన హైదరాబాదు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వీలిన సభ జరిపి ఐక్యం కాబోతున్నాయని, భవిష్యత్తులో విప్లవకార్లంతా ఐక్యం కావాలని పిలుపునిచ్చారు.
ఈ వీలిన సభకు విప్లవ అభిమానులు, ప్రగతిశీల శక్తులు, విద్యార్థి,మేధావులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు బచ్చల సారన్న,పర్శక రవి, యాసారపు వెంకన్న, ఇసం కృష్ణన్న,ఈసం మంగన్న, పెండేకట్ల పెంటన్న, జర్పుల కిషన్, మానాల ఉపేందర్, బానోతు లాలు , పాయం ఎల్లన్న, మల్యాల మల్లేష్, పూణెం నరసన్న, గొగ్గేల శ్రీను, కల్తి నరసింహారావు, ఎనగంటి రమేష్, అరేం జోగయ్య, ఎట్టి రాంబాబు ప్రగతిశీల యువజన సంఘం(పివైఎల్)జిల్లా నాయకులు అటికం శేఖర్, ఎనగంటి లాజర్, తాటి రమేష్, ఇసం సుధాకర్, మోకాళ్ళ పోతయ్య ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పిడిఎస్యు) జిల్లా కార్యదర్శి ఇర్ప రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!