ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి….
తంగళ్ళపల్లి నేటి ధాత్రి…
తంగళ్ళపల్లి మండలం టెక్స్టైల్ పార్క్ఇందిరమ్మ కాలనీలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా అభ్యర్థి ఉట్కూరి నరేందర్ రెడ్డికిమొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ వీప్ జిల్లా అధ్యక్షులు వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీనియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డితంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ ఆదేశానుసారం టెక్స్టైల్ పార్క్ ఇందిరమ్మ కాలనీలో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఇందిరమ్మ కాలనీ గ్రామంలో ఉన్నటువంటి పట్టు బద్రులను కలిసి మొదటి ప్రాధాన్యత ఓటువేసి గెలిపించాలని ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి కి ఓటు వేసి అత్యధిక మెజార్టీతోగెలిపించాలని ఈ సందర్భంగా తెలియజేశారు పట్టుభద్రులకిఏ సమస్య వచ్చిన ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి వారి గురించి వారి సమస్యలకు పరిష్కారమయ్యే దిశగా పాటు పడదామని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో సోషల్ మీడియా జిల్లా కోఆర్డినేటర్ గడ్డం మధుకర్ గ్రామ శాఖ అధ్యక్షులు శ్రీరామ్ నరేష్ కొంపెల్లి శ్యామ్ మాజీ వార్డు సభ్యులు దూస మహేందర్ గోరెంట్ల రాజమల్లు బల్ల లక్ష్మీపతి అంబటి ఆంజనేయులు మాటీటీ రాజు ముసం విలాస్ కొండి నరేష్ తదితరులు పాల్గొన్నారు
కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న బిఎస్పీ అభ్యర్ధి ప్రసన్న హరికృష్ణ మీద బిసి. సంఘాలు మండిపడుతున్నాయి. తన స్వార్ధపూరిత రాజకీయాల కోసం బిసిలను ముందు ఎగదోసి, తర్వాత పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయినా ఆయనపై పట్టభద్రులలో పెద్దగా స్పందన కనిపించడం లేదు. ప్రసన్న హరికృష్ణ ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్గా ప్రభుత్వ ఉద్యోగం సాగిస్తూ, తన విద్యార్దుల కోసం చేసిందేమీ లేదు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో పనిచేస్తూ ఆయన తన విద్యార్దులను ఉన్నత లక్ష్యాలతో తీర్చిదిద్దాల్సిన సమయంలో ప్రైవేటు కోచింగ్ సెంటర్ల మేలు కోసమే పని చేశారన్న ఆరోపణలున్నాయి. ఓ వైపు ప్రభుత్వ ఉద్యోగం చేసుకుంటూ, కోచింగ్ సెంటర్ల మేలు కోసం పనిచేశారు. తన విద్యార్ధులకు ఆ మెటీరియల్ అందించలేదు. కేవలం వ్యాపార లాభాపేక్షతోనే తన పుస్తక రచనను కొనసాగించారు. వాటిని కోచింగ్ సెంటర్లకు అమ్ముకోవడం కోసమే ప్రయత్నం చేశాడు. అలా కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. విద్యార్దులకు తీరని అన్యాయంచేశారు. తన వల్ల కోచింగ్ సెంటర్ల ద్వారా వేల మంది నిరుద్యోగులకు ఉపయోగపడ్డానని చెబుతున్నారే, గాని జీతం తీసుకుంటూ తన కాలేజీ విద్యార్దుల భవిష్యత్తు తీర్చిదిద్దానని చెప్పుకునే పరిస్ధితి లేదు. నిజంగా ఆయన సమాజం కోసం, నిరుద్యోగుల భవిష్యత్తు కోసం ఆలోచిస్తే తాను పనిచేసే కాలేజీ విద్యార్దులే కొన్ని వేల మంది వుంటారు. వారిని తీర్చిదిద్దితే ఎంతోమంది జీవితాలు బాగుపడేవి. కాని అలా చేయలేదు. కేవలం పుస్తకాలు రాసి, ప్రైవేటు కోచింగ్ సెంటర్లకు అందజేయడం వల్ల వ్యక్తిగతంగా ఆయన లాభపడ్డాడు. ఆ మెటీరియల్తో కోచింగ్ సెంటర్లు బాగుపడ్డాయి. అందుకే పట్టభద్రులు ఇప్పుడు ఆయన వ్యవహారశైలిపై గళమెత్తుతున్నారు. హరికృష్ణ విద్యార్ధుల జీవితాలను గాలికి వదిలేసి, కోచింగ్ సెంటర్లకు అమ్ముడుపోయిన వ్యక్తి అంటున్నారు. అసలు కాలేజీకి హజరు కాకుండా, విద్యార్దులకు పాఠాలు చెప్పకుండా జీతాలు తీసుకొని ప్రభుత్వాన్ని మోసం చేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కాలేజీకి ఎగనామం పెట్టి, యూనివర్సీటీ పెద్దలను ప్రసన్నం చేసుకొని, కోచింగ్ సెంటర్లకు మెటీరియ్ అందించి, తన కాలేజీ విద్యార్దులకు తీరని అన్యాయం చేశాడంటున్నారు. పైగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తూ బిసిల మధ్య చీలికకు ప్రయత్నం చేస్తున్నాడన్న బిసి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఎమ్మెల్సీ కావాలన్న ఆశలతో ముందు ఆయన కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేశారు. హరికృష్ణ అసలు స్వరూపం తెలిసిన తర్వాత ఆయనకు టికెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ నిరాకరించింది. దాంతో బిజేపి టికెట్ కోసం ప్రయత్నాలు చేశారు. బిజేపి పెద్దలను కలిసి వేడుకున్నాడు. కాని అక్కడా అవకాశం దొరకలేదు. తర్వాత బిఆర్ఎస్ పెద్దలను కలిశారు. అయితే హరికృష్ణ తన జీవితంలో ఏనాడు తెలంగాణ కోసం పనిచేసిన వ్యక్తికాదని తెలిసింది. ఓ వైపు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న సమయంలో ఆయన కోచింగ్ సెంటర్లకు మెటీరియల్ తయారు చేస్తూన సంపాదనలో మునిగితేలారంటున్నారు. ఏనాడు ఆయన తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకున్నది లేదు. తెలంగాణకు జైకొట్టింది లేదని బిసి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఒక బిసిగా అంతటి స్ధాయికి ఎదిగినా ఏనాడు ఏ బిసి విద్యార్ధికి ఆయన సాయం చేసింది లేదు. కాని తనకు పదవి కావాల్సి రాగానే మాత్రం బిసిల జపం చేస్తున్నాడని అంటున్నారు. బిఆర్ఎస్ కూడా టికెట్ ఇవ్వమని తేల్చి చెప్పడంతో ఇక గత్యంతరం లేక , ఇండిపెండెంటుగా పోటీకి నిలబడ్డాడు. అక్కడ కూడా ఆయనకు సరైన ఆదరణ లభించలేదు. బిసి సంఘాలు ఆయనకు మద్దతు పలకలేదు. దాంతో ఏదొ ఒక పార్టీ గుర్తు మీద పోటీ చేస్తే తప్ప లాభం లేదనుకున్నాడు. బిఎస్పీ పెద్దలను ప్రసన్నం చేసుకొని బిఫామ్ తెచ్చుకున్నాడు. అప్పుడు కూడా అటు బిఎస్పీని, ఇటు బిసిలను మభ్యపెడుతూనే వున్నాడు. ప్రచారంలో మోసంచేస్తూనే వున్నాడు. బిసి నాయకులను కలిసే సమయంలో బిసి కండువా కప్పుకుంటున్నాడు. బిఎస్పీ నేతలను కలిసే సమయంలో ఆ పార్టీ కండువా కప్పుకొని ప్రచారం చేయడాన్ని అందరూ గమనిస్తూనే వున్నారు. ప్రసన్న హరికృష్ణకు పట్టభద్రుల్లో పెద్దగా ఆదరణ కనిపించడం లేదు. ఆయనకు సహకరిస్తామని ఎవరూ చెప్పడం లేదు. ఆయన ప్రచారం అంతంత మాత్రంగానే సాగుతోంది. పట్టుమని ఆయన వెంట పది మంది తిరిగే పరిస్ధితి కనిపించడం లేదు. తనకు తానుగా గొప్పగా ఊహించుకొని హరికృష్ణ రంగంలోకి దిగారు. అయితే ఆయన వెనక కోచింగ్ సెంటర్లు వున్నాయంటున్నారు. హరికృష్ణకు ఎన్నికల పెట్టుబడి వాళ్లే ఏర్పాటు చేస్తున్నారంటున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో నోటిఫికేషన్లు రావడం, కోచింగ్ సెంటర్లు ఆ నిరుద్యోగుల చేత వాయిదాలు కోరడం, ప్రభుత్వ ం వినకపోతే వారి చేత కోర్టులను ఆశ్రయించడం వంటివి చేస్తుంటారు. అలా ఏళ్ల తరబడి పరీక్షలను వాయిదా వేయిస్తూపోవడం వల్ల నిరుద్యోగులు కోచింగ్ సెంటర్లను వదిలివెళ్లిపోరు. కొత్త కొత్త బ్యాచులు ఏర్పాటు చేసుకునేందుకు వీలౌతుంది. అలా కోచింగ్ సెంటర్ల వ్యాపారం మూడు పరీక్షలు, ఆరు వాయిదాలుగా నడిచేది. ఆయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కోచింగ్ సెంటర్లు చేసే ఈ జిమ్మిక్కులు సాగడం లేదు. కోచింగ్ సెంటర్లు కొంత మంది విద్యార్దులను రెచ్చగొట్టి అశోక్నగర్లో, దిల్సుఖ్ నగర్లో పెద్దఎత్తున ఉద్యమాలు చేసేందుకు కుట్రులు పన్నారు. అయినా ప్రభుత్వం చెప్పిన సమయానికి పరీక్షలు నిర్వహిస్తూ, ఉద్యోగాలు భర్తీ చేస్తోంది. ఇలా జరిగితే కోచింగ్ సెంటర్ల అవసరం ఎవరికీ రాదు. దాంతో కోచింగ్ సెంటర్లు దివాళా తీసే పరిస్ధితి వస్తుంది. ఇప్పటికే కోచింగ్ సెంటర్లు ఊగలుతోలుకునే పరిస్ధితి వచ్చింది. ఈ పరిస్ధితి మారాలంటే మళ్లీ కోచింగ్ సెంటర్లు కళకళలాడాలంటే తమకు అనుకూలమైన వ్యక్తిని ఎమ్మెల్సీ చేయాలని పెద్దఎత్తున ఖర్చుపెడుతున్నారు. ప్రసన్న హరికృష్ణనుముందు పెట్టి ఎమ్మెల్సీ ఎన్నికలను ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే ప్రసన్న హరికృష్ణ కోచింగ్ సెంటర్ల మూలంగానే కోట్లు సంపాదిస్తున్నారు. వారికి మేలు చేయడానికి తప్ప రాష్ట్రంలోని పట్టభద్రులకు న్యాయం చేసేందుకు కాదని హరికృష్ణ వ్యవహారం తేలిపోయింది. అందుకే ఆయన వెంట పట్టభద్రులు ఎవరూ కనిపించడం లేదు. కేవలం కోచింగ్ సెంటర్లకు చెందిన వ్యక్తులు మాత్రమే ప్రచారంలో పాలు పంచుకుంటున్నారు. అది కూడా అంతంత మాత్రంగానే సాగుతోంది. ప్రసన్న హరికృష్ణఎంత సాగిలపడినా వృధానే అనే టాక్ వినిపిస్తోంది. ఎంత సాగిలపడినా గెలుపు దారిలో ముందుకొచ్చే పరిస్ధితి కనిపించడం లేదు. ఎందుకంటే ఆయన నిరుద్యోగుల విషయంలో గళం విప్పిందిలేదు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు చెందిన యువతకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించలేదు. కనీసం ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత ఉద్యోగాల కోసం ఉద్యమాలు చేసింది లేదు. నిరుద్యోగులను రెచ్చగొట్టి పరీక్ష వాయిదా కోసం ప్రయత్నం చేశాడే తప్ప, ఉద్యోగాలు నోటిఫికేషన్ కోసం ఏనాడు కృషి చేయలేదు. నిరుద్యోగుల పక్షాన పోరాటంచేసింది లేదు. ఎన్నికలకు ముందే ఇన్ని జెండాలుమార్చిన హరికృష్ణ నిరుద్యోగుల పక్షాన నిలుస్తారని అనుకోవడం అత్యాశే అవుతుంది. ఎన్నికల ముందు అన్ని రాజకీయ పార్టీలను కలిసి టికెట్ కోసం ప్రయత్నం చేసిన హరికృష్ణ ఒక వేళ గెలిచినా, తనవ్యక్తిగత రాజకీయ ప్రతిష్ట కోసం పాకులాడుతాడే తప్ప నిరుద్యోగుల గళంకాలేడని అంటున్నారు. ఇంత కాలం కోచింగ్ సెంటర్లకోసం తపన పడ్డాడు. కోచింగ్ సెంటర్ల యజమానుల డబ్బులతో ఎన్నికల్లో నిలబడ్డాడు. కోచింగ్ సెంటర్లలో జరుగుతున్న ఫీజుల దోపిడీని అరికడతాడా? నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకుంటాడు. ప్రభుత్వం నోటిఫికేషన్లు వేసిన ప్రతి సందర్భంలోనూ వాటి వాయిదాల కోసమే హరికృష్ణ ప్రయత్నం చేస్తారు. నిరుద్యోగుల నుంచి కోచింగ్ సెంటర్లు సొమ్ముచేసుకునేందుకే ఉపయోగపడతాడు. అని సాక్ష్యాత్తు బిసి సంఘాలు, పట్టభద్రులే అంటున్నారు. ఇంత మంది చెబుతున్న మాటలు వింటున్న జనం హరికృష్ణను ఆదరిస్తారని మాత్రం ఎవరూ అనుకోరు.
చరిత్రలో మొదటి సారి యూనియన్ లీడర్కు టీచర్లు ఎదురు తిరుగుతున్నారు. ప్రతిసారి యూనియన్ పేరు చెప్పుకోవడం ఎమ్మెల్సీలుగా గెలవడం, రాజకీయ పార్టీల కండువాలు కప్పుకోవడం అలవాటైందని నిలదీస్తున్నారు. యూనియన్ లీడర్ ముదిరి రాజకీయ నాయకుడౌతాడంటే ఇదే నిదర్శనమంటున్నారు. దేశంలో ఏ ఉద్యోగులకు, ఏ యూనియన్లకు లేని అవకాశం ఒక్క టీచర్లకే రాజ్యాంగం ఈ అవకాశం కల్పించింది. దానిని ఉపాద్యాయుల హక్కులు, విద్యా వ్యవస్ధలో నూతన ఆవిష్కరణలకు ఉపయోగపడాల్సిన ఎమ్మెల్సీలు రాజకీయాలను ఎంచుకుంటున్నారు. ఉపాద్యాయుల సమస్యలు గాలికి వదిలేస్తున్నారు. అందుకే ఈసారి యూనియన్ పేరు చెప్పుకొని పబ్బం గడుపుకోవాలనుకుంటున్నవారికి ఎన్నుకోమని టీచర్లు ముక్తకంఠంతో చెబుతున్నారు. ముఖ్యంగా కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ ఉపాద్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేస్తున్న యూనియన్ లీడర్ వంగ మహేందర్ రెడ్డికి చుక్కలు చూపిస్తున్నారు. నిన్నటి వరకు మహేందర్ రెడ్డికి ఎదురు చెప్పడానికి కూడా ఆలోచించే ఎంతో మంది టీచర్లు ముఖం మీదే టీచర్ల కోసం ఏం చేశావని ప్రశ్నిస్తున్నారు. గతంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదు. మొదటిసారి టీచర్లు తమ గొంతువిప్పడం వారిలో వచ్చిన చైతన్యానికి నిదర్శనం. ఏకంగా సోషల్ మీడియా వేదికగా వంగా మహేందర్రెడ్డికి ఎందుకు ఓటేయ్యాలని అంటున్నారు. యూనియన్ పేరు చెప్పుకొని వారు బాగు పడడం తప్ప టీచర్లకు జరిగిన న్యాయం ఏదీ లేదంటున్నారు. అనాదిగా ఏం జరుగుతుందో మహేందర్రెడ్డిని ఎన్నుకుంటే అదే జరుగుతుందని కూడా తేల్చి చెబుతున్నారు. ఇప్పుడు అలాంటి ఆనవాయితీని కొనసాగించమంటున్నారు. సమాజానికి చైతన్యం నింపే ఉపాద్యాయులే ప్రశ్నించకపోతే, సమాజ చైతన్యం ఎలా వెల్లివిరుస్తుందంటున్నారు. యూనియన్ ముసుగేసుకొని రాజకీయాలు చేయాలనుకుంటున్నవారికి ఈ ఎన్నికలు ఒక చెంప పెట్టు కావాలని కోరుకుంటున్నట్లు కూడా టీచర్లు చెబుతున్నారు. ఏ సోషల్ మీడియా చూసినా ఇవే వార్తలు వుంటున్నాయి. ఎక్కడికక్కడ టీచర్లు తమ గొంతు సవరించుకుంటున్నారు. యూనియన్ అనేది సమస్యల పరిష్కారం కోసం, ఉపాద్యాయుల మద్దత కోసం, వారి ప్రయోజనాల కోసం…కాని యూనియన్ల వల్ల ఒరిగిందేమీ లేదంటున్నారు. ముఖ్యంగా వంగా మహేందర్ మూలంగా ఇప్పటి వరకు జరిగిన మేలు కూడా ఏదీ లేదంటున్నారు. ఇలా ఒక్కసారిగా టీచర్లు ఎదురు తిరుగుతారని కూడా మహేందర్ రెడ్డి ఊహించలేదు. గత రెండేళ్లుగా ఉద్యోగాన్ని వదులకొని ఊరూరు తిరుగుతూ ప్రచారం సాగిస్తున్నారు. కాని ఆఖరుకు ఈ పరిస్టితి వస్తుందని అనుకోలేదు. ఆయన ఉద్యోగం పూర్తిగా మానేయలేదు. కేవలం వాలెంటరీ రిటైర్ మెంటు తీసుకున్నారు. అంతే…ఈ ఎన్నికల్లో గెలిస్తే ఎమ్మెల్సీ అవుతాడు. లేకుంటే మళ్లీ తన ఉద్యోగాన్ని ఎలాగో తెచ్చుకొని కొలువు చేసుకుంటాడు. మళ్లీ యూనియన్ లీడర్గా తన పెత్తనం ఎలాగూ సాగిస్తాడు. అలాంటప్పుడు ఆయన వల్ల ఒనగూరేదేమీ వుండడు. ఈ మధ్య మహేందర్ రెడ్డి ఎక్కడికెళ్లినా ఇలాంటి ప్రశ్నలు ముఖం మీదే అడుగుతున్నారట. దాంతో ఆయన ఖంగు తింటున్నారు. ప్రచారానికి వెళ్లాలంటే కూడా భయపడుతున్నాడట. టీచర్లను ఒక చోటకు పిలవాలంటే కూడా ముందు వెనుక ఆలోచిస్తున్నాడట. టీచర్లు ఒక్కసారిగా ఇలాఎందుకు ఎదురు తిరిగే పరిస్టితి వచ్చిందని ఆలోచించుకుంటూ తల పట్టుకుంటున్నాట. మహేందర్ రెడ్డి నీ మాటలు మేం నమ్మం అంటూ ముఖం మీదే చెబుతుంటే సమాదానం చెప్పలేక దండం పెడుతూ వెనుతిరుగుతున్నారట. ఒక్కసారిగా టీచర్లలో ఇలాంటి చైతన్యం చూసి ఆయన విస్తుపోతున్నాడు. ఎమ్మెల్సీ పదవి దేవుడెరుగు ఎన్నికలు అయిపోయిన తర్వాత కనీసం తనను యూనియన్ లీడర్గానైనా అంగీకరిస్తారా? లేదా? అన్న డైలమాలో పడుతున్నారట. ఎందుకంటే ఎప్పుడో రెండేళ్ల క్రితమే రాజీనామా చేసిన ఉపాద్యాయుడు యూనియన్లో సభ్యుడుగా వుండడమే సరైంది కాదు. అలాంటిది యూనియన్ లీడర్గా ఎలా చెలామణి అవుతాడంటూ కూడా నిలదీస్తున్నారట. అయినా మహేందర్ రెడ్డి టీచర్ల సమస్యల కోసం పోరాటం సాగించి, ఉద్యోగానికి రాజీనామా చేయలేదు. టీచర్ల సమస్యలు పరిష్కరింకపోవడంతో నిరసనగా మహేందర్ రెడ్డి రాజీనామా చేసి పోరాటం చేయడంలేదు. టీచర్ల హక్కుల పోరాటం కోసం ఆయన రాజీనామా చేసి ఎన్నికల్లోకి వెళ్లడం లేదంటూ టీచర్లు సెటైర్లు వేస్తున్నారు. కేవలం తన వ్యక్తిగత ప్రయోజనం తప్ప ఇందులో టీచర్ల కోసం ఏముందంటూ చెబుతున్నారు. తమ అభిప్రాయం ఏమిటో కూడా తెలుసుకోకుండా ఏక పక్షంగా వారికి వారే నిర్ణయాలు తీసుకుంటే యూనియన్లో ప్రజాస్వామ్యమెక్కడుంది. మా మాటలకు విలువేముందని టీచర్లు ప్రశ్నిస్తున్నారు. హక్కుల గురించి రేపటి తరానికి పాఠాలు చెప్పే టీచర్ల అభిప్రాయానికే విలువలేకుండా చేస్తున్న యూనియన్ల మూలంగా మా గొంతులు నొక్కబడుతున్నాయంటున్నారు. గత ప్రభుత్వం కొత్త జిల్లాలను తెచ్చి, టీచర్ల జీవితాలు ఆగం చేసింది. జీవో.నెం.317 తెచ్చి టీచర్లను చెట్టుకొకరు, పుట్టకొకరును చేసింది. అప్పుడు యూనియన్ ఏం చేసింది? ఎందుకు ప్రభుత్వాన్ని నిలదీయలేదు. జీవో తప్పని ఎందుకు నినదించలేదు. తూతూ మంత్రంగా చెప్పడం కాదు..గతంలో టీచర్ల మాటంటే ప్రభుత్వాలు గౌరవించేవి. టీచర్లు ఉద్యమ బాట పడుతున్నారంటే భయపడేవి. కాని యూనియన్లు ప్రభుత్వాలకు తొత్తులుగా మారిపోయిన తర్వాత అసలు ప్రశ్నించడమే మర్చిపోయారు. హక్కుల సాధనకు కొట్లాటే మానుకున్నారు. అందుకే 317 జీవో అమలైంది. ఆ సమయంలో యూనియన్ నిక్కచ్చిగా వ్యతిరేకిస్తే అమలుజరిగేదా? అంటూ టీచర్లు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు కూడా ఆ జీవోపై ప్రభుత్వం నోరు మెదపడం లేదు. ఎన్నికల ముందు జీవోను సవరిస్తామని చెప్పి,దానిపై ప్రభుత్వం స్పందించడం లేదు. అయినా యూనియన్ ఏం చేస్తోంది? నిజం చెప్పాలంటే 317 జీవో రద్దు కోసం రాజకీయ పార్టీలు ప్రయత్నం చేశాయి. ముఖ్యంగా బిజేపి అధ్యక్షుడుగా ఆ సమయంలో వున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ పోరాటం చేశారు. ఈ జీవో విషయంలో అరెస్టుయ్యారు. కాని యూనియన్ మాత్రం నోరు మెదపలేదంటూ టీచర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ కోసం అటు విధులు నిర్వర్తిస్తూనే ఉద్యమాలు చేసిన చరిత్ర టీచర్లది. విద్యార్థుల జీవితాలు ఆగం కాకుండా వారికి పాఠాలు బోదిస్తూనే, మరో వైపు ఉద్యమానికి ఊపిరి పోసిన వారిలో టీచర్లున్నారు. అలాంటి టీచర్లు జీతమెప్పుడు వస్తుందా? అని ఎదురు చూసే రోజులు వస్తే కూడా యూనియన్ ప్రశ్నించింది లేదు. టీచర్లు అడుక్కుతినే పరిస్ధితి వస్తుంటే గుడ్లప్పగించి చూసిన యూనియన్ వల్ల ఒరిగిందేమీ లేదంటున్నారు. జీతాలు సకాలంలో రాకున్నా నోరు మూసుకున్నారు. టీచర్లకు రావాల్సిన జిపిఎఫ్ నిధుల ఆగిపోయినా, అడిగే నాధుడు లేదు. అయినా ఒకటీచర్దాచుకున్న సొమ్ముకూడా తీసుకోలేని స్దితిలో వున్నారంటే పరిస్దితి ఎలా వుందో అర్దం చేసుకోవచ్చు. పిఆర్సీ సమస్యలు ఎందుకు పరిష్కారం కావడం లేదంటూ టీచర్లు వంగాన నిలదీస్తున్నారు. కొన్ని వేల మంది రిటైర్డ్ టీచర్స్ బెన్ఫిట్స్ అగిపోతే యూనియన్ ఎందుకు స్పందించడం లేదంటూ ప్రశ్నిస్తున్నారు. ఇలా రకరకాల ప్రశ్నలతో మహేందర్రెడ్డిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. నాలుగు డిఏలు పెండిరగ్లో వున్నా ఇప్పటి వరకు యూనియన్ నోరు మెదపడం లేదంటున్నారు. యూనియన్ లీడర్గా వున్నప్పుడే నోరు మెదపని మహేందర్ రెడ్డి రేపు ఎమ్మెల్సీ అయిన తర్వాత సమస్యలపై మాట్లాడతాడంటే నమ్మలేమని తేల్చి చెబుతున్నారు. ఇంత కాలం గొప్పగా నాయకుడిని అని చెప్పుకుంటున్న మహేందర్రెడ్డి చేసిన ఉద్యమాలు ఏమీ లేవంటున్నారు. పెద్దగా పోరాటాలు చేసి సాదించిన హక్కులేమీ లేదు. గుంపులో గోవిందయ్యే తప్ప ఉపాద్యాయ సమస్యల మీద సదస్సులు పెట్టిన నాయకుడు కాదు. టీచర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి వెళ్లి కొట్లాడిన సందార్భాలేమీ లేవు. అందుకే ఈ ఎన్నికల్లో ఈసారి యూనియన్ నాయకులకు కాకుండా ప్రశ్నించే గొంతులు ఎవరుంటే వారిని ఎంచుకుంటామంటున్నారు.
ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గోవా ముఖ్యమంత్రులు హాజరు
ఆకట్టుకున్న తమిళనాడు బీజేపీ అధ్యక్షులు అన్నామలై ప్రసంగం
ప్రపంచ వ్యాప్తంగా హిందూ, బౌద్ధ, సిక్కు, జైన ప్రార్థనా స్థలాల అనుసంధానతే లక్ష్యం
ప్రపచంలో దేవాలయాల ఆర్థిక వ్యవస్థ విలువ రూ.6లక్షల కోట్లు
భారత్లో పెరుగుతున్న దేవాలయ పర్యాటకం
కోవిడ్ తర్వాత పెరుగుతున్న తీర్థయాత్రికులు
ఈ నేపథ్యంలోనే హిందూ దేవాలయాల అనుసంధానతకు ప్రాధాన్యం
దేవాలయాలకు గుదిబండగా మారిన ప్రభుత్వ నియంత్రణ
హైదరాబాద్,నేటిధాత్రి:
ప్రపంచ వ్యాప్తంగా దేవాలయాల మధ్య అనుసంధానతను మరింత బలోపేతం చేసే ఉద్దేశంతో ‘ఇంటర్నేషనల్ టెంపుల్స్ కన్వెన్షన్ Ê ఎక్స్పో`2025’ను (ఐ.టి.సి.ఎక్స్`2025) ఫిబ్రవరి 17 నుంచి 19వ తేదీవరకు ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన తిరుపతిలోని ఆశా కన్వెన్షన్లో జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, తమిళనాడు బీజేపీ అధ్యక్షులు అన్నామలై, గోవా మంత్రులు, పార్లమెంట్ సభ్యుల వంటి ప్రముఖులు హజరై ప్రసంగించడం విశేషం. 2023లో తొలి సదస్సు వారణాసిలో జరగ్గా రెండవ సదస్సును తిరుపతిలో నిర్వహించారు. ఇందులో 17 దేశాలకు చెందిన 1581 దేవాలయాల ప్రతినిధులు, మరో 58 దేశాలనుంచి 685దేవాలయాల ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు. ఈ మూడు రోజుల కార్యక్రమంలో 111మంది వక్తలు తమ విలువైన సందేశాలనివ్వగా, 15 వర్క్షాప్లు, 60కంటే ఎ క్కువ ప్రదర్శన శాలలను నిర్వహించారు. దేవాలయాల వారసత్వాన్ని పరిరక్షించడం, వాటి పరి పాలన, ఆలయాల నిర్వహణలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం వంటి అంశాలు ఈ సందర్భంగా చర్చకు వచ్చాయి. ఈ ఎక్స్పోను ‘టెంపుల్ కనెక్ట్’, అంత్యోదయ ప్రతిష్టాన్ సహకారంతో నిర్వహించారు. హిందూ, బౌద్ధ, జైన, సిక్కు ప్రార్థనా స్థలాలను ఒకేతాటి కిందికి తీసుకొనిరావడం దీని ప్రధాన లక్ష్యం.
ఆలయాల సమాచారం డిజిటలీకరణ
‘టెంపుల్స్ కనెక్ట్’ వ్యవస్థాపకులు గిరీష్ కులకర్ణి మరియు ఇంటర్నేషనల్ టెంపుల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్పో ఛైర్మన్, మహారాష్ట్ర శాసన మండలి ఛీఫ్ విప్ ప్రసాద్ లాడ్లు ‘మహాకుంభ్ ఆఫ్ టెంపుల్స్’గా వ్యవహరించే ఐ.టి.సి.ఎక్స్ను ఏర్పాటు చేశారు. భారతీయ మూలాలున్న దేవాలయాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరించి డిజిటల్ రూపంలో భద్రపరచడం ప్రధాన ల క్ష్యంగా టెంపుల్ కనెక్ట్ సంస్థ పనిచేస్తుంది. దేవాలయాల ఆర్థిక వ్యవస్థను మరింత విస్తరించడం కూడా ఐ.టి.సి.ఎక్స్. ప్రధాన ఉద్దేశం. దేవాలయ పర్యాటకాన్ని, నిర్వహణను ప్రోత్సహించడానికి కూడా ఇది కృషిచేస్తుంది.
మతపరమైన లేదా ధార్మిక అవస్థల పరిధికి ఆవల దేవాలయాల నిర్వహణలో మరింత పురోగతి సాధించేందుకు విధానకర్తలు, దేవాలయాల నాయకులు, పారిశ్రామిక నిపుణుల సమన్వయం కోసం ఐ.టి.సి.ఎక్స్`2025 ప్రధానంగా కృషిచేసింది. నిధుల నిర్వహణ, రద్దీ నియంత్రణ, భద్రత వ్యర్థాల నిర్వహణ వంటి అంశాలపై కూడా ఈ ఎక్స్పో దృష్టి కేంద్రీకరించింది. కేంద్ర పర్యాటకమంత్రిత్వశాఖ ఐ.టి.సి.ఎక్స్`2025 ఎక్స్పోకు మద్దతునిచ్చింది. మహారాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ కూడా దీనికి సహాయ సహకారాలను అందజేసింది. అంతేకాదు భారత పురావస్తు పరిశో ధనా సంస్థ, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటకకు చెందిన టూరిజం అండ్ ఎండోమెంట్స్ బోర్డులు కూడా ఈ సదస్సుకు సంపూర్ణ మద్దతును అందజేశాయి. కానీ టెంపుల్ స్టేట్గా పేరుపొందిన తమిళనాడునుంచి సహకారం అందలేదు. కాగా ఈ సదస్సు సందర్భంగా ‘స్మార్ట్ టెంపుల్స్ మిషన్’ను ప్రారంభించడమే కాకుండా, ‘స్మార్ట్ టెంపుల్స్ అవార్డు’లను కూడా ప్రదానం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక లక్షణాలతో అలరారుతున్న 12 దేవాలయాలకు ఈ అవా ర్డులను ప్రదానం చేశారు.
యు.కె.లోని జైన ధర్మశాలలు, ప్రముఖ డివోషనల్ చారిటీస్, హిందూ దేవాలయాల సంఘాల ప్రతినిధులు, అన్నక్షేత్ర మేనేజ్మెంట్లు, వివిధ పుణ్యక్షేత్రాలకు చెందిన పురోహిత్ మహాసంఘా లు, తీర్థయాత్రలను ప్రోత్సహించే బోర్డులకు చెందిన సభ్యులు కూడా ఈ సదస్సుల్లో పాల్గన్నారు. ఇస్కాన్, శ్రీమందిర్, దుర్లభ్ దర్శన్, సరస్వత్ ఛాంబర్, క్రిస్టల్ ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, ఒ.ఎన్.డి.సి, హల్దీరామ్ వంటి సంస్థలు ఐ.టి.సి.ఎక్స్`2025కు స్పాన్సరర్లుగా వ్యవహ రించాయి.
ప్రపంచ వ్యాప్తంగా 32 లక్షల దేవాలయాలు
ప్రపంచ వ్యాప్తంగా 32లక్షల దేవాలయాలు, ప్రధానంగా భారత్కు చెందిన ఆలయాలను ఒకే వేదిక కిందికి తీసుకొని రావడం ఐ.టి.సి.ఎక్స్`2025 ప్రధాన లక్ష్యం. ఈ దేవాలయాల మొత్తం ఆర్థిక వ్యవస్థ రూ.6లక్షల కోట్లు! ఇప్పుడు వీటన్నింటినీ ఒకే నెట్వర్క్ కిందికి తెచ్చే యత్నాలు జరుగుతున్నాయి. ఆవిధంగా వీటన్నింటినీ ప్రజలకు పారదర్శకమైన రీతిలో అందుబాటులోకి తేవడం కూడా దీని ప్రధాన ఉద్దేశం. ఐ.టి.సి.ఎక్స్ ఇప్పటికే ప్రపంచంలోని 12వేల దేవాలయాలతో అనుసంధానత ఏర్పరచుకోగలిగింది. కోవిడ్ మహమ్మారి తర్వాత దేవాలయాల సందర్భన బా గా పెరిగింది. ఉదాహరణకు కోవిడ్కు ముందు వైష్ణోదేవి ఆలయానికి రోజుకు 10 నుంచి 15వే లమంది భక్తులు సందర్శించేవారు. కానీ కోవిడ్ తర్వాత వీరి సంఖ్య 32వేలు`40వేల మధ్య వుంటోంది. పంజాబ్లోని స్వర్ణ దేవాలయాన్ని ఇప్పుడు రోజుకు లక్షమంది సందర్శిస్తున్నారు. ఇది కూడా కోవిడ్కు పూర్వం కంటే చాలా ఎక్కువ. కేరళలో ప్రఖ్యాత గురువాయూర్ దేవాలయన్ని కోవిడ్కు ముందు రోజుకు 4వేలమంది దర్శిస్తే ఇప్పుడు వారి సంఖ్య 6 నుంచి 7వేలకు పెరి గింది. ప్రస్తుతం భారత్లో పర్యాటక పరిశ్రమ ద్వారా 80 మిలియన్ల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. ఎందుకంటే ఏటా పర్యాటకుల సంఖ్య 19శాతం చొప్పున పెరుగుతోంది. అదేవిధంగా ప్రపంచ వ్యాప్తంగా మతపరమైన పర్యాటక మార్కెట్ 2032 నాటికి ఏకంగా 2.22బిలియన్ యు.ఎస్. డాలర్లకు చేరుతుందని కేపీఎంజీ సంస్థ అంచనా వేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ పర్యాటకం ఏటా సగటున 6.25% వృద్ధిని నమోదు చేస్తోంది.
చంద్రబాబు ప్రసంగం
ఈ ఎక్స్పోలో పాల్గన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృత్రిమ మేధ, బ్లాక్ ఛైన్, సుస్థిర ఇంధన పరిష్కారాల ద్వారా దేవాలయాల నిర్వహణను మరింత ఆధునీకరించాల్సిన అవసరం వుందన్నారు. ఆధ్యాత్మిక, ఆర్థిక కేంద్రాలుగా వున్న దేవాలయాలను సృజనాత్మక రీతి లో నిర్వహించాలన్నారు. ఫలితంగా వీటి సాంస్కృతిక ప్రభావశీలత బలీయంగా వుండగలదన్నా రు. ఇదే సమయంలో తిరుపతి ఆధ్యాత్మిక వారసత్వ ప్రాశస్త్యాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలని ప్రపంచ ప్రతినిధులను కోరారు.
హెచ్ఆర్ Ê సి.ఇ. చట్టం వల్ల అనర్థాలు
రెండో రోజు ఐ.టి.సి.ఎక్స్ా2025లో తమిళనాడు బీజేపీ అధ్యక్షులు అన్నామలై ప్రసంగిస్తూ త మిళనాడులో ప్రస్తుతం అమల్లో వున్న ‘హిందూ రిలిజియస్ అండ్ ఛారిటబుల్ ఎండోమెంట్ యాక్ట్ (హెచ్ఆర్Ê సి.ఇ.)’ వల్ల కలుగుతున్న అనర్థాలను ఆకట్టుకునే రీతిలో వివరించారు. ఈ చట్టాన్ని ఎత్తేయాలని, హిందూ దేవాలయాలపై ప్రభుత్వాల నియంత్రణ వుండకూడదని కోరారు. తిరుమల తిరుపతి దేవస్థానం మార్కెట్ విలువ రూ.2.5లక్షలకోట్లని పేర్కొంటూ, ప్రపంచంలోని చాలా ప్రముఖ సంస్థలకంటే ఇదెంతో విలువైందన్న సంగతిని గుర్తుచేశారు. తమిళనాడులో అమల్లో ఉన్న హెచ్ఆర్Ê సి.ఇ. చట్టం హిందూ దేవాలయాల ఆర్థిక పురోభివృద్ధికి గుదిబండలా మారిందని పేర్కొన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఈ చట్టాన్ని ఎత్తేస్తామని స్పష్టం చేశారు. వెంకటేశ్వరస్వామి దయవల్ల తాము తమిళనాడు పగ్గాలు చేపడితే రాష్ట్రంలోని 44121 దేవాల యాలకు స్వేచ్ఛను ప్రసాదిస్తామన్నారు. దేవాలయాల ఆర్థిక వ్యవస్థ, తమ చుట్టుపక్కల ప్రదేశా ల్లోని స్కూళ్ల నిర్వహణ, పౌర మౌలిక సదుపాయాల కల్పన, సెంటర్స్ ఫర్ ఎక్స్లెన్స్ ఫర్ సైన్స్ వంటి కేంద్రాల నిర్వహణలో ఎంతో ఉపయోగపడుతున్న సంగతిని గుర్తుచేశారు. తమిళనాడులో ఆలయాల ఆర్థిక వ్యవస్థ నిర్వహణను ప్రభుత్వాలు దుర్వినియోగం చేస్తున్నా ఇంతటి సామాజిక సేవను చేస్తున్న దేవాలయ వ్యవస్థను మరింత పటిష్టం చేయాల్సిన అవసరం వుందన్నారు. చోళ రాజులు ఎంత చక్కగా దేవాలయాలను నిర్వహించిందీ ఆయన వివరించారు. ఈ దేవాలయాలు కేవలం ధార్మిక కేంద్రాలు మాత్రమే కాదు, ధనిక, పేద వర్గాలను ఒక్కచోటుకు చేర్చే ప్రదేశాల న్న సంగతిని ఆయన గుర్తుచేశారు. భారత్ను ఒకే తాటిపై నిలుపుతున్నది దేవాలయాలు మాత్ర మే. ఈ నేపథ్యంలో ఆధ్యాత్మిక సుగంధాన్ని పునరుద్ధరించడం సనాతనధర్మంలో భాగమేనన్నారు.తొలి సదస్సు వారణాసిలో
ఇంటర్నేషనల్ టెంపుల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్పో (ఐ.టి.సి.ఎక్స్ా2023) 2023 జులై 22 నుంచి 24వ తేదీ వరకు వారణాసిలో జరిగింది. ఆర్.ఎస్.ఎస్. సర్సంఫ్ుచాలక్ మోహన్ భాగవత్ దీన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అప్పటి టీటీడీ ఇ.ఒ. ధర్మారెడ్డి కూడా పాల్గన్నారు. మొత్తం 25 దేశాలనుంచి 450కి పైగా దేవాలయాలకు చెందిన ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గన్నారు. వీరిలో హిందూ, బౌద్ధ, జైన, సిక్కు ప్రార్థనా స్థలాకు చెందిన వారుండటం విశేషం. వారణాసిలోని రుద్రాక్ష కన్వెన్షన్ సెంటర్లో జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రార్థనా స్థలాల్లో ఉత్తమ ప్రార్థనా రీతులను ప్రవేశపెట్టడం ప్రధానలక్ష్యమని టెంపుల్ కనెక్ట్ వ్యవస్థాపకులు గిరీష్ కుల కర్ణి, ఐటీసీఎక్స్ ఛైర్మన్ ప్రసాద్ లాడ్లు ఈ సదస్సులో స్పష్టం చేశారు. టెంపుల్ కనెక్ట్ను గిరీష్ కులకర్ణి 2016లో స్థాపించారు.
ఢల్లీి, హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల విజయంతో బీజేపీలో జోష్
రంగంలోకి దిగిన ఆర్ఎస్ఎస్
ఎన్నికలకు ఏడాదిముందే వ్యూహాత్మక అడుగులు
తృణమూల్ సాంస్కృతిక మూలాలపై విమర్శలు
హిందువులను ఏకీకృతం చేసేందుకు యత్నాలు
తృణమూల్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత
ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచిన ఆర్జీకర్ ఆసుపత్రి సంఘటన
హిందువులపై వివక్షను హైలైట్ చేస్తున్న బీజేపీ
శాఖలు పెంచుకోవడం ద్వారా క్షేత్రస్థాయిలో విస్తరణకు ఆర్ఎస్ఎస్ యత్నాలు
హైదరాబాద్,నేటిధాత్రి:
ఢల్లీి అసెంబ్లీ ఎన్నికలు, ఛత్తీస్గఢ్, గుజరాత్ల్లో జరిగిన స్థానిక ఎన్నికల్లో సాధించిన విజయాల తో కమలనాథుల్లో సమరోత్సాహం పెల్లుబుకుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలు ‘ఆపరేషన్ బెంగాల్’ను బీజేపీ మొదలుపెట్టిందా అన్న అనుమానాలను లేవనెత్తుతున్నాయి. ముఖ్యంగా కొరకరాని కొయ్యగా ఉన్న పశ్చిమ బెంగాల్లో పాగా వేయాలన్నది వారి ప్రస్తుత లక్ష్యం. 2019 లోక్సభ ఎన్నికల్లో భాజపా, పశ్చిమ బెంగాల్లో 18 లోక్సభ స్థానాల్లో విజయం సాధించగా, ఆ ఉత్సాహంతో పార్టీ కార్యకర్తలు చేసిన విస్తృత ఫలితాలనిచ్చి 2021 అ సెంబ్లీ ఎన్నికల్లో 77 సీట్లలో గెలుపు సాధించడానికి దోహదం చేసింది. ఒకప్పుడు మమతా బెనర్జీకు కుడిభుజంగా వ్యవహరించిన సుబేందు అధికారి, నందిగ్రామ్లో మమతా బెనర్జీని ఓడిరచి ఈ ప్రాంతంలో తన బలమేంటో నిరూపించారు. ప్రస్తుతం భాజపా పశ్చిమ బెంగాల్లో గెలుపు సాధనకోసం ఇప్పటినుంచే ప్రయత్నాలు ప్రారంభించింది. ముఖ్యంగా కాంగ్రెస్, కమ్యూనిస్టులు ఇప్పుడు పూర్తిగా ఉనికిని కోల్పోయిన నేపథ్యంలో, మమత ప్రభుత్వంలో నెలకొన్న అవినీతి, అరాచక పాలనను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలన్న యోచనలో వ్యూహాత్మకంగా ముందుకు సాగు తోంది. గత ఎన్నికల్లో వివిధ రాష్ట్రాల్లో బీజేపీ విజయానికి క్షేత్రస్థాయిలో ఆర్ఎస్ఎస్ గణనీయంగా కృషిచేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ ఇప్పుడు తన శాఖలను మరింత విస్తరించుకొని, బీజేపీ బలహీనంగా వున్న ప్రాంతాల్లో పార్టీకి గట్టి ఓటు బ్యాంకు ఏర్పాటుచేసేందుకు తనవంతు కృషిని మొదలుపెట్టింది.
ఢల్లీి ఎన్నికల్లో విజయం సాధించడంతో, పశ్చిమబెంగాల్ బీజేపీ శాఖలో జోష్ కనిపిస్తోంది. అవినీతి, ఆశ్రిత పక్షపాతం వంటి కారణాలవల్ల ఆప్ అధికారాన్ని కోల్పోయిందని బీజేపీ రాష్ట్ర నేతలుఒకపక్క విమర్శిస్తుంటే, ఆప్కు మద్దతిచ్చిన తృణమూల్ కాంగ్రెస్ మౌనంగా వుండటం గమనా ర్హం. ఢల్లీి ఎన్నికలు పశ్చిమ బెంగాల్లో తమ పార్టీ గెలుపునకు ఉత్తేజాన్నిస్తాయని బీజేపీ నాయకులు విశ్వసిస్తున్నారు. అయితే 2021 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 294 స్థానాల్లో 213 సీట్లను కైవసం చేసుకొని తృణమూల్ కాంగ్రెస్ తన కోట ఎంత పటిష్టంగా వున్నదీ తెలియజెప్పింది. ఇక కుంభమేళాను ‘మృత్యు కుంభ్’ అంటూ మమతా బెనర్జీ చేసిన తాజా వ్యాఖ్యలతో రాష్ట్ర బీజేపీ నేతలు ఒక్కసారి భగ్గుమన్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసిన మమతా బెనర్జీపై కఠిన చర్యలు తీసుకోవాలని, బీజేపీ నాయకులు సుబేందు అధికారి నేతృత్వంలో పార్టీ ఎమ్మెల్యేలు గవర్నర్ను కలిసి ఒక వినతిపత్రాన్ని సమర్పించడం తాజా పరిణామం. ఇదిలావుండగా పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్ సమావేశం సందర్భంగా జరిగిన గందరగోళంలో బీజేపీ నాయకు డు, విపక్షనేత సుబేందు అధికారితో సహా నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలను 30రోజుల పాటు స్పీ కర్ సస్పెండ్ చేశారు. వరుస పరిణామాలను పరిశీలిస్తే బీజేపీ నాయకులు తృణమూల్ కాంగ్రెస్ పై తమ దాడులను క్రమంగా తీవ్రం చేస్తున్నారన్న అంశం స్పష్టమవుతోంది. తృణమూల్ సాం స్కృతిక, మతపరమైన మూలాల నేపథ్యంలో భాజపా నాయకులు హిందువుల హక్కులను పరిర క్షించేది తమ పార్టీమాత్రమేనన్న అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా వచ్చే ఏడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, రాష్ట్ర బీజేపీ నాయకత్వం మరింత చురుగ్గా తృణమూల్పై విమర్శల దాడులను ముమ్మరం చేస్తారని తాజా పరిణామాలు స్ప ష్టం చేస్తున్నాయి.
ఇటీవల హిందువులు నిర్వహించే సరస్వతీ పూజపై తృణమూల్ ప్రభుత్వం ఆంక్షలు విధించడం తో, హిందువులపట్ల ప్రభుత్వం వివక్షాపూరితంగా వ్యవహరిస్తోందంటూ బీజేపీ నేతలు విపరీతం గా ప్రచారం చేశారు. హిందువులపై జరుగుతున్న దాడులు, వీరికి వ్యతిరేకంగా నెరపే రాజకీ యాలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేస్తూ ఏడాది కాలంలో తృణమూల్ను బలమైన ఓటు బ్యాంకును దెబ్బతీయాలన్న లక్ష్యంతో రాష్ట్ర నాయకత్వం ముందుకెళుతోంది. తృణమూల్ కాంగ్రెస్ కూడా బీజేపీ రాజకీయాలను ఎదుర్కొనేందుకు తమది ‘సెక్యులర్’ ప్రభుత్వమని ప్రచారం చే స్తోంది. శాంతిభద్రతల విషయంలో మతం పేరుతో చూసీ చూడనట్టు వుండలేమని స్పష్టం చే స్తోంది.
రంగంలోకి ఆర్ఎస్ఎస్
మహారాష్ట్ర, హర్యానా, ఢల్లీి ఎన్నికల్లో భాజపా విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఫ్ు ఇప్పుడు పశ్చిమ బెంగాల్పై తన దృష్టిని కేంద్రీకరించిందన్నది స్పష్టమవుతోంది. ముఖ్యంగా సంస్థ అధినేత మోహన్ భాగవత్ ఫిబ్రవరి 15వ తేదీన పశ్చిమ బెంగాల్లోని బర్ధమాన్ పట్టణంలోని తాలిత్ రాయ్ కాంప్లెక్స్లో జరిగిన సంస్థ కార్యకర్తల సమావేశంలో ప్రసంగిస్తూ, ఆర్ఎస్ ఎస్లో సభ్యులుగా చేరాలంటూ కొత్తవారికి పిలుపునివ్వడం రాష్ట్రంలో సంస్థను మరింత విస్తరించడం ద్వారా హిందువులను మరింత సుసంఘటితం చేయాలన్న ఉద్దే శం స్పష్టమవుతోంది. ‘బయట వుండి మమ్మల్ని పరిశీలిస్తే మీలో తప్పుడు అభిప్రాయం ఏర్పడవచ్చు. అందువల్ల సంస్థలో చేరండి. ఫీజు చెల్లించాల్సిన పనిలేదు. ఇక్కడి కార్యకలాపాలను పరిశీలించి నచ్చితే కొనసాగండి లేకపోతే వెళ్లిపోవచ్చు’ అంటూ ఆయన పిలుపునిచ్చారు. ఆర్ఎస్ఎస్ను అర్థం చేసుకోవాలంటే కొంత సమయం పడుతుంది. హిందూ సమాజంలో ఆత్మీయతను పెంపొందించడం, వారిని ఏకతాలిపై నడపడమే ఆర్.ఎస్.ఎస్. ప్రధాన లక్ష్యమని ఆయన అ న్నారు. బయటనుంచి అభిప్రాయాలు ఏర్పరచుకునేదానికంటే సంస్థతో సాన్నిహిత్యాన్ని పెంచు కోండి. అప్పుడు మీకు సంస్థ అంటే ఏంటో అర్థమవుతుందన్నారు. ఇప్పటికే పశ్చిమ బెంగాల్లో 70వేల ఆర్ఎస్ఎస్ శాఖలు పనిచేస్తున్నాయి. ముఖ్యంగా సంస్థ బలహీనంగా వున్న ప్రాంతాల్లో శాఖలను నెలకొల్పడం ద్వారా ప్రజల్లోకి మరింతంగా విస్తరించాలన్న అభిప్రాయం ఆయన మాటల్లో వ్యక్తమైంది. అంతేకాదు ఈసారి ఆయన పది రోజుల పర్యటన వ్యూహాత్మకంగా సాగింద నుకోవాలి. ఎందుకంటే 2026లో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. మహారాష్ట్ర, హర్యానా, ఢల్లీి ఎన్నికల్లో భాజపా విజయం వెనుక క్షేత్రస్థాయిలో చాలా ముందునుంచే ఆర్ఎస్ఎస్ కార్యకర్తల అకుంఠిత కృషి దాగివున్నదన్న ది నిష్టుర సత్యం. ఈ నేపథ్యంలో ఏడాది ముందునుంచే బెంగాల్లో తన వ్యూహాలను అమలు చేయాలన్న ఉద్దేశంతో ఆర్ఎస్ఎస్ అడుగులు ముందుకేస్తున్నట్టు అవగతమవుతోంది. ముఖ్యంగా దక్షిణ పశ్చిమబెంగాల్ ప్రాంతంలో బలంగా వున్న తృణమూల్ కాంగ్రెస్ మూలాలను దెబ్బకొట్ట గలిగితే బీజేపీ అవలీలగా అధికారంలోకి రాగలుగుతుంది. ప్రస్తుతం ఆర్ఎస్ఎస్ ఈ ప్రాంతంపై నే దృష్టికేంద్రీకరించి, తన శాఖలను మరింత విస్తరించి ఇప్పటినుంచే క్షేత్ర స్థాయి వ్యూహాలను అమలు పరచాలని చూస్తోంది.
ఆర్ఎస్ఎస్ సభను అడ్డుకోవడానికి విఫలయత్నం
ఆర్ఎఎస్ఎస్ వ్యూహాలను ముందుగానే పసిగట్టిన మమతా బెనర్జీ ప్రభుత్వం బర్థమాన్లో మోహన్ భాగవత్ నిర్వహించాల్సిన సమావేశానికి అనుమతినివ్వలేదు. ప్రస్తుతం పదోతరగతి పరీక్షలు జరుగతున్నందున, మైకులు, లౌడ్స్పీకర్ల వల్ల విద్యార్థులకు అసౌకర్యం ఏర్పడుతుందన్న నెపంతో జిల్లా యంత్రాంగం ఈ ర్యాలీ, బహిరంగ సభకు అనుమతి నిరాకరించింది. దీనిపై ఆర్ఎస్ఎస్ హైకోర్టును ఆశ్రయించడంతో, ‘ఆదివారం కావడంవల్ల పిల్లలకు ఏవిధమైన ఇబ్బంది ఏర్పడదని’ పేర్కొంటూ షరతులతో కూడిన అనుమతిని మంజూరుచేసింది. హైకోర్టు అనుమతివ్వడం తృణ మూల్ కాంగ్రెస్ ప్రభుత్వానికి దెబ్బగానే పరిగణించాలి. ఇదిలావుండగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు భాగవత్ పర్యటన కేవలం రొటీన్గా జరిగేదే అని చెబుతున్నప్పటికీ, పొరుగున్న వున్న బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న హింసాకాండ, బాంగ్లా సరిహద్దుల వద్ద కొనసాగుతున్న ఉద్రిక్త తల నేపథ్యంలో రాష్ట్రంలో ఆర్ఎస్ఎస్ తన ఉనికిని మరింత విస్తరించాలన్న ఉద్దేశంతో ఉన్నది. ఇందుకోసం గ్రామపంచాయతీల స్థాయిలో తమ కార్యకలాపాలను కొనసాగించడం ద్వారా మరింత బలోపేతం కావాలని సంఫ్ు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది.
పొరుగున బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వాన్ని పడగొట్టడం, ఇస్కాన్కు చెందిన స్వామీజీ అరెస్ట్, హిందువులపై, వారి ప్రార్థనా మందిరాలపై దాడులు పెరగడంతో పశ్చిమ బెంగాల్లో ఆర్ఎ స్ఎస్ నేతృత్వంలో పలు నిరసన ర్యాలీలు గతంలో జరిగాయి. ఫిబ్రవరి 8వ తేదీన మోహన్ భాగవత్ ఆర్జీకర్ ఆసుపత్రిలో అత్యాచారం, హత్యకు గురైన జూనియర్ డాక్టర్ తల్లిదండ్రులను కలిసి పరామర్శించడం గమనార్హం. గత అక్టోబర్ నెలలో ఆర్జీకర్ ఆసుపత్రి సంఘటనపై స్పందిస్తూ, తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం నేరస్థులను కాపాడటానికి యత్నిస్తున్నదంటూ విమర్శించారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన రాష్ట్రంలోని ఉత్తర, దక్షిణ, మధ్య ప్రాంతాలకు చెందిన కార్యకర్తలతో ఆయన సమాలోచనలు జరిపారు. అంతేకాదు బెంగాల్, బిహార్, సిక్కిం, అండమాన్ అండ్ నికోబార్ దీవులకు చెందిన సంఘ సీనియర్ కార్యకర్తలతో కూడా ఆయన చర్చలు జరపడం ప్రాధాన్యత సంతరించుకుంది. బర్ధమాన్ పట్టణంలోని ఉల్లాష్లో ఫిబ్రవరి 14న మధ్యప్రాంత ఆర్ఎస్ఎస్ కా ర్యాలయాన్ని ప్రారంభించారు. ఇదే జిల్లాలోని పుర్బాలోని శాఖను ఆయన సంద ర్శించారు.
మోహన్ భాగవత్ పర్యటన బెంగాల్లో ఆర్ఎస్ఎస్ను మరింత విస్తరించేందుకు దోహదం చే స్తుందనడంలో ఎంతమాత్రం సందేహంలేదు. బంగ్లా సరిహద్దు రాష్ట్రమైన పశ్చిమ బెంగాల్లో హింసా రాజకీయాలు సర్వసాధారణంగా మారాయి. ఈ నేపథ్యంలో బెంగాల్ పీఠం లక్ష్యంగా ఆర్ఎస్ఎస్ ఏవిధంగా పావులు నడుపుతుందో వేచి చూడాలి. గతంలో ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో ఆర్ఎస్ఎస్ వ్యూహాలు ఫలించి బీజేపీ అధికారంలోకి రావడానికి దోహదం చేశాయన్న సంగతి మరువకూడదు! అందుకనే మోహన్ భాగవత్ బెంగాల్ పర్యటనకు అంతటి ప్రాధాన్యత!
`తక్షణమే నరేష్ కుమార్ ను తప్పించాలని భక్తుల డిమాండ్.
`టిటిడి ఉద్యోగిపై సభ్యుడి పెత్తనమేమిటి?
`విజిలెన్స్ డిపార్ట్మెంట్ అలసత్వమేమిటి!
`తన కర్తవ్యం నిర్వహిస్తున్న ఉద్యోగికి ఆ అవమానమేమిటి?
హైదరాబాద్,నేటిధాత్రి:
వాటీస్ దిస్ నరేష్ నాన్సెన్స్.. తిరుమల తిరుపతి దేవస్ధానం పాలక మండలి సభ్యుడై వుండి ఉద్యోగి బాలాజీపై నోరు పారేసుకోవడం ఎంత వరకు సమంజసం. ఒక ఉద్యోగి విధి నిర్వహణను అభినందించాల్సిన సమయంలో ధర్డ్ క్లాస్ నా కొడకా..అని బూతులు తిట్టే అదికారం ఎవరిచ్చారు. అసలు పాలక మండలి సభ్యుడంటే భక్తులకు సేవ చేసే సేవకుడు మాత్రమే. పెత్తనం చేసే పెత్తందారు కాదు. భక్తులకు సౌకర్యాల కల్పనలో, దేవదేవుని సేవలో తరించాల్సిన పాలక మండలి సభ్యుడు నరేష్ కుమార్ ఉద్యోగిపై నోరు పారేసుకోవడాన్ని భక్తులు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. తన కర్తవ్యాన్ని నిబద్దతతో నిర్వహిస్తున్న ఉద్యోగిని అభినందించాల్సిందిపోయి, నోటికొచ్చినట్లు ఇష్టాను సారం మాట్లాడడాన్ని ఎవరూ స్వాగతించరు. వెంటనే నరేష్ ఆ ఉద్యోగికి క్షమాపణ చెప్పాలి. టిటిడి ఉద్యోగులు నరేష్ కుమార్ మీద పోలీసు కేసు నమోదు చేయాలి. పొరుగు రాష్ట్రానికి చెందిన వ్యక్తిని పాలకమండిలోకి తీసుకునేపప్పుడు ఇకపై వారి వ్యక్తిత్వాలేమిటి? వారి వ్యవహార శైలి ఎలాంటిది అని కూడా ఇకపై పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం వుంది. టిటిడి బోర్డు సభ్యుడి పదవీ కాలం కేవలం రెండేళ్లు మాత్రమే. నరేశ్కుమార్ పాలకమండలికి శాశ్వతసభ్యుడు కాదు. ఆయనకు ప్రత్యేకమైన అధికారాలు ఏమీ లేవు. అయినా పాలక మండలి నిర్ణయాలను నరేశ్ ఉల్లంఘించడమే తప్పు. అందరికీ ఆదర్శంగా వుండాల్సిన సభ్యుడు తనకు ఉద్యోగి సూచనలు కూడా అవమానంగా భావించడం అతని అహంకారానికి నిదర్శనం. ఎప్పుడో నెలకోసారో..వచ్చి చుట్టపు చూపుగా వచ్చినట్టు, తనకు ఎనలేని అధికారాలు టిటిడి కట్టబెట్టినట్లు ప్రవర్తించడం సరైంది కాదు. ముందుగా ఎట్టిపరిస్దితిల్లోనూ నరేశ్ ఉద్యోగి బాలాజీకి క్షమాపణ చెప్పాలి. లేకుంటే పాలకమండలి తీర్మాణం చేసి సభ్యత్వం రద్దు చేయాలి. ఈ విషయంలో మరో ఆలోచనకు ప్రభుత్వం తావివ్వకూడదు. నిత్యం వేలాది మంది భక్తులు వచ్చే తిరుమలతో విధి నిర్వహణ అంటే ఎంతో కష్టతరమైన పని. వాళ్లు పడే శ్రమ అంతా ఇంతా కాదు. వేలాది మంది భక్తులకు సేవ చేసి ఆ ఉద్యోగులు తరిస్తుంటారు. అలాంటి ఉద్యోగిపై చేయి చేసుకోవడమే కాకుండా, ఇష్టాను సారం బూతులు తిట్టడం అంటే బోర్డు సభ్యుడిగా నరేష్ ఎంత మాత్రం అర్హడు కాదు. ప్రతి క్షణం గోవింద నామ్మస్మరణతో అలరాలే పవిత్రమైన స్ధలంలో బోర్డు సభ్యుడు ఉద్యోగిపై చిందులు తొక్కడం. నోటికొచ్చిన పదజాలం వాడడాన్ని భక్తులు సహించలేకపోతున్నారు. నిజానికి అక్కడ వున్న భక్తులు ఎవరో వీడియో తీయడం వల్ల ఇదంతా బైట పడిరది లేకుంటే, ఆ ఉద్యోగికి నరకం చూపించేవారు. ఆ ఉద్యోగిని ఇప్పటికే సస్పెండ్ చేసేవారు. ఆయనపై కేసు కూడా నమోదు చేసి ఆ ఉద్యోగికి నకం చూపించేవారు. అంతటి ఘనులే కొంత మంది పాలక మండలి సభ్యులు. సభ్యులకు తోడు విజిలెన్స్ అధికారులు కూడా వీవీఐపిల సేవల్లో తరించి పోతుంటారు. తిరుమలలో విజిలెన్స్ అదికారుల సేవలు కూడా కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే. అందుకే వాళ్లు కూడా పెద్ద వాళ్ల సేవల్లో మునిగితేలుతుంటారు. వారికి సేవలు చేసి, లాభం పొందుతుంటారు. అసలు తప్పు చేసిన నరేష్కు నచ్చజెప్పాల్సిన విజిలెన్స్ అధికారులు ఉద్యోగి బాలాజీని పక్కకు నెట్టేశారు. ఆయనను దూరంగా తీసుకెళ్లారు. తన కర్తవ్య నిర్వహణలో నిజాయితీ చూపించిన బాలాజీ అక్కడినుంచి తలవంచుకుని పోయేలా చేశారు. ఇదేనా పాలక మండిలిలో చేసిన తీర్మాణం.. అంత మంది భక్తుల మందుకు ఆ ఉద్యోగిని పంపించేయండి? అంటూ విజిలెన్స్ అదికారులను ఆదేశించడం ఏమిటి? ఉద్యోగిని విజిలెన్స్ అధికారులు పక్కకు తీసుకెళ్లడమేమిటి? అసలు ఆ ఉద్యోగి బాలాజీ చేసిన నేరమేమిటి? వెంకన్న సన్నిదిలో అందరూ ఒక్కటే. తిరుమల కొండకు చేరుకున్న తర్వాత పేద, పెద్ద అన్న తేడా వుండకూడదు. వెంకటేశ్వర స్వామి సన్నిధిలో అందరూ సమానమే. ఆ విషయం కూడా తెలియని వ్యక్తికి బోర్డు సభ్యత్వం కల్పించడమే తప్పు. దర్శనం పూర్తయిన తర్వాత ఎవరైనా సరే మహాద్వారం నుంచి వెళ్లకూడదని పాలకమండలే తీర్మాణం చేసింది. అందుకు నరేశ్ కూడా అంగీకరించే మినిట్స్లో సంతకం చేశారు. అలాంటి వ్యక్తి నిబంధనలు ఎలా ఉల్లంఘిస్తాడు. అలాంటి వ్యక్తి బోర్డు సభ్యుడిగా వుండడానికి అర్హుడే కాదు. అయినా బయోమెట్రిక్ దారిని కేటాయించిన సంగతి సదరు సభ్యుడికి తెలియందా? అంటే అందరూ వేరు…నేను వేరు అనుకున్నాడా? అలాంటి వారికి తిరుమలలో వుండే అర్హతలేదు. అక్కడ పెత్తనానికి అవకాశమే లేదు. నరేష్ చేసిన పని పాలక మండలి పరువు కూడా తీసినట్లైంది. గతంలో ఎప్పుడూ ఇలాంటి వివాదం ఎదురుకాలేదు. కారణం సభ్యులకు కూడా పాలకమండలి ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేయలేదా? వారు అనుసరించాల్సిన, ఆచరించాల్సిన విధి విధానాలు చెప్పలేదా? పాలక మండలి సభ్యుడిగా వుండి నిత్యం టిక్కెట్లు అమ్ముకుంటున్నాడన్న అపవాదును ఇప్పటికే నరేష్ ఎదుర్కొంటున్నట్లు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ సంఘటన జరిగిన రోజు ఆయనతోపాటు కొంత మందిని దర్శనానికి తీసుకెళ్లిన నరేష్ వారి ముందు ఆధిపత్యం చెలాయించాలని చూశాడు. కాని బాలాజీ అడ్డుకున్నాడు. అయినా కొత్తగా ఏర్పాటైన బోర్డు సభ్యులందరూ బాలాజీ లాంటి సామాన్యమైన ఉద్యోగికి తెలియాలనేమీ లేదు. నరేశ్ లాంటి సభ్యులు రెండెళ్లకోసారి ఎంతో మంది మారుతుంటారు. ఎంత మంది బోర్డు సభ్యులను సాదారణ ఉద్యోగులు గుర్తుంచుకుంటారు. చూస్తుండగానే రెండేళ్ల పుణ్యకాలం ముగిసిపోతుంది. అంత దానికి నరేష్కు అంతటి మడిసిపాటు ఎందుకు? నరేష్ తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తి కాదు. పొరుగున వున్న కర్నాటకకు చెందిన బిజేపి నాయకుడు. సహజంగా బిజేపి నాయకులు సనాతన దర్మం. దేశం కోసం , ధర్మం కోసం అంటూ ముచ్చట్లు చెబుతుంటారు. హిందూమతోద్దరణ మాకు మాత్రమే సొంతమని చెప్పుకుంటారు. అఖిలాండ కోటి బ్రహ్మండ నాయకుడు కొలువై వున్న సప్తగిరుల మీదనే సాటి హిందువును దూషించడం నరేష్ తప్పు కాదా? ఒక ఉద్యోగిపై చేయి చేసుకోవడం నేరం కాదా? ఈ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా స్పందిచాల్సిన అవసరం వుంది. ఇలాంటి సభ్యుడి వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. అలాంటి సభ్యుడికి కొనసాగిస్తే, ఉద్యోగుల్లో కూడా అసహనం పెరిగిపోతుంది. రేపటి రోజు ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతుంది. అయినా పాలక మండలి సభ్యుడికి ప్రత్యేక గౌరవాలు ఏమిటి? ఆయన ఒక సేవకుడు మాత్రమే. తిరుమలలో భక్తులకు సేవ చేసి జన్మ ధన్యం చేసుకోవాల్సిందిపోయి, దేవుడి దగ్గరే నేనుగొప్ప అనుకునేవారిని వెంకటేశ్వర స్వామి క్షమించడు. పాపం పండితేనే ఇలాంటి మాటలు ఎవరైనా మాట్లాడుతారు. ఈ విషయంలో టిటిడి చైర్మన్ స్పందించకపోవడంపై భక్తులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ మధ్య జరిగిన తొక్కిసలాట సమయంలో అంత మంది భక్తులు చనిపోయిన సమయంలో భక్తుల యోగక్షేమాలు చూసుకోలేని నరేష్ ఎక్కడున్నారు. ఆ సమయంలో భక్తులకు ఎందుకు సేవ చేయలేదు. ఆయన భక్తులకు సేలందిస్తున్నట్లు ఎక్కడా వార్తలు వినిపించలేదు. అసలు ఆయన ఒక సభ్యుడన్న సంగతి చాలా మందికి తెలియదు. మరి అలాంటి వ్యక్తి పాలకమండలిలో చేరి నిత్యం ఎంతో మందిని దర్శనానికి పంపిస్తునట్లు కూడా వార్తలు వస్తున్నాయి. అలా టిక్కెట్లు అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నట్లు చెప్పుకుంటున్నారు. ముప్పై సంవత్సరాల పాటు తన ఉద్యోగ నిర్వహణలో భక్తులకు సేవలు చేసే ఉద్యోగి నిజంగా తప్పు చేస్తే శిక్షించాల్సిందే. కాని పాలక మండలి సభ్యులకు ఉద్యోగులు కట్టు బానిసలు కాదు. వారికి ఆత్మగౌరవం వుంటుంది. వారిని చులకన చేసి మాట్లాడడం ఎవరికీ మంచిది కాదు. ముఖ్యంగా పవిత్రమైన తిరుమలలో వెంకన్నసన్నిధిలో కోపానికి తావు లేదు. అహానికి అసలే తావు లేదు. ధిక్కార స్వరాలు వినిపించకూడదు. ముల్లోకాలను ఏలే స్వామి ముందుకు నేను గొప్ప అనుకునే వారికి చోటు వుండకూడదు. ముఖ్యంగా మర్యాద లేని వ్యక్తులకు పాలకమండిలో చోటే వుండకూడదు.
14 కాగ్ నివేదికలను తొక్కిపట్టిన కేజ్రీవాల్ ప్రభుత్వం
ఈశాన్య ఢల్లీి స్కూళ్ల మౌలిక సదుపాయాలపై ఢల్లీి హైకోర్టు చీవాట్లు
‘స్వచ్ఛ’ యమున హామీ నెరవేర్చలేదు
కాలుష్య నియంత్రణలో వైఫల్యం
అధికారంకోసం అడ్డదారులు
అమలు చేయలేని అలవికాని హామీలు
అవినీతి ఆరోపణలతో ముఖ్యమంత్రిగా జైలుకెళ్లిన రికార్డు
ఎన్నికల్లో ‘ఊడ్చేసిన’ ఢల్లీి ఓటర్లు!
హైదరాబాద్,నేటిధాత్రి: ఢల్లీి పీఠాన్ని 2/3వవంతు మెజారిటీతో కైవసం చేసుకోవడంతో గత 27 ఏళ్లుగా నిరంతరాయంగా చేస్తున్న పోరాటం ఇప్పటికి ఫలించిందన్న ఆనందం భారతీయ జనతాపార్టీని ముంచెత్తడం సహజం. అయితే ఇక్కడ గమనించాల్సిన ప్రధాన అంశమేంటంటే ఓట్లశాతాన్ని పరిశీలించినప్పుడు ఆమ్ఆద్మీ పార్టీ కంటే బీజేపీకి వచ్చిన ఓట్లు కేవలం రెండుశాతం మాత్రమే అధికం. కొన్ని సందర్భాల్లో ఒక్కశాతం ఓట్లు కూడా పార్టీల అదృష్టాలను తల్లక్రిందులు చేయడం చూస్తూనే వున్నాం. ప్రస్తుతం ఢల్లీి అసెంబ్లీలో మొత్తం 70 స్థానాలుండగా వీటిల్లో 48 భాజపాకు, 22 ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కు లభించాయి. ఈ సారి ఎన్నికల్లో భాజపాకు 45.8%, ఆప్కు 43.8%, కాంగ్రెస్ కు 6.4% ఓట్లు వచ్చాయి.అదే 2020 ఎన్నికల్లో భాజపాకు 38.5%, ఆప్కు 53.6%, కాంగ్రెస్కు 4.3% ఓట్ల షేర్ నమోదైంది. కాంగ్రెస్పార్టీ ఏఏపీతో జట్టుకట్టకపోవడం వల్లనే ఓట్లు చీలి భాజపాకు అనుకూలంగా ఫలితాలు వచ్చాయన్న వాదన ఆమోదయోగ్యంగా కనిపిస్తున్నప్పటికీ, ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. ఈ టర్మ్ పాలనలో ఆప్పై గతంలో ఎన్నడూ లేని రీతిలో అవినీతి ఆరోపణలు వచ్చాయి. శీష్మహల్, లిక్కర్కుంభకోణం వంటివి పార్టీ ఇమేజ్ను చాలా దెబ్బతీశాయి. ఈ నేపథ్యంలో ఒకవేళ కాంగ్రెస్ జట్టు కట్టినా ఆ పార్టీ ఓట్లు ఆప్ ఖాతాలో పడతాయని చెప్పడం కష్టం. అదీకాకుండా కేవలం భాజపాతో పోలిస్తే కేవలం రెండుశాతం ఓట్ల తేడానే కదా అని వాదించేవారు కొన్ని నియోజకవర్గాల్లో ఆప్కు భారీ మెజారిటీ రావడం ఈ ఓట్లశాతం అధికంగా కనిపించడానికి ప్రధానకారణమన్న సంగతిని గుర్తించాలి. అంటే కొన్ని ప్రాంతాల్లో మాత్ర మే అదికూడా ముస్లింలు అధికంగా వున్న నియోజకవర్గాల్లో మాత్రమే ఆప్ థంపింగ్ మెజారిటీని సాధించింది. ఇది ఆపార్టీ ఓట్లశాతం దాదాపు చెక్కుచెదరలేదన్న భావనకు కారణమవుతోంది. నిజం చెప్పాలంటే 2020లో ఆప్ సాధించిన ఓట్లతో పోలిస్తే 2025 ఎన్నికల్లో 9.8% ఓట్ల షేర్ను కోల్పోయింది. ఈ విధంగా కోల్పోయిన ఓట్లు భాజపా ఖాతాలో 7.8%, కాంగ్రెస్ ఖాతాలో 2.1% చొప్పున జమ అయ్యాయి. ఫలితంగా గత ఎన్నికలతో పోలిస్తే ఆ రెండు పార్టీలకు ఆ మేరకు అధికశాతం ఓట్లు నమోదుకావడం సహజమే. గుర్తించాల్సిన మరో ప్రధానాంశ మేమంటే 2015`2020 వరకు ఆప్ ఓట్లశాతం 54.3%, 53.6% నమోదు కావడం, ఆ పార్టీ ఓటు బ్యాంకు పటిష్టంగా ఉన్నదన్న సంగతిని స్పష్టం చేస్తున్నాయి. ఈ కారణంగానే 2015లో 67 సీట్లు, 2020లో 62 సీట్లలో విజయం సాధించగలిగింది. నిజానికి ఈ రెండు ఎన్నికల్లో ఒకటికంటే తక్కువ ఓట్ల శాతం తగ్గిన ఫలితంగా ఐదుసీట్లు తగ్గిపోయాయి. ఇది 2025 ఎన్నికల కు ప్రమాద ఘంటికలుగా అరవింద్ కేజ్రీవాల్ పరిగణించకపోవడం ఇప్పుడు పార్టీ ఓటమికి కారణ మైంది. ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే 1993లో ఢల్లీి ఎన్నికల్లో 34.5% ఓట్లు సాధించగా, 42.8% ఓట్లతో భాజపా అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత 2025లో మాత్రమే పార్టీ మళ్లీ అధికా రంలోకి రాగలిగింది. 1998, 2003 ఎన్నికల్లో కాంగ్రెస్ పుంజుకొని వరుసగా 47.8%, 48.1% ఓట్లతో అధికారాన్ని హస్తగతం చేసుకుంది. ఇక అక్కడినుంచి కాంగ్రెస్ పతనపథం అప్రతిహ తంగా కొనసాగుతూ వచ్చి 2015, 2020, 2025 సంవత్సరాల్లో వరుసగా 9.7%, 4.4%, 6.4% ఓట్లషేరు సంపాదించింది. 2020తో పోలిస్తే ఈసారి రెండుశాతం ఓట్లు ఎక్కువ రావ డానికి ప్రధాన కారణం, ఆప్ కోల్పోయిన ఓట్లు తన ఖాతాలో పడటమే! ఆప్ పతనానికి కారణాలేంటి? కాంగ్రెస్ నాయకురాలు శీలాదీక్షిత్ ముఖ్యమంత్రిగా 15 సంవత్సరాల పాటు ఢల్లీిని పాలించిన కాలంలో అవినీతి ఆరోపణలు పరాకాష్టకు చేరాయి. ఈ నేపథ్యంలో చైతన్యశీలురైన ఢల్లీి ప్రజలు 2011లో ఒక మార్పు అవసరమన్న నిర్ణయానికి వచ్చారు. సరిగ్గా ఇదే సమయంలో అవినీతిని నిర్మూలిస్తామంటూ 2012 అక్టోబర్ 2న ‘ఆమ్ ఆద్మీ’ పార్టీని స్థాపించి కెజ్రీవాల్ ప్రజల్లోకి రావ డంతో ఈయన చక్కటి ప్రత్యామ్నాయంగా భావించిన 2013 ఎన్నికల్లో ప్రజలు పట్టంకట్టారు. తర్వాతి కాలంలో అవినీతికి ఆలవాలమైన కాంగ్రెస్ పార్టీలో జట్టు కట్టే ప్రసక్తే లేదని కేజ్రీవాల్ శపథం చేశారు కూడా! డిల్లీని కాలుష్య రహితం చేస్తామని, 24I7 స్వచ్ఛమైన నీటిని అందిస్తామని,యమునానదిని ప్రక్షాళన చేస్తామని, ఢల్లీి రోడ్లను లండన్ రోడ్లతో పోటీపడేలా అందంగా తీర్చిదిద్దుతామంటూ హామీలు గుప్పించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన తన భీషణ ‘ప్రతిజ్ఞ’ను తుంగలో తొక్కి అధికారం కోసం కాంగ్రెస్తో జట్టు కట్టారు. తర్వాతి కాలంలో ఆయన దృష్టి ఢల్లీికి పరిమితం కాలేదు క్రమంగా ప్రధాని నరేంద్రమోదీని ఢీకొట్టేందుకు ప్రయత్నించారు. ఇందుకోసం తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అఖిలేష్ యాదవ్, లల్లూప్రసాద్ యాదవ్లతో చేతులు కలిపారు. ఈ విధంగా ఏ అవినీతికి వ్యతిరేకంగా ‘ఆప్’ స్థాపితమైందో, తాను ఏ పార్టీలపై అవినీతి ఆరోపణలు చేసారో, వాటితోనే అరవింద్ కేజ్రీవాల్ కలవడం, ప్రజల్లో ఆయనపట్ల అనుమానాలు పెంచేలా చేసింది. తర్వాతికాలంలో ఇతర పార్టీల అవినీతి మాట అట్లావుంచితానే పూర్తి అవినీతిలో కూరుకుపోయింది. పార్టీ ముఖ్యనేతలైన మనీష్ సిసోదియా, సంజయ్ సింగ్, సత్యేంద్రసింగ్ జైన్ చివరకు కేజ్రీవాల్ అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయారు. చివరకు ఆర్థిక అవకతవకల నేపథ్యంలో జైలుపాలవక తప్పలేదు. ఢల్లీి విద్యావ్యస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తామని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. కానీ ఈశాన్యఢల్లీిలోని స్కూళ్లలో కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడంపై గత ఏప్రిల్లో ఢల్లీి హైకోర్టు ప్రభుత్వాన్ని చీవాట్లు పెట్టింది. పేదలకు వైద్యాన్ని అందుబాటులోకి తేవడం, ఈ రంగంలో అవినీతిని అరికట్టే ఉద్దేశంతో ‘మొహల్లా క్లినిక్’లు ఏర్పాటు చేశారు. కానీ ఈ క్లినిక్ల్లో కేవలం 11నెల ల్లో 65వేల మంది రోగులకు చికిత్స చేసినట్టు తప్పుడు లెక్కలను రికార్డుల్లో నమోదు చేసినట్టు ఏసీబీ విచారణలో తేలింది. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ఢల్లీిలో అమలు చేయడానికి కేజ్రీవాల్ ప్రభుత్వం అనుమతించకపోవడాన్ని కూడా న్యాయవ్యవస్థ తప్పుపట్టింది. కోవిడ్ మహమ్మారి తీవ్రస్థాయిలో వున్న సమయంలో తన అధికార నివాసం శీష్మహల్కు మరమ్మతుల పేరుతో కోట్లాది రూపాయల వ్యయంతో విలాసవంతమైన సౌకర్యాలు కల్పించుకోవడంతీవ్ర విమర్శలకు దారితీసింది. ఇదే సమయంలో నీళ్ల ట్యాంకర్ల మాఫియా, రోడ్లు అధ్వాన్నంగాతయారవడం వంటి సమస్యలను పట్టించుకోలేదు. వీటిపై కూడా ఢల్లీి హైకోర్టు ప్రభుత్వాన్ని తప్పు పట్టింది. అన్నింటికంటే ముఖ్యంగా ఆప్ పాలనలో గత 31 సంవత్సరాల్లో ఎన్నడూ లేనిది, ప్రభుత్వం నిధుల లోటును ఎదుర్కొంది. ఫలితంగా నేషనల్ స్మాల్ సేవింగ్స్ ఫండ్ నుంచి రూ.10వేల కోట్లు అప్పు తీసుకోవడంతో ప్రభుత్వ పనితీరు ఎంత అధ్వాన్నంగా పనిచేస్తున్నదీ ప్రజలకు తెలిసొచ్చింది. కాంగ్రెస్ పాలనలో అంతటి స్థాయిలో అవినీతి జరిగిందన్న ఆరోపణలు వచ్చినా ఎప్పుడూ ప్రభుత్వం అప్పు తీసుకోవాల్సిన దుస్థితి రాలేదు! ఇక యమునా నది నీటిని శుభ్రం చేస్తానన్న హామీని కూడా కేజ్రీవాల్ అమలుపరచలేకపోయారు. ముఖ్యంగా ఛాట్పూజ సందర్భంగా మహిళలు కాలుష్యమయంగా వున్న యమునానదిలోకి దిగి ‘అర్ఘ్యం’ వదిలిన చిత్రాలు సోషల్ మీడియాలో హల్చెల్ చేశాయి. ఇక కేజ్రీవాల్ లిక్కర్ పాలసీ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన లిక్కర్ పాలసీ పుణ్యమాని వీధివీధికీ లిక్కర్షాపులు పుట్టుకొచ్చాయి. చివరకు ఈ స్కామ్లోనే ఆయన జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చింది. 11 నెలలుగా అంగన్వాడీ కార్యకర్తలకు చెల్లింపులు జరపకపోవడంతో కేజ్రీవాల్ ఇచ్చిన మహిళా సంక్షేమంపై హామీ కూడా ప్రశ్నార్థకంగా మారింది. మహిళలకు నెలకు రూ.1000 చెల్లిస్తామన్న హామీని కూడా కేజ్రీవాల్ అమలుచేయలేదు. అవకాశవాద రాజకీయాలు కేజ్రీవాల్ రాజకీయాలు అవకాశాన్ని బట్టి మారుతూ వచ్చాయి. ముస్లింలను బుజ్జగించే చర్యల్లో భాగంగా మౌల్వీలకు నెలవారీ జీతాలు చెల్లించిన కేజ్రీవాల్ ప్రభుత్వం హిందూ, సిక్కు పూజారు లను పూర్తిగా విస్మరించింది. ఈ రెండు వర్గాల పూజార్లు కేవలం ఎన్నికల సమయంలో మాత్ర మే గుర్తుకురావడం కేజ్రీవాల్ మార్క్ రాజకీయానికి చిహ్నం! అయోధ్య రామమందిరానికి, హిందువులు పవిత్రంగా భావించే స్వస్తిక్ చిహ్నానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం కేవలం మైనారిటీలను బుజ్జగించడానికే! మిగతా హామీలు ఎట్లావున్నా, తమ భావోద్వేగాలపై కేజ్రీవాల్ చేస్తున్న దాడిని ఢల్లీిలోని హిందూ, సిక్కు ఓటర్లు మరచిపోలేదు. మరి పారదర్శకతకో గొంతు చించుకు న్న కేజ్రీవాల్ ప్రభుత్వం కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) రూపొందించిన 14 నివేదికలను తొక్కిపట్టి, అసెంబ్లీలో ప్రవేశపెట్టలేదు. ఇవన్నీ కేజ్రీవాల్ రాజకీయ, పాలనాపరమైన వైఫల్యాలుగా చెప్పుకోవాలి. ఆమ్ ఆద్మీ పార్టీని మిగిలిన పార్టీకంటే భిన్నంగా స్వచ్ఛమైందిగా చెప్పుకున్న కేజ్రీవాల్, తర్వాతి కాలంలో అధికారంకోసం అడ్డదారులు తొక్కడం మొదలుపెట్టారు. అలవికాని హామీలు గుప్పిం చడం ఇందులో భాగమే. దీర్ఘకాల అభివృద్ధి పనులను పట్టించుకోకుండా, తాత్కాలిక ప్రయోజనా ల కల్పనతో అధికారంలోకి రావాలనుకోవడం ఆయన చేసిన పెద్ద తప్పిదం. దేశంలోని మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే ఢల్లీి పూర్తి భిన్నం. ఇక్కడ మధ్యతరగతి, విద్యావంతులు అధికం. ప్రతి విషయాన్ని వారు జాగ్రత్తగా పరిశీలించడమే కాదు, ఎప్పటికప్పుడ చైతన్యశీలంగా వుంటారు. వీరిని తక్కువ అంచనా వేయడం కేజ్రీవాల్ ఘోర తప్పిదం! ఇన్ని కారణాలతో ఆప్ ప్రస్తుతం ఓటమిపాలై, అలవికాని హామీలు గుప్పించే ఇతర పార్టీలకు ఒక గుణపాఠంగా మారింది.
-జీతంలో ముప్పై శాతం సామాజిక కార్యక్రమాలు గొప్పల కోసమే
-ప్రభుత్వాల మీద కోచింగ్ సెంటర్ల ఆధిపత్యం కోసం కొత్త ఎత్తుగడ
-విద్యార్థుల జీవితాలు ఫణంగా పెట్టి సంపాదనా మార్గాలకు రాచబాట
అబద్దమాడరాదు..సత్యమునే పలుకవలెను..అని చెప్పాల్సిన గురువులు కొందరు పచ్చి అబద్దాలు చెప్పి సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎన్నికల్లో పోటీ చేస్తున్న బిఎస్పీ అభ్యర్ధి ప్రసన్న హరికృష్ణ గౌడ్ మాటలు అలాగే వున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆలోచనతో ఆయన కొంత కాలం క్రితం తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి తాను ప్రజా సేవ కోసం ప్రజల్లోకి వచ్చానని, ప్రజా సేవ కోసం తన ఉద్యోగాన్ని తృణ ప్రాయంగా వదిలేశానని, కొలువుకు రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నానని ప్రచారం మొదలు పెట్టారు. సహజంగా ఇలాంటి మాటలు విన్నవారికి ఎవరికైనా సరే అవునా? చాలా గొప్ప వ్యక్తి అన్న భావనే ఏర్పడుంది. చాలా మందికి అసలు నిజం తెలియదు. అంతలోతుగా కూడా ఎవరూ ఆలోచించరు. ఉద్యోగాల విషయంలో ఎలాంటి వెసులు బాటు వుంటుందో కూడా ఇతరులకు పెద్దగా అవగాహన వుండదు. దాంతో ఉన్నతమైన ఉద్యోగం వదిలి ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నాడేమో? అని జనం ఆలోచిస్తుంటారు. కాని అదంతా నిజంకాదు. ఇకపోతే ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆలోచనతోనే గత కొంత కాలంగా చిన్నా చితక సామాజిక కార్యాక్రమాలు చేపడుతూ వస్తున్నానని ఆయనే చెబుతున్నారు. తనకు వచ్చే జీతంలో కొంత శాతం సమాజ సేవ కోసం ఖర్చు చేస్తున్నానంటూ చెబుతుండడం విడ్డూరం. ఆయనకు వచ్చే జీతమెంత? అందులో చేసే ఖర్చెంత? ఎందుకంటే ఆసుపత్రుల్లో పది మంది రోగులకు పండ్లు పంచినా అది సామాజిక సేవే…కాని మన సమాజంలో ఎంతో మంది కొన్ని కోట్ల రూపాయలు సమాజం కోసం ఖర్చు చేస్తూ గుప్త దానాలు చేస్తున్న వారు అనేక మంది వున్నారు. వాళ్లెవరూ ఇలా ప్రచారం చేసుకోరు. అసలు పేదలను ఆదుకునేందుకు విద్యా, వైద్య సహాయ కార్యక్రమాలు చేస్తున్నట్లు కూడా తెలియదు. కాని రాజకీయ భవిష్యత్తుకోసం ఆరాటపడే వాళ్లే ఇలా చిన్నా చితక సాయాలు చేసి పెద్దగా ప్రచారం చేసుకుంటారు. మీడియాలో వార్తలు రాయించుకొని ప్రచారంలో దూసుకుపోతుంటారు. ఉద్యోగానికి రాజీనామా చేసిననాడు కూడా ఇలాగే తన త్యాగం గురించి చెప్పుకొని మీడియా సమావేశం ఏర్పాటు చేసి, గొప్పలు చెప్పుకున్నారు. ఆ మరునాడు వచ్చిన మీడియా కథనాలను బ్రోచర్గా మార్చుకొని రాజకీయ పార్టీల వెంట ప్రసన్న హరికృష్ణ తిరిగారు. ముఖ్యంగా అదికార కాంగ్రెస్ పార్టీ చుట్టూ ప్రదక్షిణాలు చేశారు. కాని కాంగ్రెస్ పార్టీ ప్రసన్న హరికృష్ణను నమ్మలేదు. ఎందుకంటే హరికృష్ణ ఉద్యోగ జీవితమే పట్టుమని పదిహేనేళ్లు లేదు. రిటైర్ మెంటుకు దగ్గరకూడా లేరు. కాని ఆయన రాజకీయ భవిష్యత్తు కోసం అడుగులు వేశారు. అందులోనూ పెద్దల సభను ముందుగా ఎంచుకున్నాడు. ఇక్కడే ఆయనలోని అత్యాశ కనిపించింది. ఒక సాధారణ వ్యక్తి రాజకీయంగా ఎదగాలనుకున్నప్పుడు చిన్న వయసు నుంచే కార్యకర్తగా మొదలై, అంచెలంచెలుగా ఎదుగుతుంటారు. లేకుంటే రిటైర్ అయ్యే సమయంలో రాజీనామాలు చేసి రాజకీయాల్లోకి వస్తుంటారు. కాని ఇంకా ఎంతో ఉద్యగ భవిష్యత్తు వున్న వ్యక్తి రాజీనామా చేశానని చెప్పి, ప్రజలను నమ్మించి రాజకీయాల్లో వస్తున్నానంటే ఎవరూ నమ్మరు. కారణం ఆ ఉద్యోగం ఎటూ పోదు. ఇంకా రెండేళ్లకైనా సరే ఆ ఉద్యోగం మళ్లీ వస్తుంది. అవసరమైతే ఆ జీతమంతా కలుపుకొని కొలువొస్తుంది. ఈ జిమ్మిక్కులు సామాన్యులకు తెలియవు. ఏదొ కారణం చెప్పి కోర్టును ఆశ్రయిస్తారు. ఇలా రాజీనామాలు చేసి, ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన తర్వాత మళ్లీ కొలువులు తెచ్చుకున్నవారు అనేక మంది వున్నారు. ఇలా ఉద్యోగానికి రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేయడం త్యాగం కాదు. ప్రజలను మోసం చేయడం. అద్యాపక వృత్తిలో వుంటూ నీతి, నిజాయితీని సమాజానికి పంచాల్సిన వ్యక్తి అబద్దాల పునాదుల మీద, అసత్యాలతో రాజకీయాలు చేయాలనుకోవడం తప్పు. కొన్ని రోజుల తర్వాత మళ్లీ తన కొలువు తిరిగి తెచ్చుకోవడం కోసం న్యాయ స్దానాలను కూడా మోసం చేస్తారు. ఇలా కోర్టులను కూడా మోసం చేయగలిగిన వాళ్లు ప్రజలను మోసం చేయకుండా వుండగలరా? నల్లగొండ ఉపాధ్యాయ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధికూడా ఇలాగే తన ఉద్యోగానికి రాజీనామా చేసి పోటీ చేస్తున్నారు. తర్వాత ప్రభుత్వ పెద్దలను ప్రసన్నం చేసుకొని, వారు కోరినంత ముట్ట జెప్పి, కోర్టును కూడా ప్రబావితం చేసి ఉద్యోగాలు తెచ్చుకుంటారు. అందువల్ల హరికృష్ణ చెబుతున్నది అబద్దమని, త్యాగం అసలే కాదని ఇక్కడే తేలిపోయింది. ఇంకా ఆయనను ప్రజలు నమ్ముతారని అనుకోవడం విచిత్రం. ఇక కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో ఇండిపెండెంటుగా పోటీకి నామినేషన్ వేసిన హరికృష్ణ కొంతకాలంగా తాను బిసినంటూ బిసీ వాదం వినిపిస్తూ వచ్చారు. బిసిలను సంఘటితం చేసి విజయం సాధిస్తాననుకున్నారు. కాని అటు వంటి దారి ఎక్కడా కనిపించలేదు. దాంతో రాత్రికి రాత్రి బిఎస్పీ కండువా కప్పుకున్నారు. బిఎస్పీ కార్యకర్తలైన పట్టుబద్రుల వద్దకు వెళ్లినప్పుడు బిఎస్పీ కండువా కప్పుకుంటున్నారు. ఇతర బిసి పట్టభద్రుల వద్దకు వెళ్లినప్పుడు బిసి కండువాతో ప్రచారం సాగిస్తున్నారు. తాను ఎంత ఊసరవెళ్లి రాజకీయాలను చేయగలనో ఇక్కడే ఆయన చూపించుకుంటున్నారు. ఈ రెండిరటికన్నా మరో భయంకరమైన నిజం హరికృష్ణ రాజకీయంలో దాగి వుంది. గత ప్రభుత్వ సమయంలో తెలంగాణ వ్యాప్తంగా ఉద్యోగాలు లేకున్నా, అప్పటి ప్రభుత్వం చెప్పే మాటలతో కోచింగ్ సెంటర్లన్నీ కళకళలాడుతుండేవి. కోచింగ్ సెంటర్లు కూడా ఇదిలో ఈ నోటిఫికెషన్ వచ్చే, ఆ నోటిఫికేషన్ వచ్చే అని ప్రచారం చేసుకోవడానికి వీలుండేది. ప్రభుత్వం నుంచి ఉద్యోగాల కల్పన ప్రకటన వచ్చిన నాటి నుంచి కోచింగ్ సెంటర్లప్రచాం మొదలు పెట్టేవి.తెలంగాణ వచ్చిన తర్వాత లక్ష ఉద్యోగాలు ఇస్తామని గత బిఆర్ఎస్పాలకులు చెప్పడంతో గ్రామీణ ప్రాంతాల పట్టభద్రులు పెద్దఎత్తున నగరాలకు చేరుకుంటూ వుండేవారు. ముఖ్యంగా హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఉమ్మడిజిల్లాల కేంద్రాలలో పెద్దఎత్తున వెలసిన కోచింగ్ సెంటర్లలో చేరేవారు. దాంతో కోచింగ్ సెంటర్లకు కోట్లాది రూపాయల ఆదాయం వచ్చేది. కాని ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత నోటిఫికేషన్లు వేయడం నిర్ణీత గడువు ప్రకటించడం, పరీక్షలు నిర్వహించడం కోచింగ్ సెంటర్లబొచ్చేలో రాయి వేసినట్లైంది. కోచింగ్ సెంటర్లు వెలవెలబోతున్నాయి. కొన్ని దశాబ్ధాలుగా ఏటా కిటకిటలాడే కోచింగ్ సెంటర్లు మూసుకోవాల్సిన పరిస్ధితి విచ్చింది. ఆ మధ్య డిఎస్సీ, గ్రూప్ వన్ ల మీద పెద్దఎత్తున సొమ్ము చేసుకోవాలని చూసిన కోచింగ్ సెంటర్లు, అభ్యర్ధులను రెచ్చగొట్టి రోడ్లమీదకుతెచ్చింది. పరీక్షలు వాయిదా వేయాలని ఉద్యమాలు చేయించింది. అయినా ప్రభుత్వం ఇచ్చిన గడువులోగా ఉద్యోగ పరీక్షలు నిర్వహించింది. దాంతో కోచింగ్ సెంటర్ల గొంతులో వెలక్కాయ పడినట్లైంది. ఇకపై ప్రభుత్వం తమ చెఫ్పుచేతుల్లో వుండాలన్న ఆలోచనతో కోచింగ్ సెంటర్లన్నీ ఏకమై ఎమ్మెల్సీ ఎన్నికల ఖర్చు భరించేందుకు ముందుకు వచ్చి, హరికృష్ణను రంగంలోకి దింపాయి. గుట్టు చప్పుడు కాకుండా కాంగ్రెస్ పార్టీనుంచి టికెట్ తెచ్చుకునేలా హరికృష్ణ కూడా వ్యూహం పన్నారు. ఎందుకంటే ఆయన ఓ వైపు కాంపిటీటివ్ పరీక్షల కోసం పుస్తకాలు రాస్తూ , అదనపు ఆదాయం సమకూర్చుకుంటుంటారు. కోచింగ్ సెంటర్లకు ద్వారా వాటిని అమ్ముకుంటుంటారు. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిస్తే ప్రభుత్వం కోచింగ్ సెంటర్ల చేతిలోకి వెళ్లిపోతుంది. పట్టభద్రుల నుంచి కోచింగ్ల పేరిట కోట్లు సంపాదించుకోవాలని చూశారు. కాని హరికృష్ణ ఆశలు కాంగ్రెస్ పార్టీ ద్వారా తీరలేదు. ఆయనకు టికెట్ రాలేదు. అయినా సరే కొండంత అండగా కోచింగ్ సెంటర్లు వుండడంతో ఆయన ఇండిపెండెంటుగా నామినేషన్ వేశారు. బిఎస్పీ కండువా కంప్పుకొని తిరుగుతున్నారు. ఈ విషయాలు పట్టభద్రులు తెలుసుకుంటే ఆయన అసలు నిజస్వరూపం తెలిసిపోతుంది. చైతన్య వంతులైన పట్టభద్రులను మోసం చేయడం ఎవరి వల్ల కాదన్నది ప్రజల అభిప్రాయం. ఎన్నికలంటేనే ఎన్నెన్నో లెక్కలు..విద్యలు..ఎత్తులు..జిత్తులు…కథలు…నటనలు..సానుబూతి పవనాలు. .ఇన్ని దాగి వుంటాయి. కాని కొన్ని ఎన్నికలు అలా వుండకూడదు. ముఖ్యంగా పెద్దల సభకు జరిగే ఎన్నికలైనా నీతిగా, నిజాయితీ వుండాలని రాజ్యాంగ పెద్దలు కొన్ని నియమనిబంధనలు ఏర్పాటు చేశారు. రాజకీయ పార్టీలు వాటిని కూడా తుంగలో తొక్కడం అలవాటు చేసుకున్నారు. ఎన్నికల వ్యవస్దలో వున్న లొసుగులను ఆసరాగా చేసుకుంటున్నారు. ఇక తీర్పునివ్వాల్సింది పట్టభద్రులే…
ప్రజల ఆలోచనా ధోరణిలో మార్పును గుర్తించని విపక్షాలు
అధికార దాహం తప్ప బలమైన నాయకుడేడీ?
ఉచితాలు మితిమీరి మునుగుతున్న రాష్ట్రాలు
ఒక వర్గం ప్రయోజనం కోసం మరో వర్గం బలి!
ఇదీ విపక్షాల ‘సెక్యులర్’ సిద్ధాంతం!
హైదరాబాద్,నేటిధాత్రి:
స్వాతంత్య్రం వచ్చిననాటినుంచి పరిశీలిస్తే మనదేశంలో అధికారంలో ఉన్న పార్టీ ఆధిపత్యమే అ ప్రతిహతంగా కొనసాగింది తప్ప, విపక్షాల వాణి ఎప్పుడూ బలహీనంగానే వుంటూ వచ్చింది. కాంగ్రెస్కు సైద్ధాంతికంగా బలమైన ప్రత్యామ్నాయాలుగా వున్న కమ్యూనిస్టు పార్టీలు నేడు పూర్తి శిథిలావస్థకు చేరుకున్నాయి. అవినీతికి వ్యతిరేక పోరాటంలో పుట్టుకొచ్చిన ఆమ్ ఆద్మీపార్టీ, తె లంగాణ ఉద్యమ నేపథ్యంలో ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రసమితి (తర్వాత బీఆర్ఎస్గా మా రింది) ప్రాంతీయ పార్టీలు ఇప్పుడు చతికిలపడటం తాజాపరిణామం. సైద్ధాంతిక దివాలకోరుత నంతో అధికారమే పరమావధిగా రాజకీయాలు నడుపుతున్న కాంగ్రెస్ అంపశయ్యవైపు అడుగులేస్తోంది. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో కొనసాగుతూ వస్తున్నప్పటికీ హింసారాజకీయమే దానికి ఊతంగా నిలుస్తోంది. మొత్తంమీద చెప్పాలంటే దేశంలో విపక్షాలు యుద్ధంలో అన్ని ఆస్త్రాలను కోల్పోయి నిర్వీర్యమైన దుస్థితికి చేరుకున్నాయనడంలో సందేహం లేదు. ఇందుకు ప్రధాన కారణాన్ని విశ్లేషించాల్సిన ఆవశ్యకత ఏర్పడిరది. ముఖ్యంగా విభిన్న సైద్ధాంతిక నేపథ్యాలు కలిగిన బలమైన ప్రతిపక్షాలు ఎంత బలంగా వుంటే ప్రజాస్వామ్యం అంత పటిష్టంగా మనుగడ సాగిస్తుందనేది ఒక అభిప్రాయం. కానీ స్వాతంత్య్రం వచ్చిననాటినుంచి విప క్షాలు బలంగా ఉన్నది ఎప్పుడూ లేదు! బలంగా ఉన్న కొద్దికాలంలో అవి ప్రభుత్వాలను స్థిరంగా పాలన సాగించనివ్వనూ లేదు! ఈ రెండూ చెప్పడానికి విచిత్రంగా వున్నా, అక్షరసత్యం!
ఛరిష్మా రాజకీయాలు
ఏ రాజకీయ పార్టీ అయినా తాము నమ్మిన కొన్ని సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లినప్పుడు వారి ఆమోదం లభిస్తేనే దానికి మనుగడ వుంటుందనేది అందరికీ తెలిసిందే. స్వాతంత్య్రం వచ్చిన కొత్తల్లో కాంగ్రెస్పై స్వాతంత్య్రోద్యమ ప్రభావం వుండటంవల్ల అప్రతిహతంగా అధికారంలో కొనసాగగలిగింది. ఈ ఛరిష్మాముందు కమ్యూస్టుల సిద్ధాంతాలు పనిచేయలేదు. ఒకదశలో కాంగ్రెస్ను ఢీ అంటే ఢీ అనే స్థితి ఏర్పడినా స్వీయ తప్పిదాలు, అంతర్గత సైద్ధాంతిక విభేదాలు కమ్యూనిస్టుపార్టీని దెబ్బతీసాయి. ఒకరకంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీకూడా సిద్ధాంత నేపథ్యం కంటే, నె హ్రూ, ఇందిరాగాంధీ ఛరిష్మాపైనే నెట్టుకొచ్చింది. ఇప్పుడు ఆ ఛరిష్మా కలిగిన నాయకులు లేకపోవడంతో పార్టీ కోటలు ఒక్కటక్కటిగా కుప్పకూలిపోవడం మొదలైంది. ఇక కమ్యూనిస్టులో పరిపాలనా పరంగా ‘లిబరల్’, ‘నియో`లిబరల్’ విధానాల మధ్య ఊగిసలాట వైఖరి కొనసాగింది.
అవినీతిపై పోరాటం, వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ ప్రాధాన్యతల ఆధారంగా కొనసాగే ఉద్యమ నేపథ్యంలో అధికారంలోకి వచ్చే పార్టీల మనుగడ ఆయా పరిస్థితులు చక్కబడేంతవరకే వుంటుంది. ఆయా సమస్యలు తీరిన తర్వాత ప్రజలు సహజంగానే వాటిని మరచిపోతారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో సాధారణ ప్రజలు తమకు కనీసావసరాలపై దృష్టిపెడతారు తప్ప మిగిలినవి వారికి పట్టవు. ఇవి అన్ని వర్గాలు, కులాలు, మతాలవారికీ ఒక్కటే కనుక ప్రస్తుతం రాజకీయ పార్టీలు ‘సంక్షేమం’ పేరుతో ఉచితాలను ఇవ్వడం మొదలుపెట్టాయి. ఇవి ఒక పరిమితిని దాటిపోవడం తో అమలు చేయలేక అధికార పార్టీలు సతమతమవుతుంటే, మరోవైపు రాష్ట్రాల ఆర్థికవ్యవస్థలు కుప్పకూలడం వర్తమాన చరిత్ర! విపక్షాలు చేస్తున్న మరో తప్పిదమేమంటే ‘సెక్యులరిజం’ పేరు తో మెజారిటీ ప్రజలను నిర్లక్ష్యం చేయడం, మైనారిటీలను విపరీతంగా బుజ్జగించడం! ఇదికూడామెజారిటీ ప్రజల్లో వారిపట్ల వ్యతిరేకత పెరగడానికి ప్రధాన కారణం! అదే ముస్లింలు లేదా క్రైస్తవులు బలీయంగా వుండి, హిందువులు మైనారిటీలుగా ఉన్న రాష్ట్రాలు లేదా ప్రాంతాల్లో ఈ పార్టీల వైఖరి మైనారిటీలకు అనుకూలంగా వుండదు. ఈ రెండు నాల్కల ధోరణిని మెజారిటీ వర్గాలుగుర్తించడమే వాటి పతనానికి ప్రధాన కారణం
జాతీయవాదానికి కారణం
ఒక జాతిప్రజలు తమ సంస్కృతిాసంప్రదాయాలకు భంగం వాటిల్లుతుందని భయపడినప్పుడు, వారిలో జాతీయవాదం క్రమంగా పెరుగుతుందనేది వర్తమాన చరిత్ర చెబుతున్న సత్యం. ముఖ్యంగా ప్రజాస్వామ్య దేశాల్లో సెక్యులర్ ప్రభుత్వాల మితిమీరిన మైనారిటీ బుజ్జగింపు రాజకీయాలు, జాతీయవాదం ప్రబలడానికి ప్రధాన కారణమవుతున్నాయి. ఒక జాతి తన మనుగడకు ప్ర మాదం వాటిల్లుతుందని లేదా మరొక సంస్కృతి తన అస్తిత్వానికే భంగకరంగా మారిందని భా వించినప్పుడు ఉద్భవించే జాతీయవాదాలు ప్రజాస్వామ్యంలో కొత్త పోకడలను ఆవిష్కరిస్తాయి. ఐరోపా దేశాలు ప్రస్తుతం ఈ పోకడలకు గొప్ప ఉదాహరణ. మనదేశంలో జమ్ముాకశ్మీర్కు చెందిన నాలుగు లక్షలమంది కాశ్మీరీ పండిట్లు ఇప్పుడు స్వదేశంలోనే కాందిశీకులుగా బతుకులీడవా ల్సిన దుస్థితికి ఇస్లామిక్ ఉగ్రవాదంతో పాటు, సెక్యులర్ పార్టీల పక్షపాత, నిర్లక్ష్య ధోరణి ప్రధాన కారణం. సెక్యులర్ ప్రభుత్వాల మితిమీరిన బుజ్జగింపు రాజకీయాలకు విసిగిన ప్రజలు క్రమం గా జాతీయవాద పార్టీ అయిన బీజేపీ వైపు మొగ్గు చూపారు. దాదాపుగా ఇదే పరిస్థితి యూరప్ దేశాల్లో ప్రస్తుతం నెలకొంది. ఇస్లామిక్ ఉగ్రవాదం కారణంగా తమ అస్తిత్వానికి భంగం వాటిల్లుతున్నదని అక్కడి ప్రజలు భయపడుతుండటంతో క్రమంగా అక్కడ జాతీయవాద పార్టీలు అధికా రంలోకి రావడమో, పెద్ద పార్టీలుగా అవతరించడమో జరుగుతోంది. 2010కి ముందు ఈ దేశాల్లో మొత్తం పోలైన ఓట్లలో జాతీయవాద పార్టీల వాటా 3% కంటే తక్కువ వుండేది. తర్వాతి కా లంలో స్వీడన్లో 12%కు, ఫిన్లాండ్లో 18%, హంగరీలో 19%కు పెరగడం ఆయా దేశాల సా మాజిక వర్గాల్లో పెరుగుతున్న సాంస్కృతిక అభద్రతాభావానికి చిహ్నం. ఈ పరిణామాలను మన దేశంలో కమ్యూనిస్టులతో సహా సెక్యులర్ పార్టీలుగా చెప్పుకునేవారు గుర్తించకపోవడం విచారకరం.
ప్రాధాన్యత లేని అంశాలపై పోరు
పెట్టుబడిదార్లను, భూస్వాములను వ్యతిరేకిస్తూ ప్రాభవంలోకి వచ్చిన కమ్యూనిస్టు పార్టీలు తమ ప్రాభవం కోల్పోవడానికి ప్రధాన కారణం ఈ రెండు అంశాలకు ఇప్పుడు ప్రాధాన్యత లేకపోవడమే. ఒక పెట్టుబడిదారు సంస్థను స్థాపిస్తే ఎంతోమందికి ఉద్యోగ, ఉపాధి లభిస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థల్లో ట్రేడ్యూనిన్లు హక్కులకోసం పోరాటం తప్ప, బాధ్యతలపై దృష్టిపెట్టకపోవడంతోఅవి దేశ ఆర్థిక వ్యవస్థకే గుదిబండల్లా మారిపోయి, చివరకు ప్రైవేటీకరణకు గేట్లు తెరవాల్సిన పరిస్థితి ఏర్పడిరది. ఇక భూస్వామ్య వ్యవస్థ విషయానికి వస్తే ఇప్పుడు ప్రతిదీ కార్పొరేటీకరణ జరుగుతున్న కాలం ఇది. జనాభా విపరీతంగా పెరిగి కమతాల విస్తీర్ణం కుంచించుకుపోతున్న నేప థ్యంలో ఎవరికీ కడుపునిండని దుస్థితి! ఈ నేపథ్యంలో ప్రజల ఆలోచనా విధానాల్లో సమూల మార్పులు వచ్చేశాయి. లాభదాయకమైన ఉపాధి అవకాశాలవైపు దృష్టి సారించడం మొదలవడంతో భూస్వామ్య వ్యవస్థపై పోరాటానికి విలువేలేకపోయింది. సాయుధపోరాటం పేరుతో వాపపక్షతీవ్రవాదం ఇప్పుడు శాంతిభద్రతల సమస్యను సృష్టిస్తోంది. దీనికి తోడు ముస్లిం మత ఛాందస వాదం ప్రపంచ దేశాల అస్తిత్వానికే ప్రమాదకరంగా మారింది. అభివృద్ధి నిరోధకంగా, హింసను ప్రజ్వరిల్లజేస్తున్న ఈరెండు రకాల ఉగ్రవాదాలను కఠినంగా అణచివేయాలని ప్రపంచ దేశాలు నిర్ణయించిన నేపథ్యంలో వీటికి ప్రజలనుంచి మద్దతు లభించదు. వామపక్ష ఉగ్రవాద సమర్థకు లు ‘యుద్ధం’, ‘రణరంగం’ వంటి అతిపెద్ద పదాల ప్రయోగం చేస్తుంటారు. బలమైన వ్యవస్థతో సాయుధపోరాటం పనిచేయదన్నది ప్రపంచ వ్యాప్తంగా నిరూపితమైన సత్యం. తమ భావజాలాన్నిమార్చుకొని వర్తమాన పరిస్థితులకు అనుగుణంగా మలచుకుంటే, ప్రజల్లో మద్దతుకోసం ముందుకు సాగవచ్చు. అసలు ప్రపంచ వ్యాప్తంగా యుద్ధ తంత్రమే మారిపోయిన కాలమిది. ఇక ముందు ఆయుధాలు పనిచేయవు! అంతా డిజిటల్ పద్ధతిలోనే యుద్ధాలు జరుగుతాయి!
చరిత్ర ఒకప్రవాహం
చరిత్ర అనేది ఒక ప్రవాహం వంటిది. ఒక్కో కాలంలో ఒక్కో వాదం, సిద్ధాంతం బహుళ ప్రాచు ర్యం పొందుతాయి. ఒక కాలంలో ప్రధాన సమస్యగా వున్నది అనంతరకాలంలో కనుమరుగు కావచ్చు. ఎందుకంటే ఆ సమస్యపై ఆ కాలంలో జరిగిన పోరాటం విజయం సాధించడం వల్ల. ఆసమస్యకు పరిష్కారం లభించిన తర్వాత ఇక ఆ వాదంతో పనివుండదు. కానీ అదేవాదాన్ని పట్టుకు వేలాడతానన్న వారికి మనుగడ వుండదు! దళితవాదం, స్త్రీవాదం వంటి అనేక వాదాలు ఒకప్పుడు బహుళ ప్రచారం పొందడానికి ప్రధాన కారణం ఆయా వర్గాలు తీవ్ర అణచివేతను ఎదు ర్కొనడం! ఈ సిద్ధాంతాల నేపథ్యంలో జరిగిన సంఘర్షణ పుణ్యమాని వీరిపై అణచివేత తగ్గుముఖం పట్టడంతో క్రమంగా ఆయావాదాలు కనుమరుగైపోతాయి. ఇప్పుడు క్రమంగా పురుషుల పైవేధింపులు పెరుగుతున్నాయి! మరిప్పుడు ‘పురుషవాదం’ రావాలా? పిల్లల్ని మేమెందుకు కనాలి? అనే ధోరణి క్రమంగా పెరుగుతున్న రోజులివి. ఈ నేపథ్యంలో సాంకేతిక సహాయంతో బిడ్డలను కనేరోజులు మొదలయ్యాయి! ఇంతటి మార్పు వస్తున్న తరుణంలో స్త్రీవాదం పనిచేస్తుందా? సామాజికంగా సమానత్వం పరిఢవిల్లుతున్న నేటి కాలంలో పేదరిక నిర్మూలన, ఉపాధికే ప్రాధా న్యత వుంటుంది తప్ప దళితవాదానికి ప్రాధాన్యత ఎక్కడ? హింసకు లేదా అత్యాచారానికి గురైన వ్యక్తి పేద లేదా మహిళ లేదా మరే ఇతరులైనా చట్టపరమైన న్యాయాన్ని పొందడానికి అర్హులవుతారు. పీడితుడికి కులం, మతం, ప్రాంతం అనేవి వుండవు. ఎవరైనా వేధింపులకు గురైనప్పుడు పోలీసులను ఆశ్రయించి న్యాయం పొందవచ్చు. మహామహులు, తాము గొప్ప నాయకులనుకుంటున్నవారే జైళ్లకు వెళ్లే రోజులివి!
విపక్షాల మార్కు సెక్యులరిజం
ఇంత విశ్లేషణ తర్వాత మనకు అర్థమయ్యేది ఒక్కటే! మెజారిటీ, మైనారిటీ, ధనిక, పేద అనే తే డా లేకుండా అందరికి సమానత్వం, సమాన న్యాయం జరగడమే సెక్యులరిజం. కానీ విపక్షాలు సెక్యులరిజం పేరుతో తమకు ప్రయోజనం వుంటుందనుకున్న వర్గాన్ని మాత్రమే వెనకేసుకొచ్చి, మరొక వర్గాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాయి. విపరీత స్థాయిలో బుజ్జగింపులకు పాల్పడుతున్నాయి. ఇదే వాటి పతనానికి ప్రధాన కారణం! ఓట్లకోసం సైద్ధాంతిక నిబద్ధతను గాలికొదిలేయడం విపక్షాలు వరుస పరాజయాలు ఎదుర్కొనడానికి మరో కారణం! నిజం చెప్పాలంటే మైనారిటీల పేరు తో ‘మతవాదాన్ని’ సమర్థిస్తున్నవి ఈ పార్టీలే. మెజారిటీ వర్గం మేల్కంటే, దాన్ని ‘మతోన్మాదమంటూ’ గగ్గోలు పెట్టడం వీటికి ఫ్యాషనైపోయింది. ఇప్పటికీ ఇవి తమ లోపాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయడంలేదంటే, ఈ వాస్తవాన్ని ఇంకా గుర్తించలేదని అర్థం. సైద్ధాంతిక నిబద్ధత కలిగిన కమ్యూనిస్టులు తమ సిద్ధాంతాలను కాలానుగుణంగా, మనదేశ కాలమాన పరిస్థితులకు అనుగుణంగా మార్పుచేసుకోవడానికి అంగీకరించరు. అధికారం పొందడం మాత్రమే సిద్ధాంతంగా కలిగిన మిగిలిన పార్టీలు తమ విపరీత పోకడలను మార్చుకోరు. మనదేశంలో విపక్షాలు బలోపేతం కాకపోవడానికి ఇది మరో కారణం! లౌకికవాదం ముసుగులో రాజ్యాంగాన్ని హతమార్చి హిం దువులకు వ్యతిరేకంగా వ్యవహరించిన కాంగ్రెస్ భయంకరమైన పాపాన్ని మూటకట్టుకుంది. 1975 నుంచి 1977 మధ్య 21నెలల పాటు ఎమర్జెన్సీ కాలంలో అరెస్టయింది, నష్టపోయింది హిందువులే! దేశాన్ని తల్లిగా పేర్కొంటూ, మాతృప్రేమను పెపొందించేది భాజపా, ఆర్ఎస్ఎస్లు మాత్రమే! కులం, ప్రాంతం, భాష అనే కుంపట్ల మధ్య కునారిల్లుతున్న హిందువుల్లో తాము హిందువులమన్న జాగృతిని కలిగించింది కేవలం అయోధ్య రామమందిరం మాత్రమే. విభిన్న త్వం పేరుతో ప్రజలమధ్య విభేదాలు సృష్టిస్తూ ఓట్లను దండుకోవడానికి ప్రయత్నిస్తున్న విపక్షాల కుచ్చిత నీతిని ప్రజలు గుర్తించడంవల్లనే వాటికి ప్రస్తుత దుస్థితి. నేడు ప్రజలు ఒక సత్యాన్ని బాగా గుర్తించారనుకోవాలి. ఏంటంటే సన్యాసులు (కర్మయోగులు) పాలిస్తే కోట్లరూపాయల మిగు లు బడ్జెట్ వుంటోంది. అదే సన్నాసులు (స్వార్థపరులు) పాలిస్తే అప్పులే గతి!
`ఇప్పుడూ కాంగ్రెస్లో అందరికీ అందుతున్న పదవుల పంపకం
`మహిళా సాధికారతలోనే కాంగ్రెస్ పార్టీదే పై చేయి
`మహిళా విభాగానికి సైతం కాంగ్రెస్లో అధిక ప్రాధాన్యత
`పిసిసికి సమానంగా విభాగాలున్న ఏకైక పార్టీ కాంగ్రెస్
`అత్యధికంగా మహిళా ముఖ్యమంత్రులను చేసిన పార్టీ కాంగ్రెస్
`ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి సుచేత కృపలాని
`యుపి తొలి గవర్నర్ సరోజినీ నాయుడు
`కాంగ్రెస్ పార్టీ తొలి జాతీయ అధ్యక్షురాలు కూడా
`ఉప ప్రధానిగా, ముప్పై సంవత్సరాల పాటు కేంద్ర మంత్రిగా పనిచేసిన జగ్జీవన్ రాం
`అన్ని స్థాయిలలో ఎస్సీ, ఎస్టీలకు రాజకీయ ప్రాధాన్యం కల్పించిందే కాంగ్రెస్
`సామాజిక న్యాయంలో కాంగ్రెస్ ను మించిన పార్టీ లేదు
`ఇప్పుడు కూడా ఏఐసిసి. అధ్యక్షుడు ఖర్గే వున్నారు
`తెలంగాణలోనూ సమన్యాయ పాలన
`బీసీలకు సముచితమైన అవకాశాల కోసం కులగనణ
`పేద వర్గాల అభ్యున్నతి కాంగ్రెస్ తోనే
`అన్ని తరగతుల ప్రజల అభివృద్ధి కాంగ్రెస్ లోనే..
`రాజకీయ సమ ప్రాధాన్యత కేవలం కాంగ్రెస్ కే సొంతం
హైదరాబాద్,నేటిధాత్రి: వాడుకోవడానికి వర్డ్ బాగుంది కదా! అని అందరూ సామాజిక న్యాయం అనే పదం వాడుతుంటారు. కాని అందులో నిజమెంత? దానిని అనుసరించే పార్టీల విజ్ఞతెంత? రాజకీయ పార్టీల నైతికతెంత? వారు అనుసరిస్తున్న విదానమెంత? అని చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీ పార్టీలకంటే ఒకింత మేలనే చెప్పాలి. ఆది నుంచి చూసినా, ఇప్పుడు పరిశీలించినా కాంగ్రెస్ ఫార్టీ జరిగేంత సామాజిక న్యాయం మరే పార్టీలోనూ జరగదు. కాని తమ పార్టీలలో ఆ సామాజిక న్యాయం అనుసరించని పార్టీలన్నీ కాంగ్రెస్ను నిందిస్తుంటాయి. మన తెలుగు ఉమ్మడి రాష్ట్రంలో చూసినా, ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చూసినా ఆయా పార్టీలలో ఎంత సామాజిక న్యాయం అమలు జరుగుతుందన్నది చూస్తే జల్లడ వేసినా కాంగ్రెస్ తప్ప మరో పార్టీ కనిపించదు. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ వస్తే దళితుడే తొలి ముఖ్యమంత్రి అని కొన్ని వందల వేల సార్లు చెప్పింది కేసిఆర్. కొన్నివందల సార్లు తాను కాపాలా కుక్కలా వుంటానే తప్ప తెలంగాణకు ఎట్టిపరిస్ధితుల్లోనూ తొలి ముఖ్యమంత్రి దళితుడే అన్నారు. కాని తీరా బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకివచ్చిన తర్వాత కేసిఆర్ చేసిందేమిటి? కుర్చీలో తాను కూర్చున్నాడు. కీలక పదవులన్నీ రెండు సామాజిక వర్గాల చేతుల్లో పెట్టేశాడు. ప్రాధాన్యత లేని పదవులను కూడా కొన్ని సార్లు బిసిలకు, దళితులకు, గిరిజనులకు ఇచ్చేందుకు చేతులురాలేదు. కాని కాంగ్రెస్ పార్టీలో అలా వుండదు. కొంత రెడ్డి సామాజిక వర్గానిది కాంగ్రెస్ పార్టీలో పై చేయి వుంటుందన్నది వాస్తవం. కాని పూర్తిగా వారిదే పై చేయి వుంటుందనేది కూడా నిజం కాదు. బిసి నాయకులు ఎంతో మంది కాంగ్రెస్లో కీలక భూమికపోషించారు. ఇప్పుడూ క్రియాశీలక పాత్రలో వున్నారు. దేశంలోనే అన్ని వర్గాల ప్రజలకు అన్నింటా న్యాయం చేసిన పార్టీ ఏదైనా వుందంటే అది కాంగ్రెస్ పార్టీయే. ఎందుకంటే దేశ స్వాతంత్య్ర ఉద్యమ కాలంలోనే సరోజినీ నాయుడుకు 1927లో జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలును చేసింది. అసలు స్వాతంత్య్రోమ కాలంలో మహిళలకు అంత పెద్ద పదవి అందుతుందని ఎవరూ ఊహించలేదు. కాని తాను ఆ పదవి చేపట్టేందుకు సిద్దంగా వున్నానని చెప్పిన సరోజనీ నాయుడును కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలని చేశారు. అంతే కాదు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఉత్తరప్రదేశ్ గవర్నర్గా సరోజినీ నాయుడుకు అవకాశంకల్పించారు.1963లో ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా సుచేతా కృఫలానీని చేసిన ఘనతకాంగ్రెస్దే. అంతే కాకుండా కాంగ్రెస్ పార్టీ ఐదుగురు మహిళలను ముఖ్యమంత్రులను చేశారు. ఒడిషాకు చెందిన నందినీ సత్పతి, అస్సాంలో అన్వారా, డిల్లీ షీలా దీక్షిత్, పంజాబ్ రాజీందర్ కౌర్లను ముఖ్యమంత్రులను చేసింది కాంగ్రెస్ పార్టీ. కాని అది బిజేపిలో సాద్యమా? జన్సంఫ్ులో సాధ్యమైందా? ఆర్ఎస్ఎస్లో సాధ్యమౌతుందా? దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మొదటి మహిళా ముఖ్యమంత్రిని కూడా కాంగ్రెస్ పార్టీయే చేసింది. బిజేపిలో ముఖ్యమంత్రిగా పనిచేసిన ఉమా భారతి పరిస్దితి ఏమిటి? ఆమెను క్రియాశీల రాజకీయాలకు ఎందుకు దూరం చేశారు? ఎవరు దూరం చేశారు? బిజేపిలో జాతీయ అధ్యక్షురాలిగా మహిళను నియమించగలరా? కాని కాంగ్రెస్లో మహిళా విభాగం కూడా ప్రత్యేకంగా వుంటుంది. ఆ విభాగం కూడా కీలక భూమిక పోషిస్తుంది. కాని ఇతర పార్టీలలో ఆ విభాగాలు వున్నా, ఉత్సవ విగ్రహాలుగానే వుంటారు. తప్ప ఎక్కడా పార్టీ కమిటీకి సరిసమానమైన ప్రాధాన్యత వుండదు. కాంగ్రెస్ పార్టీలో చాల వరకు ఆ మహిళా విభాగానికి ఎంతో ప్రాదాన్యత వుంటుంది. అలా మహిళా అధ్యక్ష పదవులు నిర్వహించిన వాళ్లు మంత్రులయ్యారు. రాష్ట్ర రాజకీయాలను శాసించారు. అందులో గల్లా అరుణకుమారి. గీతారెడ్డి లాంటి వారు అనేక మంది వున్నారు. వాళ్లు ఎమ్మెల్యేలయ్యారు. పురుషాదిక్య సమాజంలో సమాన పాత్రలు పోషించారు. కాని బిజేపిలో ఆ పరిస్ధితి ఎక్కడా కనిపించదు. ఇదే విషయాన్ని పార్లమెంటులో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దేశమంతా ప్రచారం చేస్తున్నారు. బిజేపిలో వ్యక్తి పూజలు ఎక్కువయ్యాయి. మహిళా ప్రధాన్యత తగ్గిపోయింది. పైగా సామాజిక న్యాయం అడుగంటిపోయింది. కేంద్ర మంత్రి వర్గంలో ఎక్కువ శాతం ఉన్నత కులాలకుచెందిన నాయకులే వున్నారు. కీలకభూమికపోషిస్తున్నారు. ఉన్నత వర్గాలు కీలకంగా లేని రాష్ట్రాలలో మాత్రమే ఇతర వర్గాలకు కొంత గుర్తింపునిస్తున్నారు. తప్ప ఎక్కడా బిజేపి సామాజిక న్యాయాన్ని పాటించడం లేదు. కేవలం ప్రధాని పదవిని చూపించి, బిజేపి రాజకీయం చేస్తోంది. ఆ విషయాన్ని కూడా ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. ప్రదాని మోడీ బిసి కాదని తేల్చేశారు. అది జీర్ణించుకోలేని బిజేపి కుల రాజకీయాలను ముందు పెడుతోంది. కాని దేశంలో కుల గణనను మాత్రం తొక్కి పెట్టేస్తోంది. జనాభా గనణ చేపడితే బిసిల సంఖ్య తేలుతుంది. అన్ని కులాల లెక్కలు తేలుతాయి. దాంతో రాజకీయంగా రిజర్వేషన్ల శాతం పెంచాల్సి వస్తుంది. ఉన్నత వర్గాలకు అన్యాయం జరుగుతుంది. అందుకే బిజేపి జనాభా గణనకు ముందుకు రావడం లేదు. నిజానికి 2021లోనే జనాభా గణన జరగాలి. కాని ఇప్పటి వరకు చేపట్టలేదు. ఆలస్యానికి కారణం చెబుతోందే తప్ప, కుల గణన సంగతి మాట మాత్రమైనా చెప్పడం లేదు. కుల గణన చేపడితే దేశ రాజకీయాల్లో పెనుమార్పులు వస్తాయని బిజేపి భయపడుతోంది. కాని కాంగ్రెస్ పార్టీ ఏనాడు అలా వెనుకడుగు వేయలేదు. దేశంలో డెబ్బై ఏళ్ల స్వాతంత్య్ర దేశంలో జనాభా గణన, కుల లెక్కలు తేల్చకుండా వుండలేదు. కాని బిజేపి లెక్కలు అనగానే భయపడుతోంది. ఇటీవల రాహుల్ గాందీ చేసిన కొన్ని వ్యాఖ్యలు సంచనాలయ్యాయి. దేశ బడ్జెట్ రూపకల్పనలో పాలు పంచుకునేంత శక్తి బిసి, ఎస్సీ, ఎస్టీ అధికారులకు లేదా? వారి ఎంపిక చేయాల్సిన అవసరం లేదా? బడ్జెట్ రూపకల్పనలో ఉన్నత కులాల అదికారులకే బాధ్యతలా? ఆఖరుకు హల్వాతినడానికి కూడా ఇతర అధికారులు అర్హులు కారా?అంటూ నిలదీశారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన పాలనా వ్యవహారాలలో కీలక భూమిక పోషించే అదికారులు కూడా ఉన్నత వర్గాలేనా? అంటూ ప్రశ్నించారు. కాని కాంగ్రెస్ పార్టీపై అలాంటి ప్రశ్నలు లేవనెత్తేందుకు బిజేపికి ఎక్కడా అవకాశం లేదు. రాజ్యాంగ రచనాసంఘం అధ్యక్షుడు డాక్టర్.బిఆర్.అంబెద్కర్ ప్రత్యక్ష్య ఎన్నికల్లో ఓడిపోతే, ఆయనను రాజ్యసభకు నామినేట్ చేసి మంత్రిని చేసింది ప్రదాని నెహ్రూ. కాని బిజేపి పార్టీ చెప్పే మాటల్లో ఎంత మాత్రం నిజం లేదు. కాంగ్రెస్ పార్టీలో దళిత నాయకుడైన బాబూ జగ్జీవన్రాం ఉప ముఖ్యమంత్రి పదవిని నిర్వహించారు. అంతే కాదు సుమారు 30 సంవత్సరాల పాటు కేంద్ర మంత్రిగా పనిచేసిన ఏకైక నాయకుడు జగ్జీవన్ రాం. అంతగా ఆయనకు ప్రాదాన్యత కల్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి బిజేపిలో ఒక దళిత నాయకుడికి ఇంతటి ప్రాదాన్యత దక్కుతుందా? ఊహించగలమా? ఇప్పుడు కూడా తెలంగాణలో మంత్రి వర్గంలో కూడా చాల వరకు న్యాయం జరిగింది. ఇంకా జరగాల్సి వుంది. కానీ ఎన్నికల ముందు ఇచ్చిన హమీ మేరకు కుల గణన చేశారు. 42శాతం బిసిలకు రిజర్వేషన్ కల్పించేందుకు సిద్దంగా వున్నారు. బిఆర్ఎస్లో దళితులకు , బిసిలకు కాంగ్రెస్లో కనిపించేంత సామాజిక న్యాయం ఊహించగలమా? 2014 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కేసిఆర్ తన తొలి ఐదేళ్ల పాలనా కాలంలో ఒక్క మహిళకు కూడా మంత్రి పదవి ఇవ్వలేదు. ఇది పాలనలో మహిళా నాయకులను చిన్న చూపు చూడడం కాదా? డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చినా అది ఉన్నత వర్గానికే కట్టబెట్టారు. కాని కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇద్దరు మహిళా మంత్రుకు చోటు కల్పించారు. అందులోనూ ఒకరు బిసి, మరొకరు ఎస్టీకి కేటాయించారు. కొండా సురేఖ, ధనసరి అనసూయ( సీతక్క)ను మంత్రులు చేశారు. బిసిలకు కూడా బిఆర్ఎస్ కన్నా మెరుగైన స్ధానమే కల్పించారు. సామాజిక న్యాయం చేసేందుకు ప్రయత్నం జరిగింది. కాకపోతే పదేళ్ల పాటు పార్టీ కోసం పని చేసిన నాయకుల్లో ఎక్కువగా ఉన్నత వర్గాల నాయకులే వున్నారు. ఇక తెలంగాణ ప్రకటించిన వెంటనే రాష్ట్ర కాంగ్రెస్ భాధ్యతలు పొన్నాల లక్ష్మయ్యకు కట్టబెట్టారు. కాని ఆయన తన వల్ల కాదని ఆ పదవిని వద్దనుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువే..సామాజిక న్యాయం ఎక్కువే.. ఆ రెండు లక్షణాలులేని ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ నిందిస్తామంటే జనమే మెచ్చరు.
నితిష్ నిష్క్రమణ తర్వాత జేడీయూ విలీనానికి భాజపా ప్రణాళిక
వయసు, ఆరోగ్య సమస్యలతో నితిష్
నిశాంత్ అరంగేట్రాన్ని స్వాగతిస్తున్న పార్టీలు
నితిష్ వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకం
మరో ఇద్దరు సోషలిస్టు నాయకుల తనయులు ఇప్పటికే రాజకీయాల్లో…
పార్టీ మనుగడకోసం నితిష్ సర్దుకుపోతారా?
రాష్ట్రంలో తిరుగులేని బలంతో ఎన్డీఏ కూటమి
నేటిధాత్రి డెస్క్:
బిహార్లో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఢల్లీి పీఠం కైవసంతో, రాష్ట్రంలోని భాజపా వర్గాల్లో జోష్ నెలకొంది. మొత్తం 243 అసెంబ్లీ స్థానాల్లో 225 కైవసం చేసుకోవాలన్నది వీరి లక్ష్యం. అవసరమైతే ఒంటరిపోరుకూ సై అంటున్నప్పటికీ, బిహార్లో ఇప్పటికీ అత్యంత చరిష్మా కలిగిన నాయకుడు జెడీయూ అధినేత నితిష్కుమార్ మాత్రమే! ఈ నేపథ్యంలో పార్టీ కేంద్రనాయకత్వం మాత్రం నితిష్ నేతృత్వంలోనే ఈసారి ఎన్నికల్లో పోటీచేయాలన్న స్పష్టమైన ఉద్దేశంతో వుంది. ప్రస్తుతం భాజపా`జేడీయూ`ఎల్జేపీలు కాంబినేషన్ను ఆర్జేడీ`కాంగ్రెస్ కూటమి ఎదుర్కొనే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలోనే ఆర్జేడీ నేత తేజస్వినీ యాదవ్కు నితిష్కుమార్పై దింపుడు కళ్లం ఆశలున్నాయి. చివరిదశలోనైనా బీజేపీకి థమ్కా ఇచ్చి తమ కూటమిలో చేరితే తిరుగుండదని భావిస్తున్నా, నితీష్ నిలకడలేని వైఖరి, ఆయన ఆరోగ్యం అంతంత మాత్రంగా వుండటం వంటి ప్రతికూలతలు ఇబ్బందిగా మారాయి. అదీకాకుండా ప్రస్తుతానికి ఆయనకు కేంద్రంలోని భాజపాతో ఎటువంటి పొరపొచ్చాలు లేవు. కేంద్ర నాయకత్వం పటిష్టంగా వుండటం తో తోకజాడిరపు రాజకీయాలు ఇప్పుడు పనిచేయవన్న సంగతి ఆయనకు బాగా తెలుసు. దీనికితోడు వయోభారం, అనారోగ్యంతో ఇబ్బందులు ఎలాగో వున్నాయి. ఇదిలావుండగా రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కేంద్రం ఈసారి బడ్జెట్లో బిహార్కు ముఖ్యంగా యువత, స్త్రీలు మరియు పేదలను దృష్టిలో వుంచుకొని అనేక రాయితీలు ప్రకటించిన నేపథ్యంలో ఈసారి భాజపాకు తిరుగుండదన్న అభిప్రాయం కూడా రాష్ట్ర నాయకత్వంలో వుంది. రాష్ట్రంలోని మిథిలా ప్రాం తంలో మఖనా పంటను అధికంగా సాగుచేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర బడ్జెట్లో ఈ మఖ నా బోర్డు ఏర్పాటు చేస్తున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ బడ్జెట్ ప్రవేశ పెట్టిన సందర్భంగా ప్రకటించారు. అంతేకాదు పశ్చిమ కోశి కాల్వ ప్రాజెక్టు, నేషనల్ ఇన్స్టిట్యూ ట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ, పాట్నాలోని ఐఐటీ విస్తరణ వంటి వరాలను కూడా ప్రకటించడం గమనార్హం.
ఈనెల 24న ప్రధాని పర్యటన
ఫిబ్రవరి 24న ప్రధాని నరేంద్రమోదీ భాగల్పూర్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా 18వ విడత ‘పి.ఎం. కిసాన్ సమ్మాన్ నిధి’ని దేశవ్యాప్తంగా రైతులకు వారివారి ఖాతాల్లో జమచేయనున్నారు. బిహార్కు చెందిన 83లక్షల మంది రైతులకు ఈ నిధులు అందుతాయి. ప్రధాని నరేంద్రమోదీ ఈ పంపిణీ కార్యక్రమాన్ని బిహార్లో చేపట్టడం, రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే నన్న సంగతి స్పష్టమవుతోంది. ఇదే సమయంలో లబ్దిదారులో ప్రధాని వర్చువల్గా ముచ్చటిస్తా రు. అంతేకాకుండా రాష్ట్రంలో రూ.15వేల కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు ఆయన శంకు స్థాపన చేయనున్నారు. ప్రస్తుతం నితీష్కుమార్ నేతృత్వంలోని జేడీయూకు చెందిన 12 మంది ఎంపీలు, కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతునిస్తున్నారు. రాష్ట్ర బీజేపీ వర్గాల్లో ఒంటరిగా పోటీచేయాలన్న ఉద్దేశమున్నప్పటికీ, తిరుగులేని నితిష్కుమార్ చరిష్మాముందు ఎవరూ నిలబడటం కష్టమన్న సంగతి వారికి బాగా తెలుసు. నితిష్ తర్వాత జేడీయూలో ఎవరనేదానికి ప్రస్తు తానికి సమాధానం దొరకడం కష్టం. ప్రస్తుతం ఆయన పేరుమీదనే పార్టీ మనుగడ సాగుతోంది.
పోస్టర్ రాజకీయం
ఇదిలావుండగా ఫిబ్రవరి 12న బిహార్ రాజధాని పాట్నాలో వెలిసిన ఒక పోస్టర్ అందరిని ఒక్క సారి ఆశ్చర్యంలో ముంచెత్తింది. దీన్ని కాంగ్రెస్ నాయకుడు రవికుమార్ గోల్డెన్ ఏర్పాటుచేశారు.నలంద జిల్లాలోని హర్నౌట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తాను పోటీ చేస్తున్నట్టు ఆయన ఈ పోస్టర్లో పేర్కొనడమే అందరినీ ఆకర్షించడానికి ప్రధాన కారణం. నిజానికి ఈ స్థానం గత 20ఏళ్ళుగా జె.డి(యు)కు కంచుకోటగా కొనసాగుతోంది. జె.డి(యు) అధినేత, ముఖ్యమంత్రి నితిష్కుమార్ ఈ స్థానంనుంచే గెలుపొందారు. 2005కు ముందు ఈ స్థానంలో సమతాపార్టీ బలంగా వుండేది. ఈ పార్టీని నెలకొల్పింది ఎవరో కాదు. నితిష్కుమార్, మాజీ రక్షణశాఖ మంత్రి జార్జ్ ఫెర్నాండెజ్తో కలిసి ఈ పార్టీని ఏర్పాటు చేశారు. ఇదిలావుండగా రవికుమార్ గోల్డెన్ స్వగ్రా మం కూడా ఇదే నియోజకవర్గంలో వుంది. ఈ గ్రామం పేరు కళ్యాణ్ బిఘా. హరినారాయణ్ సింగ్ అనే సీనియర్ జేడీ(యూ) నాయకుడు 2010 నుంచి ఈ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.2020లో హర్నౌట్ స్థానంనుంచి కాంగ్రెస్ తరపున టిక్కెట్ కోసం యత్నించిన రవికుమార్ గోల్డె న్ సక్సెస్ కాలేదు. ఈసారి తనకు పార్టీ టిక్కెట్ లభిస్తుందన్న ఆశ వున్నా, ఈ స్థానం లో నితిష్ కుమార్ తన కుమారుడు నిశాంత్కుమార్ను నిలబెడితే తన గెలుపు కష్టమన్న భయం కూడా ఆయన్ను వెన్నాడుతోంది. కాగా ఇదంతా టిక్కెట్ కోసం పోస్టర్ స్టంట్ అని భాజపా, జెడీ (యు)లు కొట్టిపారేస్తుండగా, కాంగ్రెస్ దీనిపై ఇప్పటివరకు ఏవిధమైన కామెంట్ చేయలేదు.
రాజకీయాలకు దూరంగా నిశాంత్
నిశాంత్ కుమార్ బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్ పూర్తిచేసారు. ఆయన రాజకీయాల్లోకి రావడానికి ఇంతవరకు ఉత్సాహం చూపడంలేదు. పుస్తకపఠం, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, భజనలు…ఇవీ ఆయన వ్యాపకం. నితిష్కుమార్కు నిబద్ధ రాజకీయవేత్తగా రాష్ట్రంలో పేరుంది. తన వారసులను తీసుకొచ్చేందుకే రాజకీయాలు నడపరన్న మంచిపేరును తెచ్చుకున్నారు. ఇదంతా ఒక ఎత్తయితే, ఇప్పటివరకు రాజకీయాలకు దూరంగా ఆధ్యాత్మిక జీవనానికి ప్రాధాన్యమిస్తున్న నిశాంత్ ఇక రాజకీయాల్లోకి అడుగుపెడతారన్న వార్తలు రాష్ట్రంలో జోరుగా సాగుతున్నాయి. ఇందుకూ కారణం లేకపోలేదు. 2015లో ఆర్జేడీ`జేడీయూ అలయన్స్ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు నితిష్కుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకార కార్యక్రమానికి నిశాంత్ హాజరయ్యాడు. ఇదే ఎన్నికల్లో ఆర్జేడీ అధినేత లల్లూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజస్వీ యాదవ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి రాజకీయ అరంగేట్రంచేశారు. సరిగ్గా ఏడాది తర్వాత రామ్విలాస్ పాశ్వాన్ తనయుడు చిరాగ్ పాశ్వాన్ జాముయ్ లోక్సభ స్థానంనుంచి గెలుపొంది పార్ల మెంట్లోకి అడుగుపెట్టారు. ఈవిధంగా బిహార్లో ముగ్గురు సోషలిస్ట్ నాయకులు (నితిష్కుమార్, లాలూప్రసాద్ యాదవ్, రాంవిలాస్ పాశ్వాన్) తమ కింది తరాలకు అధికారాన్ని బదలీ చేస్తా రన్నది స్పష్టమైంది. ముఖ్యంగా ప్రస్తుతం రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, అసెంబ్లీ వ్యవహారాల మంత్రి శ్రావణ్కుమార్ (ఈయన నితిష్కు సన్నిహితులు) ఇటీవల మాట్లాడుతూ నిశాంత్ త్వరలోనే రాజకీయ రంగ ప్రవేశం చేస్తారని వెల్లడిరచడం ఈ వాదనకు బలం చేకూరుస్తున్నది.
రెండోతరం నాయకుల కొరత
నితిష్కుమార్ నడిపిన అస్థిర రాజకీయాల నేపథ్యంలో అప్పటివరకు ‘సుశాసన్ బాబు’గా ప్రసిద్ధు డైన ఆయన్ను ‘‘పల్టు చాచా’’ బీహార్ ప్రజలు పిలవడం మొదలుపెట్టారు. ఈ పరిస్థితుల్లో నితిష్కుమార్ తన తర్వాత అధికారాన్ని అప్పగించడానికి రెండోతరం నాయకులను తయారు చేయలేదు. మరి ఇదే సమయంలో రామ్విలాస్ పాశ్వాన్ కేంద్రంలో, లలూప్రసాద్ యాదవ్ రాష్ట్రంలో సుస్థిరమైన రీతిలో రెండోతరానికి అధికారాన్ని అప్పగించగలిగారు. ఇదిలావుండగా 2024 లోక్సభ ఎన్నికలకు ముందు, నితిష్కుమార్ అప్పటిరకు కొనసాగాని ఇండీ కూటమి కాడి కిందపడేసి, ఎన్డీఏ కూటమిలో చేరిపోయారు. ఈ ఎన్నికలను 2025 అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్స్గా పరిగణించారు. ఈ లోక్సభ ఎన్నికల్లోనే నితిష్కు తొలిసారి రెండోతరం నాయకులు లేని లోటుఅర్థమైంది. ముఖ్యంగా ఆయన స్టార్ కాంపెయినర్లుగా అశోక్ చౌదరి, విజయ్ చౌదరి, రాజీవ్ రంజన్సింగ్, సంజయ్ రaాలపై ఆధారపడ్డారు. వీరు ప్రచారంలో పాల్గనడమే కాదు, జెడీ (యు)లో నిర్ణయాలు తీసుకోవడంలో కీలకపాత్ర పోషించారు. అంతకుముందు నితిష్ వారసుడి గా మనీష్వర్మ పేరు బాగా వినబడిరది. ఈయన నితిష్కు అత్యంత సన్నిహితుడిగా వ్యవహరిం చాడు. కానీ క్రమంగా ఈయన తెరమరుగు కావడంతో, మరి నితిష్ స్థానాన్ని భర్తీ చేసేదెవరన్న దనేది ప్రశ్నగానే మిగిలిపోయింది. ఇటువంటి పరిస్థితిలో పైన పేర్కొన్న నలుగురు నాయకులే ఇకముందు పార్టీ వ్యూహాలను రచించడంతోపాటు, భాజపాతో సీట్ల ఒప్పందాలను చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీ కూడా చాలా ఓపిగ్గా జేడీయూ పరిణామాలను పరిశీలిస్తోంది. నితిష్ రాజకీయాలనుంచి తప్పుకున్నతర్వాత నాయకత్వలోటు ఎట్లాగూ ఏర్పడుతుంది కాబట్టి ఏకం గా జేడీయూను, తమ పార్టీలో విలీనం చేసుకునేందుకు కమల నాథులు వ్యూహాలు పన్నుతున్నా రు.
జేడీయూకు నష్టం
నితిష్కుమార్ రాజకీయాలనుంచి తప్పుకుంటే జేడీయూకు చాలా నష్టం. ఎందుకంటే బిహార్లోని 75శాతం దళిత ఓటర్లు ఆయనవైపే వుంటారు. నితిష్ ఏపార్టీలో ఉన్నాడనేది వారు పట్టించుకోరు. ఆయన్ను తమ నాయకుడిగా వారు చిత్తశుద్ధితో అంగీకరించడం వల్లనే నితిష్ తిరుగులేని నేతగా బిహార్ రాజకీయాల్లో వెలుగొందుతున్నారు. కుర్మి`కుశవహ వర్గాల ఓట్లు చీలకుండా గంప గుత్తగా జేడీయూకు పడేలా నితిష్ చేయగలుగుతున్నారు. వయసు, ఆరోగ్య కారణాల నేపథ్యంలో, ఈ రెండు వర్గాల మధ్య ఎప్పటికప్పుడు వచ్చే చీలికను అరికట్టే సామర్థ్యం నితిష్లో సన్నగి ల్లుతోంది. ఈ నేపథ్యంలో పార్టీకి నితిష్ వంటి క్లీన్ ఇమేజ్ వున్న నాయకుడు అవసరం. ప్రస్తు తం నితిష్కు ఎంతటి క్లీన్ ఇమేజ్ వుందో తనయుడు నిశాంత్కు కూడా అంతే ఇమేజ్ వుంది. మేనరిజం, హావభావాలు, అభిప్రాయాలు కూడా ఇద్దరివీ ఒక్కలాగానే వున్నాయి. కానీ వచ్చిన సమస్యల్లా వంశపారంపర్య రాజకీయాలకు నితిష్ వ్యతిరేకం. ఈ విషయంలో రాంవిలాస్ పాశ్వాన్, లల్లూ ప్రసాద్ యాదవ్ను గతంలో తీవ్రంగా విమర్శించారు కూడా. 2024 ఎన్నికల ప్రచా రం సందర్భంగా లల్లూ ప్రసాద్ యాదవ్నుద్దేశించి ‘ఈయన పిల్లల్ని కన్నాడు కానీ రాష్ట్రానికి చేసిందేమీ లేదని’ ఎద్దేవా చేశారు.
రాజీపడతారా?
ఇప్పుడు తనవరకు వచ్చేసరికి పార్టీని నిలబెట్టాలంటే తనయుడు నిశాంత్కుమార్కు పగ్గాలు అ ప్పగించక తప్పదు. ఈ విషయంలో నితిష్ రాజీపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం నిశాంత్కుమార్కు 50 ఏళ్లు. ఒకవేళ ఆయన రాజకీయాల్లోకి వస్తే, అంత చదువుకున్నా బయట ఏమీ అవకాశాలు లేక, మరోదారి కానరాక రాజకీయాల్లోకి ప్రవేశించాడని ప్రత్యర్థులు ప్రచారం చేయకమానరు! ఈవిధంగా నితిష్కు రెండువైపులా సమస్యలు పీడిస్తున్నాయి. నిజానికి గత ఏడాది నవంబర్ నుంచే నిశాంత్ రాజకీయాల్లోకి వస్తారన్న చర్చ మొదలైంది. ముఖ్యంగా రాష్ట్రంలో నేరాల రేటు పెరగడం, నితిష్ అస్థిర మానసిక స్థితి ఇందుకు ప్రధాన కారణం. 2024 నవంబర్ 15వ తేదీన మొట్టమొదటిసారి తండ్రి తనయుడు ఒక పెళ్లి వేడుకలో దర్శనమిచ్చారు. నితిష్కుమార్ పర్సన ల్ సెక్యూరిటీ ఆఫీసర్ తనయుడి వివాహం హర్యానాలోని రివారి జిల్లా భుర్తాల్ గ్రామంలో జరిగింది. ఈ వేడుకకు తండ్రి తనయులు హాజరయ్యారు. అప్పటినుంచే నిశాంత్ రాజకీయ అరంగే ట్రంపై ఊహాగానాలు మొదలయ్యాయి. 2025, జనవరి 8న భక్తియార్పూర్లో స్వాతంత్య్ర స మరయోధులకు నివాళులర్పించే కార్యక్రమంలో మళ్లీ ఇద్దరూ పాల్గన్నారు. ఈ సమరయోధుల్లో నిశాంత్ తాత కవిరాజ్ రామ్లఖన్ సింగ్ వైద్య కూడా వున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయ రం గప్రవేశంపై అడిగిన ప్రశ్నలకు నిశాంత్ ‘‘మీరు మా నాన్నగారికి ఓటేయండి. మళ్లీ ఆయన్ను ముఖ్యమంత్రిని చేయండి’’ అనిమాత్రమే చెబుతున్నారు. మరోపక్క 2025 అసెంబ్లీ ఎన్నికల సీట్ల విషయంలో జేడీయూ, బీజేపీల మధ్య సుదీర్ఘ చర్చలు సాగుతుండటం గమనార్హం. ఇక మొత్తం మీద పార్టీ నాయకత్వం నిశాంత్కు బాధ్యతలు అప్పగించాలని కోరుతోంది. విచిత్రమేమంటే ఆర్జేడీ నాయకుడు తేజస్వీయాదవ్ కూడా నిశాంత్కు పార్టీ పగ్గాలు అప్పగించాలని కోరుతున్నారు. ఆర్జేడీ కూటమిలో ఉన్న కాంగ్రెస్ కూడా నిశాంత్ను రాజకీయాల్లోకి ఆహ్వానిస్తోంది. విచిత్రంగా భాజపా కూడా నిశాంత్ను రాజకీయాల్లోకి స్వాగతిస్తోంది.
ఎవరి స్వార్థం వారిది
ఆర్జేడీ, కాంగ్రెస్లు నిశాంత్ ఆగమనాన్ని స్వాగతిస్తున్నా దీనికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడంలేదు. ఎందుకంటే నిశాంత్ రాజకీయాల్లోకి వస్తే, సామాజిక న్యాయ సమర్థక ఓటుబ్యాంకు, నిరుపేద అగ్రవర్ణాల ఓట్లు వీటికి పడవు. బీజేపీ వ్యూహాలు వేరు. పార్టీకి బలమైన క్యాడర్ వుంది కానీ, సుస్థిరమైన నాయకుడు లేడు. ఆలోటును నిశాంత్ తీరుస్తాడు. బీజేపీకి కేవలం అగ్రవర్ణ పార్టీగానే పేరుంది. నితీష్కుమార్ పుణ్యమాని, దళితులు, ఇతర వెనుకబడిన వర్గాల ఓట్లు కూటమికి పడటం వల్ల అధికారంలోకి రాగలిగింది. ఇక జేడీయూ ప్రధాన లోపం సంస్థాగత నిర్మాణం, బలమైన క్యాడర్ లేకపోవడం. ఈ లోటును బీజేపీ తీరుస్తోంది. ఇప్పుడు నితిష్ రాజకీయాలనుంచి ని ష్క్రమణ తర్వాత జేడీయూను విలీనం చేసుకుంటే, నాయకత్వలోటును భర్తీచేసుకోవచ్చుననేది బీజేపీ వ్యూహం. అయితే ముందుజాగ్రత్త చర్యగా గత ఆర్నెల్లనుంచి ఉపముఖ్యమంత్రి పదవిలో వు న్న సామ్రాట్ చౌదరిని నాయకుడిగా వెలుగులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది! ఈ పరిస్థితుల్లో నిశాంత్ రాజకీయాల్లోకి వస్తే చౌదరికి ఇబ్బందికరం. ఆయనకు ఇదెంతమాత్రం ఆమోదయో గ్యం కాదు. కానీ ఓటుబ్యాంకు పరంగా చూస్తే సామ్రాట్ చౌదరికి కొయిరి`కుర్మి జాతి ప్రజల్లోనే ఓటుబ్యాంకు వుంది. అదే నిశాంత్కు తండ్రి వారసత్వంగా కొయిరి`కుర్మితో పాటు దళితుల్లో మంచి పలుకుబడి వుంది. అందువల్ల నిశాంత్ రాజకీయాల్లోకి వస్తే భాజపా, సామ్రాట్ను నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టేయగలదు. ఇందుకు బీజేపీకి కొన్ని అనుకూలాంశాలున్నాయి. మొదటిది నిశాంత్ మతపరమైన విశ్వాసాలు కలిగిన వ్యక్తి, అతని సిద్ధాంతాలు, బీజేపీకి అనుకూలంగా వుంటాయి. అందువల్ల ఆర్జేడీ విలీనమైతే నిశాంతే ముఖ్యమంత్రి అవుతాడు. ఒకవేళ నిశాంత్కు పాలనానుభవం లేదనుకుంటే, సా మ్రాట్ చౌదరిని ముఖ్యమంత్రిని చేసి, నిశాంత్ను ఉపముఖ్యమంత్రిగా చేయవచ్చు. ఆవిధంగా అతనికి అనుభవం వచ్చేవరకు వేచివుండి, ఈలోగా జేడీయూను వదలడానికి ఇష్టపడని వారిని కూడా క్రమంగా తమవైపు తిప్పుకోవచ్చు. ఇది బీజేపీ ప్రణాళిక.
భాజపాలో ఎల్జేపీ(ఆర్వీ) విలీనం తథ్యమా?
చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని ఎల్జేపీ (ఆర్వీ) కూడా భాజపాలో విలీనమవుతుందనేది బిహార్ రాజకీయాల్లో మరో కీలక ప్రచారం. చిరాగ్ పాశ్వాన్కు ముఖ్యమంత్రి పదవిపై మోజుండటమే ఇందుకు కారణం. ఇప్పటికే ఆయన తన ఉద్దేశాన్ని భాజపా పెద్దలకు చెప్పారని వార్తలు వచ్చాయి. ఈ పార్టీకి పాసీ తెగల్లో మంచి పలుకుబడి వుంది. ప్రస్తుతం ఇతర దళిత తెగల్లోకి కూడాతన పలుకుబడిని విస్తరించడానికి ఎల్జేపీ(ఆర్వీ) ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. ఇదే సమయంలో హిందూస్థానీ అవామీ మోర్చా (హెచ్ఏఎం) పార్టీ అధినేత జితన్రామ్ మంరీa కూడా తన పార్టీ బలాన్ని విస్తరించాలన్న యోచనలో వున్నారు. ప్రస్తుతం ఈ పార్టీకి ముసాహర్ కులం ప్రజల్లో గట్టి పట్టుంది. ఇదికూడా ఎన్డీఏలో భాగస్వామిగానే వుంది. ఈ నాయకులనుంచి ఎదురయ్యే అడ్డంకులు ప్రధానమైనవి కావు. నిశాంత్ రాజకీయాల్లోకి రావడం ఎన్డీఏ కూటమికి చాలా అవసరం. ఎందుకంటే నితిష్ లోపాన్ని నిశాంత్ మాత్రమే భర్తీ చేయగలడు!
-మళ్ళీ పార్టీ అధికారంలోకి రావాలన్న సోయి లేకుండా పోతుందా?
హైదరాబాద్,నేటిధాత్రి:
ఎవరు ఔనన్నా, ఎవరు కాదన్నా తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అత్యంత బలవంతమైన నాయకుడు, పాలకుడు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి. ఇందులో ఎవరికీ సందేహాలు అవసరం లేదు. ఆశ్యర్యం అసలే అక్కర్లేదు. నాయకులు ప్రజల్లో నుంచి పుడతారు అనడానికి ప్రత్యక్ష సాక్ష్యం సిఎం. రేవంత్రెడ్డి. అంచెలంచెలులగా ఒక్కొ మెట్టు, ఎక్కుతూ, రాజకీయాలను తన చేతుల్లోకి ప్రజల మెప్పు పొందుతూ వచ్చారు. మొత్తం తెలంగాణ రాజకీయాలను తనవైపు తిప్పుకొని తిరుగులేని నేతగా ఎదిగారు. ప్రజా సేవలో, నాయకుడిగా ఎదుగుదలలో ఎవరి ప్రమేయం లేదు. ఎవరి ప్రోద్భలం లేదు. ఎవరి వెన్నుదన్ను అసలే లేదు. స్వయం ప్రకాశిత శక్తిగా రేవంత్ రెడ్డి ఎదిగారు. ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీలో అలాంటి నాయకుడు ఏ ఒక్కరూ లేరు. అంతే కాదు తెలంగాణ ఇతర రాజకీయ పార్టీలలో అసలే లేరు. ఆయన ఏ పార్టీ నీడన రాజకీయాలు నేర్చుకోలేదు. ఆయన నాయకుడిగా ఎదిగిన తర్వాతే తెలుగుదేశంలో చేరారు. అంతకు ముందు ఆయన మొదటిసారి పోటీతోనే జడ్పీటీసి అయ్యారు. తర్వాత మళ్లీ వెంటనే ఎమ్మెల్సీ అయ్యారు. ఆ పదవి కూడా ఇండిపెండెంటుగా గెలిచారు. తన రాజకీయ చతురతను చూపించారు. చిన్న వయసులోనే రాజకీయ చాణక్యం ప్రదర్శించారు. అప్పుడు ఆయన ఒక రాజకీయ పార్టీని ఎంచుకున్నారు. అలా ఒక్కోమెట్టు ఎక్కుతూ, చిన్న వయసులోనే రాష్ట్ర స్దాయి నాయకుడయ్యారు. తెలుగుదేశం పార్టీలో సీనియర్లందరికీ కొరకరాని కొయ్యగా ఎదిగారు. ఆయన ఎదుగుదలను చూసి ఓర్వలేనితనం ప్రదర్శించిన నాయకులు కూడా వున్నారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశం ఉనికి ప్రశ్నార్ధం కావడంతో కాంగ్రెస్లో చేరారు. చేరుతూనే వర్కింగ్ ప్రెసిండెట్ అయ్యారు. ఆ వెంటనే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంటు అయ్యారు. అలా మూడు సంవత్సరాలలో పార్టీకి పునర్వైభవం తెచ్చారు. కాంగ్రెస్ పార్టీని అదికారంలోకి తీసుకురావడానికి అష్టకష్టాలు పడ్డారు. అనేక కేసులను కేసులను ఎదుర్కొన్నారు. అనేక సార్లు జైలు జీవితం ఎదుర్కొన్నారు. నిర్భందాలు ఎదుర్కొన్నారు. అడుగడుగునా అవమానాలు ఎదుర్కొన్నారు. ఇక్కడ మరో విషయమేమింటే సహజంగా ఏ నాయకుడికైనా ప్రత్యర్ధి రాజకీయ పార్టీల నుంచి సవాళ్లను ఎదుర్కొంటారు. కాని రేవంత్ రెడ్డి స్వపక్షం నుంచి, ప్రత్యర్ధి పార్టీల నుంచి కూడా ఎదుర్కొన్నారు. వాళ్లందరూ చూస్తుండగానే ముఖ్యమంత్రి అయ్యారు. అందుకు ఆయన చేసిన కృషి అంతా ఇంతా కాదు. ఇటు సొంత పార్టీ నేతలను భుజ్జగించుకుంటూ, వారు చేస్తున్న అమానాలను ఎదుర్కొంటూ ముందుకు సాగారు. ఎలాంటి సమస్యలనైనా చిరునవ్వుతో స్వాతతించుకుంటూ వెళ్లారు. అంతే కాని ఎక్కడా బ్యాలెన్స్ తప్పలేదు. పార్టీని నిలబెట్టడంతో ఎక్కడా వెనుకంజ వేయలేదు. ధీరుడిగా ముందుకు సాగారు. పదేళ్ల తర్వాత పార్టీని అధికారంలో తెచ్చారు. అందుకే పార్టీ అధిష్టానం రేవంత్ రెడ్డి నాయక్వాన్ని మెచ్చి, నచ్చి ముఖ్యమంత్రిని చేసింది. ఇదీ రేవంత్ రెడ్డి ట్రాక్ రికార్డు. ఇలాంటి రికార్డు వున్న నాయకుడు ఎవరూ కాంగ్రెస్ పార్టీలో లేరు. పదేళ్ల కాలంలో కనీసం పార్టీ మా వల్ల బలపడిరదని చెప్పుకోగలిగిన నాయకుడు మరొకరు లేరు. పాలతో నిండిన కుండలో నీళ్లదంరూపోస్తారు. నా పాలతోనే కుండ నిండిరదని చెప్పుకుంటారు. కాని ముందు చిక్కని పాలు ఎవరు పోశారన్నది తెలియకుండా వుండదు. అలాగే కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఎవరు పార్టీని సమర్ధవంతంగా నడిపి అదికారంలోకి తెచ్చారన్నది తెలియదా? ప్రతిపక్షంలో వున్నన్నప్పుడు పార్టీని బలోపేతం చేసి అధికారంలోకి తెస్తానని చెప్పిన నాయకుడు లేదు. అంతగా పార్టీ కోసం కొట్లాడిన నాయకుడు ఎవరూ లేరు. కాకపోతే సీనియర్లమని కొందరు, మాకు పిసిసి. అవకాశమివ్వాలని కొందరు కోరుకున్నారు. కాని వాళ్లలో ఏ ఒక్కరు నాకు పిపిసి ఇస్తే పార్టీని అధికారంలోకి తెస్తానని అధిష్టానానికి భరోసా కల్పించలేదు. అధిష్టానం నమ్మకాన్ని చూరగొనలేదు. ఎందుకంటే పుట్టింటి గొప్పదనం మేనమామకే చెబితే ఎలా వుంటుంది. అందుకే పాత తరం నాయకులకు పక్కన పెట్టి, రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పగ్గాలు అప్పగించింది. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చి రేవంత్ రెడ్డి చూపించారు. అయితే ఈ మధ్య ప్రభుత్వంలో లుకలుకలు అంటూ పెద్ద పదవి కోసం పోటీ పడుతున్న నాయకులు కొందరు లేనిపోనివి ప్రచారంలోకి వచ్చేలా చేస్తున్నారని కూడా తెలుస్తోంది. లేని వివాదాలు ముసురుకునేలా చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిని మార్చినట్లు కొంత మంది పనిగట్టుకొని ప్రచారం సాగిస్తున్నారు. కాని అది నిజం కాదు. సిఎం. రేవంత్ రెడ్డిని కట్టడి చేయడానికి ఇన్చార్జిని మార్చినట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం అసలేలేదు. దీపాదాస్ మున్షీఇంత కాలం తెలంగాణకు అడిషినల్ ఇన్చార్జిగా వున్నారు. ఆమె కేరళ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి. కాంగ్రెస్ పార్టీ ఇటీవల తెలంగాణతోపాటు, చాలా రాష్ట్రాలకు కొత్త ఇన్చార్జిలను ప్రకటించింది. అందులో భాగంగానే కొత్త ఇన్చార్జిని తెలంగాణకు పంపించారు. ఈ విషయాన్ని చిలువలు పలువలు చేస్తూ, కొంత ప్రచారం సాగిస్తున్నారు. కూర్చున్నచెట్టునే నరుక్కునేందుకు సిద్దపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వుంటే ఆ నాయకులకు ఏదో ఒక పదవి వస్తుంది. కాని ఆ సత్యం మర్చిపోతున్నారు. లేనిపోని రాజకీయాలు చేయాలనుకుంటున్నారు. ఆ అంతర్గత ప్రజాస్వామ్యమే కాంగ్రెస్ కొంప ముంచుతుంది. కాంగ్రెస్ పార్టీని ఎవరూ ఓడిరచాల్సిన పనిలేదు. అసమ్మతి వాదులు నలుగురుంటే చాలు చెల్లాచెదురౌతుందని ఎప్పటి నుంచో నానుడి వుంది. దాన్ని మళ్లీ నిజం చేస్తారా? అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే అసంతృప్తి రాజేస్తారా? పార్టీలో గాని, ప్రభుత్వంతో గాని ఏదైనా సమస్యలుంటే చర్చించుకునే వేదికలున్నాయి. మంత్రుల తో ఇబ్బందులుంటే చెప్పుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వున్నారు. పార్టీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ వున్నారు. ఇంకా చెప్పుకోవాలంటే పార్టీ అధిష్టానంవుంది. అక్కడ చెప్పుకోవాల్సిన విషయాలను మీడియా కంటపడేలా? ప్రజలు తెలిసేలా, ప్రతిపక్షాలకు ఆయుధం అందేలా సమాలోచనలు చేయాల్సిన అవసరం లేదు. పదేళ్లుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఓవైపు మేమే కొట్లాడి తెలంగాణ తెచ్చామని బిఆర్ఎస్ పదే పదే చెప్పుకుంటుంది. కాంగ్రెస్ మెడలు వంచి తెలంగాణ సాధించామని ఒకటికి పదిసార్లు చెప్పుకుంటుంది. మేం లేకపోతే తెలంగాణ వచ్చేదే కాదని బిజేపి అంటుంది. వాళ్లకు ధీటైన సమాదానం చెప్పడానికి మాత్రం ఏ కాంగ్రెస్ నాయకుడికి నోరు రాదు. మాటలు రావు. కాని మాకు అన్యాయం జరిగిందని చెప్పడానికి మాత్రం అన్నీ వస్తాయి. తెలంగాణ వచ్చిన తర్వాత ఈ పదేళ్లలో మేమే తెలంగాణ ఇచ్చామని చెప్పుకునే అవకాశం దొరకలేదు. చెప్పుకోవడానికి నోరు రాలేదు. 2014 ఎన్నికల తర్వాత స్దానిక సంస్దల ఎన్నికల్లోనూ చెప్పుకోలేకపోయారు. 2019 ఎన్నికల్లో మళ్లీ ఘోరంగా ఓడిపోయారు. ఆ తర్వాత కూడా చెప్పుకునేందుకు ముందుకు రాలేకపోయారు. కాని ప్రజలు గ్రహించారు. తెలంగాణ ఇచ్చిన పార్టీకి ఒక్కసారి అవకాశమిద్దామని కనికరించారు. ముఖ్యంగా తెలంగాణ గ్రామీణ సమజామంతా ఏకమైన కాంగ్రెస్ పార్టీని గెలిపించింది. అందుకు అందరూ కృషి చేశారు. ఏ ఒక్కరిదీ తక్కువ భాగస్వామ్యమేమీ లేదు. పై స్దాయిలో వున్న నాయకులకే అసంతృప్తి వుంటే కింది స్ధాయిలో జెండా మోసిన సామాన్య కార్యకర్తల కష్టం ఎవరు తీర్చాలి. వారికి పదువులు ఎవరు ఇవ్వాలి. పదేళ్ల పాటు పార్టీకి అండగా నిలిచి, జెండాలు మోసి భుజాలు కాయలు కాసిన కార్యకర్తలు ఎవరికి చెప్పుకోవాలి. ఆస్ధులు అమ్ముకొని పార్టీని నమ్ముకొని పని చేసిన వాళ్ల గోడు ఎవరికి వినిపించాలి. ఎమ్మెల్యే స్ధాయి నేతలకేనా అసంతృప్తి వుండేది? నిజానికి ఎమ్మెల్యేలు ఎంతో సంతోషపడాలి. లక్షలాది మంది వున్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల్లో ఎమ్మెల్యేలు అయ్యే అవకాశం కొద్ది మందికే దక్కింది. ఎమ్మెల్యేలు అయిన వారు మంత్రి పదవి కావాలని కోరుకోవడంలో తప్పు లేదు. కాని అన్యాయం జరిగిందన్న కారణంతో పార్టీపై నెపం నెట్టేసి, అన్యాయం జరిగిందని వీధులకెక్కితే పార్టీ పరువు పోతుంది. ఇప్పటికే ప్రతిపక్షాలు కాచుకొని కూర్చున్నాయి. ఏడాది కాలంలో అజ్ఞాతంలోవున్న కేసిఆర్ కూడా వైఫల్యాలను ఎండగట్టాలని చూస్తున్నారు. బిజేపి ఈసారి గెలవాలని కాచుకొని కూర్చున్నది. మరో పదేళ్లయినా ప్రతిపక్షాలకు అవకాశమివ్వకుండా రాజకీయాలు చేయాల్సిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడే అసంతృప్తి జ్వాలలు రగిలించడం సరైందికాదు. పార్టీకి ఏ రకంగా మేలు జరగదు.
`రెండు సంవత్సరాల క్రితమే విఆర్ఎస్ తీసుకున్న మహేందర్ రెడ్డి
`రాజీనామా చేసినా ఉద్యోగ సంఘంలో నాయకుడు చెలామణి
Vanga mahender reddy
`అటు రియలెస్టేట్ వ్యాపారం.. ఇటు రాజకీయం
`సులువుగా ఎమ్మెల్సీ కావాలనే దొడ్డి దారి రాజకీయం
`మొత్తానికి టిచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి వంగ గెలవాలన్న తాపత్రయం
`అడ్డదారిలో ఆధిపత్య కుటిల ప్రయత్నం
`పిఆర్టియు అభ్యర్థి వంగా మహేందర్ రెడ్డి అసత్యాలు ప్రచారం
`అన్నను అడ్డం పెట్టుకొని గెలిచేందుకు పన్నాగం
`అబద్దాలు ప్రచారం చేస్తూ గెలిచేందుకు విచిత్ర విన్యాసం
`పిఆర్టియు యూనియన్ విస్తుపోతున్న సందర్భం
`అన్న సహకారంతో జరుగుతున్న మంత్రాంగం
`డిఈఓలు, ఎంఈఓలతో ఒత్తిడి రాజకీయాలు
`ఎలాగైనా మహేందర్ రెడ్డి గెలవాలని డిఈఓలు, ఎంఈవోలు ఆర్డర్లు
`సైలెంట్గా సాగుతున్న మహేందర్ రెడ్డి ప్రచారం
`చాపకింద నీరులా సాగిస్తున్న రాజకీయం
హైదరాబాద్,నేటిధాత్రి:
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా సాధారణ రాజకీయాలను మించిపోయాయి. ఉద్యోగ సంఘాలు కూడా టిక్కెట్లు అమ్ముకునే స్ధాయికి ఎదిగిపోయాయి. ఇది ఎవరో కాదు సాక్ష్యాత్తు ఓ టీచర్ ఎమ్మెల్సీ చేస్తున్న ప్రధాన ఆరోపణ. ఒక సామాన్యమైన ఉపాద్యాయుడు కోట్లు పెట్టి టిచర్ ఎమ్మెల్సీ టికెట్ కొనుక్కునే పరిస్దితి వుంటుందా? అప్పులు చేసినా సాధ్యమౌతుందా? కాని టిక్కెట్ల పంపిణీలో కోట్ల రూపాయలు చేతులు మారినట్లు కూడా స్వయంగా ఆ టీచర్ ఎమ్మెల్సీ మీడియా ముఖంగా చెబుతున్నాడంటే రాజకీయాలు ఎంత ఖరైదైపోతున్నాయో అర్ధం చేసుకోవచ్చు. ఒక సగటు ఉపాధ్యాయుడు కరీంనగర్ టీచర్స్ ఎమ్మెల్సీ టికెట్ కోట్లు పెట్టి ఎలా కొనుగోలు చేశాడు. దాని వెనుకు వున్న నిగూఢమైన రహస్యమేటి? రోజూ స్కూలుకు వెళ్లి పిల్లలకు పాఠాలు చెప్పే ఉపాధ్యాయుడు కోట్ల రూపాయలు సంపాదించడం సాద్యమా? అంటే కొన్ని సార్లు సాధ్యమే..కాని అసలైన ఉపాధ్యాయుడు కాదు…ఉపాధ్యాయ కొలువును అడ్డం పెట్టుకొని రియల్ వ్యాపారాలు సాగించి, ఫైనాన్స్ వ్యవహారాలు నిర్వహించే వారికి మాత్రమే సాధ్యం. అలా కరీంనగర్ ఉపాద్యాయ ఎమ్మెల్సీని పేరు పొందిన ఉపాద్యాయ సంఘం నుంచి వంగ మహేందర్ రెడ్డి ఎలా కొనుగోలు చేసి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు. ఈ ఎమ్మెల్సీ అభ్యర్ధి స్వయాన అన్న వంగ రవీందర్ రెడ్డి. ఆయన తెలంగాణ రెవిన్యూ అసోసియేషన్ రాష్ట్ర అద్యక్షుడు. ఈ వ్యవహారమంతా ఆయనే దగ్గరుండి నడిపిస్తున్నాడని అంటున్నారు. అందులో భాగంగా రవీందర్ రెడ్డి నాలుగు ఉమ్మడి జిల్లాలైన కరీంనగర్, మెదక్, నిజాబామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన డిఈవోలు, ఏంఈవోలపై పెద్దఎత్తున ఒత్తిడి తెస్తున్నారని సమాచారం. తన తమ్ముడు వంగ మహేందర్ రెడ్డి గెలుపుకోసం అందరూ సహకరించాలని ఆయన ఆర్డర్లు వేస్తున్నట్లు చెబుతున్నారు. డీఈవోలు, ఎంఈవోలపై ఒత్తిడి తెచ్చి, ఉపాద్యాయులకు వారితో ఫోన్లు చేయిస్తున్నట్లు కూడా చెప్పుకుంటున్నారు. ఈ విషయంపై భారతీయ జనతాపార్టీ ఏకంగా ఎన్నికల కమీషన్కు ఉత్తరంకూడ రాశారు. వంగా రవీందర్ రెడ్డి తన తమ్ముడు వంగా మహేందర్ రెడ్డి గెలుపుకోసం ఉపాద్యాయులు మీద తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నట్లు ఎన్నికల కమీషన్కు వివరించారు. ఇక అసలు విషయానికి వస్తే వంగా మహేందర్రెడ్డి ఉపాద్యాయ కొలువులో చేరినప్పటినుంచి పిఆర్టీయూ యూనియన్లో క్రియాశీలకంగా పనిచేయడం మొదలు పెట్టారు. అప్పటికే తన అన్న రవీందర్రెడ్డి కూడా ఆయన కొలువు చేస్తున్న శాఖలో నాయకత్వం ఎలా చేస్తున్నాడో చూసిన మహేందర్ రెడ్డి కొలువులో చేరిన కొద్ది రోజులకే నాయకుడయ్యారు. చదవు చెప్పడం గాలికి వదిలేశాడు. రేపటి తరాన్ని తీర్చిదిద్దాల్సిన మహేందర్ రెడ్డి యూనియన్ రాజకీయాలు మొదలు పెట్టారు. చదువు చెప్పాల్సిన అవసరం లేకుండా చేసుకున్నాడు.
అలా అంచెలంచెలుగా యూనియన్లో ఎదుగుతూ వచ్చారు. 2004 తర్వాత తెలంగాణలో వచ్చిన రియల్ బూమ్ను ఆసరా చేసుకున్నాడు. అటు ఉపాధ్యాయ వృత్తిని కొనసాగిస్తూనే రియల్ వ్యాపారం మొదలు పెట్టారు. రియల్ వ్యాపారాన్ని కూడా టీచర్లతోనే మొదలు పెట్టి, వ్యాపారాన్ని పెంచుకున్నాడు. అలా కొలువును గాలికి వదిలేసి వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు. ఇక ఇదిలా వుంటే పేద ప్రజలకు చదువు చెప్పాల్సిన కొలువులో వుంటూ, వారి జీవితాల్లో వెలుగులు నింపాల్సిన బాధ్యత విస్మరించారు. సిద్దిపేటలో కార్పోరేట్ స్కూల్ ఏర్పాటు చేశాడు. ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు తాను కొలువు చేసే చోట విద్యా కుసుమాలను వికసింపచేయాల్సిందిపోయి, తన ప్రైవేటు స్కూల్లో చదువు పేరుతో దోపిడీ మొదలు పెట్టాడు. అటు రియల్ వ్యాపారం, ఇటు ప్రైవేటు కార్పోరేట్స్కూలు, మహేందర్రెడ్డికి మరో సోదరుడి పేరు మీద కొన్ని కళాశాలలో పార్టనర్ షిప్లో పూర్తిగా విద్యా వ్యాపారం మొదలు పెట్టారు. అన్న రెవిన్యూ అసోసియేషన్ అధ్యక్షుడుగా వుండడం, ఎక్కడెక్కడ ప్రభుత్వ స్థలున్నాయో గుర్తించడం, వాటిని తమకు అనుకూలంగా మల్చుకోవడం, అక్కడ రియల్ వ్యాపారం చేయడం మొదలు పెట్టారు. అయితే తమ వ్యాపారాలపై ఎవరి కన్ను పడకుండా ఓ స్వచ్ఛంద సంస్ధను ఏర్పాటు చేశారు. ఈ సంస్ధనిర్వహణకు మరో వైపు పెద్దఎత్తున విరాళాలు సేకరించడం అలవాటు చేసుకున్నారు. కొన్ని సంవత్సరాలుగా ఆ సంస్థ నిర్వహణ కోసం అటు నిధులసేకరణను తోడు చేసుకొని రాజకీయాల్లోకి వచ్చేందుకు మార్గం వేసుకున్నాడు. కొన్ని స్కూళ్లలో వాటర్ ప్లాంటులుఏర్పాటుచేసి విద్యా వ్యవస్ధకు మేలు చేస్తున్నట్లు చెప్పుకుంటున్నాడు. రెండు సంవత్సరాల క్రితం తన ఉద్యోగానికి వాలెంటరీ రిటైర్ మెంటుతీసుకొని ఇక ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు వ్యూహాలు మొదలు పెట్టారు. ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత కూడా వంగ మహేందర్ రెడ్డి ఎలా ఉపాద్యాయ సంఘం నాయకుడుగా వుంటారు. ఎలా ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి అర్హుడౌతాడు. కేవలం ఎన్నికల కోసం కొద్ది రోజుల ముందు రాజీనామా చేశారంటే అదీ కాదు. రెండు సంవత్సరాల క్రితమే రాజీనామా చేశారు. అయితే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోతే ఆ కొలువును అలాగా వదిలేస్తారా? అంటే అదీ వుండదు. అదృష్టం వుండి గెలిస్తే ఎమ్మెల్సీ అవుతారు. లేకుంటే ప్రభుత్వ పెద్దలను ప్రసన్నం చేసుకొని మళ్లీ ఉపాద్యాయ కొలువులో చేరుతారు. ఇలాంటి జిత్తుల మారి రాజకీయాలు చాలా మంది చేస్తున్నారు. అందులో వంగా మహేందర్ రెడ్డి ఒకరు. తక్కువ సమయంలో, తక్కువ ఖర్చులో ఎమ్మెల్సీ కావాలనుకునే కొంత మంది ఈ దారిని ఎంచుకున్నారు. అటు అన్న రెవిన్యూ అసోసియేషన్ ద్వారా తన పలుకుబడిని ఉయోగిస్తున్నాడు. రవీందర్ రెడ్డిపై కూడా పెద్దఎత్తున ఆరోపణలున్నాయి. తన ఉద్యోగాన్ని అడ్డం పెట్టుకొని కొన్ని వేల కోట్లు సంపాదించారనే అపవాదు వుండనేవుంది. సంపాదించిన ఆస్ధులను కాపాడుకోవాంటే తన తమ్ముడు ప్రజా ప్రతినిధి కావడం ఒక్కటే మార్గం అనుకున్నారు. ఇలా సులువైన మార్గంలో ఎమ్మెల్సీ కావడం రవీందర్రెడ్డికి దారి లేదు. తిమ్మిని బమ్మిని చేసి రికార్డులు మార్చి, ఆక్రమణదారులకు సహకరించి, సంపాదించిన సొమ్ముతో తమ్ముడితో రియల్ వ్యాపారం రవీందర్ రెడ్డి సంపాదించారు. అలా అన్నదమ్ములంతారూ అక్రమంగా సంపాదించిన సొమ్మును కాపాడుకోవాలంటే టీచర్స్ ఎమ్మెల్సీ ఒక్కటే మార్గమని ఎంచుకున్నారు. ఇది టీచర్స్ యూనియన్లోని సభ్యులే చెబుతున్నమాట.
ఓ ఎమ్మెల్సీ మీడియా సమావేశంలో పూసగుచ్చినట్టు చెప్పిన ముచ్చట. ఒక నిబద్దత గలిగిన గురువు విద్యార్టులకు విద్యతోపాటు విద్యా వ్యవస్ధలో రావాల్సిన నూతన ఆవిష్కరణల గురించి మాట్లాడతారు. ప్రభుత్వ విద్యా వ్యవస్ధ మేలు కోసం పనిచేస్తాడు. అలాంటి ఉపాధ్యాయులను ఎమ్మెల్సీలు చేయడానికి సంఘాలకు కూడా చేతులు రావడం లేదు. టిక్కెట్లు అమ్ముకునే యూనియన్లు వుంటే మహేందర్ రెడ్డి లాంటి టీచర్లే ఎమ్మెల్సీ కావాలని కలలు గంటారు. ముఖ్యంగా ఈ దారి ఎంతో సులువైంది. తాను ఉపాద్యాయుడై రేపటి తరానికి దారి చూపుతాననుకునే ఏ ఉపాద్యాయుడు తన వృత్తికి ద్రోహం చేయడు. కాని ఉపాద్యాయ కొలువు పొంది, రాజకీయాలను లక్ష్యంగా చేసుకునే కొంతమంది ఇలా ప్రభుత్వాలను మోసం చేస్తుంటారు. పదవులు అడ్డం పెట్టుకొని కొలువులు చేయకుండా రాజకీయాలు చేస్తుంటారు. లేనిపోని హమీలు ఎంతో చైతన్యవంతులైన ఉపాద్యాయులకే చెబుతుంటారు. సాటి ఉపాద్యాయులను కూడా మోసం చేస్తుంటారు. పాత పెన్షన్ విధానం తీసుకురావడం అసలు సాధ్యమా? ప్రభుత్వాలతోనే సాధ్యం కాని ఆ విదానం టీచర్ ఎమ్మెల్సీలతో సాధ్యమౌతుందా? దేశ వ్యాప్తంగా అమలౌతున్న కొత్త విధానంలో మార్పు చేయడానికి కేంద్ర ఒప్పుకుంటుందా? అది అమలు రాష్ట్ర ప్రభుత్వానికి సాధ్యపడుతుందా? కేంద్రం అంగీకరించకుండా జరుగుతుందా? విద్య అనేది రాష్ట్ర స్ధాయిలో వుండే అంశం కాదు. ఉమ్మడి అంశం. కేంద్రం జోక్యం లేకుండా ఎలాంటి నిర్ణయాల అమలు సాధ్యంకాదు. కాని తమ రాజకీయ భవిష్యత్తు కోసం, ఎన్నికల్లో గెలవడం కోసం ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడై వుండి, యూనియన్ సభ్యులను మోసం చేసేవారిని ఎలా ఎన్నుకుంటారో కూడా టీచర్లే ఆలోచించుకోవాలి.
ఈ ‘ఉచిత’ సంస్కృతి మానకపోతే రాష్ట్రాలు నిండా మునగడం ఖాయం
అయోగ్య ‘ఉచితాల’నుంచి ప్రభుత్వాలు బయటపడాలి
ఉచితాలు కావాలని ప్రజలు కోరడంలేదు
అలవాటు చేసి తలకు రోకలి చుట్టుకుంటున్న పార్టీలు
పరాన్న భక్కులను తయారుచేస్తున్న ఉచితాలు
అధికారం మత్తులో పట్టించుకోని పార్టీలు
పార్టీల నిర్వాకానికి అప్పుల ఊబిలో రాష్ట్రాలు
హైదరామాద్,నేటిధాత్రి: ఎన్నికలముందు రాజకీయ పార్టీలు విచ్చలవిడిగా ప్రకటిస్తున్న ‘ఉచిత’ హామీలు ప్రజలను సోమరిపోతుల్లాగా, పరాన్నభుక్తులుగా మారేలా చేస్తున్నాయంటూ బుధవారం సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు అక్షరసత్యం. ఈ అనుచిత ఉచితాలతో ప్రజలు ఇక పనిపై దృష్టిపెట్టరు. ఇది దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని చెప్పడం రాజకీయ పార్టీలకు ఒక హెచ్చరిక వంటిదే. ఈ ఉచితాల వల్ల మనుషులు పనిచేయడానికి ఇష్టపడరు. ముఖ్యంగా ఉచిత రేషన్లు, పనిచేయకుండానే డబ్బులు చేతిలో పడుతుండటంతో ఎవరు పనిచేయడానికి ఇష్టపడతారు? ఈవిధంగా దేశంలో ‘పరాన్నభుక్తుల’ వర్గాన్ని మనం చేజేతులారా తయారుచేస్తున్నామని కోర్టు వ్యా ఖ్యానించింది. నిజానికి ప్రభుత్వాలు అమలు చేస్తున్న చాలా సంక్షేమ పథకాలకు సంబంధించిన నిధులను నిరుపేదల ఖాతాల్లోకి నేరుగా జమచేస్తున్నారు. అర్హులకు ఇది అందితే ఫర్వాలేదు. కానీ అనర్హుల ఖాతాల్లోకి కూడా ఇవి వెళితే వారిక పనిచేయడం మానేస్తారు. ఆవిధంగా పనిచేసే సామర్థ్యమున్నవారి విషయంలో ఇది ఎంత మాత్రం శ్రేయస్కర ఫలితాలనివ్వదు. ఎన్నికల్లో గెలవడానికి రాజకీయపార్టీలకు ఆయా పథకాలు ఉపకరిస్తాయేమో కాని, ప్రభుత్వ ఆర్థికవ్యవస్థతో పాటు శ్రామిక మార్కెట్లు దారుణంగా దెబ్బతింటాయన్న సంగతిని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నా రు. అన్నీ ఉచితంగా లభిస్తున్నప్పుడు ఎవ్వరూ పనికెళ్లరు. ప్రధానంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై దీని ప్రతికూల ప్రభావం ఎక్కువ. ఉచితరేషన్ను చాలా రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. ఫలితంగా చాలా గ్రామాల్లో వ్యవసాయ సీజన్లో శ్రామికులు దొరకని పరిస్థితి! అన్నీ ఉచితంగా లభిస్తుంటేపనికెళ్లేవారెవరు? పొట్ట నింపుకోవడానికే పనికెళ్లడం! ఇంటివద్దే పొట్ట నిండుతుంటే పనినెవరు పట్టించుకుంటారు? సుప్రీంకోర్టు తాజా వ్యాఖ్యల నేపథ్యంలో, రాజకీయ పార్టీలు ఇచ్చే ఎన్నికల వాగ్దానాలపై మరోసారి చర్చ మొదలైంది. ఈవిధంగా ఎన్నికల ముందు ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే రీతిలో హామీలివ్వడం, నగదు ప్రోత్సాహకాల పంపిణీ వంటివి ఎన్నికల చట్టాల పరిధి లో నేరంగా పరిగణించే విషయంలో సుప్రీంకోర్టు మరింత కఠినంగా వ్యవహరించాలి. ఈ నేప థ్యంలో, ఇటువంటి హామీలు ఎన్నికల చట్టాల ఉల్లంఘనకిందికి రాదని 2013లో తానిచ్చిన తీ ర్పును సరిదిద్దే అవకాశం వుంది. అయితే ఇటువంటి అంశాలపై న్యాయవ్యవస్థ కల్పించుకోవడంఎంతవరకు సమంజసం? వీటికి సంబంధించి తగిన ఆదేశాలు జారీచేయవచ్చా? లేక ఇటువంటి విధానాలను నియంత్రించేందుకు ఒక ప్రత్యేక ‘బాడీ’ని ఏర్పాటు చేయాలా? అనే అంశాలపై విచారణ 2022నుంచి సుప్రీకోర్టు వద్ద పెండిరగ్లో వుంది. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. అందరికీ నిత్యావసరాలను అందుబాటు ధరల్లో అందించేఉద్దేశంతో కొన్ని వస్తువులపై సబ్సిడీలు ప్రకటించడంలో తప్పులేదు. కానీ ఇప్పుడు రాజకీయ పార్టీలు సబ్సిడీ స్థాయిని దాటి ఉచితాల దశకు చేరుకున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే సబ్సిడీకి,ఉచితాలకు మధ్య ఉన్న విభజనరేఖను రాజకీయ పార్టీలు చెరిపేశాయనే చెప్పాలి. ఇందుకు కారణం రాజకీయపార్టీల మధ్య వుండే నిర్లక్ష్యపూరిత పోటీ! ఈ ఉచితాల ప్రభావంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక పరిశోధనా పత్రాన్ని విడుదల చే సింది. దీని ప్రకారం వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు తాము రాయితీ ఇవ్వాలనుకుంటున్న వాటిల్లో కొ న్నింటిని ఉచితంగా ప్రజలకు అందించడానికి ముందుకొస్తున్నాయి. అయితే ఈ ఉచితాలకు ఒక స్పష్టమైన నిర్వచనం లేదు. ప్రజలకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించేవి అయితే అటువంటి సబ్సి డీలవల్ల ఇబ్బంది వుండదు. ఉదాహరణకు ప్రజాపంపిణీ వ్యవస్థ, ఉపాధి హామీ పథకాలు, విద్య, ఆరోగ్య అంశాలకు ప్రభుత్వ మద్దతు వంటివి సామాజిక ప్రయోజనానికి, ప్రజల ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తాయి. కానీ ఉచిత విద్యుత్, ఉచితంగా మంచినీటి సరఫరా, ఉచిత రవాణా సదు పాయం, పెండిరగ్లో వున్న రుణాలను రద్దు చేయడం వంటివి ‘ఉచితాలు’గా చెప్పవచ్చు. ఇవి రుణాలు తీసుకునే సంస్కృతినే దారుణంగా దెబ్బతీస్తాయి. ఎట్లా అంటే ఒక వ్యక్తి తన స్థాయికి తగిన రుణాన్ని తీసుకొని తిరిగి చెల్లించడానికి ప్రయత్నిస్తాడు. అదే ప్రభుత్వమే ఆ చెల్లింపు జరిపితే రుణాలు తీసుకోవడంలో ప్రజలు బాధ్యతారాహిత్యాన్ని ప్రదర్శిస్తారు. ఇక క్రాస్`సబ్సిడైజేషన్ ( అంటే ఒక వర్గానికి ప్రయోజనం కలిగించేందుకు మరో వర్గంవారిపై ఎక్కువ ధరలు విధించడం) ప్రైవేటు పెట్టుబడులపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. ఇక వర్తమాన ధరల ప్రకారం ఎటువంటి ప్రోత్సాహకాలు లేని పనివల్ల, శ్రామికుల భాగస్వామ్యం దారుణంగా పడిపోతుందని ఈ పరిశోధనా పత్రం వెల్లడిరచింది. కొన్ని రకాల ఉచిత పథకాలు తక్కువ లీకేజ్లతో నిజమైన లబ్దిదారులకు ప్రయోజనం కలిగించవచ్చు. అయితే ఇందుకు వెచ్చిస్తున్న పెద్దమొత్తం నిధులవల్ల కలుగుతున్న ప్రయోజనాలను కచ్చి తంగా అంచనా వేయాలి. లేకపోతే ఈ ఉచితాలవల్ల ధరల్లో వచ్చే వికృత మార్పులు, ప్రజల్లో పని సామర్థ్యాన్ని తీవ్రంగా దెబ్బతీయడమే కాదు వనరుల దుర్వినియోగం కూడా సాధ్యం. ఉచిత విద్యుత్, ఉచిత నీటి సరఫరా వల్ల ఒకపక్క పర్యావరణం దెబ్బతింటే మరోపక్క విచ్చలవిడి నీటి వినియోగం వల్ల నీటితావులు ఎండిపోయే ప్రమాదముంది. ఉదాహరణకు గతంలో హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ను అమలు చేస్తామని ప్రకటించింది. ఇది అప్పట్లో పార్టీ అధికారంలోకి రావడానికి దోహదం చేసినా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా దెబ్బతినడమే కాదు, నెలవారీ జీతాలు కూడా చెల్లించలేని దుస్థితికి చేరుకుంది. ఇటువంటి పరిస్థితిలో అభివృద్ధి మాట ఎత్తడం సాధ్యమా? విచిత్రంగా మరికొన్ని రాష్ట్రాలు కూడా ఈ పథకాన్ని అమలు పరచడానికి ఆసక్తి చూపాయి. ఈ నేపథ్యంలో ‘‘స్టేట్ ఫైనాన్సెస్: ఎ స్టడీ ఆఫ్ బడ్జెట్ 2023`24’ పేరిట రిజర్వ్ బ్యాంకు విడుదల చేసిన నివేదికలో, ఈ పథకాన్ని అమలు చేయడం రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులకు ఆత్మహత్యా సదృశం వంటిదని పేర్కొంది. దీని అమ లు రాష్ట్రాల అభివృద్ధిని పరిమితం చేస్తుందని కూడా హెచ్చరించింది. ప్రస్తుతం అమల్లో వున్న జాతీయ పింఛను పథకం (ఎన్పీఎస్) స్థానంలో గతంలో రద్దుచేసిన ఓల్డ్ పింఛను విధానాన్ని అమల్లోకి తెస్తే ఎన్పీఎస్ కింద చెల్లించే మొత్తం కంటే 4.5శాతం అధిక మొత్తాన్ని ప్రభుత్వాలు ఖర్చు చేయాల్సి వుంటుంది. 2060 నాటికి దేశ జీడీపీలో ఈ చెల్లింపులు వార్షికంగా 0.9%కు చేరుకుంటాయని కూడా పేర్కొంది. పంజాబ్, కర్ణాటక రాష్ట్రాలు కూడా అలవిమాలిన ఉచితాలు ప్రకటించి ఇప్పుడు నానా ఇబ్బందులు పడుతున్నాయి. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ వంటి విపక్ష పార్టీలు విద్యుత్ సబ్సిడీపై హామీలు గుప్పిస్తున్నాయి. పరి శీలిస్తే వివిధ రాష్ట్రాలు కొన్ని యూనిట్ల వరకు విద్యుత్ సబ్సిడీని అమలు చేస్తున్నాయి. ఈ సబ్సిడీల చెల్లింపుకు తమ ఆదాయంలో 8 నుంచి 9శాతం వరకు ఖర్చుచేయాల్సి వస్తుండటంతో ఆయా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి ఇబ్బందులకు గురవుతోంది. ఇటువంటి అయోగ్య సబ్సిడీలు ఆయా రాష్ట్రాల పెట్టుబడి వ్యయాలకు పెద్ద అడ్డంకిగా మారాయని ఆర్.బి.ఐ. నివేదిక స్పష్టం చేసింది. ఫాలే ఇండియా ఫౌండేషన్ విడుదల చేసిన నివేదిక కూడా ఉచిత విద్యుత్ వల్ల ఆర్థికంగా రాష్ట్రాలకు అనర్థదాయకమని స్పష్టం చేసింది. పంజాబ్ వంటి తీవ్ర ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న రాష్ట్రాలు ఈ సబ్సిడీని పూర్తిగా ఎత్తివేయడమే ఉచితమని కూడా సూచించింది. కేవలం అధికారమే పరమావధిగా, నిర్లక్ష్య పూరిత వైఖరితో పార్టీలు అనుసరిస్తున్న ఈ ఉచితాల సంస్కృతివల్ల ప్రధానంగా నష్టపోయేది పన్ను చెల్లింపుదార్లు. తామిచ్చిన ఉచితహామీలను అమలు చేయడానికి అవసరమైన నిధులను కేవలం పన్నుల విధింపు ద్వారానే ప్రజల జేబులకు చిల్లులు పెట్టి ప్రభుత్వాలు వసూలు చేస్తున్నాయి. అభివృద్ధికి పెద్దమొత్తంలో పెట్టుబడి వ్యయం అవసరం. కానీ వచ్చిన ఆదాయంలో సింహభాంగా ఈ ఉచితాలకే పోతుంటే, ఇక అభివృద్ధి మాటెక్కడ? పన్నుల పెంపుకూడా ఒక స్థాయి వరకే చేపట్టగలవు. ఆ స్థితిలో రాష్ట్ర ప్రభుత్వాలు అప్పులు చే యక తప్పడంలేదు. ఒక్కసారి అప్పు తీసుకోవడం మొదలైతే ఆ ఊబినుంచి బయటపడటం ఎవ్వరి వల్లా కాదు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో సహా పలు రాష్ట్రాలు అప్పుల ఊబిలో పీకల్లోతు కూరుకుపోయాయంటే ప్రధాన కారణం ఈ అనుచిత ఉచితాలే! నిర్లక్ష్య రాజకీయ పార్టీలు, ఆలోచన లేని ఓటర్లు ఈ ఉచితాల మాయలో పడి అభివృద్ధిని పట్టించుకోకపోవడం వర్తమాన విషాదం!
ప్రతిష్ట బాధ్యతలు స్వీకరించిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ అధినేత శ్రీశ్రీ రవిశంకర్
ప్రత్యేక అయస్కాంత లక్షణాన్ని కోల్పోని శివలింగం
అప్పట్లో భూమిపై రెండడుగుల ఎత్తులో శివలింగం వుండేది
శివలింగాన్ని ధ్వంసం చేసిన ఘజనీ
కొన్ని అవశేళాలను భద్రపరచిన అగ్నిహోత్రీయ బ్రాహ్మణులు
వెయ్యేళ్ల తర్వాత వెలుగులోకి
హైదరాబాద్,నేటిధాత్రి: దాదాపు వెయ్యేళ్ల క్రితం ఇస్లామిక్ చొరబాటు దారుడు మహమ్మద్ ఘజనీ ధ్వంసం చేసిన పవిత్రసోమనాథ జ్యోతిర్లింగాన్ని పునరుద్ధరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఘజనీ ధ్వంసం చేసిన నిజ శివలింగ భగ్నశకలాలను ప్రస్తుత సోమనాథ దేవాలయంలో ప్రతిష్టించడం ద్వారా ఈ జ్యోతిర్లిం గాన్ని పునరుద్ధరించనున్నారు. స్వాతంత్య్రానంతరం ఈ దేవాలయాన్ని ఉపప్రధాని సర్దార్ వల్ల భాయ్పటేల్, ప్రథమ రాష్ట్రపతి బాబూ రాజేంద్ర ప్రసాద్ నేతృత్వంలో అరేబియా సముద్రతీరంలోనిర్మించారు. నాడు మహమ్మద్ ఘజనీ ధ్వంసం చేసినట్టు చెబుతున్న ఆలయ ప్రదేశానికి స మీపంలోనే ఈ నూతన సోమనాథ దేవాలయం వుంది. ఇదిలావుండగా అప్పట్లో ఘజనీ దండ యాత్ర సందర్భంగా, జ్యోతిర్లింగ ఆలయాన్ని పూర్తిగా ధ్వంసం చేయడమే కాదు, అక్కడి శివలింగాన్ని ముక్కలుగా పగులగొట్టి, అప్పటికీ కసి తీరక, అందులో ఒక ముక్కను నేటి ఆఫ్ఘనిస్తాన్లోని జామా మసీదుకు మెట్టుగా ఉపయోగించాడని చారిత్రక కథనం. అయితే ఆ భగ్న శివలింగానికి చెందిన కొన్ని భాగాలను అప్పటి అగ్నిహోత్రిక బ్రాహ్మణులు తమ ఇళ్లల్లో భద్రపరచినట్టు తెలుస్తోంది. అయితే ఇన్ని వేల సంవత్సరాలు గడిచినా ఈ విషయం ఎవరికీ తెలియదు. ఆవిధం గా భద్రపరచిన భగ్నావశేషాలను ఇప్పుడు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీశ్రీ రవిశంకర్ నేతృత్వంలో సోమనాధ ఆలయంలో ప్రతిష్టించడానికి యత్నాలు జరుగుతున్నాయి. మనదేశంలోని పవిత్ర ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో సోమనాథ క్షేత్రం ఒకటి. జ్యోతిర్లింగ స్తోత్రంలో మొట్టమొదట ప్రస్తావించేది కూడా ఈ సోమనాధ క్షేత్రాన్నే! వెయ్యేళ్ల క్రితం మనదేశంలో ఇ స్లామిక్ చొరబాటుదార్ల దాడులు విపరీతంగా జరిగాయి. ఈ దాడులకు ప్రధానంగా గురవడమే కాదు పూర్తిగా ధ్వంసమైన క్షేత్రం కూడా ఈ సోమనాథ క్షేత్రమే! ఆలయాల్లో బంగారం, ఇతర విలువైన ఆభరణాలు,రత్నాలు వుంటాయన్న సంగతి తెలుసుకున్న ఈ ఇస్లామిక్ చొరబాటుదార్లు ఆలయాలే లక్ష్యంగా దారుణ విధ్వంసానికి పాల్పడేవారు. అడ్డువచ్చిన హిందువులను దారుణంగా వధించి ఆలయాల్లో నిక్షిప్తమైన నిధులను దోచుకుపోయేవారు. ఇందులో భాగంగానే క్రీ.శ. 1024లో మహమ్మద్ ఘజనీ సోమనాథ క్షేత్రంపై భయంకరమైన దాడికి దిగాడు. అతని ముఖ్య లక్ష్యం ఆలయంలో నిక్షిప్తమైన అపారమైన ధనరాశులను కొల్లగొట్టుకుపోవడమే! అతని దాడినుంచి ఆలయాన్ని రక్షించడానికి హిందువులు ప్రాణాలకు తెగించి అడ్డుకున్నారు. కానీ ఘజనీ నిర్ద యగా 50వేల మంది హిందువులను ఊచకోతకోసి మరీ ఆలయాన్ని లూటీ చేశాడు. అప్పట్లో శివలింగం కింద కూడా నిధులు దాచిపెడతారన్న ప్రచారం వుండేది. ఇందుకోసం అతను శివలింగాన్ని ముక్కలుగా పగులగొట్టాడు. ఆ ముక్కల్లో కొన్నింటిని నేటి ఆఫ్ఘనిస్తాన్లోని ఘజ్నావీలో ని ర్మించిన జామా మసీదుకు మెట్లుగా ఉపయోగించినట్లు చెబుతారు. మధ్యయుగాల చరిత్రలో ముస్లిం రాజులు జరిపిన విధ్వంసానికి విషాదపు గుర్తుగా మిగిలిన వాటిల్లో ప్రధానంగా చెప్పుకోవలసింది సోమనాథ క్షేత్రమే! ఘజనీ దండయాత్ర సమయంలో ఇక్కడి పాలకుడు మొదటి చాళుక్య భీముడు. ఘజనీని ఎదిరించలేక పారిపోయి కంఠ్కోటలో ఆశ్రయం పొందుతాడు. మహమ్మద్ ఘజనీ ప్రధాన లక్ష్యం లూటీ మాత్రమే! రాజ్యస్థాపన కాదు! దీంతో అతగాడు వెళ్లిపోయిన తర్వాత చాళుక్య భీముడు తిరిగి వచ్చి రాజ్య పాలన చేపట్టినప్పటికీ, ధ్వంసమైన ఆలయాన్ని పునర్నిర్మించలేకపోతాడు. ఫలితంగాచాలాకాలం వరకు సోమనాథ ఆలయం శిథిలావస్థలోనే కొనసాగింది. తర్వాత రాజ్యాధికారాన్ని చేపట్టిన చాళుక్య రాజు కుమారపాల ఆలయ పునర్నిర్మాణానికి ఉపక్రమిస్తాడు. ఆయన ఆల యాన్ని అద్భుతమైన రీతిలో రత్నాలు తాపడం చేసిన రాతితో నిర్మించినట్టు క్రీ.శ.1169 నాటి శాసనం ద్వారా తెలుస్తోంది. మహమ్మద్ ఘజనీ ధ్వంసం చేసిన తర్వాత ఆలయం దాదాపు వందేళ్ల పాటు శిథిలావస్థలోనే కొనసాగిందనేది ఈ శాసనం ద్వారా తెలుస్తోంది. కుమారపాలుడు అంత కష్టపడి ఆలయం నిర్మించినప్పటికీ, తర్వాతి కాలంలో దీనిపై దాడులు ఆగలేదు. క్రీ.శ. 1299లో అల్లావుద్దీన్ ఖిల్జీ, క్రీ.శ.1395లో ముజాఫర్ షా, క్రీ.శ.1665లో ఔరంగజేబ్లు ఈ ఆలయాన్ని ధ్వంసం చేశారు. విచిత్రమేమంటే దాడికి గురైన ప్రతిసారి ప్రజలు అత్యంత భక్తి ప్రపత్తులతో సోమనాథ ఆలయా న్ని పునర్నిర్మిస్తూ రావడం విశేషం. అయితే ఘజనీ దండయాత్ర తర్వాత ఆలయాన్ని ఘనమైన రీతిలో పునరుద్ధరించిన ఘనత కుమారపాలుడికే దక్కుతుంది. ఇన్ని విధ్వంసాలకు గురైనా శతాబ్దాల ఆధ్యాత్మిక, సాంస్కృతికకు ప్రతీకగా నిలిచిన ఈ దివ్యక్షేత్రం తన గుర్తింపును ఎప్పటికప్పుడు నిలుపుకుంటూ వస్తోంది. అయితే ఇంతటి చరిత్రలో చాలామందికి తెలియని విషయం ఒకటుంది. నాడు ఘజనీ ధ్వంసం చేసిన సోమనాథ శివలింగ భగ్నశకలాల్లో చాలా వాటిని అప్పటి హిందూ పండితులు రహస్యంగా తీసుకెళ్లి తమ ఇళ్లలో వుంచి భక్తి ప్రపత్తులతో పూజిస్తూ వస్తున్నారు. ఈ రహస్యం దాదాపు వెయ్యేళ్లుగా ఎవ్వరికీ తెలియకుండా, ఆయా కుంటుంబాల వారు, తమ కింది తరాలవారికి ఈ శివలింగ శకలాలను అప్పగిస్తూ వచ్చారు. దాదాపు వెయ్యేళ్ల తర్వాత ఆ పవిత్ర శకలాలు వెలుగులోకి రావడం విశేషం. ఇన్ని సంవత్సరాలుగా ఈ పవిత్ర శివలింగ భగ్న శకలాలను భద్రపరుస్తూ వచ్చింది, అగ్నిహోత్రీయ బ్రాహ్మణులు. ఈ శకలాలను భక్తిప్రపత్తులతో ఇన్ని తరాలుగా పూజిస్తూ వస్తున్నారు. ఆవి ధంగా ఈ భగ్నశకలాలను భద్రపరచిన వారిలో సీతారామ శాస్త్రి ఒకరు. ఆయన అగ్నిహోత్రీ య బ్రాహ్మణ పండితుడు. ఇటీవల ఆయన ఈ భగ్నావశేషాలను ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీశ్రీ రవి శంకర్కు అప్పగించారు. గత 21 ఏళ్లుగా ఈ అవశేషాలు శాస్త్రి సంరక్షణలో కొనసాగుతున్నాయి. ఇవి తన మామగారి వద్దనుంచి ఈయనకు అందాయి. ఆయన దాదాపు 60ఏళ్ల పాటు వీటికి భక్తిశ్రద్ధలతో పూజాదికాలు నిర్వహించారు. ప్రవీంద్ర సరస్వతిజీ అనే గురువు ఆయనకు ఈభగ్నశకలాలను అప్పగించారు. నిజానికి 1924లో అప్పటి కంచికోటి పీఠాధిపతి పరమాచార్య వద్దకు ఈ భగ్నశకలాలను తీసుకెళ్లిన అగ్నిహోత్రి పండిత కుటుంబీకులు, వీటిని ఏం చేయాలంటూ ఆయన్ను ప్రార్థించారు. అ ప్పుడు ఆయన ఈ భగ్నశకలాల పవిత్రతను గుర్తించి, మరో వెయ్యి సంవత్సరాల వరకు వీటిని భద్రపరచండి. అప్పుడు సోమనాథ దేవాలయంలో వీటి ప్రతిష్ట జరుగుతుందని సెలవివ్వడంతో ఆ పండిత కుటుంబం వాటిని తమ ఇంటిలో భద్రంగా వుంచి పూజాదికాలు నిర్వహిస్తూ వచ్చా రు. తర్వాత సీతారామ శాస్త్రి మళ్లీ ఈ భగ్నశకలాలను కంచికోటి పరమాచార్య జగద్గురు శ్రీ జయేంద్రసరస్వతిశంకరాచార్య స్వాముల వారికి చూపించి పరిష్కారం కోరగా, అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తయిన తర్వాతనే వీటి ప్రతిష్ట జరుగుతుందని సెలవిచ్చారు. ఇది జరగక ముందే పరమాచార్య శివైక్యం చెందారు. దీంతో సీతారామశాస్త్రి వీటి భవితవ్యంపై మళ్లీ అయోమయంలో పడ్డారు. తర్వాత ప్రస్తుత శంకరాచార్య సలహామేరకు ఆయన శ్రీశ్రీ రవిశంకర్ను కలిసి పరిస్థితి వివరించడంతో, వీటిని సోమనాథ దేవా లయంలో ప్రతిష్టించడానికి హామీ ఇచ్చారు. దీంతో అమితానందం పొందిన శాస్త్రి, ‘నిజంగా నా జీవితం ధన్యమైంది. ఎట్టకేలకు ఈ భగ్నావశేషాలను సోమనాథ దేవాలయంలో ప్రతిష్టించాలన్న పెద్దల ఆకాంక్ష నెరవేరింది’ అన్నారు. ఇప్పుడు సోమనాథ దివ్యక్షేత్రానికి చెందిన శివలింగ భగ్నావశేషాలను సోమనాథ దేవాలయంలో పున్ణప్రతిష్టించే బాధ్యతను ఆర్ట్ ఆఫ్ లివింగ్ అధినేత శ్రీశ్రీ రవిశంకర్ స్వీకరించారు. వీటి ప్రశ స్త్యాన్ని వివరిస్తూ, ఇవి ఇప్పటికీ తమ అయస్కాంత శక్తిని ప్రదర్శిస్తూనే వున్నాయని, వీటి పవిత్రత లేశమాత్రం కూడా నష్టం కాలేదన్నారు. నిజానికి ఇది భారత చరిత్రలోని ఒక భాగాన్ని పున రుద్ధచించడం కాదు. భారతీయ ఆధ్యాత్మిక, నాగరికతలోని చైతన్య పునరుద్ధరణగా భావించాలి. పురాతన గ్రంథాల ప్రకారం నిజమైన సోమనాథ శివలింగం మూడడుగుల ఎత్తుండేది. భూమిపై రెండడుగులు పైకిలేచి గాల్లో తేలియాడుతుండేది. అంటే భూమ్యాకర్షణ శక్తి దీనిపై పనిచేసేది కాదు. అప్పట్లో సోమనాథ దేవాలయం సంపదకు ప్రసిద్ధి. బంగారం, రత్నాల తాపడాలతో నిర్మి తమై ఆధ్యాత్మిక శోభను వెదజల్లేది. 1024లో ఘజనీ కేవలం దేవాలయంపై దాడికి మాత్రమే పాల్పడలేదు. హిందువుల సాంస్కృతిక, ఆధ్యాత్మిక గుర్తింపును ధ్వంసం చేయడానికి యత్నించా డు. ఈ దాడిలో గాల్లో తేలియాడే శివలింగాన్ని ముక్కలు చేయడమే కాదు, వేలాదిమంది హిందవులను ఊచకోత కోసి, ఆలయంలోని అపార సంపదను దోచుకెళ్లాడు. ఎన్నిసార్లు పునరుద్ధరించినా వరుస దాడులకు గురవుతూ రావడం ఈ ఆలయ చరిత్ర! చివరకు 19వ శతాబ్దం వరకు ఇది శిథిలావస్థలోనే కొనసాగింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1951లోనాటి ఉపప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో నేటి కొత్త దేవాలయం రూపుదిద్దుకుంది.
స్వీయ తప్పిదాలతో మరింత దిగజారుతున్న కాంగ్రెస్ పలుకుబడి
ఏడాదిలో పుంజుకున్న బీజేపీ
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీకి మెజారిటీ ఖాయం
ఎన్డీఏ కూటమి సీట్లు 353కు పెరిగే అవకాశం
ఇండీ కూటమి 188కే పరిమితవవచ్చన్న సర్వే
99 నుంచి 78కి పడిపోనున్న కాంగ్రెస్ బలం
తమిళనాడులో బీజేపీ ఇంకా ఖాతా తెరవలేకపోవచ్చు
డీఎంకేదే హవా
ఒరిస్సాలో నవీన్ పట్నాయక్కే ప్రజల మద్దతు
ఉత్తరప్రదేశ్లో పుంజుకోనున్న ఎన్డీఏ
బిహార్లో కూటమిదే అధికారం
తేల్చిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే
హైదరాబాద్,నేటిధాత్రి:
ఎన్నికల్లో ప్రజల మూడ్ ఏవిధంగా వుంటుందనేది ఆ సమయానికి చోటుచేసుకున్న పరిణామాలు, స్థానిక, జాతీయ సమస్యలపై ఆధారపడివుంటుంది. అది కూడా ఒక్కో రాష్ట్రంలోని పరిస్థితులు కూడా ఎన్నికలను ప్రభావితం చేస్తాయి. అందువల్ల దేశం మొత్తంమీద ప్రజల్లో ఒకేరకమైన మూడ్ వుంటుందని చెప్పడానికి వీల్లేదు. ప్రధానంగా ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అవి స్థానిక సమస్యలు, భావోద్వేగాలను రెచ్చగొట్టి అధికారాన్ని హస్తగతం చేసుకునే వ్యూహాల ను అనుసరిస్తాయి. జాతీయ ఎన్నికల్లో తామే కింగ్మేకర్గా వుండి, కేంద్రంలో అధికారంలో ఉ న్న ప్రభుత్వాన్ని తమ కనుసన్నల్లో వుంచుకోవాలన్న దృక్పథం కూడా వాటికి వుంటుంది. ఇవి సంకీర్ణ ప్రభుత్వాలకు దారితీసి కేంద్ర ప్రభుత్వం బలహీనంగా మారిన సంవత్సరాలు కూడా మనం చూశాం. దేశ స్వాతంత్య్రం వచ్చినదగ్గరినుంచి ఛరిష్మా వున్న నాయకులపై ఆధారపడి రాజకీయ పార్టీల మనుగడ సాగిందనేది సుస్పష్టం. నెహ్రూ, ఇందిరాగాంధీలు ఏకఛత్రాధిపత్యంగా కాంగ్రెస్ను అధికారంలో నిలిపారు. వారి తర్వాత కేంద్రంలో అంతటి ఛరిష్మా వున్న నాయకులులేకపోవడంతో ఇతర పార్టీల మద్దతో ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయి. కానీ కలగూరగంప లాంటి పార్టీల సహకారం నేపథ్యంలో మన విదేశాంగ విధానం, రక్షణ, ఆర్థిక తదితర కీలక అంశాల పై ఆయా ప్రభుత్వాలు తగిన నిర్ణయాలు తీసుకోలేకపోయేవి. ఒకరకంగా చెప్పాలంటే సంకీర్ణ శకం మనదేశాన్ని తిరోగమనంలోకి తీసుకెళ్లిందనే చెప్పాలి. ఇక 2014 నుంచి నరేంద్రమోదీ దేశ ప్రధాని అయ్యాక, ఆయన తన ఛరిష్మాతో మాత్రమే కాదు, పటిష్టమైన విదేశాంగ, ఆర్థిక, రక్షణ విధానాలతో దేశాన్ని అంతర్జాతీయ యువనికపై ఒక కీలకస్థానంలో నిలిపారనడంలో ఎంతమాత్రం సందేహంలేదు. విచిత్రమేమంటే గత పదేళ్లుగా అధికారంలో వున్నప్పటికీ ఆయన ఛరి ష్మా ఎక్కడా తగ్గకపోవడం గమనార్హం. అంతర్జాతీయంగా అత్యంత శక్తివంతమైన నాయకుల్లో ఒకరుగా పేరు సంపాదించుకున్నారు. భిన్న ధృవాలైన రష్యా`అమెరికాలను సమతుల్య రీతిలో ని ర్వహించగల సామర్థ్యం ఆయన నేతృత్వంలోని టీమ్కే సాధ్యమైంది. నేడు సమస్యా పరిష్కారకర్త దేశంగా అంతర్జాతీయంగా భారత్ తన పేరు ప్రఖ్యాతులను సుస్థిరం చేసుకుంది. ఈ నేపథ్యంలో 2024 లోక్సభ ఎన్నికల్లో సొంతంగా మెజారిటీ స్థానాలు గెలుచుకోకపోయినా, కూటమి పరంగా మెజారిటీ సాధించి అధికారంలో వున్న ఎన్డీఏపై ప్రజల అభిప్రాయం తెలుసుకునేందుకు ఇంఇయాటుడే`సీఓటర్ ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ పేరుతో సర్వే నిర్వహించింది. ఈ సర్వే ఫలితాలు ఒకింత ఆశ్చర్యం, ఆసక్తి కలిగించే రీతిలో వుండటం విశేషం.
సర్వసాధారణంగా అధికారంలో ఉన్న ప్రభుత్వంపై ఐదేళ్ల పాలనాకాలం తర్వాత ప్రజల్లో ప్రభుత్వవ్యతిరేకత వ్యక్తం కావడం సహజం. కేంద్రంలో ఎన్డీఏ కూటమి వరుసగా మూడోసారి అధికారంలో కొనసాగుతోంది. ప్రస్తుతం లోక్సభలో ఎన్డీఏ కూటమి బలం 293. ఇందులో భారతీయ జనతాపార్టీవి 240 స్థానాలు. 2014 సాధారణ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 38.5% ఓట్లతో అధికారాన్ని కైవసం చేసుకుంది. అప్పటివరకు అంటే 2004`2014 వరకు పాలించిన యు.పి.ఎ. కూటమి ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయింది. దేశ ప్రధానిగా నరేంద్రమోదీ మొట్టమొదటి సారి ప్రమాణస్వీకారం చేశారు. తర్వాత 2019 ఎన్నికల్లో 45.43% ఓట్లతో 353 స్థానాల్లో గెలిచిన ఎన్డీఏ తిరిగి అధికారంలోకి వచ్చింది. రెండోసారి నరేంద్రమోదీ ప్రధాని అయ్యారు. ఇక 2024 ఎన్నికల్లో 400 సీట్లు సాధించాలన్న లక్ష్యంతో ప్రచారం సాగించినప్పటికీ కూటమి 293 స్థానాలకే పరిమితం కా వాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఏడాది కాలం ఎన్డీఏ కూటమి పాలనపై ప్రజాభిప్రాయం, ఓట్ల రూపంలో మారితే ఎన్ని స్థానాలు గెలుచుకోగలదన్న అంశంపై ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ పేరుతో ఇండియా టుడే`సీ ఓటర్ నిర్వహించిన తాజా సర్వేలో ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. ఒకరకంగా చెప్పాలంటే ఏడాది క్రితం అధికారంలోకి వచ్చినప్పటికీ అంతకుముందు ఎన్నికలతో పోలిస్తే సంతృప్తికరమైన పనితీరు ప్రదర్శించని ఎన్డీఏ ఇప్పటికిప్పు డు ఎన్నికలు జరిగితే 353 స్థానాల్లో తిరుగులేని విజయం సాధిస్తుందని ఈ సర్వే తేల్చింది. ఇందులో బీజేపీ సొంతంగా 280కి పైగా స్థానాలను కైవసం చేసుకొని సాధారణ మెజారిటీ సాధి స్తుందని కూడా పేర్కొంది. ఇక లోక్సభలో 243గా ఉన్న ఇండీ కూటమి బలం ఏకంగా 188కి పడిపోతుందని కూడా స్పష్టం చేసింది. ఈ ఏడాది జనవరి 2 నుంచి ఫిబ్రవరి 9వరకు దేశం లోని అన్ని లోక్సభ నియోజకవర్గాల్లో ఈ సర్వేను నిర్వహించారు.
ప్రస్తుతం ఎన్డీఏ కూటమిలో 39 రాజకీయ పార్టీలు భాగస్వాములుగా వుండగా వీటిల్లో బీజేపీ, నేషనలిస్ట్ పీపుల్స్ పార్టీలు మాత్రమే జాతీయ పార్టీలుగా ఎన్నికల కమిషన్ చేత గుర్తింపు పొందా యి. మిగిలినవన్నీ ప్రాంతీయపార్టీలే. ఎన్నికలు జరిగితే భారతీయ జనతాపార్టీ 281 స్థానాల్లో విజయం సాధిస్తుందని సర్వే పేర్కొంది. అంటే ప్రస్తుతం వున్న 240 స్థానాలతో పోలిస్తే మరో 41స్థానాలను కైవసం చేసుకోగలుగుతుంది. ఏడాది కాలంలో బీజేపీ తిరిగి పుంజుకుందన్నది స్పష్టమవుతోంది. ఇక కాంగ్రెస్ ప్రస్తుత బలం 99 నుంచి 78కి పడిపోతుంది. వ్యక్తిగతంగా భాజపా ఓట్ల శాతం గతంతో పోలిస్తే మూడు శాతం పెరిగి 41%కు పెరుగుతుంది. ఇక కాంగ్రెస్ ఓట్ల షేరు 20శాతానికి పడిపోవడం గమనార్హం.
మొత్తంమీద పరిశీలిస్తే పదేళ్లకాలం పరిపాలించినా నరేంద్రమోదీ ఛరిష్మా చెక్కుచెదరలేదన్నదని ఈ సర్వే స్పష్టం చేసింది. ఇక కాంగ్రెస్ తన తిరోగమన విధానాలను ఇప్పటికైనా సరిదిద్దుకోపోతే పతన తప్ప ఉత్థానం వుండదని సర్వే ఫలితాలు హెచ్చరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ తాను ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాలను పున్ణసమీక్షించుకోవాలి. మితిమీరిన మైనారిటీ బుజ్జగిం పు, మెజారిటీ వర్గాలను నిర్లక్ష్యం చేయడం, అధికారంకోసం అలవికాని హామీలివ్వడం, ప్రతి అంశాన్ని ప్రతికూల ధోరణితో ఆలోచించడం వంటి పద్ధతులను మార్చుకోకపోతే భవిష్యత్తులో కాంగ్రెస్ మనుగడ కష్టం. ఇప్పటికే కీలక నాయకులను కోల్పోయి, కేవలం గాంధీ కుటుంబంపై ఆధారపడి రాజకీయాల్లో కొనసాగే స్వయం ప్రకాశం లేని నాయకులే పార్టీలో అధికం. ఇదే పార్టీని దారుణంగా దెబ్బతీస్తోంది. గత ఎన్నికల్లో నరేంద్రమోదీ ‘400 సీట్లు’ నినాదాన్ని కాంగ్రెస్ తనకు అనుకూలంగా మలచుకుంది. ముఖ్యంగా అన్ని సీట్లు ఎన్డీఏకి వస్తే, రాజ్యాంగాన్ని మార్చేస్తా రని, రిజర్వేషన్లు ఎత్తేస్తారని తప్పుడు ప్రచారాలను విపరీతంగా చేపట్టడం ప్రజల్లో ముఖ్యంగా వెనుకబడిన వర్గాల్లో అనుమానాలు పెరిగి, భాజపాను 240 వద్దే నిలిపేశారు. విచిత్రంగా ఆరునెలలు తిరగకుండానే మహారాష్ట్ర, హర్యానా, ఢల్లీి ఎన్నికల్లో విజయం సాధించి పడిలేచిన బంతిలాభాజపా తన సత్తా ఏంటో చూపింది.
తమిళనాడులో మళ్లీ డీఎంకోకాంగ్రెస్ కూటమి 39 స్థానాలను స్వీప్ చేస్తుందని సర్వే స్పష్టం చేసింది. కాకపోతే బీజేపీ ఓట్ల శాతం పెరిగినా, అవి సీట్లను గెలిపించే స్థాయిలో వుండవని పే ర్కొంది. రాష్ట్రంలో గతంతో పోలిస్తే డీఎంకే కూటమి 52% ఓట్ల షేరు సాధిస్తుందని పేర్కొంది. ఇది గత ఎన్నికలతో పోలిస్తే ఇది ఐదుశాతం ఎక్కువ. గత ఎన్నికల్లో తమిళనాడులో 18% ఓట్లు సాధించిన బీజేపీ ఈసారి 21% వరకు పొందగలుతుగుందని సర్వే పేర్కొంది. ఇక ఏ.ఐ.డి.ఎం.కె గతంలో 20% ఓట్లు పొందగా 3శాతం పెరిగి 23%కు చేరుతుంది.
ఇక ఉత్తరప్రదేశ్లోని మొత్తం 80 లోక్సభ స్థానాల్లో భాజపా 43`45 స్థానాల్లో గెలిచే అవకాశ మున్నదని సర్వే పేర్కొంది. బీజేపీ ఓట్ల శాతం గతంతో పోలిస్తే 4% పెరగుతుందని, ఇండీ బ్లాక్ఓట్లు 2% తగ్గుతాయని సర్వే తెలిపింది. 2024 లోక్సభ ఎన్నికల్లో ఇండీ కూటమికి 43 సీట్లు వచ్చాయి. వీటిల్లో 37 సమాజ్వాదీ పార్టీవి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఇండీ కూటమి సీట్లు 34`36 వరకు మాత్రమే పరిమితమవుతాయి. భాజపా కేవలం 33 సీట్లలోనే విజయం సాధించింది. అయితే ఎన్డీఏ కూటమికి ఇప్పుడు రాష్ట్రం నుంచి 36 స్థానాలున్నాయి. ఇక బిహార్లోని 40 లోక్సభ స్థానాల్లో ఎన్డీఏ కూటమి 33`35 స్థానాల్లో విజయం సాధిస్తే, ‘మహాఘట్బంధన్’ కూటమికి 5`7 స్థానాలకే పరిమితమయ్యే అవకాశాలున్నాయి. 2024 ఎన్నికల్లో ఎన్డీఏకు 47% ఓట్లు రాగా ఇప్పుడు అవి 52%కు పెరగనున్నాయి. బిహార్ అసెంబ్లీకి ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్డీఏ కూటమిలో చీలిక లేకుండా, ఉమ్మడిగా పోటీచేస్తే ప్రభుత్వానికి ఢోకాలేదని ఈ సర్వే తెలియజేస్తోంది. ఎందుకంటే ఢల్లీిలో మాదిరిగా బిహార్లో ఓట్ల చీలిక సాధ్యం కాదు. బీజేపీ, జేడీయూ, లోక్జనశక్తి పార్టీల కూటమి బలంగా వుంటే వీరిని ఓడిరచడం సాధ్యంకాదు. విచిత్రమేమంటే గత ఏడెనిమిది సంవత్సరాలుగా నితిష్కుమార్ హవా రాష్ట్రంలో అప్రతిహతంగా సాగుతూ వచ్చింది. ఈసారి ఆయన గతంలో మాదిరిగా ఓటర్లను ఆకట్లుకోలేక పోవచ్చునన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు భిన్నంగా బీజేపీ ఓట్లశాతాన్ని గణనీయంగా పెంచుకొని మరింత బలంగా రూపొంది అధికారంపై పట్టు సాధించవచ్చుననేది స్థానిక విశ్లేషకుల అంచనా. ఒరిస్సా విషయానికి వస్తే ఈ సర్వేలో 52% మంది ఓటర్లు నవీన్ పట్నా యక్ను తిరుగులేని నే తగా పేర్కొన్నారు.
మొత్తంమీద జాతీయ స్థాయిలో సర్వే ఫలితాలను పరిశీలిస్తే ఎన్డీఏ కూటమి మరింత బలపడే అవకాశాలే మెండుగా వున్నట్టు తోస్తున్నది. ప్రజలు ఊరికే పట్టం కట్టరు…పనితీరుకే ప్రాధాన్యమి స్తారన్న సంగతిని ఈ సర్వే స్పష్టం చేస్తోంది.
`పార్టీకి పని చేసిన వారికి పక్కకు పెట్టి టిక్కెట్లిచ్చాడు
`2019 నుంచి పవన్ చేసిన పోరాటం లేదు
`అసలు జనసేన పార్టీ నిర్మాణమే జరగలేదు
`లోకేష్ పాదయాత్ర కూటమి గెలుపుకు కారణమైంది
`చంద్రబాబు మీద నమ్మకంతో జనం ఓట్లేసి గెలిపించింది
`పొత్తు ధర్మంలో చంద్రబాబు స్నేహానికి విలువిచ్చారు
`దానిని పవన్ విచ్చిన్నం చేసుకోవాలని చూస్తున్నారు
`ఇప్పటికీ అన్న నాగబాబు రాజకీయ భవిష్యత్తు కోసం పవన్ ఆరాటపడుతున్నాడు
`పెద్దన్న చిరంజీవికి పెద్ద పోస్ట్ కోసం ప్రయత్నం చేస్తున్నడు
`జనసేన నాయకుల కోసం పవన్ ఆలోచించడం లేదు
`కూటమి గెలుపులో కీలక భూమిక తెలుగు తమ్ముళ్లు
`ఐదేళ్లలో కేసులు ఎదుర్కొన్నది తమ్ముళ్లు
`వైసిపి మీద అలుపెరుగని పోరాటం చేసింది తమ్ముళ్లు
`నిర్భంధాలను ఎదుర్కొని నిలబడిరది తమ్ముళ్లు
`సుదీర్ఘమైన పాదయాత్ర చేసింది లోకేష్
`ఇక్కడ పవన్ పాత్రేముంది?
`పవన్ బలం ఎక్కడ పనికొచ్చింది
`పంట చేతికొచ్చాక కుప్ప మీద కూర్చున్నది పవన్
`కూటమిలో పెత్తనం కోసం ఆరాటపడుతున్నది పవన్
`చెరపకురా చెడేవు అన్న సామెత మర్చిపోయినట్లున్నాడు
`స్వయంకృతాపరాధంతో మొత్తం చెడగొట్టుకుంటున్నాడు
ఆంధ్రప్రదేశ్లో కూటమి గెలుపుకు కారణం ఎవరు? ఇది ఇప్పుడు ఏపిలో జరుగుతున్న చర్చ. నిజంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మూలంగానే కూటమికి అంత మెజార్టీ వచ్చిందా? లేక తెలుగుదేశం బలం వల్లనే జనసేనకు ఉనికి ఏర్పడిరదా? ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మూలంగానే జనసేనకు ఊపిరి పోసినట్లైందని చెప్పడంలో సందేహం లేదు. ఎందుకంటే జనసేనాని పార్టీ పెట్టినప్పటి నుంచి ఎన్నికల్లో గెలిచింది లేదు. గత ఎనికల్లో రెండు చోట్ల పోటీచేసినా ఒక్క సీటులో కూడా కనీసం ప్రభావం చూపలేదు. అలాంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వల్ల తెలుగుదేశానికి ఊపు వచ్చిందనేదానిలో అర్దమే లేదు. ఎందుకంటే వైసిపి ప్రభుత్వ హయాంలో జనసేన చేసిందేమీ లేదు. తన ఉనికి కోసం పడిన ఆరాటం లేదు. వైసిపి మీద చేసిన జనసేనాని ప్రత్యక్షంగా చేసిన పోరాటమేమీ లేదు. ఏనాడు ఏ ఒక్క సమాజం కోసం ఉద్యమం చేసింది లేదు. అసలు ప్రజల్లో వున్నదే సరిగ్గా లేదు. అప్పుడప్పుడు సీజనల్ నాయకుడిగా వచ్చిపోవడం తప్ప ఆయన నిబద్దతలో రాజకీయాలు చేయలేదు. అటు సినిమాలు చేసుకుంటూ, ఆ గ్యాప్లో రాజకీయాలు చేస్తూ వచ్చారు. కాని ఎన్నికలకు ఆరు నెలల ముందు వైసిపి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబును అరెస్టు చేయడం, ఆ సమయంలో పవన్ కల్యాణ్ కలిసి రావడంతో జనసేన దశ తిరిగింది. తెలుగుదేశం నీడలో ఆ పార్టీకి వెలుగు సంతరించుకున్నది. ఎంతో గొప్ప మనసులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, హుందాగా పవన్ కల్యాణ్ సహాకారాన్ని కొనియాడారు. ప్రభుత్వ ఓటు చీలిపోకుండా వుండేందుకు, కూటమి అద్భుతమైన విజయం సాదించేందుకు పవన్ కృషి గొప్పదని అనేక సార్లు చెప్పారు. నిజానికి ఆ సమయంలో పొత్తు లేకపోకపోయినా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేది. ఇది ముమ్మాటికీ నిజం. కాని జగన్ రాజకీయాన్ని తుడిచిపెట్టాలంటే జనసేన కూడా కలిసి వస్తే అద్భుతమైన విజయాన్ని చూడొచ్చని తన రాజకీయ చాణక్యంతో చంద్రబాబు ముందుకు సాగారు. అది జనసేనకు బాగా కలిసి వచ్చింది. అసలు ఉనికిలో లేని జనసేనకు జవసత్వాలు వచ్చేలా చేసింది. ఎన్నికల మందుకు పవన్ కల్యాణ్కు కూడా తన బలమెంతో తెలియదు. అంతే కాదు తాను గెలుస్తానో లేదో..అని చెప్పిన సందర్భాలు కూడా అనేకం వున్నాయి. అలాంటి పవన్ కళ్యాణ్కు ఆ పొత్తు పొడిచినప్పుడే అడిగిన 50 సీట్లకు తగ్గేవారు కాదు. కాని ఆయనకు పది సీట్లు ఇస్తే ఎక్కువ అనుకున్న సందర్భంలో చంద్రబాబు నాయకుడు ఎంతో ఉదారతతో 21 సీట్లు ఇచ్చారు. అయినా పవన్ కల్యాణ్ ఎంత మంది జనసేన నాయకులకు టిక్కెట్లు ఇచ్చారు. 2019 ఎన్నికల్లో తన అన్న నాగబాబుకు కూడా టికెట్ ఇచ్చిన పవన్ ఈ ఎన్నికల్లో ఎందుకు ఇవ్వలేదు. ఎందుకంటే తన గెలుపు మీదనే ఆయనకు నమ్మకం లేదు. దాంతో నాగబాబును రంగంలోకి దింపలేదు. లేకుంటే తప్పకుండా అన్నకు టికెట్ ఇచ్చేవారు. గత ప్రభుత్వం వైసిపి మీద నిరంతరం పోరాటం చేసింది చంద్రబాబు నాయుడు, లోకష్, తెలుగు తమ్ముళ్లు. చంద్రబాబు నాయుడు నుంచి, తమ్ముళ్లదాకా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కేసులు ఎదుర్కొన్నారు. చంద్రబాబు ఏకంగా జైలు పాలయ్యారు. లోకేష్ సుధీర్ఘమైన పాదయాత్ర చేపట్టారు. ప్రజల్లోకి వెళ్లారు. ప్రజలను చైతన్యం చేశారు. ఇలా ఐదేళ్ల పాటు నిరంతరం వైసిపికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. కాని వైసిసికి వ్యతిరేకంగా పోరాటం చేసిన జనసైనికులు ఎవరైనా వున్నారా? అసలు ఇప్పటి వరకు ఆ పార్టీకి యంత్రాంగమే లేదు. గత ఎన్నికల్లో చంద్రబాబు నాయకుడు 21 టికెట్లు ప్రకటిస్తే కూడా అందులో జనసేన నుంచి పోటీ చేసేందుకు అభ్యర్దులే దొరకలేదు. జగన్ టికెట్లు ఇవ్వకుండా వదిలేసిన నాయకులను జనసేనలోకి తీసుకొని పవన్ టిక్కెట్లు ఇచ్చారు. వైసిపి పనికి రారని వదిలేసిన వారికి పవన్ టిక్కెట్లు ఇచ్చారు. అది కూడా ఆ నాయకులు పవన్ను చూసి రాలేదు. కూటమిని చూసి వచ్చారు. చంద్రబాబు నాయకత్వాన్ని నమ్మి వచ్చారు. ఈ విషయం పవన్కు ఇప్పటికీ అర్ధం కాకుండా వుంది. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు వుండరు. శాశ్వత మిత్రులు వుండరు. 2019లో ఆయన తెలుగుదేశానికి దూరంగా వున్నారు. తర్వాత మళ్లీ దగ్గరయ్యారు. జగన్ మీద కలిసి పోరాటం చేశారు. ఇది కూడా పవన్ కల్యాన్ వ్యూహంలో భాగమే. ఒకరికొకరు అన్నట్లు ఉభయ కుశలోపరిగా సహకరించకుకున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూసుకున్నారు. కూటమిని అధికారంలోకి తెచ్చుకున్నారు. ఇంత వరకు బాగానేవుంది. కాని ఎప్పటికైనా తెలుగుదేశం పొత్తుతో ఈ ఐదేళ్ల కాలంలో ఏదైనా జరగొచ్చని పవన్కు తెలియంది కాదు. మంత్రి లోకేష్ను ముఖ్యమంత్రిని చేయాలన్న ప్రతిపాదనలు వస్తాయని పవన్కు తెలియక కాదు. పవన్కు అన్నీ తెలుసు. తెలిసే పొత్తుకు అంగీకరించారు. ముందు ఏరు దాటాలి. అప్పుడు కదా? ఏ నిర్ణయం తీసుకునేది అనుకున్నారు. అనుకున్నట్లుగా ఆది నుంచి వ్యవహరిస్తూనే వస్తున్నారు. హోం మంత్రిత్వ శాఖ మీద చేసిన వ్యాఖ్యలైనా, ఇతర చర్యలైనా ఆయన కావాలనే చేస్తూ వస్తున్నారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలు తనపై రాకుండా చూసుకుంటూ జాగ్రత్తపడుతున్నారు. అయితే లోకేష్కు ప్రాధాన్యత ఇంత తొందరగా ఇచ్చే రాజకీయం మొదలౌతుందని పవన్ కూడా ఊహించలేదు. దాంతో తన ప్లాన్కు పవన్ మరింత పదును పెట్టారు. ఈ మధ్య ముఖ్యమంత్రి చంద్రబాబుకు కూడా దూరం దూరంగా వుంటున్నారు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు హాజరు కావడం లేదు. అయితే ఈ మధ్య ఆయనకు వైరల్ ఫీవర్ వచ్చిందని కొన్ని రోజులు ప్రచారం జరిగింది. తర్వాత తీవ్రమైన నడుము నొప్పితో బాధపడుతున్నట్లు వార్తలువచ్చాయి. కాని మరునాడే దక్షిణభారత దేశ సనాతన ధర్మ యాత్ర మొదలు పెట్టారు. దేవాలయాల సందరర్శను వెళ్లిపోయారు. ఇది తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. సాక్ష్యాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోన్లో మాట్లాడాలనుకున్నా సాధ్యం కాలేదు. అంటే దూరం పెంచుకోవాలని పవన్ అనుకుంటున్నట్లు స్పష్టమైన సంకేతాలు అందుతున్నట్లే లెక్క. దీని వెనకాల బిజేపి వుందన్న వాదనలు కూడా వున్నాయి. బిజేపి దక్షిణాదిలో పాగా వేసేందుకు పవన్ను ఒక వారదిగా వాడుకోవాలని చూస్తోందనేది కనిపిస్తూనే వుంది. ఎందుకంటే ఒకప్పటి పవన్ వేరు..ఇప్పుడు పవన్ వేరు. ఒకప్పుడు తాను ఎర్రరంగు వాదినని ఆయనే చెప్పుకున్నారు. ఇప్పుడు కాషాయదారిగా మారారు. అందువల్ల పవన్ రాజకీయాలు రకరకాల మార్గాలను ఎంచుకొని సాగుతోంది. కూటమిలో కటకట మొదలైందని అంటున్నారు. ఇప్పటికిప్పుడు అందులో పెద్దగా విబేధాలు కనిపించకపోయినా, కుంపటిలో నివురుగప్పిన నిప్పులా పొగ మాత్రం అప్పుడపప్పుడూ కనిపిస్తుంది. అందుకే పవన్ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తన రాజకీయాన్ని విస్తరించాలనుకుంటున్నాడు. అందువల్ల తెలుగుదేశం పార్టీ కూడా పవన్ రాజకీయానికి ఆది లోనే అడ్డుకట్ట వేయాల్సిన అవసరం వుంది. పెద్దలు కీలెరెగి వాతలు పెట్టాలన్నారు. ఇప్పుడు జనసేన విషయంలో టిడిపి ఆ పద్దతి అనుసరించాల్సిన పరిస్ధితి వస్తుందనే చెప్పాలి. రెండు బలమైన జోడెట్లు బండి లాగుతుంటే దాని కింద నడుస్తున్న మేక నేనే లాగుతున్నాను అన్నట్లు వుంది ఏపి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆలోచన. రాజకీయాలలోకి రాకుముందు పవన్ కల్యాణ్పై రకరకాల ఆరోపణలు వుండేవి. ఆయన ఆవేపరుడని అంటూ రకాల మాటలు వినపడేవి. అవి ఆయన ప్రత్యక్ష్యంగా తెలిసిన వ్యక్తులు చేసిన వ్యాఖ్యలే. కాని రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయనలో కొంత మార్పువచ్చిందని అంటారు. కాని గతంలో ఎన్నికల ముందు ఆయన ఊగిపోతూ చేసిన వ్యాఖ్యలు చూసిన వారికి ఇంకా ఆయనలో అలాంటి ఆవేశం వుందనేది కాదనలేనిది. కాకపోతే పవన్ కల్యాన్ను బాగా అభిమానించే వారంత ఆయన వ్యక్తిత్వమే పవనిజమంటూ గొప్పగా చెప్పుకునేవారు. ఆ పవనిజంలో నిజమెంత వుంది? అన్నది ఆయన రాజకీయంగా వేస్తున్న అడుగులతోనే తేలిపోతోంది. ఒకప్పుడు ఆయన ఆలోచనలు వేరు. ఆయన చెప్పిన మాటలు వేరు. తాను బీఫ్ తినాల్సివస్తే అంటూ ఒకరి మనోభావాలను, వారి ఆచార వ్యవహారాలను తప్పు పట్టొద్దని చెప్పిన సందర్బాలు అనేకం వున్నాయి. కాని ఇప్పుడు అవన్నీ ఒట్టి మాటలే అని తేలిపోతున్నాయి. ఇప్పుడు ఆయన ఎత్తుకున్న సనాతన ధర్మంలో గతం తాలూకు ఆలోచనలన్నీ తుడిచేశారా? సమాధి చేశారా? అన్నది ఆయన వ్యక్తిగతం. కాని ఆయన ప్రజల్లో వుంటున్నారు. ప్రజానాయకుడుయ్యారు. రాజ్యాంగబద్దమైన పదవిలో వున్నారు. దాంతో ఆయన గతంలో చెప్పిన మాటలను, ఇప్పడు ఆచరిస్తున్న విధానాలను అనేక మంది ప్రశ్నిస్తున్నారు.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి 2026 ఏప్రిల్ నెలలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఫి బ్రవరి 11న జరిగిన శాసనసభాపక్ష సమావేశంలో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రిమమతా బెనర్జీ ఒక ప్రకటన చేస్తూ, రాబోయే ఎన్నికల్లో ఎవ్వరితో పొత్తు పె ట్టుకునే ప్రసక్తే లేదని, తమ పార్టీ ఒంటరిగానే పోటీచేస్తుందని స్పష్టం చేయడంలో పెద్దగా విశేషమేమీ లేనట్టు కనబడుతున్నా, ఇటీవల జరిగిన ఢల్లీి ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని మూటకట్టుకున్న ఆప్, జవసత్వాలు ఉడికి కాలు,చెయ్యి కదపలేని స్థితిలో వున్న కాంగ్రెస్తో కూడిన ‘ఇండీ’ కూటమితో జట్టు కడితే ఎటువంటి ప్రయోజనం వుండబోదన్న సత్యం ఆమెకు మరోసారి బోధపడినట్టు భావించాలి. తనకు రాజకీయ లబ్దిని కలిగించే ఏ చిన్న అంశాన్ని వదిలిపెట్టని దీదీ నిర్ణయం ఎవ్వరికీ పెద్దగా ఆశ్చర్యపరదనే చెప్పాలి. మితిమీరిన ఉచితాలు వికటిస్తాయన్న మరో స త్యాన్ని ఢల్లీి ఎన్నికలు రాజకీయపార్టీలకు బాగా బోధపరచి వుంటాయి. ప్రధాని పదవికి పోటీలో ఉన్నానని చెప్పుకునే మమతాబెనర్జీకి పశ్చిమ బెంగాల్ తప్ప మిగిలిన రాష్ట్రాల్లో ఎంతమాత్రం పలుకుబడిలేదన్న సత్యాన్ని గుర్తించాలి.
పెరుగుతున్న ఆధిపత్యపోరు
బయటి రాజకీయాలు ఒక ఎత్తయితే పశ్చిమబెంగాల్ అంతర్గత రాజకీయాలు ముఖ్యంగా తృణ మూల్ కాంగ్రెస్లో మమతాఅభిషేక్ బెనర్జీల మధ్య క్రమంగా పెరుగుతున్న ఆధిపత్యపోరు రాష్ట్ర రాజకీయాలను ఆసక్తికరంగా మారుస్తున్నాయి. దీన్నే ‘‘ఓల్డ్ గార్డ్స్’’ వర్సెస్ ‘‘యంగ్ టర్క్స్’’ మధ్యపోటీగా అక్కడి రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో తిరుగులేని అధినేత్రిగా మమతా బెనర్జీ బయటి వారికి కనిపిస్తున్నా ఒక వయసు దాటిన వృద్ధులు రాజకీ యాలనుంచి తప్పుకొని యువకులకు ఛాన్స్ ఇవ్వాలన్న వాదనలు పార్టీలో క్రమంగా బలం పుం జుకోవడం, అభిషేక్ బెనర్జీకి పట్టం కట్టాలన్న వర్గం బలపడుతున్న సంగతిని స్పష్టం చేస్తున్నది. అయితే మమతా బెనర్జీ మాత్రం ‘‘సీనియర్ నాయకులను గౌరవించాల్సిందే’’నని స్పష్టం చేస్తున్నారు.
‘ఓల్డ్’ వర్సెస్ ‘యంగ్’
గత నెలలో పశ్చిమబెంగాల్ ప్రభుత్వ అధికార భవనం ‘నబన్న’లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె రవాణా శాఖమంత్రి స్నేహశీష్ చక్రవర్తినుద్దేశించి ‘‘సరైన సంఖ్యలో బస్సులు లేకపోవడంవల్ల ప్రయాణికులు పడుతున్న ఇబ్బం దులను గురించి వాకబు చేయడానికి ఏనాడైనా బస్టాండ్కు వెళ్లారా? అసలు రవాణాశాఖలో ఏంజరుగుతున్నదో ఏమీ తెలియడంలేదు’’ అని అనడంతో మంత్రి నీళ్లు నమలడమే సమాధానమైంది. ఇక విద్యాశాఖ సమీక్షలో ‘‘నాకు తెలియకుండా ప్రాథమిక పాఠశాలల్లో సెమిస్టర్ వ్యవస్థను ఎట్లా ప్రవేశపెడతారు? అటువంటి కీలకమైన నిర్ణయాలను నన్ను సంప్రదించకుండా ఎట్లా తీసుకుంటారు? దినపత్రికల్లో చదివి తెలుసుకోవాల్సి వచ్చింది’’ అని ప్రశ్నిస్తే ఆయనవద్ద కూడా స మాధానం లేదు. పిల్లల మీద భారం తగ్గించాలి కానీ, పెంచకూడదని ఆమె హెచ్చరించారు. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి స్నేహశీష్ చక్రవర్తి, విద్యామంత్రి బ్రత్యబసులు, ముఖ్యమంత్రి మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి నమ్మిన బంట్లు కావడం గమనార్హం! ఈ సమీక్ష ద్వారా ఒక్క విషయం స్పష్టమవుతోంది. రాష్ట్రంలో కొన్ని కీలక నిర్ణయాలు మమతా బెనర్జీకి తెలియకుండానే జరుగుతున్నాయి.ముఖ్యంగా ఇటువంటి నిర్ణయాలకు డైమండ్ హార్బర్ (ఇది అభి షేక్ బెనర్జీ స్థానం) కేంద్రస్థానంగా వున్నదన్నది పశ్చిమ బెంగాల్లో బహిరంగ రహస్యమే. అంతేకాదు ఈ సమీక్షపై రాష్ట్రంలోని టెలివిజన్ ఛానళ్లు తృణమూల్ పార్టీలో పెరుగుతున్న ‘‘ప్రబీణ్’’ (ప్రావీణ్యత) వర్సెస్ ‘‘నబీన్’’ (నవ్యత) మధ్య జరుగుతున్న సంఘర్షణగా పేర్కొన్నాయి. అంతేకాదు వృద్ధులు మమతా బెనర్జీవైపు, యువకులు అభిషేక్ వైపు మొగ్గు చూపుతుండటం ప్రస్తుతం పార్టీలో జరుగుతున్న తాజా పరిణామం.
కళాకారుల వివాదం
కొందరు సెలబ్రిటీ కళాకారులు, ఈ ఏడాది నూతన సంవత్సరం వేడుకల్లో తాము పాల్గనాల్సిన సాంస్కృతిక కార్యక్రమాలు రద్దుచేశారని ప్రకటించారు. వీరంతా గత ఏడాది ఆగస్టు 9న ఆర్జీకర్ ఆసుపత్రిలో యువ డాక్టర్పై జరిగిన అత్యాచారం, హత్యకు వ్యతిరేకంగా నిరసనలు తెలపడం లో ముందు వరుసలో నిలవడం గమనార్హం. కొందరు తృణమూల్ కాంగ్రెస్ నాయకుల నిర్దేశం మేరకే ఈ రద్దు జరిగిందని వారు పేర్కొన్నారు. అంతకు ముందు టీఎంసీ సీనియర్ నాయకు డు, అధికార ప్రతినిధి కుణాల్ ఘోష్ ‘ఎక్స్’ వేదికగా ఒక పోస్ట్ పెట్టారు. ‘‘అధికారపార్టీ, ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న కళాకారులను బాయ్కాట్ చేయాలి’’ అన్నది ఈ పోస్టు సారాంశం. మరుసటిరోజే అభిషేక్ బెనర్జీ ఒక ప్రకటన చేస్తూ ‘‘ప్రజాస్వామ్యంతోనిరసనహక్కు ప్రతి ఒక్కరికి వుంటుంది. మా ప్రభుత్వం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మాదిరిగా కాదు’’ అని స్పష్టం చేశారు. అంతేకాదు అధినేత్రి మమతా బెనర్జీ తరపున ఎవ్వరూ ఎటువంటి పోస్ట్ లు పెట్టకూడదని కూడా హెచ్చరించారు. కుణాల్ ఘోష్ దీనికి స్పందిస్తూ ‘‘మమతా బెనర్జీకి తెలియకుండా, ఆమె చెప్పకుండా తానెటువంటి పోస్ట్లు పెట్టనని’’ సమాధానమిచ్చారు. ఇక్కడ కూ డా మమత, అభిషేక్ల మధ్య వున్న విభేదాలు స్పష్టమయ్యాయి.
సస్పెన్షన్లు
ఇటీవల రాజ్యసభ మాజీ సభ్యుడు శంతన్ సేన్ను టీఎంసీ సస్పెండ్ చేసింది. విచిత్రమేమంటే ఈయన అభిషేక్ బెనర్జీకి అత్యంత సన్నిహితుడు. రాజకీయుడిగా మారిన ఈ డాక్టర్, ఆర్జీకర్ ఆసుపత్రి సంఘటనపై చేసిన ప్రకటనలు, ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టాయి. దీనికి తోడు ‘‘సే వాశ్రయ’’ పేరుతో, అభిషేక్ లోక్సభ నియోజకవర్గం డైమండ్ హార్బర్లో అనేక మెడికల్ క్యాం పులు నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే పార్టీ ఆయన్ను సస్పెండ్ చేసింది. ఇదిలావుండగా గత నవంబర్ నెలలో హుమాయూన్ కబీర్ అనే పార్టీ ఎమ్మెల్యే, అభిషేక్ బెనర్జీకి హోమ్ మంత్రిత్వ శాఖ ఇవ్వాలని డిమాండ్ చేసారు. అంతటితో ఆగకుండా మమత చుట్టూ వున్న వృద్ధ నాయకు లు నిజంగా ముఖ్యమంత్రికి, పార్టీకి శ్రేయోభిలాషులుగా వున్నారా అంటూ అనుమానం వ్యక్తం చేయడం, పార్టీ ఆయన్ను సస్పెండ్ చేయడం వెంటవెంటనే జరిగిపోయాయి.
పార్టీలో ‘సీనియర్లు’ వర్సెస్ ‘జూనియర్లు’ మధ్య జరుగుతున్న సంఘర్షణకు సాక్ష్యంగా మరో సంఘటనను కూడా ఉదహరించవచ్చు. 2022, ఫిబ్రవరి నెలలో పార్టీ అత్యున్నతస్థానాల్లో ఉన్న నా యకులను తొలగిస్తూ అధిష్టానం నిర్ణయించింది. విచిత్రమేమంటే ఆవిధంగా తొలగింపునకు గు రైనవారంతా అభిషేక్ మద్దతుదారులే! అయితే అభిషేక్ను కట్టడి చేయడానికే ఈ చర్య తీసుకున్నారని భావించినా తర్వాత ఆయన్ను పార్టీ జాతీయ కార్యదర్శిగా నియమించడం గమనార్హం. అంటే మమతా బెనర్జీ తన మేనల్లుడి విషయంలో ‘‘బ్రెడ్ అండ్ స్టిక్’’ పాలసీని అనుసరిస్తున్నార నుకోవాలి.
2023లో అభిషేక్ బెనర్జీ ‘‘తృణమూల్ ఎర్ నబజోవర్ యాత్ర’’ పేరుతో రాష్ట్రం లో 3500 కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించారు. తనపై వస్తున్న ఆశ్రిత పక్షపాతం, అవినీతి ఆరోపణలను తిప్పికొట్టే ఉద్దేశంతో ఆయన 60రోజుల పాటు ఈ యాత్రను నిర్వహించారు. ఫలితంగా తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో మొత్తం 49స్థానాల్లో 29సీట్లు టీఎంసీ గెలుచుకోగలిగింది. ఈ ఎన్నికల్లో గట్టిపోటీదారుగా వుంటుందనుకున్న భాజపా 12సీట్లకే పరి మితం కాగా, కాంగ్రెస్ ఒక్క సీటు దక్కించుకుంది. ఇక కమ్యూనిస్టులు ఒక్కసీటూ గెలుచుకోలేదు. మరి ఇవే ఎన్నికల్లో అభిషేక్ బెనర్జీ పార్టీ వృద్ధనాయకులైన సుదీప్ బందోపాధ్యాయ్, కళ్యాణ్ బందోపాధ్యాయ్లు పోటీచేస్తున్ననియోజకవర్గాలో ప్రచారం చేయలేదు. వీరిద్దరూ పార్టీలో యువ నాయకత్వాన్ని ఎప్పుడూ విమ ర్శిస్తుండటం గమనార్హం.
ఇన్ని పరిణామాల నేపథ్యంలో పార్టీలో రెండు అధికార కేంద్రాలు కొనసాగుతున్నాయన్న వార్తలు జోరందుకున్నాయి. గత డిసెంబర్లో మమతా బెనర్జీ తన మేనల్లుడితో సమావేశమై, పార్టీలో మార్పులు చేపట్టడానికి అనుమతివ్వడం గమనార్హం! అంతేకాదు వచ్చే ఏడాది జరుగబోయే అ సెంబ్లీ ఎన్నికల్లో పోరుకు పార్టీని సిద్ధం చేయాలని కూడా ఆమె కోరడం విశేషం! పార్టీలో వ్యక్త మవుతున్న ఆగ్రహావేశాలను, నాయకత్వం ఇప్పటివరకు సమర్థవంతంగా నియంత్రణలో వుంచ గులుతోందనేది అక్షరసత్యం. కాకపోతే పార్టీ మమతా బెనర్జీ ఛరిష్మాపైనే నడవడం పెద్ద బలహీనత! అభిషేక్ బెనర్జీకి పార్టీపై పట్టున్నప్పటికీ, ప్రజల్లో ఛరిష్మా ఎంతవరకు ఉన్నదనేది ఇంకా స్పష్టం కాలేదు! వ్యక్తి ఛరిష్మాపై ఆధారపడిన పార్టీల చరిత్ర ఎట్లా ముగిసిందో మనం చూస్తూనే వున్నాం.
`పార్టీ నాయకులు, కార్యకర్తల కృషి జీవితంలో మర్చిపోలేను.
`ప్రత్యర్థులు పట్టభద్రులకు పెద్దగా పరిచయం లేని వ్యక్తులు.
`విద్యా వేత్తగా నేను అందరికీ సుపరిచితం.
`పట్టభద్రుల స్పందన చాలా బాగుంది.
`పట్టభద్రులు బ్రహ్మ రథం పడుతున్నారు.
`నరేందర్ రెడ్డి ప్రచారంలో మహిళామణులు కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం విశేషం.
`ప్రజలు నరేందర్ రెడ్డికి ఘన స్వాగతం పలుకుతున్నారు.
`అందరికీ అందుబాటులో వుంటారు అనే పేరు నాకు మాత్రమే వుంది.
`విద్యావేత్తగా అందరికీ తెలిసిన వ్యక్తిని కావడం నాకు కలిసొచ్చే అంశం.
`రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై యువతలో మంచి స్పందన.
`ఉద్యోగాల కల్పన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతోనే సాధ్యం.
`పదేళ్లలో పట్టుమని గత పాలకులు పది కొలువులు ఇచ్చింది లేదు.
`బిజేపికి మాటలు ఎవరూ నమ్మడానికి సిద్ధంగా లేరు.
`బిజేపి మాటలు నీటి మీద రాతలని తరలిపోయింది.
`దేశంలో బిజేపి వల్ల నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోతుంది.
`పారిశ్రామిక అభివృద్ధి కుంటుపడిపోయింది.
`బిజేపి చేతగాని తనం వల్ల అమెరికాలో మన యువత ఇబ్బందులు పడుతున్నారు.
`కాంగ్రెస్ పాలనలో దౌత్య సంబంధాలు చాలా మెరుగ్గా వుండేవి.
`మన దేశం నుంచి వెళ్లిన యువతకు మంచి గౌరవం వుండేది.
`బిజేపి దౌత్యపరమైన అవగాహన రాహిత్యం దేశానికి తీరని నష్టం జరుగుతోంది.
`కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుద్యోగులలో ఒక భరోసా కలిగింది.
`కాంగ్రెస్ ప్రభుత్వంమే ఉద్యోగాలు ఇస్తుందని బలమైన నమ్మకం ఏర్పడిరది.
`ఒక్క ఏడాదిలోనే 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఒక చరిత్ర.
`రిటైర్ అయిన ఉద్యోగుల స్థానంలో వెంటనే ఉద్యోగ కల్పన కోసం కృషి చేస్తాను.
`ప్రైవేటు రంగంలో కూడా తెలంగాణ యువతకు ప్రాధాన్యత కలిగేలా చూస్తాను.
`రాష్ట్ర ప్రభుత్వం ఐటి విస్తరణ, ఉద్యోగ కల్పనపై ప్రత్యేక దృష్టి పెడుతోంది.
`ఇప్పటికే లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి.
`ఎంతో మంది నిరుద్యోగుల కల నెరవేరేందుకు మంచి రోజులు రానున్నాయి.
`కొన్ని లక్షల మంది విద్యార్థులను తీర్చిదిద్దాను.
`వారి సహకారంతో గెలిచి, నిరుద్యోగ యువతకు సేవ చేస్తాను.
హైదరాబాద్,నేటిధాత్రి:
నిత్యం ప్రజల్లో వుంటా..ప్రజలతో వుంటా…ప్రజల జీవన విదానంలో వుంటా..ప్రతి నిమిషం ప్రజలతోనే గడుస్తుంది. రోజులో ఏ కొద్ది సమయమే నా కోసం వుంటుంది. మిగతా సమయమంతా ప్రజలోనే వుంటుంది. నిత్యం ఎంతోమందిని కలుస్తుంటాను. సమాజాన్ని దగ్గరుండి చూస్తుంటారు. సామాజిక సమస్యలు ప్రతి క్షణం అద్యయనం చేస్తుంటాను. పేదరికంలో మగ్గుతున్న జీవితాలను చాలా దగ్గరగా వుండి చూస్తుంటారు. నేను వ్యాపార వేత్తను కాదు. విద్యా వేత్తను. ప్రతి ఏటా కొన్ని వేల మందిని సమాజంలోకి పంపిస్తుంటారు. పసి వయసు నుంచి నా విద్యా సంస్ధలతో వారు పెనవేసుకున్న అనుబంధం, వారిని ఉన్నతమైన పౌరులుగా తీర్చిదిద్దే వరకు వారితో నా ప్రయాణం సాగుతుంది. ఇది ఒక్క ఉపాద్యాయుడికి మాత్రమే దక్కుతుంది. అందులో విద్యా సంస్దల నిర్వహణతో నేను అనేక పాఠాలు నేర్చుకుంటాను. వాటిని మా విద్యాలయాల ద్వారా విద్యార్దులకు, పరోక్షంగా సమాజానికి నేర్పిస్తుంటాను. దేశ విదేశాలలో విద్యా వ్యవస్దల మీద నిరంతరం అధ్యయనం కొనసాగుతుంది. మన పిల్లల ఉత్తమ భవిష్యత్తుకు మార్గలు వేయడం జరుగుతుంది. సమాజంలో చైతన్యాన్ని నింపేందుకు నిరంతరం కృషి చేస్తుంటారు. అనేక సభలు, సమావేశాలకు హజరౌతుంటాను. సామాజిక స్ధితిగతుల మీద నిరతంరం ఉపన్యాసాలు ఇస్తుంటాను. ఇలా నా జీవితమంతా ప్రజలతోనే ముడిపడి వుంటుంది. తెలంగాణలో నన్ను గుర్తు పట్టని వారుండరు. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నాతో పరిచయం లేని వాళ్లంటూ వుండరు. నా విద్యా సంస్దల్లో చదువుకున్న వాళ్లు, వారి తల్లిండ్రులు, రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్తలు ఇలా అన్ని రంగాల ప్రజలతో నాకు వున్నంత సత్సంబందాలు మరెవరికీ వుండవు. అందువల్ల కాంగ్రెస్ పార్టీ నుంచి నేను పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్ధిగా పోటీ చేసేందుకు అవకాశం కల్పించారు. నాపై పార్టీ పెట్టుకున్న నమ్మకాన్ని నిలుపుకుంటాను. కాంగ్రెస్ పార్టీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్తాను. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రజా ప్రభుత్వ విజయాలలో ప్రధాన భూమిక ఉద్యోగ కల్పనపై ప్రజలకు వివరిస్తాను. వారికి మెరగైన ఉపాది కల్పన కోసం కృషి చేస్తాను. నా మాటల మీద నమ్మకంతో, కాంగ్రెస్ పార్టీపై వున్న విశ్వాసంతో ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అంటున్న ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి, ఆల్ఫోర్స్ విద్యా సంస్దల అదినేత డాక్టర్. వి. నరేందర్ రెడ్డితో నేటిధాత్రి ఎడిటర్ కట్టా రాఘవేంద్రరావు చెప్పిన విషయాలు, వివరాలు ఆయన మాటల్లోనే…
సమాజంలో ఉన్నత లక్ష్యాలు, వ్యక్తిగత ఆశయాలు, వాటిని నిజం చేసుకునే అవకాశం కల్పించే ఏకైక వారధి విద్య. ఆ విద్యను కొన్ని లక్షల మందికి ముప్పై సంవత్సరాలకు పైగా అందిస్తున్నాను. అలా ప్రజలతో నా ప్రయాణం ఇప్పటి వరకు ఎంతో గొప్పగా సాగుతోంది. అందుకు కారణం నా అంకితభావమే కారణం. ఒక విద్యా వేత్త సమాజం గురించి ఆలోచించినంతగా మరెవరూ ఆలోచించరని ఆ నా అభిప్రాయం. ఈ సమాజం నాది. నా సమాజం ఎప్పుడూ ఉన్నతంగా వుండాలని కోరుకునే వారిలో నేనూ ఒకడిని. అంతే కాకుండా దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన పార్టీ, దేశంలో పంచవర్ష ప్రణాళికలు రూపొందిం చి,ఐదేళ్లకోసం లక్ష్యాలను నిర్ధేశించుకొని దేశాన్ని అన్ని రంగాలలో ముందుకు నడిపించింది కాంగ్రెస్ పార్టీ. బిజేపి పార్టీకి అలాంటి లక్ష్యాలు ఏమీ లేవు. దేశాబివృద్దికి ప్రధాన్యతలు లేవు. ప్రణాళికలను ఎత్తి వేసినప్పుడే బిజేపి అంతరంగం అర్దమైంది. కేవలం రాజకీయం తప్ప ప్రగతి దారి మూసేయమే బిజేపి లక్ష్యంగా మారింది. అలాంటి ప్రజలను మభ్యపెట్టే రాజకీయాలు తప్ప ఉఫాది కల్పించింది లేదు. ప్రజల జీవితాల్లో వెలుగు నిందింది లేదు. వికసిత్ భారత్ అంటూ గొప్పలు చెప్పుకోవడం తప్ప చేసిందేమీ లేదు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఉపాధి కల్పనలో మహాత్మాగాంధీ ఉపాధి హమీ పధకం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆ పధకం వల్ల పల్లె ప్రజలకు నిత్యం ఉపాది కలుగుతోంది. ఆ పధకాన్ని కూడా అటెకెక్కించే కుట్ర బిజేపి చేస్తోంది. ఈసారి బడ్జెట్లో ఈ పదకం ప్రస్తావన కూడా తేలేదు. ఉపాధి పథకం కూలీ పెంచలేదు. పైగా రెండు కోట్ల మందిని ఆ ఉపాధి నుంచి తప్పించే కుట్ర చేస్తోంది. ఇలా పేదల జీవితాలను చిద్రం చేస్తూ, పారిశ్రామిక వేత్తలకు తొత్తుగా మారింది బిజేపి. అలాంటి బిజేపి పాలనతో పేదలకు మేలు కన్నా, శాపమే ఎక్కువైంది. ఏ రంగంలో చూసినా అవరోహనమే కనిపిస్తోంది. మధ్య తరగతి మీద పన్నుల మీద పన్నుల వడ్డిస్తూ వారి జీవితాలన చిదిమేస్తున్న పార్టీ బిజేపి. 2014 ఎన్నికల ముందు ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ప్రజలను మోసం చేసింది. యువత జీవితాలలో ఆశలు రేపింది. ఈ పదకొండేళ్ల కాలంలో ఉద్యోగాలు ఇచ్చిందిలేదు. నిరుద్యోగుల ఆశలు నెరవేర్చింది లేదు. పైగా ఉన్న ఉద్యోగాలను తొలగిస్తోంది. దేశంలోనే అతి పెద్దదైన రైల్వే వ్యవస్ధను నిర్వీర్యం చేసి, ప్రైవేటు రంగానికి అప్పగించే కుట్రలు చేస్తోంది. ప్రధాన మంత్రి మోడీ స్వయంగా ప్రభుత్వం వ్యాపారాలు చేయదని చెప్పినప్పుడే ఆయన అంతరంగం పూర్తిగా అర్ధమైపోయింది. మన దేశ స్వామ్య వాద ఆర్ధిక వ్యవస్ధను పూర్తిగా వ్యక్తి ఆర్ధిక వ్యవస్ధగా మార్చి, ప్రజల హక్కులను కాలరాస్తున్నారు. ఎల్ఐసి లాంటి సంస్ధలను కూడా ప్రైవేటు పరం చేసి, ప్రభుత్వ రంగ సంస్ధలను నిర్వీర్యం చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే బిజేపి సాగిస్తున్న అరాచకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సివుంది. విద్యా వైద్య రంగాలను పూర్తిగా భ్రష్టు పట్టించి, ప్రజల జీవితాలను ఆగం చేస్తోంది. మన దేశ సగటు ఆయు ప్రమాణమే 69 సంవత్సరాలు. అలాంటిది 70 సంవత్సరాలకు పై బడిన వారికే ఉచిత వైద్యం అని చెప్పి ఇలా కూడా ప్రజలను మోసం చేయొచ్చని నిరూపించిన ఏకైక పార్టీ బిజేపి. బిజేపి ప్రభుత్వం అనుసరిస్తున్న అసమర్ధ విధానాల వల్ల విదేశీ దౌత్య సంబంధాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. అమెరికా ఎన్నికల్లో మళ్లీ గెలిచిన ట్రంప్ మన విద్యార్ధులను, ప్రజలకు బేడీలు వేసి, తిరిగి పంపిస్తున్నారు. ఒక దేశానికి చెందిన సైనిక విమానం మరో దేశం అనుమతి లేకుండా వాలడం అంటే మనపై ఆధిపత్యాన్ని చూపించినట్లే లెక్క. అయినా స్పందన లేని ప్రధాని మోడీ అమెరికా మందు సాగిలపడడం మన దౌర్భాగ్యం. గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాల కాలంలో ఇలాంటి పరిస్దితులు దేశం చూసిందా? ఇతర దేశాల ముందు సాగిలపడడం జరిగిందా? అందువల్ల దేశ ప్రజల్లో చైతన్యం రావాలి. అది ముందు తెలంగాణ నుంచే మొదలవ్వాలి. తెలంగాణలో బిజేపి పార్టీకి చోటులేదు. ప్రజల ఆదరణ అంతకాన్న లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వారికి ఓటు కూడా పడదు. పైగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రత్యర్ధి పార్టీలకు చెందిన వ్యక్తులు ఎవరూ ప్రజలు తెలిసిన వాళ్లు కాదు. ప్రజల్లో వుండేవాళ్లు కాదు. అందుకే ఎక్కడికెళ్లినా నన్ను ప్రజలు ఎంతో ఆదరిస్తున్నారు. ముఖ్యంగా నాలుగు జిల్లాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యంగా మంత్రి శ్రీధర్బాబు, సీనియర్ నాయకులు, మాజీ మంత్రి జీవన్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు అందరూ నా గెలుపు కోసం ఎంతో శ్రమిస్తున్నారు. వారి కృషి వృదా కాదు. వ వారి ఆశీస్సులతో నేను గెలవడం పక్కా…అది కూడా మంచి మెజార్టీతో గెలుస్తాను. గతంలో ఏ పార్టీ కూడా అదికారంలోకి వచ్చిన తొలి ఆరు నెలల్లోనే మొత్తంగా ఏడాదిలో 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిన చరిత్ర లేదు. అది ఒక్క కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా పాలనకే దక్కుతుంది. అందుకే ప్రజా ప్రభుత్వం మీద ప్రజలకు మరింత నమ్మకం ఏర్పడిరది. నిరుద్యోగులు తమ ఆశలు, కలలు నెరవేరుతాయన్న విశ్వాసం వారిలో బలంగా ఏర్పడిరది. తాను ఎమ్మెల్సీగా గెలిచిన మరు క్షణం నుంచి నిరుద్యోగుల ఆశల నెరవేర్చేందుకు ప్రయత్నం చేస్తాను. అటు ప్రభుత్వ ఉద్యోగాలు, ఇటు ప్రైవేటు రంగంలో ఉద్యోగాల కల్పన కోసం కృషి చేస్తాను. నిరుద్యోగ సమస్య పరిష్కారానికి అవసరమైన సూచనలు, సలహాలు ప్రభుత్వానికి ఇస్తూ, యువత భవిష్యత్తుకు బాటలు వేసేందుకు తోడ్పడతాను..ఇది నా హమీ…
`కాంగ్రెస్ లో చేరినా బిఆర్ఎస్ పార్టీని ఉతికి ఆరేయలేకపోతున్నారు
`మరి కొందరు చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు
`రెండు వైపులా దారులు మూసుకుపోయే పరిస్థితి తెచ్చుకున్నారు
`అటు ఎన్నికలంటే భయం..ఇటు పదవీ గండం!
`కాంగ్రెస్కు దగ్గర కాలేక, దూరంగా వుండలేక సతమతమౌతున్నారు
`నియోజకవర్గాలలో కాంగ్రెస్ నాయకుల ఆదరణ లేదు
`నియోజకవర్గాలకు వెళ్తే జేజేలు కొట్టే వారు లేరు
`అడుగడుగునా అవమానాలు ఎదుర్కొంటున్నారు
`ఉప ఎన్నికలు వస్తే గెలుస్తామన్న విశ్వాసం కనిపించడం లేదు
`రాజీనామా చేసినా వెంటనే ఉప ఎన్నికలు వచ్చే పరిస్థితి లేదు
`ఆరు నెలల పాటు ప్రజల్లో వుంటూ ప్రచారం అంత సులువు కాదు
`ఏ రకంగా చూసినా కష్టకాలమే!
`సుప్రీం కోర్టు ఎమ్మెల్యేలను భర్తరఫ్ చేస్తే కాంగ్రెస్ పార్టీ టిక్కెట్లు ఇవ్వాలని రూలేం లేదు?
`ఇప్పుడు మళ్ళీ యూటర్న్ తీసుకున్నా కారుకే ప్రమాదం
`రెంటికీ చెడ్డ రేవడిగా మిగిలిపోతారు
`భవిష్యత్తు రాజకీయానికి తమకు తామే చరమగీతం పాడుకున్నారు
హైదరాబాద్,నేటిధాత్రి:
పిరాయింపులు ఎమ్మెల్యేలకు ముందు నుయ్యి వెనుక గొయ్యిలా మారింది. నిజానికి ఇలా జరుగుతుందని ఎవరూ ఊహించలేదు. గతంలో ఎమ్మెల్యేలు పార్టీలు పిరాయించిన సందర్బాలు అనేకం వున్నాయి. అప్పుడు వారికి ఈ పరిస్దితి ఎదురుకాలేదు. కాని ఇప్పుడు ఎదురౌతున్న సమస్యతో పిరాయింపు దారులంతా తలలు పట్టుకుంటున్నారు. ఎరక్కపోయి వచ్చామా? తొందరపడ్డామా? అని మధనపడుతున్నారు. తెగిన గాలిపటాలైపోయే పరిస్దితి ఎదురుకానుందా? అన్న ఆందోళనలో వున్నారు. పైకి గంభీరంగా కనిపిస్తున్నా, లోలోన వారు పడుతున్న ఇబ్బందులు అంతా ఇంతా కాదు. అటు కాంగ్రెస్లో వున్నట్లు లేదు. ఇటు గెలిచిన పార్టీకి తిరిగి వెళ్లిపోయే పరిస్ధితి లేదు. రెంటికీ చెడిన రేవడిగా తమ రాజకీయం మారుతుందా? అని ఆందోళన చెందుతున్నారు. మూలుగుతున్న నక్కమీద తాటి పండు పడ్డట్టు సుప్రింకోర్టు నోటీసులు జారీ చేయడంతో వారి ఆందోళన మరింత ముదురుతోంది. ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసకోవాలో అర్ధం కాని పరిస్ధితి ఎదురౌతోంది. ఒక వేళ సుప్రింకోర్టులో ఊరట లభిస్తే అన్న చిరు ఆశతో వున్నారు. స్పీకర్ నిర్ణయంపై సుప్రింకోర్టు ఇప్పటికే కొన్ని ప్రశ్నలు సంధించింది. ఇంకా స్పీకర్కు సమయం ఇవ్వకపోవచ్చు. ఆ లోపు ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే పరిస్ధితి ఎలా వుంటుందా? అన్న ఆలోచన కూడా చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒక వేళ సుప్రింకోర్టు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తే ఆ ఎమ్మెల్యేలపై ప్రజల్లో మరింత తీవ్రత పెరుగుతుందని చెప్పడంలో సందేహం లేదు. కండువాలు మార్చినా జై కాంగ్రెస్ అనలేకపోతున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలకు దగ్గర కాలేకపోతున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు కొంత మంది పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఆదరించడం లేదు. ముఖ్యంగా పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యేగా అంగీకరించడానికి ఇష్టపడడం లేదు. అభివృద్ది పనులపై ఎమ్మెల్యే ఎక్కడికి వెళ్లినా కాంగ్రెస్ నాయకులే ఆయనను అడ్డుకుంటున్నారు. అలాంటి ఎమ్మెల్యే మీద అనర్హత వేటు పడితే ఇక కాంగ్రెస్ కూడా ఆయనను ఆదరించదు. ఆయనకు టికెట్ ఇవ్వదు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశాలు జారీచేసినా సరే కాంగ్రెస్ నాయకులు వినే పరిస్దితి వుండదు. ఎందుకంటే గెలిపించాల్సింది ప్రజలు, నాయకులు, కార్యకర్తలే. వారిని ఒత్తిడి తెచ్చి గూడెంకు మళ్లీ టికెట్ ఇచ్చి గెలిపించుకోవడం కుదిరేపని కాదు. కచ్చితంగా ఆయన స్ధానంలో మరొకరికి టికెట్ ఇవ్వకతప్పదు. కార్యకర్తలే తిరుగుబాటు చేస్తుంటే జై కాంగ్రెస్ అనలేకపోతున్నాడు. అలా అని బిఆర్ఎస్ మీద విమర్శలు చేయలేకపోతున్నాడు. సహజంగా పార్టీ మారిన తర్వాత ప్రత్యర్ధి పార్టీని టార్గెట్ చేయకుండా రాజకీయాలు చేస్తే ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు సహించరు. గుంపులో చేరిన తర్వాత ఆ పార్టీ నినాదాలను అందుకోవాలి. కాని పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎవరూ అటు కేసిఆర్ను గాని, ఇటు ఇతర నాయకులపై గాని ఎలాంటి ఆరోపణలు చేయడం లేదు. పార్టీ మారడానికి తొలి అడుగు వేసిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే తొలి రోజుల్లో కొంత దూకుడు ప్రదర్శించాడు. సాక్ష్యాత్తు అసెంబ్లీలోనే బిఆర్ఎస్ ఎమ్మెల్యేలపై నోరు పారేసుకున్నారు. తర్వాత ఆయన కూడా బిఆర్ఎస్ మీద మాట్లాడేందుకు ముందుకు రావడం లేదు. అంతే కాదు ఇటీవల కాలంలో కేసిఆర్ గొప్ప నాయకుడు. భోళా శంకరుడు అంటూ కితాబిస్తున్నారు. బిఆర్ఎస్ నాయకులనేద్దేశించిన వ్యాఖ్యలపై కేటిఆర్ను కలిసి వివరణ కూడా దానం నాగేందర్ ఇచ్చుకున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. ఇక హైడ్రా విషయంలో దానం నాగేందర్ తీవ్ర అసంతృప్తితో వున్నారు. కాంగ్రెస్లో చేరినా తన మాట చెల్లుబాటు కావడం లేదని మధనపడుతున్నాడు. బిఆర్ఎస్ నుంచి వచ్చి, సికింద్రాబాద్ ఎంపిగా పోటీ చేసి కాంగ్రెస్ కోసం త్యాగం చేస్తే తనను గుర్తించేవారు లేకుండాపోయారని అనుకుంటున్నారట. ఇదిలా వుంటే సుప్రింకోర్టు ఒక వేళ దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవిని భర్తరఫ్ చేస్తే రాజకీయ జీవితానికి పుల్ స్టాప్ పడినట్లే అని చెప్పకతప్పదు. పది మంది ఎమ్మెల్యేల భర్తరఫ్ జరిగితే మాత్రం టికెట్ రాని వారిలో దానం నాగేందరే మొదటి వ్యక్తి అవుతారని చెప్పడంలో సందేహం లేదు. సరే మంచో చెడో పార్టీ మారడం జరిగింది. పరిరిస్దితి చేయి దాటిపోయింది. కాంగ్రెస్ పార్టీలోనైనా పూర్తిగా కలిసిపోతున్నారా? అంటే అదీ లేదు. తమకు ఎలాంటి ప్రాదాన్యత లేకుండాపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నా బిఆర్ఎస్పై ఇప్పటి వరకు పల్లెత్తు మాట అనని నాయకులు మళ్లీ తమకు కారులో చోటు దక్కుతుందన్న ఆశతో వున్నట్లు కూడా చెప్పుకుంటున్నారు. అదే జరిగితే ప్రజలు కాంగ్రెస్కన్నా ముందు బిఆర్ఎస్నే చీదరించుకుంటారు. ఉప ఎన్నికలే వస్తే బిఆర్ఎస్కు ఒక్క సీటు కూడా రాదు. అప్పుడు బిజేపికి బంగారు పళ్లెంలో ఎమ్మెల్యేలను అందించినట్లౌవుంది. నిజం చెప్పాలంటే రెండు వైపులా దారులు మూస్తే తప్ప భవిష్యత్తులో ఇలా పార్టీ మారడానికి ఎమ్మెల్యేలు ముందుకు రారు. ప్రజా ప్రభుత్వాలను అసి ్దరపర్చాలనుకోవడం రాజకీయ పార్టీల అనైతిక రాజకీయాలకు పరాకాష్ట. అలాంటి రాజకీయాలను ఎవరూ సహించకూడదు. సమర్ధించకూడదు. పార్టీ మారారు.. కాంగ్రెస్లో ప్రాధాన్యత దక్కకపోయినా పదవి ఊడిపోకుండా వుంటే చాలని కోరుకుంటున్నారు. పొరపాటున ఉప ఎన్నికలు వస్తే మాత్రం పార్టీ మారిన ఎమ్మెల్యేలకు చుక్కలు చూడడం తప్పదు. ఎందుకంటే ఇప్పటికప్పుడు సమీపంలో ఎన్నికలు లేవు. ఓ ఆరు నెలల సమయంలో కేరళ రాష్ట్ర ఎన్నికలున్నాయి. అప్పటి వరకు ఉప ఎన్నికలు రాకపోవచ్చు. అప్పటి వరకు పార్టీ మారిన ఎమ్యెల్యేలు ప్రజల్లో వుండాలంటే దూల తీరిపోతుంది. ప్రజలు ఎన్నికల వాగ్ధానాల మీద నిలదీస్తుంటారు. మళ్లీ ఎన్నికల్లో పోటీ అంటూ వెళ్తే అడుగడుగునా సమాధానం చెప్పుకుంటూ పోవాల్సి వస్తుంది. ఏ మాత్రం బ్యాలెన్స్ తప్పినా మొదటికే మోసం వస్తుంది. ఇప్పటికే పార్టీ మారిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలే ఆదరించడం లేదు. ఇక ప్రజలు కూడా దూరం కొడితే వారి రాజకీయం శంకగిరి మాన్యాలే. ఆరు నెలల పాటు కార్యకర్తల సాధకబాధకాలు చూసుకోవాలి. ఎమ్మెల్యేగా వున్నప్పుడు నాయకులు, కార్యకర్తలు ఇంటి ముందు వచ్చి వాలుతారు. ఎన్నికల సమయంలో ఎమ్మెల్యేలే పార్టీ కార్యకర్తల ఇంటి ముందుకు వెళ్లాల్సిన పరిస్ధితి ఎదురౌతుంది. సరే ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడైనా మూడు నెలుల వుంటేనే ఊపిరి సలపకుండాపోతుంది. అలాంటిది ఆరు నెలల కాలమంటే ఇక ఎమ్మెల్యే అభ్యర్ధులు ఆస్దులమ్ముకొవాల్సిందే. రాజకీయాలు చేయాల్సిందే. వారి కష్టాలు తీర్చేవారు కూడా ఎవరూ వుండరు. ప్రజల్లో వుంటూ, ప్రజలకు సేవ చూస్తూ, వారి మాటల పడుతూ, అడుగడుగునా అవాంతరాలు ఎదుర్కొంటూ వెళ్లినా, ఆఖరు నిమిషంలో టికెట్ దక్కకపోతే ఆ బాధ ఊహిస్తేనే భయంకరంగా వుంటుంది. ఈ సంగతి వాళ్లకు కూడా తెలుసు. అయినా తప్పదు. తన నాయకత్వాన్ని రుజువు చేసుకోవాల్సి వుంటుంది. ప్రత్యర్ధి పార్టీలు నిత్యం వేసే నిందలను భరించాలి. ప్రజలను రెచ్చగొట్టి చేసే రాజకీయాలను ఎదుర్కొవాలి. ఎటు చూసినా మద్దెల వాయింపు తప్పదు. ఆరు నెలల పాటు కడుపు నిండా తిండి వుండదు. కంటి నిండా నిద్ర వుండదు. ఎప్పుడు ఏ సమస్య వచ్చి నెత్తి మీద పడుతుందో తెలియదు. ప్రజలు కూడా తమ సమస్యల పరిష్కారానికి వస్తే సమయం ఇవ్వకపోతే ప్రజల నుంచి ఎదురయ్యే వ్యతిరేకత మామూలుగా వుండదు. అసలే సోషల్ మీడియా కాలం. ఆ పది మంది ఎమ్మెల్యేల చుట్టూ నిత్యం వందలాది సోషల్ మీడియా ప్రతినిధులు వుంటారు. ఎమ్మెల్యేలను వెంటాడుతుంటారు. వారు ఎక్కడికెళ్లితే అక్కడికి వాలిపోతారు. ఎమ్మెల్యేల ఇంటి వద్ద కూడా కొంత మంది ఎప్పుడూ సిద్దంగా వుంటారు. ప్రతి నిమిషాన్ని వివాదం చేయడానికి సిద్దంగా వుంటారు. పిరాయింపు ఎమ్మెల్యేలు పొరపాటున ఎవరి మీద నైనా అసహనం వ్యక్తం చేసినా, ఆ ఎమ్మెల్యే మీద ప్రజలు ఏవైనా వ్యాఖ్యలు చేసినా ఇక సోషల్ మీడియాలో కనిపించే వాయింపు ఓ రేంజ్లో వుంటుంది. ఇన్ని రకాల అవరోధాలును ఎదుర్కొని, సమస్యల వలయాన్ని చేధించుకొని నిలిచేదెవరో..గెలిచేదెవరో.. చూడాలి.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.