ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గోవా ముఖ్యమంత్రులు హాజరు
ఆకట్టుకున్న తమిళనాడు బీజేపీ అధ్యక్షులు అన్నామలై ప్రసంగం
ప్రపంచ వ్యాప్తంగా హిందూ, బౌద్ధ, సిక్కు, జైన ప్రార్థనా స్థలాల అనుసంధానతే లక్ష్యం
ప్రపచంలో దేవాలయాల ఆర్థిక వ్యవస్థ విలువ రూ.6లక్షల కోట్లు
భారత్లో పెరుగుతున్న దేవాలయ పర్యాటకం
కోవిడ్ తర్వాత పెరుగుతున్న తీర్థయాత్రికులు
ఈ నేపథ్యంలోనే హిందూ దేవాలయాల అనుసంధానతకు ప్రాధాన్యం
దేవాలయాలకు గుదిబండగా మారిన ప్రభుత్వ నియంత్రణ
హైదరాబాద్,నేటిధాత్రి:
ప్రపంచ వ్యాప్తంగా దేవాలయాల మధ్య అనుసంధానతను మరింత బలోపేతం చేసే ఉద్దేశంతో ‘ఇంటర్నేషనల్ టెంపుల్స్ కన్వెన్షన్ Ê ఎక్స్పో`2025’ను (ఐ.టి.సి.ఎక్స్`2025) ఫిబ్రవరి 17 నుంచి 19వ తేదీవరకు ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన తిరుపతిలోని ఆశా కన్వెన్షన్లో జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, తమిళనాడు బీజేపీ అధ్యక్షులు అన్నామలై, గోవా మంత్రులు, పార్లమెంట్ సభ్యుల వంటి ప్రముఖులు హజరై ప్రసంగించడం విశేషం. 2023లో తొలి సదస్సు వారణాసిలో జరగ్గా రెండవ సదస్సును తిరుపతిలో నిర్వహించారు. ఇందులో 17 దేశాలకు చెందిన 1581 దేవాలయాల ప్రతినిధులు, మరో 58 దేశాలనుంచి 685దేవాలయాల ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు. ఈ మూడు రోజుల కార్యక్రమంలో 111మంది వక్తలు తమ విలువైన సందేశాలనివ్వగా, 15 వర్క్షాప్లు, 60కంటే ఎ క్కువ ప్రదర్శన శాలలను నిర్వహించారు. దేవాలయాల వారసత్వాన్ని పరిరక్షించడం, వాటి పరి పాలన, ఆలయాల నిర్వహణలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం వంటి అంశాలు ఈ సందర్భంగా చర్చకు వచ్చాయి. ఈ ఎక్స్పోను ‘టెంపుల్ కనెక్ట్’, అంత్యోదయ ప్రతిష్టాన్ సహకారంతో నిర్వహించారు. హిందూ, బౌద్ధ, జైన, సిక్కు ప్రార్థనా స్థలాలను ఒకేతాటి కిందికి తీసుకొనిరావడం దీని ప్రధాన లక్ష్యం.
ఆలయాల సమాచారం డిజిటలీకరణ
‘టెంపుల్స్ కనెక్ట్’ వ్యవస్థాపకులు గిరీష్ కులకర్ణి మరియు ఇంటర్నేషనల్ టెంపుల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్పో ఛైర్మన్, మహారాష్ట్ర శాసన మండలి ఛీఫ్ విప్ ప్రసాద్ లాడ్లు ‘మహాకుంభ్ ఆఫ్ టెంపుల్స్’గా వ్యవహరించే ఐ.టి.సి.ఎక్స్ను ఏర్పాటు చేశారు. భారతీయ మూలాలున్న దేవాలయాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరించి డిజిటల్ రూపంలో భద్రపరచడం ప్రధాన ల క్ష్యంగా టెంపుల్ కనెక్ట్ సంస్థ పనిచేస్తుంది. దేవాలయాల ఆర్థిక వ్యవస్థను మరింత విస్తరించడం కూడా ఐ.టి.సి.ఎక్స్. ప్రధాన ఉద్దేశం. దేవాలయ పర్యాటకాన్ని, నిర్వహణను ప్రోత్సహించడానికి కూడా ఇది కృషిచేస్తుంది.
మతపరమైన లేదా ధార్మిక అవస్థల పరిధికి ఆవల దేవాలయాల నిర్వహణలో మరింత పురోగతి సాధించేందుకు విధానకర్తలు, దేవాలయాల నాయకులు, పారిశ్రామిక నిపుణుల సమన్వయం కోసం ఐ.టి.సి.ఎక్స్`2025 ప్రధానంగా కృషిచేసింది. నిధుల నిర్వహణ, రద్దీ నియంత్రణ, భద్రత వ్యర్థాల నిర్వహణ వంటి అంశాలపై కూడా ఈ ఎక్స్పో దృష్టి కేంద్రీకరించింది. కేంద్ర పర్యాటకమంత్రిత్వశాఖ ఐ.టి.సి.ఎక్స్`2025 ఎక్స్పోకు మద్దతునిచ్చింది. మహారాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ కూడా దీనికి సహాయ సహకారాలను అందజేసింది. అంతేకాదు భారత పురావస్తు పరిశో ధనా సంస్థ, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటకకు చెందిన టూరిజం అండ్ ఎండోమెంట్స్ బోర్డులు కూడా ఈ సదస్సుకు సంపూర్ణ మద్దతును అందజేశాయి. కానీ టెంపుల్ స్టేట్గా పేరుపొందిన తమిళనాడునుంచి సహకారం అందలేదు. కాగా ఈ సదస్సు సందర్భంగా ‘స్మార్ట్ టెంపుల్స్ మిషన్’ను ప్రారంభించడమే కాకుండా, ‘స్మార్ట్ టెంపుల్స్ అవార్డు’లను కూడా ప్రదానం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక లక్షణాలతో అలరారుతున్న 12 దేవాలయాలకు ఈ అవా ర్డులను ప్రదానం చేశారు.
యు.కె.లోని జైన ధర్మశాలలు, ప్రముఖ డివోషనల్ చారిటీస్, హిందూ దేవాలయాల సంఘాల ప్రతినిధులు, అన్నక్షేత్ర మేనేజ్మెంట్లు, వివిధ పుణ్యక్షేత్రాలకు చెందిన పురోహిత్ మహాసంఘా లు, తీర్థయాత్రలను ప్రోత్సహించే బోర్డులకు చెందిన సభ్యులు కూడా ఈ సదస్సుల్లో పాల్గన్నారు. ఇస్కాన్, శ్రీమందిర్, దుర్లభ్ దర్శన్, సరస్వత్ ఛాంబర్, క్రిస్టల్ ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, ఒ.ఎన్.డి.సి, హల్దీరామ్ వంటి సంస్థలు ఐ.టి.సి.ఎక్స్`2025కు స్పాన్సరర్లుగా వ్యవహ రించాయి.
ప్రపంచ వ్యాప్తంగా 32 లక్షల దేవాలయాలు
ప్రపంచ వ్యాప్తంగా 32లక్షల దేవాలయాలు, ప్రధానంగా భారత్కు చెందిన ఆలయాలను ఒకే వేదిక కిందికి తీసుకొని రావడం ఐ.టి.సి.ఎక్స్`2025 ప్రధాన లక్ష్యం. ఈ దేవాలయాల మొత్తం ఆర్థిక వ్యవస్థ రూ.6లక్షల కోట్లు! ఇప్పుడు వీటన్నింటినీ ఒకే నెట్వర్క్ కిందికి తెచ్చే యత్నాలు జరుగుతున్నాయి. ఆవిధంగా వీటన్నింటినీ ప్రజలకు పారదర్శకమైన రీతిలో అందుబాటులోకి తేవడం కూడా దీని ప్రధాన ఉద్దేశం. ఐ.టి.సి.ఎక్స్ ఇప్పటికే ప్రపంచంలోని 12వేల దేవాలయాలతో అనుసంధానత ఏర్పరచుకోగలిగింది. కోవిడ్ మహమ్మారి తర్వాత దేవాలయాల సందర్భన బా గా పెరిగింది. ఉదాహరణకు కోవిడ్కు ముందు వైష్ణోదేవి ఆలయానికి రోజుకు 10 నుంచి 15వే లమంది భక్తులు సందర్శించేవారు. కానీ కోవిడ్ తర్వాత వీరి సంఖ్య 32వేలు`40వేల మధ్య వుంటోంది. పంజాబ్లోని స్వర్ణ దేవాలయాన్ని ఇప్పుడు రోజుకు లక్షమంది సందర్శిస్తున్నారు. ఇది కూడా కోవిడ్కు పూర్వం కంటే చాలా ఎక్కువ. కేరళలో ప్రఖ్యాత గురువాయూర్ దేవాలయన్ని కోవిడ్కు ముందు రోజుకు 4వేలమంది దర్శిస్తే ఇప్పుడు వారి సంఖ్య 6 నుంచి 7వేలకు పెరి గింది. ప్రస్తుతం భారత్లో పర్యాటక పరిశ్రమ ద్వారా 80 మిలియన్ల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. ఎందుకంటే ఏటా పర్యాటకుల సంఖ్య 19శాతం చొప్పున పెరుగుతోంది. అదేవిధంగా ప్రపంచ వ్యాప్తంగా మతపరమైన పర్యాటక మార్కెట్ 2032 నాటికి ఏకంగా 2.22బిలియన్ యు.ఎస్. డాలర్లకు చేరుతుందని కేపీఎంజీ సంస్థ అంచనా వేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ పర్యాటకం ఏటా సగటున 6.25% వృద్ధిని నమోదు చేస్తోంది.
చంద్రబాబు ప్రసంగం
ఈ ఎక్స్పోలో పాల్గన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృత్రిమ మేధ, బ్లాక్ ఛైన్, సుస్థిర ఇంధన పరిష్కారాల ద్వారా దేవాలయాల నిర్వహణను మరింత ఆధునీకరించాల్సిన అవసరం వుందన్నారు. ఆధ్యాత్మిక, ఆర్థిక కేంద్రాలుగా వున్న దేవాలయాలను సృజనాత్మక రీతి లో నిర్వహించాలన్నారు. ఫలితంగా వీటి సాంస్కృతిక ప్రభావశీలత బలీయంగా వుండగలదన్నా రు. ఇదే సమయంలో తిరుపతి ఆధ్యాత్మిక వారసత్వ ప్రాశస్త్యాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలని ప్రపంచ ప్రతినిధులను కోరారు.
హెచ్ఆర్ Ê సి.ఇ. చట్టం వల్ల అనర్థాలు
రెండో రోజు ఐ.టి.సి.ఎక్స్ా2025లో తమిళనాడు బీజేపీ అధ్యక్షులు అన్నామలై ప్రసంగిస్తూ త మిళనాడులో ప్రస్తుతం అమల్లో వున్న ‘హిందూ రిలిజియస్ అండ్ ఛారిటబుల్ ఎండోమెంట్ యాక్ట్ (హెచ్ఆర్Ê సి.ఇ.)’ వల్ల కలుగుతున్న అనర్థాలను ఆకట్టుకునే రీతిలో వివరించారు. ఈ చట్టాన్ని ఎత్తేయాలని, హిందూ దేవాలయాలపై ప్రభుత్వాల నియంత్రణ వుండకూడదని కోరారు. తిరుమల తిరుపతి దేవస్థానం మార్కెట్ విలువ రూ.2.5లక్షలకోట్లని పేర్కొంటూ, ప్రపంచంలోని చాలా ప్రముఖ సంస్థలకంటే ఇదెంతో విలువైందన్న సంగతిని గుర్తుచేశారు. తమిళనాడులో అమల్లో ఉన్న హెచ్ఆర్Ê సి.ఇ. చట్టం హిందూ దేవాలయాల ఆర్థిక పురోభివృద్ధికి గుదిబండలా మారిందని పేర్కొన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఈ చట్టాన్ని ఎత్తేస్తామని స్పష్టం చేశారు. వెంకటేశ్వరస్వామి దయవల్ల తాము తమిళనాడు పగ్గాలు చేపడితే రాష్ట్రంలోని 44121 దేవాల యాలకు స్వేచ్ఛను ప్రసాదిస్తామన్నారు. దేవాలయాల ఆర్థిక వ్యవస్థ, తమ చుట్టుపక్కల ప్రదేశా ల్లోని స్కూళ్ల నిర్వహణ, పౌర మౌలిక సదుపాయాల కల్పన, సెంటర్స్ ఫర్ ఎక్స్లెన్స్ ఫర్ సైన్స్ వంటి కేంద్రాల నిర్వహణలో ఎంతో ఉపయోగపడుతున్న సంగతిని గుర్తుచేశారు. తమిళనాడులో ఆలయాల ఆర్థిక వ్యవస్థ నిర్వహణను ప్రభుత్వాలు దుర్వినియోగం చేస్తున్నా ఇంతటి సామాజిక సేవను చేస్తున్న దేవాలయ వ్యవస్థను మరింత పటిష్టం చేయాల్సిన అవసరం వుందన్నారు. చోళ రాజులు ఎంత చక్కగా దేవాలయాలను నిర్వహించిందీ ఆయన వివరించారు. ఈ దేవాలయాలు కేవలం ధార్మిక కేంద్రాలు మాత్రమే కాదు, ధనిక, పేద వర్గాలను ఒక్కచోటుకు చేర్చే ప్రదేశాల న్న సంగతిని ఆయన గుర్తుచేశారు. భారత్ను ఒకే తాటిపై నిలుపుతున్నది దేవాలయాలు మాత్ర మే. ఈ నేపథ్యంలో ఆధ్యాత్మిక సుగంధాన్ని పునరుద్ధరించడం సనాతనధర్మంలో భాగమేనన్నారు.తొలి సదస్సు వారణాసిలో
ఇంటర్నేషనల్ టెంపుల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్పో (ఐ.టి.సి.ఎక్స్ా2023) 2023 జులై 22 నుంచి 24వ తేదీ వరకు వారణాసిలో జరిగింది. ఆర్.ఎస్.ఎస్. సర్సంఫ్ుచాలక్ మోహన్ భాగవత్ దీన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అప్పటి టీటీడీ ఇ.ఒ. ధర్మారెడ్డి కూడా పాల్గన్నారు. మొత్తం 25 దేశాలనుంచి 450కి పైగా దేవాలయాలకు చెందిన ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గన్నారు. వీరిలో హిందూ, బౌద్ధ, జైన, సిక్కు ప్రార్థనా స్థలాకు చెందిన వారుండటం విశేషం. వారణాసిలోని రుద్రాక్ష కన్వెన్షన్ సెంటర్లో జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రార్థనా స్థలాల్లో ఉత్తమ ప్రార్థనా రీతులను ప్రవేశపెట్టడం ప్రధానలక్ష్యమని టెంపుల్ కనెక్ట్ వ్యవస్థాపకులు గిరీష్ కుల కర్ణి, ఐటీసీఎక్స్ ఛైర్మన్ ప్రసాద్ లాడ్లు ఈ సదస్సులో స్పష్టం చేశారు. టెంపుల్ కనెక్ట్ను గిరీష్ కులకర్ణి 2016లో స్థాపించారు.