ఈ టార్చర్‌ మేం భరించలేం!

`సబ్‌ రిజిస్ట్రార్ల ఆందోళన, ఆవేదన.

`మంత్రి పొంగులేటికి, ఉన్నతాధికారులకు రిజిస్ట్రార్ల లేఖ.

`మీడియా ముసుగులో వచ్చే వారిని తట్టుకోలేం!

`ఎవరు అసలో..ఎవరు నకిలో తెలియడం లేదు.

`మీడియా పేరు చెప్పి వచ్చే ప్రతి ఒక్కరినీ గుర్తించలేం.

`సమయమంతా వారికి కేటాయించడంతోనే సరిపోతోంది.

`సమాధానం చెప్పడంతోనే సగం సమయం వృధా అవుతోంది.

`వివరణలు ఇవ్వడానికే గంటలు కరిగిపోతున్నాయి.

`అసత్య వార్తలన్నింటికీ జవాబుదారీలం కాలేము.

`జవాబులు చెప్పుకుంటూ కూర్చుంటే కొలువులు చేయలేము.

`సోషల్‌ మీడియాకు నియంత్రణ లేకపోతే వారిని కంట్రోల్‌ చేయలేము.

`రిజిస్ట్రేషన్‌ కోసం వచ్చే వారు పది మంది!

`లేని పోని వార్తలతో వచ్బే జర్నలిస్టులు పదుల సంఖ్యలు.

`గాలి వార్తలు..వసూల్‌ రాజాలు!

`లేని పోని వార్తలు సృష్టిస్తున్నారు.

`ప్రజల్లో రిజిస్ట్రార్లను మరింత చులకన చేస్తున్నారు.

`రిజిస్ట్రేషన్‌కు వచ్చే వాళ్లంతా అనుమానంగా చూస్తున్నారు

`డాక్యుమెంట్‌ రైటర్లు, సోషల్‌ మీడియా జర్నలిస్టులు కలిసి భ్రష్టు పట్టిస్తున్నారు

`డాక్యుమెంట్‌ రైటర్ల నుంచి లేని సమాచారం సేకరించి అభూత కల్పనలు రాస్తున్నారు

`రిజిస్ట్రార్లు అవినీతికి పాల్పడుతున్నారని వార్తలు రాస్తున్నారు

`నిజాలకన్నా అబద్దాలకే విలువెక్కువైంది

`మా జీవితాలు అనుమానాలతో సతమతమౌతున్నాయి

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

పీత కష్టాలు పీతవి, సీత కష్టాలు సీతవి అని సామెత. కానీ అసలు దర్జా, దర్పం వెలగబెట్టే వారికి కూడా కష్టాలుంటాయా? వస్తాయా? ఇబ్బంది పెడతాయా? ఊపిరి సలపకుండా చేస్తాయా? అంటే అవునని కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఎప్పుడూ ఎవరూ వినని సందర్భం, సందేహం కావడంతో ఒకింత ఆశ్చర్యమే అనిపిస్తుంది. కాకపోతే అది నిజం. ఈ మధ్య తెలంగాణలోని సబ్‌ రిజిస్ట్రార్లు ఈ టార్చర్‌ మేం భరించలేం! బాబోయ్‌ అంటున్నారు. నిజంగానే రిజిస్ట్రార్లు ఈ మాటలు అంటున్నారా? అని ఆరా తీస్తే అవుననే అంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే సబ్‌ రిజిస్ట్రార్లు తీవ్ర అందోళన చెందుతున్నారు. ఆవేదనకు గురౌతున్నారు. మేము ఈ కొలువు చేయలేకపోతున్నామని గొల్లు మంటున్నారు. ఉద్యోగం చేయలేమని చెబుతున్నారు. దాంతో కొంతమంది సబ్‌ రిజిస్ట్రార్లు రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి కి, ఇతర ఉన్నతాధికారులకు ఓ లేఖ రాసినట్లుగా సమాచారం అందుతోంది. నిత్యం కార్యాలయాలకు వెళ్లాలంటే ఇబ్బందులు ఎదురౌతున్నాయని ఆ లేఖలో గోడు వెళ్లబోసుకున్నారు. ఈ విషయం నేటిధాత్రి దృష్టికి వచ్చింది. ఆ లేఖ సారాంశం అందింది. తెలంగాణ వ్యాప్తంగా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి నిత్యం వచ్చే జర్నలిస్టులతో వేగలేకపోతున్నామన్నది ఆ లేఖ సారాంశం. ప్రతి రోజు పదుల సంఖ్యలో వచ్చే జర్నలిస్టులలో అసలు జర్నలిస్టులు ఎవరు? జర్నలిస్టుల ముసుగులో వచ్చిందెవరో తేల్చుకోలేక రిజిస్ట్రార్లు సతమతమౌతున్నారట. మీడియా ముసుగులో వచ్చే వారిని తట్టుకోలేకపోతున్నామని సబ్‌ రిజిస్ట్రార్లు లేఖ రాశారు. రిజిస్ట్రేషన్‌ కార్యాలయానికి వచ్చే జర్నలిస్టులలో ఎవరు అసలో..ఎవరు నకిలో తెలియడం లేదు. మీడియా పేరు చెప్పి వచ్చే ప్రతి ఒక్కరినీ గుర్తించలేమంటున్నారు. పదుల సంఖ్యలో జర్నలిస్టులు రావడం సమయం కోరడం, వారు ప్రశ్నల మీద ప్రస్నలు అడగడం జరుగుతోంది. తమకు సంబంధం లేని అంశాలను, వారి ఊహలను మా నెత్తిన రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఏ వార్త ఎందుకు రాస్తున్నారో, ఎవరిని అడిగి రాస్తున్నారో అర్థం కావడం లేదు. ముఖ్యంగా సోషల్‌ మీడియా జర్నలిస్టులు రాసే ప్రతి విషయానికి సమాధానం చెబుతూ వెళ్తే కొలువు చేయడానికి సమయం సరిపోవడం లేదు. ఏ రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో ఒక రోజు ఎన్ని రిజిస్ట్రేషన్లు జరిగాయన్న పూర్తి సమాచారం నెట్‌లో దొరుకుతుంది. అయినా అర్థం పర్థం లేని వార్తలు రాస్తున్నారు. కట్టు కథలు అల్లి వీడియోలు తయారు చేస్తున్నారు. ఆరోపణలు చేస్తూ వండి వారుస్తున్నారు. ఆ వార్తలకు తలా తోక వుండడం లేదు. నిజంగానే ఏదైనా పొరపాటు జరిగితే జర్నలిస్టులకు రాసే హక్కు వుంది. కానీ జరగనవి జరిగినట్లు కల్పిత కథలు సృష్టించి మా మనోభావాలను దెబ్బ తీస్తున్నారని రిజిస్ట్రార్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వార్తలపై అటు ఇతర జర్నలిస్టులకు సమాధానం చెప్పుకోవడమే కాదు, పై స్థాయి అధికారులకు కూడా వివరణలు ఇచ్చుకోవాల్సి వస్తుంది. వచ్చే వార్తలలో ఏవి నిజమో..ఏవి అబద్ధమో అర్థం కాక ఉన్నతాధికారులు వివరణలు అడుగుతున్నారు. ఇలా రోజంతా ఆ తలనొప్పితోనే గడిచిపోతోంది. దాంతో మా రిజిస్ట్రేషన్‌ కోసం ఎన్ని సార్లు తిరగాలంటూ ప్రజలు కూడా నిలదీస్తున్నారు. ఏదో ఆశించే రిజిస్ట్రార్లు కాలయాపన చేస్తున్నారని అనుమానపడుతున్నారు. మేం ఎదురుకుంటున్న ఈ సమస్యలు అధికారులు పట్టించుకోవడం లేదు. మీడియా అర్థం చేసుకోవడం లేదు. రోజుల్లో సగానికి పైగా సమయమంతా వారికి కేటాయించడంతోనే సరిపోతోంది. మా బాధ ఎవరూ పట్టించుకోవడం లేదు. వినిపించుకోవడం లేదు. జర్నలిస్టులను రానివ్వకపోతే ఏదో జరుగుందని మళ్ళీ వార్తలు రాస్తారు. సమాధానం చెప్పడంతోనే సగం సమయం వృధా అవుతోంది. జర్నలిస్టులకు వివరణలు ఇవ్వడానికే గంటలు కరిగిపోతున్నాయి. జర్నలిస్టులు రాసే ప్రతి వార్తకు,అసత్య వార్తలన్నింటికీ జవాబుదారీలం కాలేము. ఇలా నిరంతరం జవాబులు చెప్పుకుంటూ కూర్చుంటే కొలువులు చేయలేము. నిజంగానే ఏదైనా అవకతవకలు జరిగితే రుజువులతో సహా వార్తలు రాయండి. నిందారోపణలే లక్ష్యంగా వార్తలు రాసి మనో భావాలు దెబ్బ తీయొద్దని సూచిస్తున్నారు. సోషల్‌ మీడియాకు నియంత్రణ లేకపోతే వారిని కంట్రోల్‌ చేయలేము. రిజిస్ట్రేషన్‌ కోసం వచ్చే వారు పది మంది! లేని పోని వార్తలతో వచ్బే జర్నలిస్టులు పదుల సంఖ్యలుగా వుంటున్నారు. గాలి వార్తలు..వసూల్‌ రాజాలు!గా మారిన వాళ్లంతా తెల్లారి లేస్తే రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలలోనే వుంటున్నారు. రిజిస్ట్రేషన్‌ కోసం వచ్చిన వారి పనులు తొందరగా ముగించాలా? లేక జర్నలిస్టులకు సమాధానాలు చెప్పుకుంటూనే కూర్చోవాలో అర్థం కావడం లేదు. వీళ్ల పరిస్థితి ఇలా వుంటే డాక్యుమెంట్‌ రైటర్ల ఆగడాలు మరో రకంగా వుంటున్నాయి. కొత్తగా వచ్చిన రిజిస్ట్రార్లకు చుక్కలు చూపిస్తున్నారు. లేని పోని వార్తలు సృష్టించి, కొంత మంది జర్నలిస్టులకు సమాచారం అందిస్తున్నారు. అది నిజమనుకొని ఎలాంటి ఆధారాలు కూడా అడక్కుండానే కొంత మంది జర్నలిస్టులు వార్తలు రాసేస్తున్నారు. ప్రజల్లో రిజిస్ట్రార్లను మరింత చులకన చేస్తున్నారు. రిజిస్ట్రేషన్‌కు వచ్చే వాళ్లంతా అనుమానంగా చూస్తున్నారు. డాక్యుమెంట్‌ రైటర్లు, సోషల్‌ మీడియా జర్నలిస్టులు కలిసి భ్రష్టు పట్టిస్తున్నారు. డాక్యుమెంట్‌ రైటర్ల నుంచి లేని సమాచారం సేకరించి అభూత కల్పనలు రాస్తున్నారు. రిజిస్ట్రార్లు అవినీతికి పాల్పడుతున్నారని వార్తలు రాస్తున్నారు. నిజాలకన్నా అబద్దాలకే విలువెక్కువైంది. మా జీవితాలు అనుమానాలతో సతమతమౌతున్నాయి. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా రెవిన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, శాఖకు చెందిన ఉన్నతాధికారులు ఈ సమస్యలకు పరిష్కారాలు ఆలోచించాలని సబ్‌ రిజిస్ట్రార్లు కోరుతున్నారు.

ప్రకంపనలు సృష్టిస్తున్న సీపీఎం ముసాయిదా

మోదీ ప్రభుత్వం ఫాసిస్ట్‌ లేదా నియోఫాసిస్ట్‌ కాదన్న సీపీఎం

భగ్గుమన్న కాంగ్రెస్‌, సీపీఐ

కేరళ రాజకీయాలను కుదిపేస్తున్న సీపీఎం మారిన వైఖరి

ఎల్‌డీఎఫ్‌పై ఎదురుదాడిని పెంచిన కాంగ్రెస్‌

సీపీఎం వ్యూహాన్ని విపక్షాలు అర్థం చేసుకోవడంలేదా?

వచ్చే ఏడాదిలో కేరళ అసెంబ్లీకి ఎన్నికలు

చాపకింద నీరులా వ్యవహరిస్తున్న బీజేపీ

హైదరాబాద్‌,నేటిధాత్రి:

భారత రాజకీయాల్లో కమ్యూనిస్టులు, భారతీయ జనతాపార్టీ`ఆర్‌ఎస్‌ఎస్‌లు పరస్పర విరుద్ధ భావజాలాలు కలిగినవన్న సంగతి మనకు తెలిసిందే. నిజం చెప్పాలంటే కమ్యూనిస్టు సిద్ధాంతానికి, భాజపా అనుసరించే జాతీయవాద సిద్ధాంతానికి ఉప్పు`నిప్పు సంబంధమంటే అతిశయోక్తి కాదు. అటువంటిది కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ ఇండియా (మార్క్సిస్ట్‌) వచ్చే ఏప్రిల్‌ నెలలో పార్టీ కాంగ్రెస్‌ జరుగనున్న నేపథ్యంలో ఒక ముసాయిదాను విడుదల చేసింది. భాజపాను ఫాసిస్ట్‌, నియో`ఫాసిస్ట్‌ పార్టీగా ఎప్పుడూ తనదైన శైలిలో విమర్శించే సీపీఐ(ఎం) ఈసారి ముసాయిదాలో నరేంద్రమోదీ ప్రభుత్వం ‘నియో`పాసిస్ట్‌’ లేదా ‘ఫాసిస్ట్‌’గా పిలవడానికి అవసరమైన అర్హతలు లేవని పేర్కొనడం దేశంలో ఒక్కసారి రాజకీయ ప్రకంపనలు రేకెత్తించింది. ఈ ముసాయిదా విడుదల కాగానే కాంగ్రెస్‌, కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (సీపీఐ)లు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. నిజం చెప్పా లంటే ఈ ముసాయిదా విపక్షపార్టీల మధ్య కొత్త విభేదాలను సృష్టించడమే కాదు, వాటిల్లో నెల కొన్న నిలకడలేని రాజకీయాలను మరోసారి బట్టబయలు చేసింది.

విషయమేంటంటే వచ్చే ఏప్రిల్‌ నెలలో సీపీఐ(ఎం) పార్టీ 24వ కాంగ్రెస్‌ మీటింగ్‌ జరుగనుంది. పార్టీ రాజకీయ తీర్మానానికి సంబంధించి ముసాయిదా నోట్‌ను రూపొందించి తన రాష్ట్ర శాఖలకు పంపింది. ఇటువంటి ప్రతి పార్టీ కాంగ్రెస్‌ సమావేశానికి ముందు ఇటువంటి ముసాయిదానుపంపడం రివాజు. అయితే ఇప్పటివరకు బీజేపీ`ఆర్‌ఎస్‌ఎస్‌పై పార్టీ అనుసరిస్తున్న వైఖరిపై సీపీఎం యూటర్న్‌ తీసుకోవడమే ఈ ముసాయిదాలోని ఆశ్చర్యం కలిగించే విశేషం! నిజానికి బీజేపీ`ఆర్‌ఎస్‌ఎస్‌లను ఫాసిస్ట్‌ అజెండాతో ముందుకెళ్లేవిగా సీపీఎం ఎప్పుడూ విమర్శిస్తూ రావడం కద్దు. మాజీ సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి గతంలో మోదీ ప్రభుత్వాన్ని, ఫాసిజాన్ని సమాంతర రేఖలుగా వివరించడానికి ప్రయత్నించారు. ఇదిలావుండగా సీపీఎం తన అభిప్రాయాన్ని సమర్థించుకోగా, సహచర సీపీఐ మాత్రం ఈ ‘తప్పిదాన్ని’ సరిదిద్దుకోవాలని డిమాండ్‌ చేసింది. 1964లో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ ఇండియా సీపీఎం మరియు సీపీఐలుగా చీలిపోయిన సంగతి తెలిసిందే. ఇక కాంగ్రెస్‌ ఒక అడుగు ముందుకేసి సీపీఎం కేవలం తన ఉనికికోసమే ఈవిధంగా మాటమార్చిందంటూ విరుచుకుపడిరది.

సీపీఎం, సీపీఐ మరియు కాంగ్రెస్‌లు జాతీయస్థాయిలో ఒకే కూటమిలో వుండగా, కేరళలో మా త్రం సీపీఎం, సీపీఐల కూటమితో ఏర్పడిన ఎల్‌డీఎఫ్‌ ప్రభుత్వం అధికారంలో వుంది. ఇక కాంగ్రెస్‌ నేతృత్వంలోని యు.డి.ఎఫ్‌. ఈ రాష్ట్రంలో విపక్షంలో వుంది. సీపీఎం తాజా వైఖరి నేపథ్యంలో ప్రముఖ రచయిత తుషార్‌ గాంధీ ‘ఎక్స్‌’వేదికలో ఈవిధంగా పోస్ట్‌ చేశారు. ‘‘కేరళ సీపీఎం మోదీ ప్రభుత్వాన్ని ఫాసిస్ట్‌గా అంగీకరించడంలేదు. అంటే ఇప్పుడు సీపీఎం తన ఎర్ర జెండానుమడతపెట్టి, ఆర్‌ఎస్‌ఎస్‌ను కేరళలోకి ‘రెడ్‌ కార్పెట్‌’ వేసి మరీ ఆహ్వానించాలని చూస్తున్నదనుకోవాలా? ఇప్పుడు ‘లాల్‌’ కాస్తా ‘భగ్వా’గా మారిపోయిందా?’’ అంటూ ప్రశ్నించారు.
మోదీ ప్రభుత్వం ‘నియో`ఫాసిస్ట్‌’ లక్షణాలను ప్రదర్శిస్తున్నప్పటికీ, దాన్ని ‘ఫాసిస్ట్‌ లేదా నియో` ఫాసిస్ట్‌’గా పిలిచేందుకు అవసరమైన యోగ్యతలు దానికి లేవని సీపీఎం ముసాయిదా స్పష్టం చేసింది. ‘మేం మోదీ ప్రభుత్వాన్ని ఫాసిస్ట్‌ లేదా నియో`ఫాసిస్ట్‌ అని ఎప్పుడూ పేర్కొనలేదు. ఇదేసమయంలో భారత్‌ను నియో`ఫాసిస్ట్‌ రాజ్యంగా పరిగణించడంలేదు. మేం చెప్పేదల్లా ఒక్కటే. ఆర్‌ఎస్‌ఎస్‌ రాజకీయ విభాగమైన బీజేపీ పదేళ్లుగా దేశాన్ని పాలిస్తోంది. ఈ కాలంలో బీజేపీ`ఆర్‌ఎస్‌ఎస్‌లు దేశంలో రాజకీయ సుసంఘటితను సాధించాయి. దీని ఫలితంగా నియో`ఫాసిస్ట్‌ లక్షణాలు వ్యక్తమవడం మొదలైంది’ అని సీపీఎం ముసాయిదా తీర్మానం పేర్కొంది. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు బాలన్‌ పార్టీ అభిప్రాయాన్ని గట్టిగా సమర్థించారు. ‘‘మేం ఎప్పుడూ బీజేపీ ప్రభుత్వాన్ని ఫాసిస్ట్‌గా వ్యవహరించలేదు. ఫాసిజం మళ్లీ పురుడుపోసుకుందన్న మాట కూడా మేం ఎప్పుడూ అనలేదు. నిజంగా ఫాసిజం దేశంలోని ప్రవేశిస్తే రాజకీయ నిర్మాణం ఒక్కసారిగా మారిపోతుంది.’ అని బాలన్‌ పేర్కొన్నట్టు మీడియాలో వార్తలు వచ్చాయి. సీపీఐ, సీపీఐ (ఎంఎల్‌)లు తమ అభిప్రాయానికి భిన్నంగా దేశంలోకి ఫాసిజం వచ్చేసిందని భావిస్తున్నాయి, అని కూడా బాలన్‌ పేర్కొ న్నారు. నిజానికి దేశంలోకి ఫాసిజం వచ్చిందని భావిస్తే అందుకు రుజువులు చూపండి అని బాలన్‌ కోరినట్టు మళయాల న్యూస్‌ పోర్టల్‌ ‘మాధ్యమం’ పేర్కొంది.

మధ్యంతరాసామ్రాజ్యయుగంలో పురుడుపోసుకున్న క్లాసికల్‌ాఫాసిజానికి మరియు నియోాఫాసిజానికి మధ్య వున్న తేడాను తాము గుర్తించామని, ఇది కేవలం నియోాలిబరలిజంలో చోటుచేసుఉన్న సంక్షోభం నుంచి పుట్టుకొచ్చింది మాత్రమేనని సీపీఎం పేర్కొంది. నియోాఫాసిజం నిజా నికి ప్రజాస్వామ్య చట్రంలో నిరంకుశ లక్షణాలు కలిగివుంటుందని, క్లాసికల్‌ాఫాసిజం మాదిరిగా కాకుండా ఇది పూర్తిగా ఎన్నికల వ్యవస్థనే తిరస్కరిస్తుందని వివరించింది.
కేరళ అసెంబ్లీకి 2026లో ఎన్నికలు జరుగనున్నాయి. ప్రస్తుత సీపీఎం వైఖరిని, కేరళ కాంగ్రెస్‌ తనకు అనుకూలంగా మార్చుకోవడానికి యత్నాలు మొదలుపెట్టింది. ఎల్‌డీఎఫ్‌ ప్రభుత్వాన్ని గద్దెదింపాలన్న లక్ష్యంతో పనిచేస్తున్న కాంగ్రెస్‌ ‘ప్రస్తుత సీపీఎం వైఖరి పూర్తిగా దాని వ్యాపారధోరణికి నిదర్శనం’ అని విమర్శించింది. కేరళలో సీపీఎంను ఇకనుంచి ‘కమ్యూనిస్ట్‌ జనతా పార్టీ’ (సీజేపీ)గా పిలవాలంటూ ఎద్దేవా చేసింది. సీపీఎంకు, బీజేపీకి మధ్య అంతర్గతంగా ‘అంగీకారం’ కుదిరిందా? అంటూ అనుమానం వ్యక్తం చేసింది. ఫాసిస్ట్‌ బీజేపీ ప్రభుత్వాన్ని ఫాసిస్ట్‌ కాదనడమంటే ఆపార్టీకి సీపీఎం కోవర్ట్‌గా వ్యవహరిస్తోందా? అన్న అనుమానం వ్యక్తం చేసింది.
‘సీపీఎం ఉన్నతస్థాయిలో తీసుకొచ్చిన కొత్త సిద్ధాంతం నేపథ్యంలో ఇప్పటివరకు సెక్యూలర్‌ విలువలకోసం పోరాడే పార్టీగా భావించేవారు, నేటివరకు వామపక్షంగా పరిగణిస్తూ తప్పుచేశామన్న భావనకు గురవుతారు. గత అసెంబ్లీ, లోక్‌సభ మరియు ఇతర ఉప`ఎన్నికల్లో క్రమంగా రైట్‌ వింగ్‌వైపుకు మారుతున్న పరిణామాలు, సీపీఎంను దేశంలో అతిపెద్ద ప్రతిపక్ష పార్టీగా స్థానం లేకుండా చేస్తున్నాయి. అంతేకాదు ఈ పార్టీ ప్రస్థానం ముగింపు దశలో ఉన్నదన్న సత్యాన్ని వెల్లడిస్తున్నాయి’ అని కేరళ కాంగ్రెస్‌ పేర్కొంది.

కేరళ అసెంబ్లీలో విపక్ష నేత వి.డి. సతీశన్‌ మాట్లాడుతూ ప్రస్తుత సీపీఎం వైఖరి, బీజేపీతో దానికున్న రహస్య ఒప్పందాన్ని వెల్లడిస్తోందని ఆరోపించారు. ‘కేరళలో సీపీఎం ఎప్పుడూ ఫాసిజంతోశాంతిగానే వ్యవహరిస్తోంది. సంఫ్‌ుపరివార్‌తో అది ఒక అంగీకారానికి వచ్చింది. ఈ సంబంధాన్ని సుస్థిరం చేసుకోవడానికి ఇప్పుడు మోదీ ప్రభుత్వం ఫాసిస్ట్‌ కాదంటూ కొత్త ముసాయిదాను ముందుకు తెచ్చింది. మోదీతో చేతులు కలపడానికి, సంఘపరివార్‌తో శాంతి ఒప్పందం ద్వారా వారికి లంగిపోవడానికి సీపీఎం సిద్ధపడిరది’’ అని సతీశన్‌ ఆరోపించారు.
కేవలం కాంగ్రెస్‌ మాత్రమే కాదు సీపీఐ కూడా సీపీఎం వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కేరళప్రభుత్వంలో సీపీఎంకు జూనియర్‌ భాగస్వామిగా కొనసాగుతున్న సీపీఐ, ‘సీపీఎం ముసాయిదా లో చేసిన తప్పిదాన్ని సరిదిద్దుకోవాలి’ అని డిమాండ్‌ చేస్తోంది. ఆర్‌ఎస్‌ఎస్‌ అంటేనే ఒక ఫాసిస్ట్‌ సంస్థ. ఆర్‌ఎస్‌ఎస్‌ కింద పనిచేసే మోదీ నేతృత్వంలోని బీజేపీ కూడా ఫాసిస్ట్‌ ప్రభుత్వమే. ఈ నేపథ్యంలో సీపీఎం తన పంథాను సరిదిద్దుకోవాలని కేరళ సీపీఐ ప్రధాన కార్యదర్శి బినోయ్‌ విశ్వం డిమాండ్‌ చేసినట్టు మీడియాలో వార్తలు వచ్చాయి.
విషయాన్ని పరిశీలిస్తే కేరళలో రాబోయే ఎన్నికల నేపథ్యంలో సీపీఎం, వ్యవహారజ్ఞానంతో సమ తుల్య వైఖరితో అడుగులు ముందుకేస్తుంటే, సీపీఐ మాత్రం తన వైఖరిలో ఏవిధమైన మార్పులే కుండా పూర్వపు పంథాతోనే ముందుకెళుతుండటం వర్తమాన చరిత్ర చెబుతున్న సత్యం. ఇక కాంగ్రెస్‌ కేరళలో ఎల్‌డీఎఫ్‌ ప్రభుత్వానికి వ్యతిరేకమే కనుక, అధికారంలోకి రావడానికి సీపీఎం వైఖరిని ఒక అవకాశంగా తీసుకొని మరింత దూకుడుగా ముందుకెళ్లే వైఖరిని అనుసరిస్తోంది. ఏది ఏమైనా సీపీఎం తాజాగా మారిన తన వైఖరితో విపక్షాలను ఒక్క కుదుపునకు లోను చేసిందనడంలో ఎంతమాత్రం సందేహంలేదు.
ఇక్కడ మరో ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. కేరళలో క్రమంగా బీజేపీ ఓటింగ్‌ శాతం పెరుగుతున్న నేపథ్యంలో, ఇది ఇలాగే వచ్చే ఎన్నికల్లో కూడా జరిగితే తాము నష్టపోక తప్పదన్న అభిప్రాయానికి సీపీఎం వచ్చి వుండాలి. అందుకనే రాష్ట్రంలోని హిందువుల్లో పెరుగుతున్న జా గృతి పవనాలను గుర్తించే తాను బీజేపీకి వ్యతిరేకం కాదన్న ముద్రను సుస్థిరం చేసుకుంటే, వచ్చే అసెంబ్లీ హిందూ ఓట్లను కాపాడుకోవచ్చన్నది సీపీఎం వ్యూహం కావచ్చు. ఓట్లశాతం పెరుగు తున్నా కేరళలో బీజేపీ ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకునే స్థాయికి ఇంకా ఎదగలేదు. కానీ పెరుగుతున్న బీజేపీ అనుకూల ఓటింగ్‌ అధికార ఎల్‌డీఎఫ్‌ను దెబ్బతీస్తుంది. ఈ వ్యూహంతోనే తాను బీజేపీకి వ్యతిరేకం కానన్న భావనను ప్రజల్లోకి తీసుకెళ్లగలిగితే, బీజేపీ ఎట్లాగూ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు కనుక, ఆ పార్టీకి అనుకూల ఓట్లను తమవైపుకు తిప్పుకోవచ్చన్న సీపీఎం వ్యూహం నిజమైతే సహచర పార్టీలు తొందరపడి సీపీఎంను విమర్శిస్తున్నాయనుకోవాలి. ఇదే సమయంలో భాజపా కూడా ఈ ట్రాప్‌లో పడకుండా తన ఓటు బ్యాంకును సుస్థిరం చేసుకుంటూనే మరింత చొచ్చుకెళ్లేలా ప్రణాళికలు రూపొందించాల్సి వుంటుంది.

తక్కువ ప్రీమియంతో పూర్తి స్థాయిలో నష్టపరిహారం అందేవిదంగా చూడాలి.

తక్కువ ప్రీమియంతో పూర్తి స్థాయిలో నష్టపరిహారం అందేవిదంగా చూడాలి

తెలంగాణ రైతు రక్షణ సమితి ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు కిషన్ రావు

పరకాల నేటిధాత్రి
రాష్ట్ర సర్కారు పంటల బీమా పథకాన్ని వెంటనే అమలు చేయాలని తెలంగాణ రైతు రక్షణ సమితి ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు వరికెల కిషన్ రావు ఆర్డిఓ డాక్టర్, కె.నారాయణ కు వినతిపత్రం సమర్పించారు.రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది ఎకరాలలో వరి పంట సాగులో ఉన్నదని,యాసంగి వరి పంటకు దోమ పోటు,అగ్గి తెగులు,వడగండ్ల వానలతో కోలుకోలేని విధంగా గతంలో రైతులకు పెద్ద ఎత్తున నష్టం జరిగిందని గుర్తు చేశారు.మామిడి పంట కూడా చాల సందర్భాలలో పంట కోసే ముందు పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉన్నదని వెల్లడించారు.పంటల భీమా పథకం అమలులో ఉంటే, రైతు ప్రభుత్వం దయాదాక్షి ణ్యములపైన ఆధారపడాల్సిన అవసరం ఉండదని,హక్కుగా పూర్తి స్థాయిలో నష్ట పరిహారం పొందే వీలుంటుందని చెప్పారు.లేనిచో ప్రభుత్వం ఇచ్చే అతి తక్కువ పరిహారం తో సరి పెట్టుకొని అప్పుల పాలై పెద్ద ఎత్తున వడ్డి సంవత్సర కాలం కడుతూ నష్టపోవలిసి ఉంటుందని వివరించారు.ఇప్పటికే పంటలు ఎండుతున్నట్టు,రైతు ఆత్మహత్యలు అక్కడక్కడ జరుగుతున్నట్టు వార్తలు వస్తున్నవని,రాష్ట్రములో రుణ మాఫీ పూర్తి స్థాయి లో అమలు కాక,రైతు భరోసా కొరకు ఇంకెన్నాళ్లు ఎదురు చూడాలో తెలువని పరిస్థితి లో రైతులు దిగులుతో ఉన్నారని స్పష్టం చేశారు.
ఇలాంటి పరిస్థితిలో ప్రకృతి వికటించి పెద్ద ఎత్తున నష్టం జరిగినచో రైతు తట్టుకోలేడని ఆవేదనతో తెలిపారు. ప్రస్తుతానికి ప్రధాన మంత్రి ఫసల్ భీమా యోజన అమలు చేసే అవకాశం లేనందున భవిష్యత్తు లో పంట నష్టం పెద్ద ఎత్తున జరిగే అవకాశం ఉన్న వరి,మిరప మొక్కజొన్న మామిడి పంటల రైతులకు అండగా ఉండడానికి రాష్ట్ర ప్రభుత్వం పూనుకొని పంటల భీమా పథకం అమలు పరిచే కంపెనీల తో చర్చలు జరిపి, వారిని ఒప్పించి అతి తక్కువ ప్రీమియం తొ ఇప్పటినుంచి పంటలు చేతి కి వచ్చే వరకు పంటల భీమా పథకం అమలు చెయ్య వలిసినదిగా విజ్ఞప్తి చేశారు.రైతును పూర్తి స్థాయిలో ఆదుకొనే చర్యలు వెంటనె చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో రైతులు నాయకులు సురావు బాపూరావు,లోనే సతీష్,కోడెం రవీందర్ తదితరులు రైతులు పాల్గొన్నారు.

పవన్‌ ఒప్పుకున్నట్లే!

`లోకేష్‌ కు లైన్‌ క్లియరైనట్లే!!

`లోకేష్‌ కు సీఎం గా పట్టాభిషేకమే!

`త్వరలోనే లోకేష్‌ ముఖ్యమంత్రి అయినట్లే. 

`అందుకు పవన్‌ కళ్యాణ్‌ వ్యాఖ్యలు నిదర్శనమే

`పదిహేళ్ల పాటు కూటమి కొనసాగుతుందని పవన్‌ ఉవాఛ.

`అంటే లోకేష్‌ ను సీఎంగా ఒప్పుకున్నట్లే లెక్క.

`అయితే ఆలస్యం కూడా చేయొద్దు.

`నాయకులు మాట్లాడిన ప్రతి మాట నిజం కాదు.

`ప్రతి మాటకు కట్టుబడి వుంటారన్న నమ్మకం లేదు.

`పరిస్థితుల ప్రభావం అని మాట తప్ఫొచ్చు.

`పార్టీ శ్రేణుల ఒత్తిళ్లంటూ పవన్‌ మాట మార్చవచ్చు.

`రాజకీయాలలో శాశ్వత మిత్రులు ఎక్కడా వుండరు.

`అవసరాల కోసం దారులు వెతుక్కునే పదవులే వుంటాయి.

`పదవి కాంక్ష లేకుండా రాజకీయాలు ఎవరూ చేయరు.

`పవన్‌ మాట మీద నిలబడతాడా? అన్నది డౌటే!

`లోకేష్‌ ను సీఎం చేయడానికి పవన్‌ను ఒప్పించే ప్రయత్నం.

`ఈ ఏడాదిలోనే లోకేష్‌ ను సీఎం చేయాలని టిడిపి పట్టు.

`సమయం కోరుతున్న పవన్‌?

`ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికల తర్వాత పరిస్థితులను బట్టి అని పవన్‌ మెలిక?

`యూపిలో బిజేపి హాట్రిక్‌ సాధిస్తే లోకేష్‌ ఆశలు ఆవిరి?

`శాసనమండలి ఎన్నికలు కూడా ప్రభావం చూపొచ్చు.

`టీడీపీ విజయం సాధిస్తే లోకేష్‌ కు పట్టాభిషేకం వాయిదా పడొచ్చు!

`ఓడిపోతేనే లోకేష్‌ కు లైన్‌ క్లియర్‌ కావొచ్చు!

`ఇలాంటి పరిస్థితి చాలా విచిత్రమైనది.

`ఏ రకంగా చూసినా లోకేష్‌ సిఎం కావడానికి మార్గం పడేదే!

 

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

తెలుగు దేశం పార్టీ శ్రేణులు సంతోషపడే వార్త. సంబరాలు చేసుకోవాల్సిన వార్త. చినబాబు మంత్రి లోకేష్‌ ఆంద్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి కావడానికి మార్గం సుగమమౌతున్నదనే విషయం స్పష్టమౌతున్న వార్త. అవును..చాలా తొందరగానే లోకేష్‌ కు ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం నిర్వహించే సమయం ఆసన్నమౌతోంది. అందుకు ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ కూడా సై అంటున్నట్లు విశ్వసనీయ సమాచారం. లోకేష్‌ ను ముఖ్యమంత్రిని చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదని సాక్షాత్తు పవన్‌ కళ్యాణ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తో కూడా పంచుకున్నట్లు తెలుస్తోంది. ఏపి రాజకీయాలలో నవ శకం రావాలంటే యువ తరం రాజకీయాలు పురుడు పోసుకోవాలని పవన్‌ కూడా అభిప్రాయపడుతున్నట్లు అర్థమౌతోంది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ని, వైసిపిని మరో పదిహేళ్ల పాటు నిలువరించాలంటే కూటమి వుండాలని పవన్‌ బలంగా కోరుకుంటున్నట్లు స్వయంగా చెప్పారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే కూటమికి బీటలు రాకుండా చూసుకునే బాధ్యత నాది అని కూడా అసెంబ్లీలో పవన్‌ కళ్యాణ్‌ తేల్చి చెప్పారు. ఏపి బాగుపడాలన్నదే తన తపన అన్నారు. రాష్ట్రాభివృద్ది కోసం ఎలాంటి త్యాగాలైనా చేయడానికి తాను సిద్దమని పవన్‌ చెప్పారు. ఎందుకంటే ఎన్ని రోజులైనా, ఇంకెంత కాలమైనా తెలుగు దేశం పార్టీకి భవిష్యత్తు నాయకుడు లోకేష్‌ మాత్రమే. ఆయనను కాదని మరెవరూ అధ్యక్షుడు కాలేరు. తెలుగు దేశం పార్టీ అధికారంలోకి ఇంకా ఎన్ని సార్లు వచ్చినా ముఖ్యమంత్రి కావాల్సింది లోకేష్‌ మాత్రమే. ఈ విషయం జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ కు స్పష్టంగా తెలుసు. పవన్‌ మొదటి నుంచి చెబుతూనే తన శ్రేణులను సమాయత్తం చేస్తూనే వున్నాడు. అయితే కొంత మంది జనసేన నాయకులు పవన్‌ వ్యాఖ్యలకు నొచ్చుకుంటున్నారు. పవన్‌ ఇలా నిర్ణయం తీసుకుంటే మా భవిష్యత్తు ఏం కావాలి? అనే ప్రశ్నలు కూడా మొదలయ్యాయి. అయినా పార్టీ పచ్చగా వుంటేనే నాయకులు, కార్యకర్తలు వుంటారు. పార్టీ అధికారంలో వుంటే జిందాబాద్‌ లు కొడతారు. గతంలో వుండే పరిస్థితులు ఇప్పుడు లేదు. ప్రతిపక్షంలో వుంటే నాయకులు, శ్రేణులు ఎంత కాలమైనా పార్టీని కాపాడుకునే వారు. ఇప్పుడు ఆ రోజులు లేవు. తనేమిటో తన పార్టీ పరిస్థితి ఏమిటో పవన్‌ కళ్యాణ్‌ కు బాగా తెలుసు. కలలు కొన్ని నిజాలు కాకపోవచ్చు. అందువల్ల పవన్‌ కళ్యాణ్‌ చాలా దూరదృష్టితోనే కూటమి ఎల్లకాలం కొనసాగుతుందని చెప్పి వుండొచ్చు. అంటే లోకేష్‌ సిఎం కావడానికి పవన్‌ ఒప్పుకున్నట్లే! అనే మాటలు వినిపిస్తున్నాయి. సిఎం కావడానికి లోకేష్‌ కు లైన్‌ క్లియరైనట్లే!!అనే సంకేతాలు వినిపిస్తున్నాయి. లోకేష్‌ కు సిఎం గా పట్టాభిషేకమే! అని పార్టీలో వినిపిస్తోంది. అయితే ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు ఆలస్యం కూడా చేయొద్దు. నాయకులు మాట్లాడిన ప్రతి మాట నిజం కాదు. వాళ్లు మాట్లాడిన ప్రతి మాటకు కట్టుబడి వుంటారన్న నమ్మకం లేదు. అందుకు పవన్‌ కళ్యాణ్‌ అతీతుడు కాదు. ఆయనలోనూ మార్పు రాదనే హామీ ఎవరూ ఇవ్వలేరు. ఎందుకంటే రాజకీయమే అవకాశవాదానికి చిహ్నం. రాజకీయాలలో ఆశావాదమే కాదు, అవకాశ వాదం లేకపోతే ముందుకు వెళ్ళలేదు. పదవులు కావాలనుకున్నప్పుడు గాలి ఎటు వీస్తే అటు మళ్లితేనే అందుతాయి. ఎలాంటి నాయకుడైనా తాను అందరికంటే ఎత్తులో వుండాలనే కోరుకుంటారు. నేను మరో నాయకుడి పల్లకి ఎల్ల కాలం మోస్తానని చెబితే అబద్దమే అవుతుంది. రాజకీయాలలో నీతి, నిజాయితీ అనే పదాలకు చోటు ఎప్పుడూ వుండదు. పైకి సిద్దాంతాలు, రాద్దాంతాలు ఎన్ని మాట్లాడినా అవకాశ వాదాన్ని మించిన రాజకీయం ఎప్పుడూ ముందు పడదు. అందువల్ల పరిస్థితుల ప్రభావం అని పవన్‌ ఎప్పుడైనా మాట తప్ఫొచ్చు. నాకు ప్రాధాన్యత తగ్గుతుందని అలక చెందొచ్చు. పక్కనుండే నాయకులు కలత చెందవచ్చు. మిమ్మల్ని నమ్ముకున్న వారికి అన్యాయం చేస్తారా? ప్రశ్నించొచ్చు. మీ నాయకత్వం కోసం పని చేస్తామే కానీ మరో పార్టీ కండువా కప్పుకోమని జనసేన నాయకులు అనవచ్చు. అప్పుడు పవన్‌ కళ్యాణ్‌ కు తప్పకపోవచ్చు. పార్టీ శ్రేణుల ఒత్తిళ్లంటూ పవన్‌ మాట మార్చవచ్చు. రాజకీయాలలో శాశ్వత మిత్రులు ఎక్కడా వుండరు. పవన్‌ ఇప్పటి వరకు పెట్టుకున్న పొత్తులను చూస్తేనే అర్థం చేసుకోవచ్చు. గతంలో తెలుగు దేశం తో సాగారు. తర్వాత వామపక్షాలతో కూడారు. మరి కొంత కాలం తర్వాత బిఎస్పీ అధినేత మాయావతి కాళ్లకు దండం పెట్టారు. పొత్తుకు సై అన్నారు. వాస్తవ రాజకీయాలను బాగా గమనించి మళ్ళీ కూటమికి సై అన్నారు. సామ్యవాద రాజకీయం నుంచి సనాతన ధర్మం వైపు దారి మార్చుకున్నాడు. తెలుగు దేశం పొత్తు తో తొలిసారిగా అసెంబ్లీ లో అడుగుపెట్టారు. ఏకంగా ఉప ముఖ్యమంత్రి పదవి అలంకరించారు. ఎందుకంటే అవసరాల కోసం దారులు వెతుక్కునే పదవులే వుంటాయి. పదవి కాంక్ష లేకుండా రాజకీయాలు పవన్‌ కళ్యాణే కాదు ఎవరూ చేయరు. కాలం గడిస్తే పవన్‌ మాట మీద నిలబడతాడా? అన్నది డౌటే! అందువల్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంత తొందరపడితే అంత మంచిది. ఆలస్యం అమృతం విషం. లోకేష్‌ ను సిఎం చేయడానికి పవన్‌ను ఒప్పించే ప్రయత్నం పెద్దగా చేయాల్సిన అవసరం కూడా లేదు. లోకేష్‌ ను సిఎం చేయొద్దనే హక్కు పవన్‌కు లేదు. లోకేష్‌ ను సిఎం చేయొద్దు అనేది పొత్తు ధర్మంలో లేదు. అందుకే ఈ ఏడాదిలోనే లోకేష్‌ ను సిఎం చేయాలని టిడిపి పట్టు పడుతోంది. అయితే పవన్‌ కొంత సమయం కోరుతున్నారా? అనేది తేలాల్సి వుంది. అయితే యుపి ఎన్నికలయ్యేదాకా సాగ దీయాలని పవన్‌ చూస్తున్నట్లు కొందరు అంచనా వేస్తున్నారు. దేశంలో బిజేపి అప్రతిహతంగా రాష్ట్రాలను కైవసం చేసుకుంటూ వెళ్తోంది. మూడోసారి ఉత్తర ప్రదేశ్‌ ను బిజేపి గెలుచుకుంటే ఇక దేశంలో ఆ పార్టీకి తిరుగుండదు. అప్పుడు పవన్‌కు కూడా బలం పెరుగుతుందని చెప్పడంలో సందేహం లేదు. యూపిలో బిజేపి హాట్రిక్‌ సాధిస్తే లోకేష్‌ ఆశలు ఆవిరౌతాయని మాత్రం కచ్చితంగా చెప్పొచ్చు. అంతే కాకుండా శాసనమండలి ఎన్నికలు కూడా ప్రభావం చూపొచ్చు. కాకపోతే ఇక్కడ రెండు రకాల వాదనలు వినిపిస్తున్నాయి. మండలి ఎన్నికలలో టిడిపి విజయం సాధిస్తే లోకేష్‌ కు పట్టాభిషేకం వాయిదా పడొచ్చు! ఒకవేళ టిడిపి ఓడిపోతేనే లోకేష్‌ కు లైన్‌ క్లియర్‌ కావొచ్చు! గెలిస్తే ప్రజల మద్దతు మనకే వుందని చంద్రబాబు నాయుడే కొంత ఆలస్యం చేయొచ్చు. ఇలాంటి పరిస్థితి చాలా విచిత్రమైనది. కానీ ఏ రకంగా చూసినా లోకేష్‌ సిఎం కావడానికి మార్గం పడేదే!అది ఎప్పుడు అనేది చంద్రబాబు నిర్ణయం మీద మాత్రమే ఆధారపడి వుంది.

ముగిసిన మహా కుంభమేళా

తర్వాతి మహాకుంభమేళా 20157లో

66.21కోట్ల మంది స్నానాలతో ఆల్‌ టైమ్‌ రికార్డ్‌

ముగింపు సందర్భంగా మహా హారతి

మహాశివరాత్రి రోజునే 1.53కోట్ల మంది స్నానాలు

ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్మాత్మిక మేళా

ప్రపంచ వ్యాప్తంగా గూగూల్‌, వీకీపీడియాల్లో రికార్డు స్థాయిలో సెర్చ్‌లు

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

‘యద్భావం తద్భవతి’ అన్న నానుడిని నిజం చేస్తూ ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కుంభమేళా ఫిబ్రవరి 26తో ముగిసింది. 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ కుంభమేళా తర్వాతి మహోత్సవం 2157లో జరుగనుంది. ప్రతి పన్నెండు సంవత్సరాలకోమారు వచ్చే కుంభమేళాలు 12 ముగిసిన తర్వాత 144 సంవత్సరాలకు వచ్చేదే మహా కుంభమేళా. ఇది కేవలం ప్రయాగ్‌ రాజ్‌లో మాత్రమే జరుగుతుంది. కుంభమేళాలు నాలుగు రకాలు. నాలుగేళ్లకోమారు జరిగేది కుంభమేళా, ఆరేళ్లకోమారు వచ్చేది అర్థ కుంభమేళా, 12 ఏళ్లకోమారు వచ్చేది పూర్ణ కుంభమేళా అదేవిధంగా 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చేది మహా కుంభమేళా. ఇప్పుడు ప్రయాగ్‌ రాజ్‌ లో జరిగింది మహా కుంభమేళా. మొత్తం 45రోజుల పాటు ఎంతో ఉత్సాహంగా జరిగిన ఈ మహా ఆధ్యాత్మిక ఉత్సవంలో ఫిబ్రవరి 26 వరకు 66.21 కోట్ల మంది పవిత్ర స్నానాలు ఆచరించారని ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించింది. ఈ సంఖ్య దేశంలోని మొత్తం హిందూ జనాభాలో సగం కంటే ఎక్కువ కావడం గమనార్హం. 

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర మంత్రులు, భూటాన్‌ రాజు సైతం ఈ సందర్భంగా త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని పటిష్టమైన చర్యలు తీసుకున్నప్పటికీ కొన్ని అపశ్రుతులు చోటుచేసుకున్నాయి. ప్రయాగ్‌రాజ్‌లో తొక్కిసలాటలో 30 మంది మరణించడం, ఢల్లీి రైల్వేస్టేషన్‌లో తొక్కిసలాటలో మరో 18మంది దుర్మరణం వంటివి మనసుకు బాధకలిగించేవే. ఇక్కడ విపక్షాలు ఆరోపిస్తున్న విధంగా ప్రభుత్వ వైఫల్యం కాదు, ప్రజల్లో క్రమశిక్షణా రాహిత్యం ఇటువంటి అనుకోని దుర్ఘటనలకు కారణమవు తున్నాయన్నది పరిస్థితులను గమనిస్తే తెలుస్తుంది. జనవరి 13న ప్రారంభమై ఫిబ్రవరి 26న ముగిసిన కుంభమేళాలో మహాశివరాత్రి సందర్భంగా త్రివేణి సంగమం వద్ద ఇచ్చిన మహా హారతితో 144 సంవత్సరాలకోమారు వచ్చే ఈ మహా క్రతువు ముగిసింది. మహాశివరాత్రి రోజున కేవలం ఒక్కరోజునే 1.53కోట్ల మంది త్రివేణి సంగమంలో స్నానాలు ఆచరించారు. 

మే 2న తెరుచుకోనున్న కేదార్‌నాథ్‌ ఆలయం

ఈసారి మహాకుంభమేళా ముగింపు రోజైన మహాశివరాత్రి పర్వదినాన కేదార్‌నాథ్‌ దేవాలయాన్నితెరిచే రోజును ప్రకటించారు. వచ్చే మే 2వ తేదీన ఉదయం ఏడుగంటలకు వృషభ లగ్నంలో కేదార్‌నాథ్‌ ఆలయ తలుపులు తెరచుకుంటాయి. దీంతో చార్‌ధామ్‌ యాత్ర ప్రారంభమవుతుంది. కేదార్‌నాథ్‌ దేశంలోని 12 జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటి. గుజరాత్‌లోని సోమనాథ్‌, నాగేశ్వర్‌ ఆలయం, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీశైల మల్లికార్జున క్షేత్రం, మధ్యప్రదేశ్‌లోని మహాకాళేశ్వర, ఓంకారేశ్వర ఆలయం, ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌ ఆలయం, మహారాష్ట్రలోని భీమశంకర, త్రయంబకేశ్వర ఆలయం, ఉత్తరప్రదేశ్‌లోని కాశీ విశ్వనాథ ఆలయం, జార్ఖండ్‌లోని వైద్యనాథస్వామి ఆల యం, తమిళనాడులోని రామేశ్వరం, మహారాష్ట్రలోని ఘృష్ణేశ్వర్‌ ఆలయం…వీటిని ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలుగా వ్యవహరిస్తారు.

తొలిసారి కుంభమేళా ప్రస్తావన

క్రీ.శ.629ా645 మధ్యకాలంలో భారతదేశంలో పర్యటించిన చైనా యాత్రికుడు హుయాన్‌త్సాంగ్‌ లేదా జియాంజంగ్‌ రచనల్లో తొలిసారి చారిత్రకంగా కుంభమేళా ప్రస్తావన కనిపిస్తుంది. ఇంపీరియర్‌ గెజిట్‌ ఆఫ్‌ ఇండియా ప్రకారం 1892లో ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన కుంభమేళా సంద ర్భంగా పెద్దఎత్తున కలరా సోకింది. అప్పటి అధికార్లు పెద్దఎత్తున సహాయ కార్యక్రమాలు అమ లచేసారు. ఇందులో భాగంగా హరిద్వార్‌ పునరుద్ధరణ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. 1903 కుంభమేళాకు సుమారు నాలుగు లక్షలమంది హాజరుకాగా, 1954 కుంభమేళాలో తొక్కిసలాట జరిగి 500 మంది ప్రాణాలు కోల్పోయారు. 1998 ఏప్రిల్‌ 14న హరిద్వార్‌లో జరిగినకుంభమేళాకు పదిమిలియన్ల మంది ప్రజలు హాజరయ్యారు. 2001లో అలహాబాద్‌ (ప్రయాగ్‌ రాజ్‌) కుంభమేళాకు ఆరవై మిలియన్ల మంది హాజరుకాగా వీరిలో ఒక మిలియన్‌ ప్రజలు విదేశాలవారు కావడం విశేషం. 

పరమహంస యోగానంద రచించిన ఒక యోగి ఆత్మకథ ప్రకారం 1892లో ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన కుంభమేళా సందర్భంగా ఆయన గురువు యుక్తేశ్వర్‌ మహరాజ్‌ తొలిసారి మహావతార్‌ బాబాను కలుసుకున్నారు. 1989లో కుంభమేళా సందర్భంగా ఫిబ్రవరి 6న ప్రయాగ్‌ రాజ్‌లో 1.5కోట్ల మంది హాజరు కావడంతో గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో నమోదైంది. 

సినిమాలు, డాక్యుమెంటరీలు

1982లో దిలీప్‌రాయ్‌ తీసిన ‘అమ్రిత కుంభేర్‌ సంథానే’ చిత్రంలో కుంభమేళాను చూపించారు. 2001లో మెరీజియో బెనజో, నిక్‌డేలు కుంభమేళాపై ‘‘ది గ్రేటెస్ట్‌ షో ఆన్‌ ది ఎర్త్‌’’ పేరుతో ఒక డాక్యుమెంటరీ తీశారు. దీనితో పాటు నదీముద్దీన్‌ 2004లో ‘‘సాంగ్స్‌ ఆఫ్‌ ది రివర్‌’’, ‘‘ఇన్వొకే షన్‌’’, ‘‘కుంభమేళా’’ పేరుతో తీసిన డాక్యుమెంటరీలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. సి.బి.ఎస్‌.సండే మార్నింగ్‌ అనే ప్రముఖ అమెరికన్‌ మార్నింగ్‌ షో 2010 ఏప్రిల్‌లో 18న ప్రసారం చేసిన కార్యక్రమంలో హరిద్వార్‌ కుంభమేళాను ప్రపంచంలోనే అత్యధిక ప్రజలు పాల్గనే మతకార్యక్రమంగా వర్ణించింది. 

అఖాడాల నిర్వహణలో

మన దేశంలో ఈస్ట్‌ ఇండియా కంపెనీ పరిపాలన ప్రారంభమయ్యే వరకు ఈ కుంభమేళాలను ‘అఖాడా’లు నిర్వహించేవి. కుంభ స్నానాల సందర్భంగా అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు, ఇతరత్రా సదుపాయాలు కల్పించేవారు. అంతేకాదు హిందువులకు ఆధ్యాత్మిక మార్గాన్ని చూపేవారుగా ఈ అఖాడాలకు చెందిన సాధువులను పరిగణించేవారు. 17వ శతాబ్ద కాలంలో ఈ అఖాడాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగేదని కూడా ఈస్ట్‌ ఇండియా కంపెనీ రికార్డులను బట్టి తెలుస్తోంది. ముఖ్యంగా 1760లో హరిద్వార్‌లో జరిగిన కుంభమేళాలో శైవ సాధువులైన గోసాయిన్లు, వైష్ణ వ సాధువులైన బైరాగుల మధ్య ఘర్షణ జరిగినట్టు ఈస్ట్‌ ఇండియా కంపెనీ రికార్డుల్లో నమోదైంది. మరాఠా పీష్వా ముద్రించిన రాగి శాసనంలో 1789లో నాసిక్‌లో జరిగిన కుంభమేళా సందర్భంగా శైవ సన్యాసులు, వైష్ణవ బైరాగి సాధువుల మధ్య గొడవలు జరిగినట్లు పేర్కొనివుంది. ఈవిధంగా అఖాడాల మధ్య నిరంతరం గొడవలు జరుగుతున్న నేపథ్యంలో 18వ శతాబ్దంలో ఈస్ట్‌ఇండియా కంపెనీ కలుగ జేసుకొని ఈ కుంభమేళాల సందర్భంగా క్యాంపులను ఏర్పాటు చేసి పన్నులు వసూలు చేయడం మొదలుపెట్టింది. అంతేకాదు కంపెనీ అధికార్లు ఏ అఖాడా ఎప్పుడు స్నానం చేయాలన్న నియమనిబంధనలను అమలుచేసింది. ఈస్ట్‌ ఇండియా కంపెనీ ఈ కుంభ మేళాకు వచ్చేవారిపై ‘యాత్రపన్ను’ విధించడం ద్వారా ఆదాయం పొందే కోణంలోనే ఆలోచిం చింది. చివరకు 1870 నాటికి కుంభమేళా నాటి బ్రిటిష్‌ ప్రభుత్వ పర్యవేక్షణలో జరిగింది. బ్రిటిష్‌ ప్రభుత్వం విధిస్తున్న పన్నులను ప్రయాగ్‌వాల్‌ పండాలు (ప్రయాగ్‌రాజ్‌లోని బ్రాహ్మణులు) తీ వ్రంగా వ్యతిరేకించారు. పన్నులు వసూలు చేస్తున్నా ప్రభుత్వం సదుపాయాల గురించి పట్టించుకునేది కాదు. చివరకు 1938లో లార్డ్‌ ఆక్‌లాండ్‌ ఈ యాత్రపన్నును రద్దు చేయడంతో కుంభ మేళాకు హాజరయ్యే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇదిలావుండగా 1857 సిపాయిల తిరుగుబాటు నేపథ్యంలో, బ్రిటిష్‌ ప్రభుత్వం ఈకుంభమేళాలను తిరుగుబాటును ప్రోత్సహించే కేం ద్రాలుగా పరిగణించి తగిన జాగ్రత్తలు తీసుకునేది. కాగా 1895లో అమెరికాకు చెందిన ప్రముఖ రచయిత, వ్యాసకర్త మార్క్‌ ట్వైన్‌ ( అసలు పేరు సామ్యూల్‌ లాంఘోర్న్‌ క్లీమెన్స్‌) ప్రయాగ్‌రాజ్‌లోని కుంభమేళాను సందర్శించాడు. ‘‘ఈ కుంభమేళా సమాజానికి ఆధ్యాత్మితను, ఐకమత్యాన్ని, భక్తిని, విలువలను ప్రభోదిస్తాయి’’ అని ఆయన తన రచనల్లో పేర్కొన్నాడు. అంతేకాదు కుంభమేళా సందర్భంగా పెద్ద ఎత్తున వ్యాపారాలు కూడా జరిగేవి. బుఖారా, కాబూల్‌, తుర్కిస్తాన్‌, అరబ్‌లు, పర్షియన్లు హరిద్వార్‌ కుంభమేళాలో పాల్గని తమ వ్యాపారాలను నిర్వహించేవారు. ఆహారధాన్యాలు, నిత్యావసరాలు, బమ్మలు వంటివి వ్యాపారులు అమ్మ కాలు జరిపేవారు. రెండో ప్ర పంచ యుద్ధ కాలంలో బ్రిటిష్‌ ప్రభుత్వం కుంభమేళాను నిషేధించింది. ఇంధన కొరత ఏర్పడు తుందన్న భయమే ఇందుకు కారణం. ఇదేసమయంలో జపాన్‌ కుంభమేళా జరిగే ప్రాంతంపై బాంబు వేస్తుందన్న ప్రచారం జరగడంతో 1942 కుంభమేళాకు చాలా తక్కువమంది ప్రజలు హజరయ్యారు.1947 దేశ స్వాతంత్య్రం తర్వాత అధికారంలోకి వచ్చిన రాష్ట్ర ప్రభుత్వాలు కుంభమేళా నిర్వహణ బాధ్యతలను నిర్వహించడం మొదలుపెట్టాయి. 

తొక్కిసలాటలు, తప్పిదాలు

1820లో హరిద్వార్‌ కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటలో 485 మంది మరణించారు. తర్వాత కంపెనీ ప్రభుత్వం తొక్కిసలాటలను నివారించేందుకు ఘాట్లను అభివృద్ధి చేయడం, మౌలిక సదుపాయాల కల్పన వంటి చర్యలు తీసుకుంది. 19`20 శతాబ్దాల్లో తొక్కిసలాటలు అడపాదడపాచోటుచేసుకున్నాయి. ఇటువంటి సంఘటనలు జరిగిన తర్వాత ఆయా ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల పెంపును అప్పటి ప్రభుత్వాలు చేపట్టాయి. ఇదిలావుండగా 1885లో ఒక హుస్సేన్‌ అనే అధికారిని కుంభమేళా మేనేజర్‌గా నాటి బ్రిటిష్‌ ప్రభుత్వం నియమించడం వివాదానికి దారితీ సింది. ఇతను యూరోపియన్‌ పురుషులు, మహిళలకోసం విలాసవంతమైన బోట్లను ఏర్పాటు చేయడమే కాకుండా, వీటిల్లో యువతులతో నృత్యాలు, మద్యం, బీఫ్‌ను ఏర్పాటు చేయడంతో, వారు విలాసంగా వీటిల్లో ప్రయాణిస్తూ, స్నానం చేస్తున్న భక్తులను వీక్షిస్తూ ‘ఎంజాయ్‌’ చే శారని అప్పటి దినపత్రికల్లో వార్తలు ప్రచురితం కావడంతో ప్రభుత్వ చర్య రచ్చకు దారితీసింది.

వివాదాల మధ్య భారీ కలెక్షన్లతో దూసుకెళుతున్న ‘ఛావా’

ట్రైలర్‌ రిలీజ్‌ నుంచీ వివాదాలే

తాజాగా వందకోట్ల పరువు నష్టం వేస్తామంటూ హెచ్చరికలు

అయితే కలెక్షన్లలో తగ్గేదే లే అంటున్న చిత్రం

వివాదాలే చిత్రాలకు ప్రచారంగా మారుతున్న వైనం

మార్కెటింగ్‌కి ట్రెండ్‌గా మారిన వివాదాలు

వివాదాల్లో చిక్కినా నష్టపోయిన సినిమాలు అసలు లేవనే చెప్పాలి

నిర్మాతకు శుభసూచికంగా మారుతున్న వివాదం

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

ఒక చిత్రం విడుదలకు ముందే వివాదల్లో ఇరుక్కుంటే దానికొచ్చే కలెక్షన్లే వేరు. ఇది ప్రస్తుతం మనదేశంలోని అన్ని భాషా చిత్రాలకు వర్తిస్తుంది. మరాఠా చక్రవర్తి ఛత్రపతి శివాజీని దేశవ్యా ప్తంగా హిందువులు ఎంతగానో ఆరాధిస్తారు. హిందూ ధర్మ పరిరక్షణకోసం నాటి మొఘల్‌ చక్రవర్తి ఔరంగజేబ్‌ విస్తరణ కాంక్షను గణనీయంగా దెబ్బతీసిన మరాఠావీరుడు ఆయన. ఆయన తదనంతరం శివాజీ కుమారుడు శంభాజీ కూడా తండ్రిబాటలోనే పయనించి చివరకు ఔరంగజేబ్‌చేతికి చిక్కి చిత్రహింసలకు గురై మరణించాడన్నది చారిత్రక కథనం. ఈ కథనంపై ఆధారపడి తీసిన చిత్రమే ‘ఛావా’. ఈ చిత్రం ఫిబ్రవరి 14న విడుదల కాకముందే గత నెలలో నిర్వాహకు లు విడుదల చేసిన ట్రైలర్‌ చూపిన ఒక నృత్యంపై వివాదం రేగింది. ఎట్టకేలకు ఆ వివాదం ముగిసిందనుకుంటే ఇప్పుడు నిర్మాతలకు పరువునష్టం దావా కేసు రూపంలో మరో కష్టం వచ్చిపడిరది. చిత్రంలో గనోజీ, చెన్హోజీ షిర్కేలను నెగెటివ్‌గా చూపించారంటూ వారి వారసులు ఆగ్రహం వ్యక్తం చేయడమే కాదు, ఏకంగా చిత్ర దర్శకుడు లక్ష్మణ్‌ ఉటేకర్‌పై వందకోట్ల రూపాయల పరువునష్టం దావా వేస్తామని హెచ్చరించడం తాజా పరిణామం. ఇంత వివాదంలోనూ చిత్రం ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా రూ.450కోట్లు వసూళ్లు రాబట్టడం విశేషం. 

ఈ రెండు పాత్రలను మరాఠీ నటులు సువ్రత్‌ జోషి, సారంగ్‌ సతాయేలు పోషించారు. మొఘల్స్‌కు శంభాజీ ఎక్కడ వున్నదీ వీరు తెలియజేసినట్టు చిత్రంలో చూపించారు. గనోజీ, చెన్హోజీ షిర్కే లు, శంభాజీ అనుపానులు చెప్పడంవల్లనే మొఘల్‌ సైన్యాలు ఆయన్ను పట్టుకోవడం తర్వాత ఔరం గజేబ్‌ చిత్రహింసలకు గురిచేసి చంపేసినట్టు చిత్రంలో చూపించారు. ఈ నేపథ్యంలో షిర్కే కుటుంబ వారసులు చిత్ర నిర్వాహకులకు ఫిబ్రవరి 20న ఒక లీగల్‌ నోటీసు పంపారు. చిత్రం లో చరిత్రను తప్పుగా చూపించడంవల్ల తమ కుటుంబం ప్రతిష్ట బాగా దెబ్బతిన్నదని, వారు తమ లీగల్‌ నోటీసులో పేర్కొన్నారు. 

దీంతో డైరెక్టర్‌ లక్ష్మణ్‌ ఉటేకర్‌, గనోజీ, చెన్హోజీ షిర్కే వారసులైన భూషన్‌ షిర్కే ఇంటికి వెళ్లి మరీక్షమాపణలు చెప్పారు. ‘‘షిర్కే కుటుంబం భావోద్వేగాలను దెబ్బతీయడం తమ ఉద్దేశం కాదు. ఒకవేళ మీరు బాధపడివుంటే అందుకు క్షమాపణలు కోరుతున్నాను. అదీకాకుండా చిత్రంలో వారి ఇంటిపేరు లేదా గ్రామం పేరు ప్రస్తావించలేదు. కేవలం వారిపేర్లు గనోజీ, చెన్హోజీ షిర్కేలుగా మాత్రమే పేర్కొన్నాం’’ అని వివరణ ఇచ్చారు. అయినప్పటికీ భూషన్‌ షిర్కే అందుకు సంతృప్తి చెందలేదు. చిత్రంలోని అభ్యంతరకర భాగాలను తొలగించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. 

నిజానికి గత నెలలో చిత్రం ట్రైలర్‌ను విడుదల చేసినప్పుడు అందులో షంభాజీ మహరాజ్‌, రాణియశూబాయ్‌తో కలిసి నృత్యం చేస్తున్నట్టు చూపడం దుమారం రేపింది. రాజ్యసభ సభ్యుడు శం భాజీ రాజే ఛత్రపతి దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఒక చరిత్రను చిత్రంగా మలచే సమయంలో నిర్వాహకులు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా చిత్రాన్ని విడుదల చేయడానికి ముందు నిర్వాహకులు చరిత్రకారులకు చూపించి వాస్తవాలను నిర్ధారించుకోవాలని కోరారు. ఈయనశంభాజీ మహరాజ్‌ కుటుంబ వారసుడు కావడం గమనార్హం. చిత్రంలో శంభాజీ మహరాజ్‌గా విక్కీ కౌశన్‌, రాణి యశూబాయ్‌గా రష్మికా మండన్న నటించారు. ఒక మహారాజు చరిత్రను చూపుతున్నప్పుడు, వారిపై ఇటువంటి నృత్యాల సీన్లు చిత్రీకరించడం సముచితం కాదని తీవ్రంగా విమర్శలు వచ్చాయి.  

చిత్ర దర్శకుడు లక్ష్మణ్‌ ఉటేకర్‌ ‘నృత్యం’పై వస్తున్న విమర్శలకు తనదైన శైలిలో సమర్థించుకున్నారు. శంభాజీ మహరాజ్‌ జీవితం పోరాటాలతోనే గడిచిపోయింది. అటువంటప్పుడు రాజు, రాణి కి మధ్య రొమాన్స్‌ జరిగే అవకాశం ఎక్కడుంటుందనేది ప్రతి ఒక్కరికీ సహజంగా వచ్చే సందే హం. కానీ కథను చెబుతున్నప్పుడు సృజనాత్మక కళను జోడిరచడం కొన్ని సందర్భాల్లో తప్పదు. వీక్షకులు ఎంతో తెలివైనవారు. వారెప్పుడూ తప్పుడు నిర్ణయాలు తీసుకోరు. ఎందుకంటే ఒక పోరాట యోధుడి జీవితాన్ని వాస్తవిక రీతిలో ఆవిష్కరిస్తున్నప్పుడు వీక్షకులు ఈ నృత్యాన్ని తప్పక ఆమోదిస్తారు. ఛావా విషయంలో మా అంచనా ఇదేనన్నారు. 

ఈ నృత్యం అంశం చినికి చినికి గాలివానగా మారడంతో దర్శకుడు లక్ష్మణ్‌ ఉటేకర్‌, ఎం.ఎన్‌.ఎస్‌.పార్టీ అధినేత రాజ్‌థాకరేను కలిసి, తాము ప్రవేశపెట్టిన లెంజీ నృత్యం మహారాష్ట్ర సంప్రదా యిక నృత్యం. అయిప్పుటికీ దీనిపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈ నృత్యాన్ని తొలగిస్తామని చెప్పారు. తర్వాత మహారాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మరియు శివసేన నాయకుడు ఉదయ్‌ సామంత్‌ కూడా అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో చివరకు నృత్యాన్ని తొలగించి వివాదానికి శు భం పలికారు. విచిత్రమేమంటే లెంజీ తమ సంప్రదాయిక నృత్యమన్న సంగతిని శంభాజీ మహరాజ్‌ వంశానికి చెందిన వారసులు అంగీకరిస్తున్నారు. కాకపోతే ఈ చిత్రంలో నృత్యం పెట్టిన సందర్భాన్ని వారు ప్రశ్నించడం గమనార్హం.

ప్రముఖ బాలీవుడ్‌ నటి స్వరభాస్కర్‌ ఈ చిత్రంపై ‘ఎక్స్‌’లో చేసిన పోస్ట్‌ మరో వివాదానికి కారణమైంది. ‘‘కుంభమేళా సందర్భంగా ఎంతో మంది మరణిస్తే, వారి శవాలను బుల్డోజర్లతో తొల గించే సన్నివేశాలకు ఎంతమాత్రం స్పందించని ఈ సమాజం ఐదువందల ఏళ్ల క్రితం హిందువులను హింసించారంటూ ఎక్కువచేసిన చూపిన మరియు పాక్షిక కల్పనతో కూడిన ఈ చిత్రాన్ని చూసిన సమాజం ఆగ్రహం వ్యక్తం చేయడం ఆశ్చర్యంగా వుంది. ఇదొక మెదడు, ఆత్మ చనిపోయినసమాజం’’ అనేది ఈ పోస్ట్‌ సారంశం. దీంతో ఒక్కసారిగా నెటిజన్లు ఆమెపై విరుచుకుపడ్డారు. ఇదేసమయంలో ఆమె సమర్థకులూ రంగంలోకి దిగారు. ‘‘శంభాజీ మహరాజ్‌ హిందువులకో సం చేసిన నిరుపమాన త్యాగాన్ని కేవలం కల్పన అని చెప్పడానికి నీకెంత ధైర్యం.’’ అంటూ ఆ మెపై నెటిజెన్లు ఎదురుదాడికి దిగారు. ‘చరిత్రతో నాటకాలాడొద్దు’ అని మరొకరు ఆమెను హెచ్చరించారు. విచిత్రమేమంటే ఆమె పెళ్లిచేసుకున్న వ్యక్తి ఫహద్‌ అహ్మద్‌! అయితే ఇలాంటి వివాదాల్లో చిక్కుకోవడం ఆమెకు కొత్తేం కాదు. వివాదం సృష్టించడం, చీవాట్లు తినడం ఆమెకు బాగా అలవాటైపోయింది. 

వివాదాల్లో చిక్కుకున్న కొన్ని బాలీవుడ్‌ చిత్రాలు

మద్రాస్‌ కేఫ్‌:

 ఇది శ్రీలంక అంతర్యుద్ధం నేపథ్యంలో తీసిన చిత్రం. భారత మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ హత్యోదంతాన్ని కూడా ఇందులో చూపారు. అయితే ఎల్‌టీటీఈని దోషిగా చూపారం టూ తమిళనాడులో ఆ సంస్థ అనుకూలురు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంతో తమిళనాడులో ఈ చిత్రాన్ని విడుదల చేయలేదు. 

విశ్వరూప్‌:

 తమిళనాడులోని ముస్లిం గ్రూపులు ఈ చిత్రాన్ని బ్యాన్‌ చేయాలని డిమాండ్‌ చేశాయి. సెన్సార్‌ బోర్డు సర్టిఫికెట్‌ ఇచ్చినా, ఈ చిత్రాన్ని తమిళనాడులో విడుదల చేయలేదు. తమిళనా డులో కంటే అధిక ముస్లిం జనాభా ఉన్న రాష్ట్రాల్లో ఈ చిత్రం బాగా ఆడిరది.

ఓ మై గాడ్‌ (ఓ.ఎం.జి):

 తరతరాలుగా వస్తున్న హిందూ సంప్రదాయాలను, హిందూ దేవుళ్లను అపహాస్యం చేసారంటూ ఈ చిత్రాన్ని బ్యాన్‌ చేయాలని విశ్వహిందూ పరిషద్‌, హిందూ జన జాగృతి సమితి వంటి సంస్థలు ఆందోళన చేశాయి. అయినప్పటికీ ఎటువంటి కోతలు లేకుండా ఈ చిత్రాన్ని 2012లో విడుదల చేశారు. కలెక్షన్లలో ఆల్‌టైమ్‌ రికార్డు సృష్టించింది.

స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌:

 ఇందులో చిత్రీకరించిన ఒక నృత్యంలో రాధను సెక్సీగా చూపారన్న కారణంగా ఇండోర్‌కు చెందిన ఒక స్వచ్ఛంద సంస్థ సినీ నిర్వాహకులపై కేసు పెట్టింది. అయినప్పటికీ ఈ చిత్రంలో ఆ పాటను తొలగించలేదు. 

రాక్‌స్టార్‌: ఈ చిత్రంలో ‘సాదా హక్‌’ అనే పాటలో వెనుక ‘స్వతంత్ర టిబెట్‌ పతాకాన్ని’ చూపడంతో సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌, ఇంతియాజ్‌ అలీ మధ్య వివాదం రేగింది. ఆ పతాకా న్ని బ్లర్‌ చేయమని ఆయన్ను కోరింది. కానీ దర్శకుడు అందుకు అంగీకరించలేదు. అయితే వీడియో నుంచి ఈ సీక్వెన్స్‌ను తొలగించక తప్పలేదు.

అరక్షణ్‌: 

ఈ సినిమాలో సైఫ్‌ అలీఖాన్‌ ఒక దళిత యువకుడిగా నటించారు. రాచకుటుంబానికి చెందిన సైఫ్‌ అలీఖాన్‌ ఆవిధంగా నటించడాన్ని వ్యతిరేకిస్తూ కాన్పూర్‌లో కొన్ని దళిత అనుకూల గ్రూపులు ఆందోళన జరిపాయి. దీంతో ఈ చిత్రాన్ని ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌, ఆంధ్రప్రదేశ్‌ల్లో ని షేధించారు. ఈ చిత్రంలోని కొన్ని డైలాగ్‌లు పంజాబ్‌లోని కొన్ని వర్గాలకు ఇబ్బంది కలిగించేవి గా వున్నాయని అక్కడి ప్రభుత్వం బ్యాన్‌ చేస్తే, యు.పి.లో అధికారంలో ఉన్న అప్పటి మాయావతి ప్రభుత్వం శాంతిభద్రతల సమస్యలు ఉత్పన్నమవుతాయని రెండు నెలలపాటు నిషేధించింది.

మై నేమ్‌ ఈజ్‌ ఖాన్‌:

 పాకిస్తాన్‌ క్రికెట్‌ టీమ్‌ సభ్యులను ఇక్కడి ఐపీఎల్‌కు పోటీపడుతున్న క్లబ్‌లు పిలవడంలేదని బాలీవుడ్‌ నటుడు షారూక్‌ ఖాన్‌ విమర్శించారు. అయితే దీన్ని శివసేన ఖండిరచింది. ఈ సినిమాను విడుదల చేయరాదంటూ పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. అయితే షారూక్‌ ఖాన్‌ క్షమాపణలు చెప్పడానికి అంగీకరించలేదు. అవసరమైతే బాల్‌ థాకరేతో ఈవిష యంపై మాట్లాడతానన్నారు. 

బిల్లు: 

ఈ సినిమా అసలు పేరు ‘బిల్లు బార్బర్‌’. అయితే ‘బార్బర్‌’ పేరు తమను కించపరచేదిగా వున్నదంటూ సెలూన్‌, బ్యూటీపార్లర్ల యజమానులు ఆందోళనకు దిగడంతో షారూక్‌ ఖాన్‌ ‘బా ర్బర్‌’ పేరు తొలగించి ‘బిల్లు’ పేరుతో విడుదల చేశారు.

4 సీట్లకు 40 మంది!

-ఎమ్మెల్సీ ఎన్ని’’కల’’ నెరవేరేది ఎవరికి.

-నాలుగు సీట్లలో సామాజిక న్యాయం సాధ్యమేనా!

-ఎమ్మెల్సీలెవరికి దక్కేనో!

-అద్దంకికి అడ్డంకులు తొలిగేనా?

-మరో వాయిదా పడదన్న గ్యారెంటీ వచ్చేనా?

-సీనియర్లు అడ్డుపడితే మొదటికే మోసం వచ్చేనా?

-ఆశావహులు చాలా మంది వున్నారు.

-చాలా మంది నేతలు కాచుకొని కూర్చున్నారు.

-పార్టీ కోసం త్యాగాలు చేసిన వారు వున్నారు

-పార్టీ అధికారంలోకి రావడంలో పాత్ర వున్న వారున్నారు.

-వారిని కాదని సామాజిక సమీకరణాలంటే సాధ్యపడేనా!

-పదుల సంఖ్యలో క్యూలో వున్నారు.

-అందరూ మాకే కావాలంటున్నారు!

-ఎవరికిచ్చినా మరొకరు నొచ్చుకుంటారు!

-అన్యాయం జరిగిందని గగ్గోలు పెడతారు.

-అభ్యర్థుల ఎంపిక కొత్తి మీద సామే!

-నలుగురి ఎంపిక నలభై మంది అలక సహజమే.

-భవిష్యత్తు పేరు చెప్పి వాయిదా వేయడమే!

-మీడియా అత్యుత్సాహం కూడా ఆశవహుల్లో కలవరమే.

-లేని లీకులతో మీడియా చేసేది గందరగోళమే!

-పార్టీకి లేని దురద మీడియాకు ఎక్కువే.

-రేటింగ్‌ కోసం పాకులాటలో లేని ఆశలు రేపడం అలవాటే.

-గందరగోళం సృష్టించి వార్తలు వండిరచడమే!

-అభ్యర్థుల పేర్లు కూడా డిసైడ్‌ చేసేది మీడియానే.

-వాళ్లకు టికెట్‌ రాకపోతే అన్యాయం జరిగిందని లొల్లి చేసేది మీడియానే.

-నాయకులంతా నిమిత్త మాత్రులే.

-ఈసారి టికెట్‌ వచ్చిన వాళ్లు మాత్రం అదృష్టవంతులే!

 

తెలంగాణలో శాసన మండలి ఎన్నికకు మరో నోటిఫికేషన్‌ విడుదలైంది. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఎంతో మంది కాంగ్రెస్‌ నాయకులు ఎవరి ప్రయత్నాలలో వారు గత ఎడాది కాలంగా బిజీబిజీగానే వున్నారు. అటు అధిష్టానం, ఇటు రాష్ట్ర నాయకత్వం ప్రసన్నం కోసం ఎదురుచూస్తున్నారు. ఎమ్మెల్సీ తమకే ఇవ్వాలంటూ అభ్యర్థనలు పంపుతూనే వున్నారు. వీలు చిక్కినపుడుల్లా ఎక్కే ఫ్లైట్‌ దిగే ఫ్లైట్‌ అన్నట్లు డిల్లీ వెళ్లి తమ గోడు చెప్పుకుంటూనే వున్నారు. ఈసారి మాకు అవకాశం ఇవ్వాలంటూ వేడుకుంటూనే వున్నారు. ఇప్పుడు ఆ సమయం రానే వచ్చింది. ఐదు ఎమ్మెల్సీ ఎన్నికల కోసం నోటిఫికేషన్‌ రానే వచ్చింది. అందులో నాలుగు ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌ వచ్చే అవకాశం వుంది. రోజు రోజుకూ ఆశావహుల సంఖ్య పెరిగిపోతూనే వుంది. మొదట్లో వున్న లిస్ట్‌కు ఇప్పుడు వినిపిస్తున్న లిస్ట్‌కు పొంతనే లేదు. ఒకింత చాంతాడంత పెరిగిపోయింది. అయినా ఎమ్మెల్సీలెవరికి దక్కేనో! అన్నది ఉత్కంఠగా మారిపోయింది. ఇక ముందుగా చెప్పాల్సి వస్తే కరీంనగర్‌ జిల్లాకు చెందిన సీనియర్‌ నాయకుడు మాజీ మంత్రి జీవన్‌ రెడ్డి గురించి మాట్లాడుకోవాలి. గత ఎన్నికలలో పట్టభద్రుల ఎన్నికలలో ఎమ్మెల్సీ గా ఎన్నికైన జీవన్‌ రెడ్డికి ఆ అవకాశం పార్టీ ఇవ్వలేదు. ఆయనే వద్దన్నారన్న ప్రచారం కూడా వుంది. పైగా ఆయన సొంత నియోజకవర్గమైన జగిత్యాలలో బిఆర్‌ఎస్‌ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే వినయ్‌ కుమార్‌ కాంగ్రెస్‌ పార్టీ దరి చేరారు. ఇది జీవన్‌ రెడ్డికి సుతారం ఇష్టం లేదు. అయినా కాంగ్రెస్‌ పార్టీ జీవన్‌ రెడ్డి అలకను పట్టించుకోలేదు. కానీ ఆయనకు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా ఎంపిక చేస్తామని చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. కానీ అధిష్టానం అనుకుంటే తప్ప ఎమ్మెల్సీ వచ్చే అవకాశం లేదు. ఇక మొదటి నుంచి అన్యాయం జరుగున్న నాయకుడు అద్దంకి దయాకర్‌. ఈసారైనా అద్దంకికి అడ్డంకులు తొలిగేనా? అనే ప్రశ్న వుండనే వుంది. ఆయన పూర్తిగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి భరోసా మీదనే ఆధారపడి వున్నారు. అయినా ఎక్కడో ఏదో అనుమానం ఆయన వ్యక్తం చేయకపోయినా లోలోన గుబులు వుండనే వుంది. తుంగతుర్తి నియోజకవర్గం తనదే అన్న ధీమాతో ఆది నుంచి వున్నారు. 2019 ఎన్నికలలో అద్దంకి దయాకర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. తక్కువ మెజారిటీతో ఓడిపోయారు. ఒక దశలో అద్దంకి దయాకర్‌ గెలిచినట్లే వార్తలు వచ్చాయి. ఆఖరు క్షణంలో ఫలితం తారుమారైంది. అప్పటి నుంచి ఆయన తుంగతుర్తిని వీడలేదు. ఆ నియోజకవర్గం ఎప్పటికైనా నాదే అని పనులు చేసుకుంటూ వెళ్లారు. చివరి నిమిషంలో ఎమ్మెల్యే మందుల సామేల్‌ పేరు తెరమీదకు వచ్చింది. ఆయనకే టికెట్‌ అధిష్టానం ఇచ్చింది. ఇందులో ఏం జరిగిందనేది అద్దంకికి తెలుసు. పార్టీకి తెలుసు. ప్రజలకు కూడా తెలుసు. తర్వాత పార్లమెంటు ఎన్నికల సమయంలో కూడా అద్దంకికి టికెట్‌ వచ్చినట్లే అనుకున్నారు. వరంగల్‌ సీటు వస్తుందని ఆయన కూడా భరోసాతోనే వున్నారు. ఆఖరు నిమిషంలో కడియం కావ్యకు టికెట్‌ వెళ్లింది. అద్దంకి అలా మరో సారి అన్యాయం జరిగింది. ఇప్పుడైనా అద్దంకి ఎమ్మెల్సీ అవుతారా లేదా? అన్న దానిపై ఉత్కంఠ నెలకొనే వుంది. మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డికి పాద నమస్కారం కూడా చేసిన సందర్భం వుంది. ఇక ఇప్పుడు ఆయన భవిష్యం తేలకపోతే భవిష్యత్తు రాజకీయం కష్టమే. కాంగ్రెస్‌కు వచ్చేవే నాలుగు స్థానాలు. బిసి నినాదం బలంగా వినిపిస్తోంది. ఆ నాలుగు మాకే కావాలని బిసిలు కోరుతున్నారు. అందులో కనీసం రెండు సీట్లైనా బిసిలకు పోతే అద్దంకి పరిస్థితి ఏమిటి అన్నది ప్రశ్నగా మిగులుతోంది. పైగా మాజీ ఎమ్మెల్యే సంపత్‌ కుమార్‌ కూడా రేస్‌లో వున్నారు. ఇప్పటికే మాల సామాజిక వర్గానికి సీట్లు ఎక్కువ ఇచ్చారన్న వాదన వుండనే వుంది. వరంగల్‌ పార్లమెంటు విషయం అన్యాయం జరిగిన దొమ్మాటి సాంబయ్య కూడా సీటు నాకే ఇవ్వాలంటూ కోరుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన అద్దంకికి ఇప్పుడు ఎమ్మెల్సీ రాకపోతే ఇక ఆయన నిర్ణయం ఎలా వుంటుందో చూడాలి. ఒకవేళ అద్దంకి అదృష్టం బాగుండి, ఎమ్మెల్సీ అయితే మాత్రం మంత్రి కావడం పెద్ద సమస్య కాకపోవచ్చు. అందువల్ల అద్దంకిని అడ్డుకోవడానికి ఆయన సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు నేతలు కూడా తమ వంతు రాజకీయం సాగిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. అద్దంకి ఎమ్మెల్సీ అయితే మంత్రి వర్గ విస్తరణలో ఆ ఇద్దరు నేతలు ఆశలు వదులుకోవాల్సి వస్తుందని చెప్పడంలో సందేహం లేదు. నాలుగు స్థానాలలో సామాజిక న్యాయం సాధ్యమయ్యేనా! అన్న ప్రశ్న అందరిలోనూ ఆసక్తిని పెంచుతోంది. ముఖ్యంగా మైనారిటీ వర్గం నుంచి మంత్రులు ఎవరూ లేరు. మాజీ మంత్రి కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు షబ్బీర్‌ అలీ ఎమ్మెల్సీ రేసులో వున్నారు. ఈసారి అవకాశం వస్తే మంత్రి వర్గంలో చోటు లభిస్తుందని ఆశిస్తున్నారు. పైగా నిజామాబాదు ఉమ్మడి జిల్లాకు మంత్రి వర్గంలో చోటు దక్కాల్సి వుంది. కానీ త్వరలో జిహెచ్‌ఎంసి ఎన్నికలు జరగాల్సి వుంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ లో కాంగ్రెస్‌ పార్టీకి ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు. బిఆర్‌ఎస్‌ నుంచి గెలిచిన ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ సొంత గూటికి వచ్చేశారు. అయినా ఆయన అంత సంతోషంగా లేరు. సుప్రీంకోర్టు లో వున్న కేసులో తీర్పు ఎలా వుంటుందో చెప్పలేనిది. అందువల్ల హైదరాబాద్‌ కు మంత్రి వర్గంలో చోటు కల్పించడం కోసం ఎమ్మెల్సీ ఎవరికైనా ఇస్తారనే అంటున్నారు. ముఖ్యంగా ఫిరోజ్‌ ఖాన్‌ ఎమ్మెల్సీ కావాలనుకుంటున్నారు. అంతే కాకుండా మాజీ టీం ఇండియా క్రికెట్‌ కెప్టెన్‌ మహమ్మద్‌ అజహరుద్దీన్‌ కూడా ఎమ్మెల్సీ కావాలనుకుంటున్నారు. ఇరవై ఏళ్లుగా కాంగ్రెస్‌ లో కొనసాగుతున్నారు. యూపి లోని ఫిరోజాబాద్‌ నుంచి రెండు సార్లు ఎంపిగా ఎన్నికయ్యారు. ఆ అనుభవంతో పాటు అధిష్టానం వద్ద అజహరుద్దీన్‌కు మంచి వెయిట్‌ వుంది. ఇక సీనియర్లలో ఎక్కువగా బిసిలు వున్నారు. వారిలో ఇప్పటికీ ఆక్టవ్‌గా వున్న వి. హనుమంత రావు ఫ్లీజ్‌ అంటున్నారు. నిజామాబాద్‌ మాజీ ఎంపి. మధుయాష్కీ గౌడ్‌ నాకేం తక్కువ అంటున్నాడు. పైగా రాహుల్‌ గాంధీకి సన్నిహితుడు అనే గుర్తింపు వుంది. వీళ్లతో పాటు సికింద్రాబాద్‌ మాజీ ఎంపి. అంజన్‌ కుమార్‌ యాదవ్‌ పోటీ పడుతున్నాడు. సీనియర్లు అడ్డుపడితే ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక మొదటికే మోసం వచ్చేనా? ఎందుకంటే ఆశావహులు చాలా మంది వున్నారు. సీటు మాకంటే మాకే అంటూ కాచుకొని కూర్చున్నారు. పార్టీ కోసం ఇంత కాలం త్యాగాలు చేసిన వారు వున్నారు. అంతే కాకుండా ఈసారి కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడంలో కృషి చేసిన వాళ్లు వున్నారు. వారిలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి అత్యంత సన్నిహితులైన ఇద్దరు నాయకులు వున్నారు. ఒకరు మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్‌ రెడ్డి, మరొకరు ఖైరతాబాద్‌ నియోజకవర్గం పార్టీ ప్రెసిడెంట్‌ రోహిన్‌ రెడ్డి. ఈ ఇద్దరిలో ఎవరికో ఒకరికి ఎమ్మెల్సీ వస్తుందని కూడా అంటున్నారు. ఇకపోతే ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ తిరుగులేని శక్తిగా మారి పూర్తి సీట్లు సాధించడంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి సోదరుడు ప్రసాద్‌ రెడ్డి పాత్ర ఎంతో కీలకమైంది. గత పార్లమెంటు ఎన్నికలలోనే ఖమ్మం సీటు ప్రసాద్‌ రెడ్డికి వస్తుందనుకున్నారు. కానీ రాలేదు. అప్పుడే ఎమ్మెల్సీ హామీ పార్టీ ఇచ్చిందనేది సమాచారం. ఇన్ని చిక్కు ముడుల మధ్య సామాజిక సమీకరణాలంటే సాధ్యపడతాయా! అధికారంలో వున్నప్పుడు సామాజిక సమీకరణాలతో అన్యాయం జరిగితే నాయకుడు ఊరుకుంటారా? తెలంగాణ మొత్తం మీద కాంగ్రెస్‌ పార్టీ లో పదుల సంఖ్యలో క్యూలో వున్నారు. అందరూ మాకే కావాలంటున్నారు! ఎవరికిచ్చినా మరొకరు నొచ్చుకుంటారు! అన్యాయం జరిగిందని గగ్గోలు పెడతారు. అభ్యర్థుల ఎంపిక కొత్తి మీద సామే! అన్న మాటలే వినిపిస్తున్నాయి. నలుగురి ఎంపిక నలభై మంది అలక సహజమే అని అంటున్నారు. భవిష్యత్తు పేరు చెప్పి వాయిదా వేస్తామంటే నాయకులు సంతృప్తి చెందుతారా? ఇక సందిట్లో సడే మియా లాగా మీడియా చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. మీడియా అత్యుత్సాహం కూడా ఆశవహుల్లో కలవరం నింపుతోంది. లేని లీకులతో మీడియా చేసేది గందరగోళం సృష్టిస్తోంది. పార్టీకి లేని దురద మీడియాకు ఎక్కువైపోయింది. నాయకులంతా నిమిత్త మాత్రులే. ఈసారి టికెట్‌ వచ్చిన వాళ్లు మాత్రం అదృష్టవంతులే!

యోగా గురువు శ్రీనివాస్ కు కాకతీయ పురస్కారం.

యోగా గురువు శ్రీనివాస్ కు కాకతీయ పురస్కారం.

Kakatiya Puraskar

గత 25 సంవత్సరాలుగా యోగాలో పోశాల శ్రీనివాస్ చేస్తున్న విశేష సేవలను గుర్తించిన ఇండస్ ఫౌండేషన్ వారు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా హనుమకొండలో జరిగిన కార్యక్రమంలో కాకతీయ పురస్కారాన్ని ముఖ్య అతిధి మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు గారి చేతుల మీదుగా అందించటం జరిగిందని పురస్కార గ్రహీత యోగ గురువు పోశాల శ్రీనివాస్ తెలియజేశారు. ఈ సందర్భంగా యోగా గురువు శ్రీనివాస్ మాట్లాడుతూ యోగాతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని భావించి, మానసిక మరియు శారీరక ప్రశాంతతకు యోగా దోహదపడుతుందని భావించి గత 25 సంవత్సరాలుగా భారతీయ సనాతన ధర్మంలోని యోగ విద్యను 150 గ్రామాలలో సుమారు రెండు లక్షల మందికి యోగాలో ఉచిత శిక్షణను అందించినందుకుగాను ఈ పురస్కారం లభించిందని తెలియజేస్తూ, యోగా శిక్షణతో పాటు అనేక దేశభక్తి, ఆధ్యాత్మిక,సామాజిక మరియు సాంఘిక కార్యక్రమాల్లో చేసిన విశేష సేవలను గుర్తించి ఇండస్ ఫౌండేషన్ అధినేత ఏనుగుల రాకేష్ రెడ్డి గారు ఈ పురస్కారానికి ఎంపిక చేయటం చాలా ఆనందంగా ఉంది అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఇండస్ ఫౌండేషన్ అధినేత ఏనుగుల రాకేష్ రెడ్డి, శ్రీ సి ఎస్ రంగరాజన్ చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు, స్వామి ప్రణవానంద దాస్ , జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు, ప్రముఖ సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్, పద్మశ్రీ అవార్డు గ్రహీత సమ్మయ్య, మాజీ ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి.దయాకర్ రావు, తాటికొండ.రాజయ్య, వొడితల.సతీష్ బాబు పాల్గొన్నారు.

మెరుగైన వైద్యం అందించాలి.

వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందించాలి.

ఎం ఎం ఆర్ ఐ, సిటీ స్కానింగ్ ఏర్పాటు చేయాలని ఎం ఎస్ ఎఫ్ డిమాండ్.

చిట్యాల:నేటి ధాత్రి 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో స్టూడెంట్స్ ఫెడరేషన్ భూపాలపల్లి జిల్లా సీనియర్ నాయకులు అంబాల అనిల్ కుమార్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చెయ్యగ ఈ సమావేశంలో పాల్గొన్న అంబాల అనిల్ కుమార్ మాదిగ మాట్లాడుతూ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా ఉన్న సబ్బండ వర్గాల ప్రజలకు పేద వర్గాల ప్రజలకు బడుగు బలహీన వర్గాల ప్రజలకు దళిత వర్గాల ప్రజలకు ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీ బహుజన వర్గాల ప్రజలకు గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు అడవి ప్రాంతాల్లో జీవనం కొనసాగిస్తున్న ఆదివాసులకు గోండు కోయ లంబాడి యానాది కూలి పని చేస్తూ జీవనం కొనసాగిస్తూ బతుకుతున్న ప్రజలందరికీ వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వైద్యం అందుబాటులో లేక అనారోగ్య సమస్యలతో బాధపడే పేద వర్గాల ప్రజలకు సరైన మార్గం చూపాలని అంబాల అనిల్ కుమార్ అన్నారు భూపాలపల్లి జిల్లాలో ఉన్న వంద పడకల ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యం అందించకపోవడం సమస్యలకు అనుగుణంగా పరికరాలు లేకపోవడం చాలా బాధాకరమని మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశారు గ్రామీణ ప్రాంతాల్లో నుంచి ఇతర దూర ప్రాంతానుంచి కనీసం ఆసుపత్రికి రావడానికి కూడా ప్రజల దగ్గర డబ్బులు లేనటువంటి పరిస్థితులు ఉన్నాయని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి రోగులను ఎంజీఎం కి తరలించడం చాలా బాధాకరం అని ఆయన అన్నారు గ్రామీణ ప్రాంతాల్లో నుంచి ఇతర ప్రాంతాల్లో నుంచి జిల్లా కేంద్రానికి రావడానికి ఆర్థికంగా డబ్బు లేక తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న ప్రజలు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో మరియు ఇతర హైదరాబాదులో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్స్ వైద్యం కోసం సమస్యను బట్టి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు జిల్లా కేంద్రానికి రావడానికె తీవ్రమైన ఇబ్బంది పడుతున్న ప్రజలు భూపాలపల్లి జిల్లా వంద పడకల హాస్పిటల్ లో సరైన వైద్యం లేక సిటీ స్కానింగ్ ఎమ్మారై స్కానింగ్ మరియు సరైన ఆపరేషన్ థియేటర్ లేక అన్ని సమస్యలకు పరిష్కార మార్గం చూపడానికి తక్షణమే జిల్లా కేంద్రంలో ఉన్నా వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిని డెవలప్మెంట్ చేయాలని ప్రతి సమస్యకు పరిష్కార మార్గం ఉండే విధంగా ప్రభుత్వం మరియు ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న అధికారులు తక్షణమే స్పందించి ప్రభుత్వ ఆసుపత్రిని డెవలప్మెంట్ చేసి జిల్లాలో ఉన్న ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకున్న సమస్యలు పరిష్కరించి ప్రజలకు న్యాయం చేయవలసిందిగా ప్రభుత్వాన్ని జిల్లా అధికారులను జిల్లా కలెక్టర్ ని హాస్పటల్ సూపర్డెంట్ ని జిల్లా డిఎంహెచ్వో ని మరియు జిల్లాలో ఉన్న వైద్యాధికారులను కోరుతున్నాము, వారం పది రోజుల్లో సమస్యలకు పరిష్కార మార్గం చూపకపోతే రాబోయే రోజుల్లో ప్రభుత్వ ఆసుపత్రి ముందు సమస్యలను ఉద్దేశించి కలెక్టరేట్ ముందు సమస్యలు పరిష్కరించేదాకా ధర్నాలు చేపడతామని సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు పోరాటం చేస్తామని పిలుపునిస్తున్నాము అని అన్నారు, అనిల్ కుమార్ఈ కార్యక్రమంలో ఎమ్మెస్ ఎఫ్ మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ నాయకులు రాజేందర్ నాగరాజు రాజకుమార్ గణేష్ రాజు రణధీర్ రామంజు లక్ష్మీ సాయి మరియు తదితర మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ నాయకులు పాల్గొన్నారు.

మొగుడంపల్లి మండలంలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్..

మొగుడంపల్లి మండలంలో ప్రశాంతంగా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్

జహీరాబాద్. నేటి ధాత్రి:

మొగుడంపల్లి మండల కేంద్రంలో ఎమ్మెల్సీ ఉపాధ్యాయుల, పట్టభద్రుల ఎన్నికలు గురువారం ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఓటర్లు ఉదయం నుంచే ఓటింగ్ కేంద్రాలకు చేరుకోవడంతో పోలింగ్ సజావుగా కొనసాగుతోంది. ఉదయం 10 గంటల వరకు 10 % శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. పోలింగ్ ముగింపు సమయానికి ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది. పోలీసు భద్రత మధ్య శాంతియుత వాతావరణంలో ఎన్నికల కొనసాగుతున్నాయి.

విద్యార్థిని ఆత్మహత్య..

విద్యార్థిని ఆత్మహత్య

వరంగల్ :నేటిధాత్రి

వరంగల్ ములుగు రోడ్ లోని పైడిపల్లి వద్ద గల వ్యవసాయ పరిశోధన కేంద్రం ఆవరణలోని వ్యవసాయ కళాశాలలో విద్యార్థిని ఆత్మహత్య కలకలం రేపింది. కళాశాలలోని ఓ గదిలో ఫ్యానుకు ఉరి వేసుకుని సూసైడ్ చేసుకుంది. మృతురాలి స్వస్థలం నల్గొండ జిల్లా. ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీకి అనుబంధంగా ఇక్కడ నడుస్తున్న వ్యవసాయ కళాశాలలో కొంతకాలంగా ర్యాంగింగ్ జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. సీనియర్లు ర్యాంగింగ్కు పాల్పడుతున్నారని గతంలోనే విద్యార్థిని తల్లిదండ్రులకు చెప్పగా వారు నచ్చజెప్పి తిరిగి కాలేజీకి పంపినట్లు సమాచారం. ఈక్రమంలోనే ఇవాళ బలవన్మరణానికి పాల్పడటం గమనార్హం. మరోపక్క ఆత్మహత్యకు వ్యక్తిగత కారణాలు కూడా కారణమని తెలుస్తుంది. ఏనుమాముల పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మంథని అసెంబ్లీ ఇంచార్జ్ సునీల్ రెడ్డి పిలుపు..

మేధావులారా.. ఉపాధ్యాయులారా
ఆలోచించండి..ఆదరించండి..

ఎమ్మెల్సీ ఓటర్లకు పెద్దపల్లి జిల్లా మాజీ అధ్యక్షులు ,మంథని అసెంబ్లీ ఇంచార్జ్ చంద్రుపట్ల సునీల్ రెడ్డి పిలుపు.

మంథని :- నేటి ధాత్రి

మంథని నియోజకవర్గంలో టీచర్, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులు అంజిరెడ్డి, మల్కా కొమురయ్య లకు మద్దతుగా పార్టీ నాయకులతో కలిసి మంథని పట్టణం లో సునీల్ రెడ్డి ఎంఎల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించి అభ్యర్థులకు మీ ప్రాధ్యాన్యత ఓటు వేయాలని పిలుపునిచ్చాడు.నమ్మించి మోసం చేస్తున్న కాంగ్రెస్ కు బుద్ధి రావాలంటే ఈ ఎన్నికల్లో బీజేపీనీ గెలిపించాలి చట్టసభల్లో మీ తరపున ప్రశ్నించే గొంతులు ఉండాలంటే బీజేపీ ఎంఎల్సీ అభ్యర్థులు గెలవాల్సిందే మోసం చేసిన కాంగ్రెస్ కు ఓటుతో గుణపాఠం చెప్పాలని ఈ గెలుపు చాలా కీలకం మేదావులంతా తెలంగాణ భవిష్యత్ ను నిర్ణయించే ఎన్నికలు కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులను వల్ల భవిష్యత్ కోసం బీజేపీ నీ గెలిపించండి అంటూ 317 జీవో కి వ్యతిరేకంగా బిజెపి పోరాటం చేసింది నీరుద్యోగ సమస్యలపై బిజెపి చేసినా పోరాటాలను ఓటర్లు గమనించాలని అన్నారు
ఆదిశగా మేధవులంతా.. ఆలోచిస్తారని.. పార్టీ అభ్యర్థులను ఆశీర్వదిస్తారని నమ్ముతున్నాము రాబోయే రోజుల్లో బీజేపీ గెలుపు తధ్యం ఓటర్లుఅంతా మీ మొదటి ప్రాధాన్యత ఓటును అభ్యర్థులు అంజిరెడ్డి, కొమురయ్య లకు వేసి మద్దతు తెలపాలని కోరారు ఈ కార్యక్రమం లో బీజేపీ నాయకులు చల్ల నారాయణ రెడ్డి ,బీజేవైఎం రాష్ట్ర కోశాధికారి మంథని అసెంబ్లీ ఎంఎల్సీ ఎన్నికల ప్రభారీ నీలకంఠం పాండు ,ఎంఎల్సీ అసెంబ్లీ కన్వీనర్ బిరుదు గట్టయ్య ,అసెంబ్లీ కో కన్వీనర్ నాంపల్లి రమేష్ ,మంథని పట్టణ ,మండల అధ్యక్షులు సంతోష్ ,రాజేందర్,జిల్లా కౌన్సిల్ సభ్యులు బోగోజు శ్రీనివాస్ ,మంథని మాజీ పట్టణ అధ్యక్షులు ఎడ్ల సదాశివ్ ,కామన్పూర్ మండల ఇంచార్జి చిలువేరి సతీష్ సీనియర్ నాయకులు సామల అశోక్ ,నరమళ్ల కృష్ణ,లక్ష్మణ్, ఎడ్ల సాగర్ ,శ్రవణ్ ,సత్యం,అయింటి మల్లేష్ ,మహేష్ ,కార్యకర్తలు పాల్గొన్నారు.

దేశవ్యాప్తంగా బలోపేతమవుతున్న బీజేపీ

రెండోతరం నాయకులను తయారుచేస్తున్న సీనియర్‌ నాయకత్వం

నాయకత్వ కొరత లేకుండా వ్యూహాత్మక అడుగులు

ఛరిష్మా నాయకులున్నా పార్టీకే ప్రాధాన్యం

గట్టి సంస్థాగత బలం ఉన్న పార్టీ బీజేపీ

రెండో తరం నాయకులను ఎదగనీయని కాంగ్రెస్‌

నాయకుల ఛరిష్మాపై ప్రాంతీయ పార్టీల మనుగడ

సంస్థాగత బలహీనతలతో కునారిల్లుతున్న విపక్షాలు

ప్రాంతీయ పార్టీల కోటలు కూల్చే వ్యూహాలతో బీజేపీ ముందడుగు

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

ఢల్లీికి రేఖాగుప్తా, మధ్యప్రదేశ్‌కు మోహన్‌యాదవ్‌, మహారాష్ట్రకు దేవేంద్ర ఫడ్నవిస్‌లను ముఖ్య మంత్రులను చేయడం ద్వారా, ప్రస్తుత రాజకీయ ప్రయోజనాలను సుదీర్ఘకాలం కొనసాగించేం దుకు చక్కగా అడుగులు ముందుకేస్తున్నదన్న సత్యం బోధపడుతోంది. అంతేకాదు కేంద్రంలో సీనియర్‌ నాయకత్వం బలంగా వున్నప్పుడే ఈవిధంగా సెకండ్‌ లైన్‌ నాయకులకు కీలకస్థానాలు అప్పగించి, ఏవైనా సమస్యలు వస్తే తమదైన శైలిలో పరిష్కరిస్తూ ఆయా నాయకత్వాలను బలోపేతం చేయడం ద్వారా పార్టీలో నాయకత్వ కొరత లేకుండా చేయడంలో భారతీయ జనతాపార్టీ వ్యూహాత్మక ఆచరణశైలి అద్భుతమనే చెప్పాలి. ఇది దేశంలోని మిగిలిన రాజకీయ పార్టీల్లో కని పించడం లేదు. 

బీజేపీ కేంద్ర నాయకత్వం రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా నాయకులను ఎంపిక చేసిన తర్వాత వారికి పూర్తి అండగా నిలుస్తోంది. ఎవరైనా నాయకుల్లో అసంతృప్తి వున్నా, ముఖ్యమంత్రికి వ్య తిరేకత వ్యక్తమవుతున్న సందర్భాల్లో ఎప్పటికప్పుడు కేంద్రం కలుగజేసుకొని సర్దుబాటు చేయడ మే కాదు, పార్టీ దిగువస్థాయి నాయకత్వంతో పాటు, కార్యకర్తలు కూడా ఆయా ముఖ్యమంత్రులనాయకత్వంలో పనిచేసేవిధంగా చర్యలు తీసుకుంటోంది. ఆవిధంగా కేంద్రంలో, రాష్ట్రాల్లో బల మైన నాయకత్వాన్ని అభివృద్ధి చేయడం వల్ల, దేశం మరియు రాష్ట్రాల్లో సామాజిక ఆర్థిక ప్రగతికి ఎంతో దోహదం చేయగలదు. 

అదే కాంగ్రెస్‌ విషయానికి వస్తే అసలు రెండోతరం నాయకులను ఎదగనిచ్చే ప్రసక్తే లేదు. ఒకవేళ అన్ని ప్రతికూలతలను తట్టుకొని ఎదగాలని యత్నించినా యధాశక్తి వాళ్లను బలహీనపరచేవరకు కేంద్ర నాయకత్వం నిద్రపోదు. రాహుల్‌ గాంధీ, ఆయన సలహాదార్లు కూడా గత పదేళ్లుగా ఇదే వ్యవహారశైలి అనుసరిస్తున్నారు. సచిన్‌ పైలెట్‌, మనీష్‌ తివారీ, పృథ్వీరాజ్‌ చౌహాన్‌, అశోక్‌ గెహ్లాట్‌, భూపేంద్రసింగ్‌ హూడా వంటి నాయకుల వ్యవహారశైలివల్ల పార్టీ ఎప్పటికప్పుడు బల హీనపడటం తప్ప మరో ప్రయోజనం ఏమీ వుండటంలేదు. 

గత లోక్‌సభ మరియు వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను పరిశీలిస్తే నరేంద్రమోదీ, అమిత్‌ షాల వ్యూహం ఎంతచక్కగా పనిచేస్తున్నదీ అర్థమవుతుంది. అటల్‌`అద్వానీ కాలంలో మాదిరిగా రెండోతరం నాయకులు పార్టీలో ఎదగడంలేదని చేస్తున్న ప్రచారంలో ఎంతమాత్రం నిజంలేదు. అటల్‌ బిహారీ వాజ్‌పేయి యుగంలో అద్వానీ, మురళీమనోహర్‌ జోషి, సుష్మా స్వరాజ్‌, నితిన్‌ గడ్కరీ, కళ్యాణ్‌ సింగ్‌, రాజ్‌నాథ్‌ సింగ్‌లకు పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లే అవకాశం ల భించింది. అదేవిధంగా ప్రస్తుత నరేంద్రమోదీ హయాంలో అమిత్‌ షా, జె.పి.నడ్డా, యోగి ఆది త్యనాథ్‌, శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌, మనోహర్‌ లాల్‌ కట్టర్‌, రమణ్‌సింగ్‌, దేవేంద్ర ఫడ్నవిస్‌, మో హన్‌ యాదవ్‌, భజన్‌లాల్‌ శర్మ, విష్ణుదేవ్‌ సాయి, నాయబ్‌ సింగ్‌ సైనీ వంటి నాయకులకు అ త్యంత ప్రాధాన్యతనిస్తూ పార్టీ బలోపేతానికి అవసరమైన భూమికను రూపొందిస్తున్నారు. మధ్య ప్రదేశ్‌లో మోహన్‌ యాదవ్‌ పనితీరు ఆధారంగా శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ప్రభుత్వంలో స్థానం కల్పించడమే కాకుండా సంస్థాగతంగా కూడా సముచిత స్థాయిలో నిలిపారు. ఇప్పుడు మోహన్‌ యాదవ్‌ వంటి నాయకులు క్షేత్రస్థాయి నుంచి సమర్థవంతమైన నాయకులుగా రూపొందడమే కాదు, పరిపాలన పై గట్టి పట్టు సాధిస్తున్నారు. అంతేకాదు వీరు ఆకట్టుకునే ప్రసంగాలతో ప్రజలను సమ్మోహితులను చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్‌ సంస్థాగత నాయకుడి స్థాయిని దాటి ఎదిగిపోయారు. ప్రస్తు తం ముఖ్యమంత్రిగా పాలన, శాంతిభద్రతలపై గట్టి నియంత్రణ సాధించారు. మతపరమైన అంశాలపై ఒక మహంత్‌గా తన స్పష్టమైన ముద్రను సమాజం పై వేయగలిగారు. అయోధ్య, కాశి, మధుర, వంటి అంశాలపై ఆయన ప్రధానంగా దృష్టి కేంద్రీకరించారు. కుంభ్‌మేళాను సమర్థవం తంగా నిర్వహిస్తున్నారు. 

ఇక కాంగ్రెస్‌ పార్టీ విషయానికి వస్తే గత రెండుదశాబ్దాలో దాని నాయకత్వ వైఖరిలో మార్పు లేశమాత్రం కూడా కనిపించడంలేదు. పార్టీ యావత్తు గాంధీ కుటుంబంపైనే ఆధారపడివుంది. మన్మోహన్‌ సింగ్‌ ప్రధానిగా పదేళ్లు పనిచేశారు. కానీ మాస్‌ లీడర్‌గా లేదా లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన నాయకుడిగా గుర్తింపు లేదు. లోక్‌సభ ఎన్నికల్లో ఓటమిపాలైన తర్వాత రాజ్యసభ ద్వారా ఆయన్ను పార్టీ ప్రధానిని చేసింది. అసలాయనకు కాంగ్రెస్‌ సంస్థపైనే పెద్దగా ఆసక్తి లేదు.

గాంధీ కుటుంబం చేసిందేమంటే సొంతపార్టీలోనే ప్రత్యర్థి రాజకీయాలను ఎగదోయడం. అర్జున్‌సింగ్‌, దిగ్విజయ్‌సింగ్‌, కమల్‌నాథ్‌, మాథవరావు సింథియా, జ్యోతిరాదిత్య, అశోక్‌ గెహ్లాట్‌, రాజేష్‌ పైలెట్‌, భూపేంద్రసింగ్‌ హూడా, వీరేంద్రసింగ్‌, కుమారి షెల్జా మొదలైన నాయకుల పక్క లో అసంతృప్తులను ఎగదోసి వారిని సుస్థిరపాలన చేయనీయలేదు. ఫలితంగా ఇటువంటి నాయకులు క్షేత్రస్థాయిలో ఏనాడు బలోపేతం కాలేకపోయారు. పార్టీలో వృద్ధ నిజాయతీ నాయకుడు ఎ. కె. అంటోనీ పార్టీ వరుస ఓటమికి కారణాలపై ఇచ్చిన నివేదిక నాయకత్వాన్ని నైరాశ్యంలో ముంచింది.

కర్ణాటకలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉపముఖ్యమంత్రి శివకుమార్‌లు ఎంత విరోధులుగా వుంటే పార్టీ అధిష్టానానికి అంత లాభం. మల్లికార్జున ఖర్గే పేరుకే పార్టీ అధ్యక్షులు. నిర్ణయాలన్నీరాహుల్‌ గాంధీ, వేణుగోపాల్‌, జయరామ్‌ రమేష్‌లవే. ఇప్పుడు ప్రియాంకా గాంధీ వాద్రా తన టీమ్‌కు ప్రాధాన్యతనిస్తారు. లాలూ ప్రసాద్‌ యాదవ్‌, శిబు హేమంత్‌ సొరేన్‌తో సఖ్యత ద్వారా ఈ టీమ్‌ కొంత ప్రయోజనం పొందవచ్చు. రాహుల్‌ గాంధీ సమకాలీన నాయకులైన మిళింద్‌ దియోరా, జ్యోతిరాదిత్య, ఆర్‌.పి.ఎన్‌. సింగ్‌ వంటివారు తమను పార్టీలో పక్కన పెట్టడంతో మన స్తాపం చెంది భాజపాలో చేరిపోయారు. శశి థరూర్‌, మనీష్‌ తివారి, సచిన్‌ పైలెట్‌లను ఒక పరిమితికి మించి అధిష్టానం ఎదగనివ్వడంలేదు. 

ఇక ప్రాంతీయ పార్టీల విషయానికి వస్తే ఆయా రాష్ట్రాల్లో పార్టీ అధినేతదే పూర్తి ఆధిపత్యం. ప శ్చిమబెంగాల్‌లో మమతా బెనర్జీపైనే తృణమూల్‌ కాంగ్రెస్‌ పూర్తిగా ఆధారపడిరది. బిహార్‌లో రా ష్ట్రీయ జనతాదళ్‌పై ఏకఛత్రాధిపత్యం లాలూప్రసాద్‌ యాదవ్‌, తేజస్వినీ యాదవ్‌లదే. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ అఖిలేష్‌ యాదవ్‌పై, లోక్‌దళ్‌ జయంత్‌ చౌదరి, బహుజన్‌ సమాజ్‌వాదీ పార్టీ మయావతి, తమిళనాడలో డీఎంకే స్టాలిన్‌పై, ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ చంద్ర బాబు నాయుడిపై, తెలంగాణలో భారత రాష్ట్ర సమితి కె.సి.ఆర్‌. కుటుంబంపై, కర్ణాటకలో జనతాదళ్‌ సెక్యులర్‌ హెచ్‌.డి. దేవగౌడ`కుమారస్వామి కుటుంబంపై, హర్యానాలో లోక్‌దళ్‌ చౌతా లా కుటుంబంపై, పంజాబ్‌లో అకాలీదళ్‌ బాదల్‌ కుటుంబంపై ఆధారపడి వున్నాయి. ప్రాంతీయ పార్టీలు ఆయా పార్టీల నాయకుల ఛరిష్మాపై నెట్టుకొస్తున్నాయి తప్ప సంస్థాగత నిర్మాణం, రెం డో స్థాయి నాయకత్వ వృద్ది అనేవి ఇక్కడ సాధ్యంకాదు. ఒకరకంగా చెప్పాలంటే కేంద్రంలో కాం గ్రెస్‌, రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు ప్రజాస్వామ్యం ముసుగులో ‘రాచరికాన్ని’ అనుసరిస్తున్నాయని చెప్పాలి. 

ఇక కమ్యూనిస్టు పార్టీల గురించి ఎంత తక్కువ చెబితే అంత మంచిది. దేశవ్యాప్తంగా పూర్తిగా పట్టుకోల్పోయి అంపశయ్యపై కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మనదేశంలో గట్టి ప్రతిపక్షం ఏర్పడే అవకాశాలు కనిపించడంలేదు. 

ప్రస్తుతం భారతీయ ఎన్డీఏ కూటమి దేశంలోని మొత్తం 28రాష్ట్రాలో పంధొమ్మిదింటిలో అధికా రంలో వుంది. ఇక బీజేపీ సొంతంగా 13 రాష్ట్రాల్లో, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ప్రభుత్వాలను ఏర్పాటుచేసింది. అదేవిధంగా మూడు కేంద్ర పాలితప్రాంతాల్లో రెండిరటిని ఎన్డీఏ కూటమే పాలి స్తోంది. ఒకప్పుడు బీజేపీ రaార్ఖండ్‌లో అధికారంలో ఉన్నప్పటికీ, ప్రస్తుతం రaార్ఖండ్‌ ముక్తిమో ర్చా రాష్ట్ర పగ్గాలను చేపట్టింది. ఇక జమ్ము`కశ్మీర్‌, పంజాబ్‌ రాష్ట్రాల్లో గతంలో భాజపా ఇతర పార్టీలతో కూటమి కట్టి అధికారాన్ని హస్తగతం చేసుకుంది. అయితే బీజేపీ ఇప్పటివరకు అధికా రంలోకి రాని రాష్ట్రాలు మూడున్నాయి. అవి వరుసగా తమిళనాడు, తెలంగాణ, కేరళ. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశంతో కలిసి అధికారంలో కొనసాగుతోంది. బీజేపీ కమలం గుర్తుపై పోటీచేసే పార్టీలు కూడా వున్నాయి. ఈ పార్టీలన్నీ తమిళనాడుకు చెందినవే కావడం విశేషం. అవి వరుసగా ఇండియా జననాయగ కచ్చి, పుతియా నీధి కచ్చి, తమిరaగ మక్కల్‌ మున్నేట్ర కజగం, ఇంధియా మక్కల్‌ కల్వి మున్నేట్ర కజగం. సంస్థాగతంగా, వ్యూహాత్మకంగా ముందుకు కదలడంలో భాజపా దరిదాపుల్లో ఏ పార్టీ లేదన్నది అక్షరసత్యం.

500 నోటుకు కాలం చెల్లనుందా?

`2000 నోటు దారిలో నడవనుందా?

`కొద్ది రోజులలో కనుమరుగు కానుందా?

`అప్పుడే నూకలు చెల్లిపోనున్నాయా?

`మళ్లీ నోట్ల ఉపసంహరణ సంకేతాలు ?

`200 నోటుకు కూడా కష్టకాలం రానుందా?

`100 తోనే ఆర్థిక లావాదేవీలు జరుపోవాల్సి వస్తుందా?

`50 ఇంకా కొంత కాలం ఆయువు వుండేనా?

`300 నోటు రానుందంటున్నారు నిజమేనా? 

`నోట్ల రద్దుతో బ్లాక్‌ మనీ పోయినట్లే అన్నారు!

`బ్లాక్‌ మనీ గురించి మాట్లాడడం మానేశారు.

`పాకిస్తాన్‌ నుంచి విచ్చలవిడిగా నకిలీ నోట్లు వస్తున్నాయని నోట్లు రద్దు చేశారు.

`ఇక కొత్త నోట్ల ప్రవేశంతో నకిలీ తయారీ అసాధ్యమన్నారు.

`నకిలీ నోట్ల చెలామణి వ్యవస్థకు పాతరే అన్నారు.

`అకస్మాత్తుగా రాత్రికి రాత్రి నోట్లు రద్దు చేసేశారు.

`డిజిటల్‌ లావాదేవీలు అమలు చేశారు.

`నోట్ల రద్దు కాగానే వెంటనే 2000 నోట్లు తెచ్చారు.

`విపరీతంగా విమర్శలు రావడంతో క్రమంగా దానిని కనుమరుగు చేశారు.

`తర్వాత 200 నోట్లు తెచ్చారు.

`దేశంలో పెద్ద ఎత్తున 500 నోట్లు నకిలీ చెలమణి జరుగుతుందంటున్నారు.

`ఇలా ఉపసంహరణలు చేసుకుంటూ పోతే జనం సహనాన్ని కూడా మర్చిపోతారు

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

మార్కెట్‌లో త్వరంలో రూ.500 నోటు ఉప సంహరణ జరగుతుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. పెద్దనోట్ల వల్ల నల్ల దనం ఆగడం లేదన్న మాటలు వినిపిస్తున్నాయి. అసలు నల్లదనమే లేదని నోట్ల రద్దు మూలంగా తేలిపోయింది. మళ్లీ నలధనం వార్తలు ఎందుకు సృష్టించబడుతున్నాయి. అంటే సమాదానం చెప్పేవారు లేరు. దేశమంతా ఒకే పన్ను విధానం వుంటే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ధరల వ్యత్యాసం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. జిఎస్టీ తెచ్చారు. దానిని అమలు చేసిన రోజు దేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్లైందన్నారు. అందుకే జీఎస్టీ అమలు అర్ధరాత్రి చేపట్టారు. అర్ధరాత్రి ఆర్ధిక స్వాతంత్య్రం అన్నారు. ఏమైంది? దేశ ఖజానాను పన్నుల వరద పారింది. సగటు వ్యక్తి జీవితం తలకిందులైంది. అంతకు ముందు నోట్ల రద్దు చేశారు. యాభై రోజులు సమయం ఇవ్వండి. నోట్ల రద్దు వల్ల దేశానికి మేలు జరక్కపోతే అడగండి అన్నారు. కాని ప్రజలు బాదపడుతుతంటే చూశారు. జనం విలవిలలాడుతుంటే చూస్తూ మౌన వ్రతం చేశారు. నోట్ల రుద్ద చేపట్టి, పెద్ద నోట్లను ముందు తెచ్చారు. అన్ని నోట్లు రద్దుచేసి, కొత్తగా రెండువేల నోటు తెచ్చారు. డిజిటల్‌ మనీ వ్యవస్ధను ప్రవేశపెట్టారు. నోట్లు లేని ఆర్ధిక వ్యవస్ధను సృష్టించారు. ఇది కొంత మేలు జరిగిందనుకున్నా నోట్లు పూర్తిగా లేకపోతే కూడా ఇబ్బందులే అన్నది తెలుసుకున్నారు. కాకపోతే రెండు వేల నోట్లు తెచ్చారు. దాని వల్ల పేదలకు ఏమైనా మేలు జరిగిందా? అంటే అదీ లేదు. ఆ నోటును కూడా కొంతకాలం తర్వాత ఉపసంహంరించుకున్నారు. అప్పుడు పేదలు పెద్దగా స్పందించలేదు. కారణం వారి ఆర్ధిక సానుకూలతకు ఆ నోటుకు పెద్దగా సంబంధం లేదు. కాని ఇప్పుడు మళ్లీ ఐదు వందలరూపాయల నోటును కూడా ఉపసంహరించుకోవాలనుకుంటున్నారు. అనే వార్త సగటువ్యక్తికి పిడుగులాంటి వార్తే. ఎందుకంటే ఎంత డిజిటల్‌ పేమెంట్లు పెరిగినా చాలా సంస్ధలు నగదు లావాదేవీలు జరుపుతున్నాయి. ముఖ్యంగా విద్య, వైద్య, ఆరోగ్య , దేవాదాయ రంగాలలో డిజిటల్‌మనీ లావాదేవీలు జరగడం లేదు. ఈ విషయం పాలకులకు తెలియదా? పెద్ద పెద్ద ఆసుపత్రులలో నగదు ఇస్తే తప్ప వైద్యం చేయడంలేదు. నగదు చెల్లిస్తేనే వైద్యం చేస్తున్నారు. ఇక ప్రైవేటు విద్యా సంస్ధల్లో కూడా నగదు లావాదేవీలకు ఆస్కారం లేదు. అంటే అవి జీఎస్టీ ఎగ్గొడుతుంటే మాత్రం పాలుకలు చేష్టలుడిగి చూస్తుంటారు. సామాన్యుల నుంచి మాత్రం ముక్కుపిండి వసూలుచేస్తారు. అంతెందుకు నూటానలభైకోట్ల మన దేశ జనాభాలో నూటా ఇరవై కోట్ల మంది హిందువులే. హిందువులు ఏ గుడికి వెళ్లినా నగదు లావాదేవీలే నిర్వహిస్తున్నారు. తిరుపతి లాంటి పుణ్యక్షేత్రాలలో కూడా నిర్వహించే హోటళ్లు, దర్శనం ప్రసాదాలు ఇలా అనేక రకాల సేవలు నగదు వుంటేనే అంగీకరిస్తున్నారు. అలాంటప్పుడు డిజిటల్‌ చెల్లింపుల వల్ల లాభం ఏం జరుగుతోంది? ఇక ఐదువందలనోట్ల ఉప సంహకరణకు ఇప్పుడు మరో కారణం చెబుతున్నారు. దేశంలో నకిలీ ఐదు వందలనోట్లు చెలామణిలోవున్నాయంటున్నారు. మరి నోట్ల రద్దు సమయంలో తెచ్చిన కొత్త నోట్లను తయారు చేయడం ఎవరి వల్ల కాదన్నారు? ఆ నోట్లలో వుండే చిప్‌లు కూడా వుంటాయన్నారు. వాటిని తయారు చేయడం అంత సులువైన పని కాదన్నారు. ఇప్పుడు ఆ నోట్లను ఎలా తయారు చేస్తున్నారు. నోట్లను రద్దు చేసి ప్రభుత్వం సాదించిన విజయమేమింటంటే ఏం సమాదానం చెబుతారు? ఐదు వందల నోటుతోపాటు, రెండు వందల నోటు కూడా ఉపసంహరించుకుంటారన్న వర్తాలు కూడా చెక్కర్లు కొడుతున్నాయి. వాటి స్ధానంలో మూడువందల రూపాలయ నోటు వస్తుందంటున్నారు. అసలు ఈ నోట్ల ఉప సంహకరణ వల్ల కొత్తగా నోట్ల ప్రింటింగ్‌ ఎంత భారమౌతుందో తెలిసి కూడా పదే పదే ప్రయోగాలు చేస్తూ, జనం నెత్తిన పన్నుల భారం రుద్దడం తప్ప మరేం లాభం లేదు. ఎందుకంటే సంచి నోట్లు తీసుకుపోతే ఒక మూలన సరిపడే సరుకులు రాకపోవడమే ద్రవ్యోల్భనం. ఈ లాజిక్‌ను మర్చిపోయి పదే పదే నోట్ల రద్దు వల్ల జనాన్ని విసిగించడం, వారి వద్దనున్న సొమ్మును పన్నుల రూపాలంలో లేకుండా చేయడం తప్ప ప్రజలకు ఒరిగేదేమీ వుండదు. పేదలు మరింత పేదలుగా మారడం తప్ప, ధనవంతులు కావడం దుర్లభం. మధ్య తరగతి ప్రజలు కూడా పేద వర్గాలుగా మారుతున్నారు. అయినా పాలకులు మారడం లేదు. పేదలకు న్యాయం జరగడం లేదు. ధనం మూలం ఇదమ్‌ జగత్‌ అన్నారు. ప్రతి వ్యక్తి తనచేతిలో చిల్లి గవ్వైనా వుండాలనుకుంటాడు. కానీ గవ్వలేకుండా పాలకులు చేస్తున్నారు. నోటు లేని ఆర్ధిక వ్యవస్ధను సృష్టిస్తున్నారు. ఇంత వరకు బాగానే వుంది. కాని పూర్తిగా నోట్లు లేకుండా చేయడం సాద్యం కాదు. పదే పదే నోట్లను అందుబాటులోలేకుండా చేస్తే మాత్రం ఆర్దిక వ్యవస్ధ కుదేలు. ఇదంతా పాలకులు అర్దం చేసుకోరు. వారికి అర్దం కాదు. అవును దేశంలో నోట్ల రద్దు మూలంగా జరిగిన ఇబ్బందులు జనానికి తెలుసు. కాని పాలకులకు వాటి కష్టం తెలిస్తే బాగుండు. సామాన్యుడు నోట్ల రద్దు మూలంగా పడిన ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. దేశ ఆర్ధిక వ్యవస్ధను గాడిలో పెట్టడంకోసం, నకిలీ నోట్ల చెలామణి ఆపడం కోసం ఐదేళ్లకో, ఆరెళ్లకో నోట్లలో మార్పులు తీసుకురావడం సహజమే. కాని ఎవరైనా ఒక్కొ మెట్టు ఎక్కి పైకి వెళ్లాలలనుకుంటారు. కాని పై నుంచి కిందికి రావడమే పురోగమనం అని ఎవరూ అనుకోరు. నోట్ల రద్దు మూలంగా జరిగిందదే…నోట్ల రద్దుకు ముందు వున్న ఆర్ధిక వ్యవస్ధకు, ఇప్పటికీ తేడా చాలా వుంది. ఆర్దిక వ్యవస్ధ పనతనమైంది. కాని పాలకులు మాత్రం గొప్పలు చెప్పుకుంటారు. ట్రిలియన్‌ డాలర్లు అంటూ పెద్ద పెద్ద లెక్కలు చెబుతారు. వారికి కూడా వాటి సంగతి తెలియదు. వాటి విలువ అసలే తెలియదు. కాని ఆర్దిక వేత్తలు చెప్పమంటే చెబుతారు. కాని పేదల జీవితాలు చూడాల్సిన పాలకులు, పెద్దల మాటలు వింటే ప్రగతి కారకులు కాదు. ప్రగతి నిరోధకులౌతారు. పది మంది దగ్గర ఆర్దిక వ్యవస్ధ బందీ అయితే, మిగతా వర్గాలకు కుదేలౌతాయి. వంద మందిలో తలో రూపాయి వుంటే అందరికీ ఉయోపగడుతుంది. కాని పది మంది దగ్గ పదిరూపాయలు వుంటే ఆ పది మందికే ఉపయోగపడుతుంది. ఇంత చిన్న లాజిక్‌ను పాలకులు మిస్‌ అతుంటారు. జనాన్ని ఇబ్బందులు పెడుతుంటారు. గతంలో మురార్జీ దేశాయి అదికారంలోకి వచ్చినప్పుడు ఇదే జరిగింది. ఎంత సేపు పక్కన దేశాల మూలంగా మనం నష్టపోతున్నామంటూ లెక్కలు చెప్పి నోట్లు అప్పడూ రద్దు చేశారు. ఇప్పుడూ ఆ కారణం ఒకటిగాచేసి నోట్లు రద్దు చేశారు. ఏమైంది. ఆర్ధిక వ్యవస్ధ కోలుకోనేంత దూరం వెళ్లిపోయింది. దేశంలో నల్లధనం పెరిగిపోయింది. దాంతో దేశ ఆర్ధిక వ్యవస్ధ ఆగమౌతుందన్నారు. నల్ల దనం మొత్తం తీస్తే దేశానికి ఆదాయం సమకూరుతుందన్నారు. ఏమైంది? ఒక్క రూపాయి కూడా రాలేదు. ఆపరేషన్‌ సక్సెస్‌ బట్‌ పేషెండ్‌ డెడ్‌ అని వార్త వినాల్సి వచ్చింది. నోట్ల రద్దు వల్ల ఏర్పడినసమస్యల వల్ల కూడా జనం దేశంలో అనేక మంది చనిపోయారు. కాని లాభమేమైనా జరిగిందా? అంటే శూన్యం. ఒక వేళ నిజంగానే నోట్ల రద్దు వల్ల మన దేశానికి మేలు జరిగితే బిజేపి పార్టీ ఈ పాటికి చేసే ప్రచారం మామూలుగా వుండేది కాదు. కాని నోట్ల రద్దు వల్ల పాకిస్తాన్‌ గిలగిలాడిపోతోంది..ఆ దేశ ఆర్ధిక వ్యవస్ద కుప్పకూలింది. తినడానికి తిండి లేకుండా జనం మలమల మాడిపోతున్నారు. అని వాట్సాప్‌ యూనివర్సిటీ చేసే అబద్దపు ప్రచారాలను నమ్మే వాళ్లు కూడా మనదేశంలో కోట్ల మంది వున్నారు. అందుకే నోట్ల రద్దు ప్రభావం బిజేపి మీద పడకుండాపోయింది. లేకుంటే ఈ పాటికి ప్రజలు బిజేపిని సర్ధేశేవారు. కాని ఎంత సేపు పక్క దేశాల రాజకీయాలను గురించి ప్రజల్లో ఏవగింపు నింపాలి. మన దేశ ఆర్ధిక విధనాల వల్ల పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌లో ఆకలి రాజ్యమేలుతుందని చెప్పాలి. మనదేశంలో ముస్లింల సంఖ్య పెరగుతుందని చెప్పాలి. మేకిన్‌ ఇండియా అని నినాదాలు చేయాలి. చైనా వస్తువులు వాడకూడదు అని పదే పదే బిజేపి నాయకులు ప్రచారం చేస్తుంటారు. ప్రభుత్వం మాత్రం ఇప్పటీకీ ప్రపంచంలో ఇతర దేశాలకన్నా ఎక్కువ వాణిజ్యం చైనాతోనే ముడిపడి వుందన్న సంగతిని చెప్పదు. అసలు మనం చైనా వస్తువులు కొనకపోవడం వల్ల అక్కడి ప్రజలు పనులు లేక, ఉపాదిలేక విలవిలలాడుతున్నారని అంటారు. ఇదా రాజకీయం. ఇదేనా దేశాన్ని ఆర్దికంగా గాడిలో పెట్టడం. ఏది మేకిన్‌ ఇండియా? పతంగుల దారం నుంచి మొదలు, మనదేశ జాతీయ జెండాలు కూడా చైనా నుంచే దిగుమతి చేసుకుంటున్నాం. ఇంక్కెక్కడి మేకిన్‌ ఇండియా? పన్నుల వాయింపుల తప్పడం లేదు. విదేశీ వస్తువులు కొనుగోలు ఆగడం లేదు. మనదేశంలో పారిశ్రామిక ప్రగతి కనిపించింది లేదు. పెద్ద నోట్లు పోయి చిన్న నోట్లు వస్తే జేబులు నిండినట్లు కనిపించొచ్చేమో గాని, వాటి విలువ పెరగదన్నది తెలిస్తే పాలకులు పదే పదే ఇలాంటి ప్రయోగాలు చేయరు. లెస్‌ లగేజ్‌ మోర్‌ కంఫర్టు అని పెద్దలన్నారు. గాని మోర్‌ లగేజ్‌ మోర్‌ కంపర్టు అని అనలేదు. ఈ లాజిక్‌ పాలకులు ఎప్పుడో మిస్‌ అయ్యారు. మిస్‌ ఫైర్‌ అయిన లెక్కలతోటి పన్నులు వాయిస్తున్నారు. నోట్ల ఉపసంహరణ సర్వరోగ నివారిణి అనుకుంటున్నారు. మొదటికే మోసం వస్తున్నా అదే పని కరక్టు అనుకుంటున్నారు. మన ప్రజాస్వామ్యంలో యధా ప్రజా ..తదారాజ అన్నది కనిపించాలి. కాని యధా రాజా..తధా ప్రజా రాజ్యమేలుతోంది. సామ్యవాదం మరుగునపడిపోయింది. మళ్లీ ప్యూడల్‌ వ్యవస్ధ ముసుగులో పెట్టుబడి దారి వ్యవస్ధ కాటేస్తోంది. జనాన్ని పీల్చుకుతింటోంది. ఒక రకంగా చెప్పాలంటే కాల్చుకుతింటోంది.

ఎమ్మెల్యే నివాళి…!

రోడ్డు ప్రమాదంలో మరణించిన యువకులకు.. ఎమ్మెల్యే నివాళి

దేవరకద్ర/ నేటి ధాత్రి.

దేవరకద్ర నియోజకవర్గం కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రానికి చెందిన యువకులు చరణ్ రెడ్డి, అనిల్ సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో మంగళవారం చరణ్ రెడ్డి, అనిల్ భౌతిక దేహాలకు ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందడం బాధాకరం అన్నారు. నివాళులర్పించిన వారిలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ను పకడ్బందీగా నిర్వహించాలి..

ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ను పకడ్బందీగా నిర్వహించాలి
– రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ

– ప్రతి ఓటర్ కు ఓటర్ స్లిప్ లను పంపిణీ చేయాలి

– ఫిబ్రవరి 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహణ

– ప్రతి 2 గంటలకు పోలింగ్ రిపోర్టు వివరాలను పంపాలి

– పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

సిరిసిల్ల(నేటి ధాత్రి):

శాసనమండలి ఎన్నికల పోలింగ్ మన పెద్దపల్లి జిల్లాలో పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు.మంగళవారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ
చందుర్తి, కోనరావు పేట మండల కేంద్రాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో, వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను ఆర్డీఓ రాజేశ్వర్ తో కలిసి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ, పోలింగ్ సజావుగా జరిపేందుకు వీలుగా పోలింగ్ కేంద్రాలలో అవసరమైన అన్ని సౌకర్యాలు ఉండాలని, సీసీ కెమెరాలు లేదా వెబ్ కాస్టింగ్ తప్పనిసరిగా ఉండాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.
జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరికి ఓటర్ స్లిప్ పంపిణీ చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల వద్ద
ఫిబ్రవరి 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు శాసనమండలి ఎన్నికల పోలింగ్ జరుగుతుందని అన్నారు.
పోలింగ్ కేంద్రం పరిసరాలను చెక్ చేసుకోవాలని ,100 మీటర్ల రేడియస్ లో ఎన్నికలను ప్రభావితం చేసేలా ఎటువంటి ప్రచారం జరగడానికి వీలు లేదని అన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద డమ్మీ బ్యాలెట్ అతికించాలని అన్నారు.
పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు లైన్లో వచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని, దివ్యాంగులు వృద్ధులు గర్భిణీ స్త్రీలు ప్రాధాన్యతతో ఓట్లు వేసే విధంగా చూడాలని, 100 మీటర్ల పరిధిలో ఓటర్ సహాయ కేంద్రానికి హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేయాలని అన్నారు.
పోలింగ్ లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు పాస్పోర్ట్ డ్రైవింగ్ లైసెన్స్ పాస్ బుక్ , పాన్ కార్డు ఆధార్ కార్డు, పెన్షన్ డాక్యుమెంట్, జాతీయ ఉపాధి హామీ పథకం జాబ్ కార్డ్, యూడి ఐడి, హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డు గుర్తింపు కోసం ఓటర్లు తమ వెంట తీసుకుని రావాల్సి ఉంటుందని అన్నారు.
పోలింగ్ నాడు ఉదయం ఖాళీగా ఉన్న బ్యాలెట్ బాక్స్ ను ఏజెంట్లకు చూపించాలని, గ్రీన్ పేపర్ లో ఏజెంట్ల సంతకాలు తీసుకుని సీజ్ చేయాలని, బ్యాలెట్ బాక్స్ పై పోలింగ్ కేంద్రం వివరాలు ఉండే విధంగా పేపర్ అతికించాలని, ఓటర్ సీక్రసి కాపాడేందుకు వీలుగా ఓటింగ్ కంపార్ట్మెంట్లను ఏర్పాటు చేయాలని అన్నారు.
పోలింగ్ నాడు ప్రతి రెండు గంటలకు ఒకసారి అంటే 10 గంటలకు, 12 గంటలకు, 2 గంటలకు, పోలింగ్ ముగిసిన తరువాత 4 గంటలకు పోలింగ్ వివరాలను ప్రకటించాలని అన్నారు. సాయంత్రం నాలుగు గంటల వరకు ఓటర్ స్లిప్పులు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఓటు వేసే అవకాశం కల్పించాలని, అన్నారు.
చివరి ఓటర్ ఓటు వినియోగించుకున్న తర్వాత నిబంధనలు ప్రకారం బ్యాలెట్ బాక్సులను మూసివేసి సీల్ చేయాలని, ప్రతి ఒక్క సిబ్బంది తన మాన్యువల్ ను ఒకటికి రెండు సార్లు పరిశీలించు కోవాలని , విధులను పక్కగా నిర్వహిస్తూ ప్రశాంతంగా ఓటింగ్ జరిగేలా చూడాలని అన్నారు.
అనంతరం కోనరావుపేట మండలం వెంకట్రావు పేట గ్రామంలోని ఇసుక రీచ్ ను పరిశీలించారు.
ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట వేములవాడ ఆర్డిఓ రాజేశ్వర్ తహసిల్దార్లు విజయ్ ప్రకాష్ రావు , మహేష్, సుజాత, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

ఏనుగులు బీభత్సం.. ఐదుగురు మృతి..

ఏనుగులు బీభత్సం.. ఐదుగురు మృతి..

అన్నమయ్య జిల్లా..
ఓబుల వారి పల్లి(నేటి ధాత్రి)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శివరాత్ర వేళ తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండల పరిధిలోని గుండాలకోనలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి.
శివరాత్రి సందర్భంగా ఆలయానికి వెళ్తున్న భక్తులపై ఏనుగులు ఒక్కసారిగా దాడికి పాల్పడ్డాయి.ఈ ఘటనలో వై.కోటకు చెందిన ఐదుగురు భక్తులు మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలికి చేరుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కాగా అటవీ ప్రాంతంలో ఆహారం దొరకపోవడంతో గత కొంత కాలంగా అడవి జంతువులు తరచూ జనావాసాల్లోకి ప్రవేశించి ప్రజలపై దాడికి పాల్పడుతున్నాయి. చిరుత, ఏనుగుల దాడులలో పదుల సంఖ్యలో జనాలు ప్రాణాలు కోల్పోయారు.ఎంతో మంది గాయాలపాలయ్యారు. అటవీ జంతువులు కనిపిస్తే వాటి ముందుకు వెళ్లకూడదని వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచిస్తున్నారు.

కొత్త తిమ్మాపూర్ వద్ద డివైడర్ పనులు ఆపాలంటూ నిరసన.

కొత్త తిమ్మాపూర్ వద్ద డివైడర్ పనులు ఆపాలంటూ నిరసన..

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

.క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కుర్మపల్లి స్టేజ్ నుండి శ్రీనివాస గార్డెన్ వరకు నిర్మిస్తున్న 100 ఫీట్ల రహదారి నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో డివైడర్లు ఏర్పాటు చేస్తున్నారు. అందులో భాగంగానే రామకృష్ణాపూర్ ఎక్స్ రోడ్ నుండి అమ్మ గార్డెన్ వరకు డివైడర్ నిర్మించడం వల్ల కొత్త తిమ్మాపూర్ గ్రామానికి వెళ్లే ప్రజలకు దూర భారం ఏర్పడుతున్న నేపథ్యంలో మంగళవారం డివైడర్ పనులు ఆపాలని స్థానిక ప్రజలు నిరసన చేపట్టారు.డివైడర్ పనులు అడ్డుకున్నారు. ప్రజల సౌకర్యార్థం రహదారి పై అవసరమైన చోట యుటర్న్ లు కల్పించాలని స్థానిక ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి దృష్టికి తీసుకెళ్లినా సరే నిర్మాణాలు యధావిధిగానే జరుగుతున్నాయని, అవసరమైన చోట యూటర్న్ నిర్మించడం లేదని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకొని కొత్త తిమ్మాపూర్ వెళ్లే రహదారి దగ్గర యూటర్న్ ఏర్పాటు చేసేలా చొరవ తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. లేనిపక్షంలో రహదారిపై బైఠాయించి నిరసన కార్యక్రమాలు చేపడతామని అంటున్నారు.

ఉద్యోగంలో లీలలు…ఉద్యోగులతో రాసలీలలు!

`మంత్రికి తెలియకుండానే నియామకాల?

`అక్రమార్కుడికే అందలమా.

 

`మంచి ఆటగాడు ఆ ‘‘అంజయ్య’’?

`నకిలీ పత్రాలతో ప్రమోషన్లు!

`రిటైర్‌ అయినా కొత్త కొలువులు!

`’’అంజయ్య’’ మళ్లా కొలువెక్కిండు!

`పులిహోర కలపడంలో మేటి…కొలువులు తెచ్చుకోవడంలో ఘనాపాటి

`’’అంజయ్య’’… మళ్లా కొలువెట్లొచ్చిందయ్యా?

`’’అంజయ్య’’కు మరో రెండేళ్లు ఉద్యోగం!
`ఔట్‌ సోర్సింగ్‌ వెసులుబాటు సద్యోగం!

`’’ఏడుపాయల’’ దేవాలయంలో పెద్ద నౌకరే!

`నకిలీ సర్టిఫికేట్‌ తో అప్పట్లో ప్రమోషన్‌.

`క్రిమినల్‌ కేసు నమోదుతో బైట పడ్డ భాగోతం.

`తన కింద పని చేసే మహిళలతో ‘‘కేళీ కలాపం’’!

`అప్పట్లో దేవాదాయ శాఖలో సంచలనం.

`వసతీ గృహం నిర్మాణంలో చేతి వాటం.

`లక్షల రూపాయలు తిన్నట్లు తేలిన పర్వం.

`అధికారులు ‘‘అంజయ్య’’ గుప్పిట్లో!

`రిటైర్‌ అయినా మరో రెండేళ్లు కుర్చీలో!!

`’’అంజయ్య’’ మీద కనికరం… రెండేళ్లకు కొలువు వరం!

`అన్నిట్లో ఆరితేరినోడు ‘‘అంజయ్య’’!

`’’అంజయ్య’’ మీద అంత ప్రేమెందుకయ్యా ‘‘రామకృష్ణయ్య’’!

`అమ్మ వారి గుడిలో అపవిత్రుడికి కొలువేందయ్య!

`రసరాజు ‘‘అంజయ్య’’కు రెండేళ్లు ఔట్‌ సోర్సింగ్‌ ఎందుకయ్యా!

`గుడి ఎనక నా సామి గుడిసేటి ఏశాలు తెలిసినా ఇదేం పనయ్యా?

`’’అంజయ్య’’ మీద పిర్యాదు చేసిన ‘‘రామకృష్ణ’’ కొలువిచ్చిండు.
`అవినీతి అధికారికి మరో అవకాశం కల్పించిండు.

పైదరాబాద్‌,నేటిధాత్రి:
అష్ట దరిద్రుడికి నిత్య కళ్యాణమట.. ఇది చదివితే నిజమేనేమో అనిపిస్తుంది. ఒక వ్యక్తి అత్యంత వివాదాస్పదుడు అని తెలిసిన తర్వాత అతన్ని అందలం ఎక్కించడం దుర్మార్గం. వ్యవస్దకు పట్టన గ్రహణం. అంజయ్య అనే దేవాదాయశాఖలో పనిచేసిన ఉద్యోగి చేసిన అక్రమాలు, అవినీతి అంతా ఇంతా కాదు. ఇక దుర్మార్గాల గురించి ఒక్క ముక్కలో చెబితే సరిపోతయేంత చిన్నది కాదు. అన్ని లీలలు తెలిసిన ఉద్యోగి. రాసలీలల్లో ఆరితేరిన వ్యక్తి. ఇంత గొప్ప నీచ చరిత్ర వున్న అంజయ్య ఇటీవలే ఉద్యోగం నుంచి రిటైర్‌ అయ్యారు. అలా అయ్యారో లేదో ఇలా మళ్లీ కొలువు తెచ్చుకున్నాడు. ఈ ఏడాది జనవరిలో అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ అదికారిగా విధులు నిర్వహించిన అంజయ్య రిటైర్‌ అయ్యారు. ఏవో కొ ంపలు మునిగిపోయినట్లుగా, దేవాదాయ శాఖలో మరెరూ లేనట్లుగా రెండేళ్లపాటు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగం కల్పిస్తూ పిబ్రవరి 19న దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. విచిత్రమేమిటంటే గతంలో అంజయ్య పెద్ద అవినీతి పరుడు. దేవాదాయ సొమ్మును కాజేస్తున్నాడు. దర్శశాల నిర్మాణం కోసం దాతలు ఇచ్చిన సొమ్మును అంజయ్య మింగేశాడు. అని రిపోర్టు ఇచ్చిన ఉన్నతాదికారి రామకృష్ణ ఇప్పుడు అదే అంజయ్యకు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రెండేళ్లపాటు ఏడుపాయల వన దుర్గాభవాని ఆలయంలో అడ్మినిస్ట్రేటివ్‌ అధికారిగా కొలువును ప్రసాదం పంచినట్లు ఇచ్చేశారు. దీన్నే దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నారని చెప్పుకుంటారు. గతంలోనే నకికీ సిర్టిఫికెట్‌ ఆరోపణలు అంజయ్య మీద వున్నాయి. ఆలయం నిధులను మింగినట్లు విమర్శలున్నాయి. విజిలెన్స్‌ అదికారులు కూడా లెక్కలుతేల్చి, రిపోర్టు కూడా ఇచ్చారు. వాటిని ఎప్పుడో పక్కన పెట్టారు. ప్రమోషన్ల మీద ప్రమోషన్లు ఇచ్చారు. రిటైర్‌ అయినా సరే మళ్లీ అంజయ్యను తెచ్చి సీట్లో కూర్చొబెడుతున్నారు. ఎన్నికల కోడ్‌ అమలులోవుందన్న సోయి కూడా ఉన్నతాధికాలకు లేకుండాపోయింది. ఎవరు పట్టించుకుంటారు లే అనుకున్నారో లేక, మాకు ఎదురేముందిలే అని అనుకున్నారో గాని పోస్టింగ్‌ ఆర్టర్‌ ఇచ్చేశారు. సహజంగా ప్రభుత్వ ఉద్యోగులంటే ఎంతో ఆదర్శంగా వుండాలి. వారి జీవితం ప్రజలకు మేలు చేసేలా వుండాలి. ఎల్లప్పుడూ సేవచేసేలా వుండాలి. ప్రజలకు అందుబాటులో వుండాలి. సేవ చేయడంలో అందరికన్నా ముందుండాలి. అదే ప్రభుత్వ శాఖలో మరింత గొప్పగా జీవితాలను గడపాల్సిన వారు దేవాదాయశాఖలో వుండాలి. ఆ శాఖలో పనిచేసే వారికి సమర్ధత ఒక్కటే కొలమానం కాదు. వారి వ్యవహారశైలి కూడా ఎంతో కీలకం. వారి ఆలోచన దగ్గర నుంచి వారు నడుచుకునే విధానం కూడా సరిగ్గా వుండదకూడదు. కలలో కూడా తప్పటడుగు వేయకుండా వుండాలి. ప్రజా దనం దుర్వినియోగం చేయకుండా వుండాలి. ముఖ్యంగా హిందువులు ఎంతో పవిత్రంగా కొలిచే స్థలాలైన గుళ్లలో పనిచేసే అధికారులు ఎంతో పవిత్రంగా వుండాలి. వారి మనసు అంతకన్నా పవిత్రంగా వుండాలి. ఏ చిన్న పొరపాటు చేయడానికి కూడా భయపడాలి. దేవుడంటే హిందువులకు ఎంతో నమ్మకం. దేవుడంటే ప్రతి వారికి భక్తి వుంటుంది. తప్పు చేస్తే దేవుడు శిక్షిస్తాడనే భయం వుంటుంది. కాని కోట్లాది మంది ఎంతో భయభక్తులతో దేవుళ్లను సందర్శించి వారి తప్పులను మన్నించమని వేడుకుంటారు. అలాంటి ఎంతో పవిత్రమైన స్ధలాలలో ఉద్యోగాలు చేసే ఉద్యోగులు ఎలావుండాలి. ఎంతో ఆదర్శవంతమైన జీవితం గడపడమే కాకుండా, ఆ దేవునిపై అచెంచలమైన భక్తిభావం వుండాలి. అంతకన్నా కొన్ని వందల రెట్ల భయం వుండాలి. కాని గుళ్లలో పనిచేసే కొంత మంది ఉద్యోగుల జీవితాలు ఎంత నీచంగా వుంటాయంటే చెప్పడానికి కూడా అలవి కాకుండా వుంటాయి. అంత దుర్మార్గంగా వుంటాయి. మరికి వారికి దేవుడంటే భయం లేకుండా, నిర్భీతిగా, నిర్లజ్జగా, నిర్లక్ష్యంగా అవినీతి కార్యకలాపాలకు పాల్పడుతుంటారు. ఇంకాకొంత మంది ఓ అడుగు ముందుకేసి చేయకూడని పనులు చేస్తుంటారు. అలా పవిత్రమైన స్ధలాలో కొలువు చేస్తూ నీచమైన పనులు చేస్తూ తనకుతానుగా దొరికిపోయిన ఉద్యోగి అంజయ్య. కొమురవెళ్లి దేవస్దానంలో చిన్న ఉద్యోగిగా కొలువులో చేరిన అంజయ్య కష్టపడి అంచెలంచెలుగా ఎదగలేదు. భక్తులకు సేవ చేసి పేరు పొందలేదు. ఉత్తమ ఉద్యోగిగా ఎక్కడా పేరు లేదు. ఎవరు అంజయ్య గురించి చెప్పినా నీచం,నికృష్టం అనే చెబుతుంటారు. మరి అలాంటి వ్యక్తికి ఉన్నతాధికారులు ఎందుకు సహకరించారన్నది అంతుచిక్కని ప్రశ్న. అంటే కింది స్దాయి నుంచి పై స్ధాయిదాకా ఎంతో పవిత్రమైన దేవాదాయశాఖలో కీచకులు, కామకులు, లంచావతారులు తిష్టవేశారని చెప్పడంలో సందేహం లేదు. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? అంటే ఇదే మరి. ఒక ఉద్యోగి ఆలయ నిధులు దుర్వినియోగం చేస్తున్నాడని తెలిసినా పై అధికారులు ఎందుకు ఉపేక్షిస్తూ పోయారన్నది కూడా తేలాల్సివుంది. తాను చేరుకోవాల్సిన రైలు జీవిత కాలం లేటు అంటూ గతంలో చెప్పుకునేవారు. దేవాదాయ శాఖలో చూస్తే జీవితం అయిపోయినా కూడా గమ్యం చేరని ప్రయాణంలా సాగుతుంటాయి. అందుకే అవినీతికి పాల్పడిన, అనేక అక్రమాలు చేసిన అధికారులు కూడా తప్పించుకుంటున్నారు. ఏకంగా రిటైర్‌ అయిపోతున్నారు. కాని కేసులు అలాగే పెండిరగ్‌లో వుంటున్నాయి. అసలు విషయానికి వస్తే కొమురవెళ్లిలో జూనియర్‌ అసిస్టెంటుగా మొదలైంది అంజయ్య జీవితం. నికిలీ సర్టిఫికెట్‌తో ప్రమోషన్‌ పొందాడన్నది రుజువైంది. క్రిమినల్‌ కేసు కూడా నమోదైంది. అన్నీ తెలిసినా అంజయ్యకు ప్రమోషన్‌ ఇచ్చారు. క్రిమినల్‌ కేసు నమోదైన తర్వాత కూడా ఆయనను ఉద్యోగంలో నుంచి తొలగించలేదు. చిన్న ట్రాన్ఫ్‌ఫర్‌తో సరిపెట్టారు. అదే శిక్ష అని దేవాదాయశాఖ అదికారులు చేతులు దులుపుకున్నారు. ఇలా పై అదికారులు ఆశీస్సులు వున్న అంజయ్య లాంటి వారి వ్యవహార శైలి విచ్చలవిడి తనాన్ని మరింత పెంచుకుంటుంది. అందుకే అంజయ్యకు భుక్తులంటే చులకన. దేవుడంటే భయం వుండదు. భక్తి వుండదు. పవిత్రమైనస్ధలంలో కొలువు చేస్తున్నామన్న సోయి కూడా వుండదు. ఇక కొమురవెళ్లి దేవస్దానంలో పనిచేసే మహిళా ఉద్యోగుల పట్ల ఆయన చేష్టలు మరీ దుర్మార్గంగా వుండేవి. మహిళా ఉద్యోగులు తనకు లొంగిత ఒక లెక్క..లొంగకపోతే మరో లెక్క. అంతే కాదు తనుకు లొంగిన మహిళలతో పోటోలు దిగి, వారిని బ్లాక్‌ మెయిల్‌ చేయడం కూడా అలవాటు చేసుకున్నాడు. ఆ ఫోటోలు కూడా గతంలో బైట పడ్డాయి. ఇలా పవిత్రమైన స్ధలంలో మహిళలను వేదింపులకు గురిచేయడమే కాదు, వారి లొంగదీసుకొని కేళీ కలాపాలు నిర్వహించాడు. అయినా అదికారులు పట్టించుకోలేదు. అంజయ్యపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అంటే దేవాదాయ శాఖ ఎంత భ్రష్టుపట్టిపోయిందో అర్దం చేసుకోవచ్చు. తన కింద పనిచేయాలంటే మహిళా ఉద్యోగులు గజగజ ఒనికిపోయేవారు అని చెబుతుంటారు. ఇక ఆలయం శుభ్రం చేసే స్వీపర్లను బానిసలకన్నా హీనంగా చూసేవాడు అనే ఆరోపణలు అనేకం వున్నాయి. వారు అంజయ్య చెప్పినట్లు చేయాలి. లేకుంటే ఉద్యోగాలు పోతాయని భయపెట్టేవాడు. వారు సర్వస్వం అర్పించుకునేలా చేసేవాడని అప్పట్లో అనేక విమర్శలు వచ్చాయి. అందుకు సాక్ష్యంగా కూడా అనేక ఫోటోలు కూడా బైటకు వచ్చాయి. కాని దేవాదాయాశాఖ పై స్ధాయి అదికారులు అంజయ్య మీద చర్యలు తీసుకోలేదు. ఎందుకంటే గుడి సొమ్మును అప్పనంగా మింగుతూ పై స్ధాయి అదికారులకు వాటాలు పంపుతుండేవారని సాటి ఉద్యోగులే చెబుతుంటారు. అంతే కాదు పై అదికారులు ఆశలు ఎలాంటివైనా తీర్చేవాడని అందుకే అంజయ్యపై ఎలాంటి చర్యలు తీసుకోకపోయేవారని చెబుతుంటారు. ఇంత కాలం తప్పుడు పనులు చేసిన అంజయ్యకే ఉన్నతాదికారులు అండదండలు అందించారు. రిపోర్టులను బుట్టదాఖలు చేశారు. నిధులు మింగినా చర్యలు తీసుకోలేదు. పైగా ప్రమోషన్లు ఇచ్చి ప్రోత్సహించారు. అంటే అంజయ్య చేసిన తప్పులలో ఉన్నతాధికారులకు వాటాలున్నట్లు వాళ్లే అంగీకరించనట్లు కాదా? తమకేం తెలియదన్నట్లు ప్రకటనలు చేస్తారా చూడాలి.
మంత్రిగారు…ఈ దుర్మార్గం చూడండి.
ప్రభుత్వానికి తెలియకుండా చీమ చిటుక్కుమనకూడదు. దేవాదాయా శాఖ కొండా సురేఖకుతెలియకుండా ఒక్క ఫైలు కూడా కదలకూడదు. కాని ఉద్యోగాల నియామకాలు మంత్రికి తెలియకుండానే జరిగిపోతున్నాయా? సాక్ష్యానికి అంజయ్య నియామకం ఒక్కటి చాలు. ఉద్యోగాల కోసం ఎంతో మంది ఎదరుచూస్తున్నారు. వాళ్లందరినీ కాదని ఉన్నతాదికారులు అంజయ్యకే ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగం ఎందుకిచ్చినట్లు? ఇక పోతే సంబంధిత మంత్రికి తెలియాల్సిన అవసరం లేదా? ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాల నియామకం మొత్తం అదికారుల చేతుల్లోనే వుందా? అలా అని ప్రభుత్వం వారికి స్వేచ్ఛనిచ్చిందా? అదే నిజమైతే కొత్తగా అర్హులైన నిరుద్యోగిని ఎంపిక చేయొచ్చు. లేకుంటే రిటైర్‌ అయిన నిజాయితీ పరుడైన ఉద్యోగికి ఇవ్వొచ్చు. పవిత్రమైన గుడిలో కొలువు చేస్తూ అపవిత్రమైన పనులు చేసే అంజయ్య లాంటి ఉద్యోగికి మళ్లీ ఔట్‌ సోర్సింగ్‌ కొలువంటే అపచారం కాదా? తెలంగాణలో ఏడుపాయల జాతర అంటే ఎంతో గుర్తింపు వుంది. వనదుర్గాభవాని అంటే మూడు నాలుగు రాష్ట్రాల నుంచి కొన్ని లక్షల మంది భక్తులు దర్శనం కోసం ఏటా వస్తుంటారు. కోరిన కోర్కెలు తీర్చే కల్పతరువుగా, భక్తులకు కొంగు బంగారమైన ఎంతో శక్తి వంతమైన మహిమాన్విత క్షేత్రంలో అంజయ్య లాంటి లోలుడికి ఉద్యోగం ఇవ్వడాన్ని భక్తులంతా తప్పు పడుతున్నారు. ఇలాంటి వ్యక్తి నియామకం వల్ల ప్రభుత్వం అబాసుపాలయ్యే అవకాశం వుంది. మంత్రికొండా సురేఖ తక్షణం స్పందించి, అంజయ్య మీద వున్న ఆరోపణలపై విచారణ జరిపించాలని కోరుతున్నారు. రిటైర్‌ అయినంత మాత్రాన ఆయన చేసి అవినీతి మాసిపోదంటున్నారు. పైగా మళ్లీ అంజయ్య అంత సుద్దపూస లేడన్నట్లు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగం ఇచ్చిన అదికారులపై కూడా దృష్టిపెట్టాలని భక్తులు కోరుతున్నారు. అంజయ్య అవినీతిలో ఉన్నతాదికారుల వాటా కూడా తేల్చాలంటున్నారు. లేకుంటే దేవాదాయశాఖలో ఇలాంటి ప్రబుద్దలు మరింత పెరిగిపోయే అవకాశాలున్నాయి. భక్తుల మనోభావాలు దెబ్బతినే ప్రమాదముంది. అందువల్ల మంత్రి కొండా సురేఖ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

కోచింగ్‌.. చీటింగ్‌!

 

`కోచింగ్‌ సెంటర్ల చీకటి సంపాదన.

`గోల్‌ మాల్‌ గోవిందం!

 

`‘‘వేలకోట్ల’’ రాబడికి లెక్కుండదు!

`అకాడమీ లకు హద్దుండదు.

 

సెంటర్లలో వెంచర్లకు మించి ఆదాయం.

`పైకి మాత్రం కి విద్యా వికాసం.

`జరిగేదంతా ‘‘వేల కోట్లలో’’ వ్యాపారం.

`లక్షల మందికి కోచింగులు.

`వేలాది రూపాయల ఫీజులు.

`చెతికందేవి ఎన్ని కొలువులు?

`అమాయకుల జీవితాలకు కల్పించే ఆశలు.

`విద్యార్థుల బలహీనతలే పెట్టుబడి.

`పదే పదే చెల్లించే ఫీజులు లెక్కకు మించిన రాబడి.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

తెలంగాణలో గ్రూప్‌ 2,3 పరీక్షలు వాయిదా పడ్డాయి. నిజానికి ఆగష్టు నెలలో జరగాల్సిన పరీక్షలు. కాని జరగడం లేదు. కారణం అభ్యర్ధుల నుంచి వచ్చిన ఒత్తిడి అన్నది అందరూ చెప్పుకునే మాట. కాని దాని వెనుక కోచింగ్‌ సెంటర్ల మాయా జాలం వుందన్నది అందరూ అంగీకరించాల్సిన అంశం. ఎవరు ఔనన్నా, ఎవరు కాదన్నా కోచింగ్‌ సెంటర్ల మాఫియా మూలంగానే జరిగిందనేది అందరికీ తెలుసు. కాకపోతే ప్రభుత్వాన్ని బద్‌నాం చేయడానికి ఇంత కాలం వాయిదా కోసం ఉద్యమాలు చేయించారు. దాని వెనుక కూడా కోచింగ్‌ సెంటర్ల నిర్వాహకల ప్రోద్భలం వుందన్న ఆరోపణలు అనేకం వున్నాయి. ఈ పరీక్షల వాయిదా వల్ల కోచింగ్‌ సెంటర్లకు మళ్లీ కల వచ్చిందనే చెప్పాలి. కనీసం ఆరు నెలల పాటు ఇక కోచింగ్‌ సెంటర్లు రాత్రి పగలు అనే తేడా లేకుండా బ్యాచ్‌లు నిర్వహిస్తారు. కోట్ల రూపాయలు సంపాదిస్తారు. కోచింగ్‌ సెంటర్లు క్లాసులు చెప్పే సమయంలో వీడియోలు తీసి, వాటిని ఆన్‌లైన్‌ కోచింగ్‌ల పేరుతో ప్యాకేజీలు కూడా అమ్ముకుంటున్నారు. దాంతో అటు యూ ట్యూబ్‌ నుంచి ఆదాయం. దానికి తోడు ఉచిత ప్రచారం. ఆన్‌లైన్‌ ప్యాకేజీ కింద ఒక్కొ అభ్యర్ధి నుంచి వేలాది రూపాయలు వసూలు చేస్తాయి. సెంటర్ల నిర్వహణతో వచ్చే ఆదాయం అదనం. అదే అసలైన సంపాదనకు మార్గం. ఇక చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా తెలంగాణ వ్యాప్తంగా మూతబడిన కోచింగ్‌ సెంటర్లు కూడా తెరుచుకుంటాయి. ప్రభుత్వం కూడా జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటిస్తామని చెప్పడంతో ఇక ఐదేళ్లపాటు విరామం లేకుండా సెంటర్లు నిర్వహిస్తుంటారు. ఏటా కొన్ని లక్షల మంది పట్టభద్రులు తమ చదువు పూర్తి చేసుకొని వస్తుంటారు. వారికి రకరకాల విద్యా కోర్సుల కోసం, ఉద్యోగాల కోసం కోచింగ్‌లు ఇస్తుంటారు. గ్రూప్‌ పరీక్షల వాయిదా వల్ల కనీసం వెయ్యి కోట్ల రూపాయల వ్యాపారం జరగొచ్చన్నది ఒక అంచానా. డిఎస్సీ వాయిదా వేస్తే ఇంకా ఎక్కువ ఆదాయం సమకూరేది. గ్రూప్‌ పరీక్షలు ఎన్ని లక్షల మంది రాసినా, కోచింగ్‌ చాలా తక్కువ మంది తీసుకుంటారు. కారణం ఉద్యోగాలు తక్కువగా వుంటాయి. డిఎస్సీ పదకొండు వేల ఉద్యోగాలున్నాయి. దాంతో నిరుద్యోగుల్లో ఆశలు వుంటాయి. కోచింగ్‌ సెంటర్లలో కొంత తర్ఫీదు తీసుకుంటే పరీక్ష సులువౌతుందన్న భావన వారిలో కలుగుతుంది. అందుకే కొందరు కోచింగ్‌ సెంటర్ల నిర్వాహకులు కృత్రిమ ఉద్యమం లేపారు. పరీక్షల నిర్వహణతో అంతా చల్లబడిరది. గ్రూప్‌ పరీక్షలు వాయిదా పడడంతో ఆగిపోయింది.
ట్యుటోరియల్స్‌, కోచింగ్‌ సెంటర్ల మూలంగా లక్షల్లో వుండే పై చదువులకు అవసరమైన కోర్సుల్లో సీట్లు సాధించేందుకు కొంత వరకు ఉపకరిస్తాయేమో కాని, వందల్లో, కొన్ని సార్లు వేలల్లో వుండే ఉద్యోగాలు మాత్రం ఖచ్చితంగా వస్తాయనుకోవడం మాత్రం పూర్తిగా భ్రమే. సహజంగా ఏ రాష్ట్రాలలో అయినా గ్రూప్‌ పరీక్షల నిర్వహణతో ప్రభుత్వాలు ఎంపిక చేసే ఉద్యోగాలు కేవలం వందల్లోనే వుంటాయి. ఒక్క డిఎస్సీ లాంటి పరీక్షలే కొన్ని సార్లు వేలల్లో వుంటాయి. అంతే కాని వందల్లో వుండే గ్రూప్‌1, గ్రూప్‌2 పరీక్షలు కేవలం కోచింగ్‌ సెంటర్లలలో చదువుకున్నవారికే ఉద్యోగాలు వస్తాయన్నది ముమ్మటికీ అబద్దం. ఏ కోచింగ్‌ సెంటరైనా సరే పరీక్షల్లో మెలుకవలు నేర్పుతారు. పరీక్షల్లో సమయం ఎలా సద్వినియోగం చేసుకోవాలన్నదానిపైనే ఎక్కువ దృష్టిపెడతారు. కాకపోతే పరీక్షల విధానంలో తర్పీదు ఇవ్వడంలో కోచింగ్‌ సెంటర్ల పాత్ర కొంత వరకు ఉపయోగకరమే తప్ప, పూర్తిగా దోహరపడతాయని చెప్పడం మాత్రం శుద్ద అబద్దం. ఒక తెలివైన అభ్యర్ధి కోచింగ్‌ వెళ్తే ఉద్యోగం సంపాదించుకునే అవకాశం మెరుగౌతుంది. అంతే తప్ప ఆ తెలివైన అభ్యర్ధి కేవలం కోచింగ్‌కు వెళ్లడం వల్లనే ఉద్యోగం సంపాదించాడని చెప్పలేం. కారణం ఎంతో మంది కోచింగ్‌కు వెళ్లే స్తోమత లేని వాళ్లు కూడా ఉద్యోగ నిర్వహణ పరీక్షల్లో కూడా ఫస్టు ర్యాంకు సాధించిన వారున్నారు. కోచింగ్‌ సెంటర్లలో చదువుకున్న వాళ్లందరూ మొదటి ర్యాంకులుసాధించినట్లు పెద్దగా చరిత్రలుకూడా లేవు. అంతే కాదు గ్రూప్‌1 లో ప్రభుత్వాలు ప్రకటించే కొలువులు ఎన్ని వుంటాయో, తెలంగాణ మొత్తం మీద అన్ని కోచింగ్‌ సెంటర్లు వున్నాయంటే ఆశ్చర్యపోవనవసరం లేదు.
ఇటీవల కోచింగ్‌ సెంటర్లలో చదువుకుంటే తప్ప కొలువులు రావన్న భ్రమలు యువతలో బాగా కల్పించారు. ఎందుకంటే ఉద్యోగాల పరంపర అలా కొనసాగడం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగాలు పొందిన వారిలో చాల మంది అప్పటి అధికారుల కనుసన్నల్లో నడిచిన కోచింగ్‌ సెంటర్లలో చదువుకున్న వారికి ఉద్యోగాలు వచ్చినట్లు పెద్దఎత్తున ప్రచారం వుండేది. అందులో కొంత వాస్తవం కూడా వుంది. అందుకే ఉద్యోగార్ధులు కోచింగ్‌ సెంటర్లకు పరుగులు పెట్టడం అలవాటు చేసుకున్నారు. వాళ్లు తయారు చేసిన మెటీరియల్‌ నుంచే ప్రశ్నలు వస్తాయన్న భ్రమలు కల్పించారు. అదే నిజమైతే ఉద్యోగాలు వచ్చిన వాళ్లంతా కోచింగ్‌ సెంటర్లలో చదువుకున్న వాళ్లే అయి వుండాలి. కాని అది ఎప్పుడూ సాధ్యం కాలేదు. కాని అందమైన బ్రోచర్లు తయారు చేయడం, ఉద్యోగాలు పొందిన వారితో ఇంటర్వూలు చేయించడం మొదలు పెట్టారు. ఇంటి దగ్గరే పూర్తి సమయం చదువుకున్న అభ్యర్ధులకు డబ్బులిచ్చి కూడా తమ కోచింగ్‌ సెంటర్లలో చదువుకున్నట్లు కూడా ప్రచారం చేయించుకుంటూ వస్తున్నారు. దాంతో యువత ఆకర్షితులౌతున్నారు. ఇక సోషల్‌ మీడియా వచ్చిన తర్వాత ఆ ప్రచారం మరీ విపరీతమైంది. దాంతో గ్రామీణ యువత కోచింగ్‌ సెంటర్లవైపు చూడడం అలవాటు చేసుకున్నారు. నిత్యం కోచింగ్‌తోపాటు, పరీక్ష నిర్వహణ వంటివి చేస్తుంటారు. అయినా ఉద్యోగాలు పొందని వారే ఎక్కువగా వుంటారు. తెలంగాణలో కొన్ని వందల కోచింగ్‌ సెంటర్లు వున్నాయి. అన్నింటి నుంచి ఉద్యోగాలు పొందుతున్న వారు ఎంత మంది? కోచింగ్‌లు తీసుకున్నవారు ఎంత మంది? అన్నది లెక్కేస్తే అసలు బండారం బైటపడుతుంది. ఎలాంటి కోచింగ్‌ తీసుకోకుండా ఇంటి వద్ద చదువుకున్నవారు కూడా రెండు మూడు ఉద్యోగాలు సంపాదించిన వారు కూడా చాల మంది వున్నారు.
కోచింగ్‌ సెంటర్ల వ్యాపారం గురించి తెలిస్తే విస్తుపోవాల్సిందే. ఎందుకంటే కోచింగ్‌ సెంటర్లు విద్యా వ్యవస్దలకు అనుసంధానమై వుండవు. ఎందుకంటే అవి ట్యూషన్‌ సెంటర్లుగానే పరిగణిస్తారు. కాని కోచింగ్‌ సెంటర్ల వ్యాపారం వేల కోట్లలో వుంటుంది. ఒక కోచింగ్‌ సెంటరు ఏర్పాటుకు ఎలాంటి అనుమతి అవసరం లేదు. ఎవరి నుంచి పర్మిషన్లు పొందాల్సిన అవసరం లేదు. ఎలాంటి నిబంధనలు లేవు. ఆంక్షలు అసలే లేవు. ఎందుకంటే అది విద్యా సంస్ధలు కాదు. ఒక స్కూల్‌ ఏర్పాటు చేయాలంటే సవాలక్ష నిబంధనలుంటాయి. ఒక కాలేజ్‌ ఏర్పాటుకు కూడా అనేక రకాల అనుమతులు పొందాల్సివుంటుంది. కోచింగ్‌ సెంటర్లు కూడా స్కూళ్ల మాదిరిగానే పనిచేస్తాయి. పైగా స్కూళ్లు, కాలేజీలు వేసవి కాలంలో మూసేస్తారు. కాని కోచింగ్‌ సెంటర్లు అప్పుడే ఎక్కువ నిర్వహిస్తారు. స్కూళ్లలో ఫీజుల నియంత్రణ, నిబంధనలుంటాయి. ఏ క్లాసుకు ఎంత చార్జి వసూలు చేయాలన్నదానిపై స్పష్టమైన గైడ్‌ లైన్స్‌ వుంటాయి. కాని కోచింగ్‌ సెంటర్లకు ఎలాంటి లెక్క లేదు. ఉద్యోగార్ధులు కోచింగ్‌ కోసం వెళ్లడానికి ఆ సెంటర్ల నిర్వాహకులు నిర్ణయించిన దానికి కట్టుబడే చేరుతుంటారు. కారణం భవిష్యత్తు. ఉద్యోగం వస్తుందన్న నమ్మకం. కొందరు ఒక్కసారి కాకుండా ఉద్యోగం వచ్చే వరకు కోచింగ్‌ తీసుకుంటూనే వుంటారు. అలా ఏళ్ల తరబడి తీసుకునేవారు కూడా వున్నారు. పలు కోచింగ్‌ సెంటర్లు మారుతుంటారు. అన్ని కోచింగ్‌ సెంటర్లకు ఫీజులు వదిలించుకుంటుంటారు. అయినా ఉద్యోగాలు రాని వాళ్లు చాలా మంది వున్నారు. అలాంటప్పుడు కోచింగ్‌ సెంటర్ల గొప్పదనం ఏమీ లేదు. కాని వాళ్ల వ్యాపారానికి ఢోకా వుండదు. కోచింగ్‌ సెంటర్లు సంపాదనకు ఎలాంటి ఐటి కూడా అవసరంలేదు. కాని వచ్చే ఆదాయాన్ని ఎవరూ చూపించరు. అందుకు అవసరమైన బిల్లు బుక్కులు కూడా సరిగ్గా వుండవు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version