కేరళను కుదిపేస్తున్న రూ.వెయ్యి కోట్ల స్కాం

‘హాఫ్‌ ప్రైజ్‌’ స్కాంగా ప్రసిద్ధి

అన్ని పార్టీలకు చెందిన కొందరు నాయకుల మెడకు చుట్టుకుంటున్న వైనం

ఎా3గా మాజీ హైకోర్టు న్యాయమూర్తి

30వేల మంది బాధితులు

నిఘా నీడలో రాష్ట్రంలోని ప్రముఖులు

నేటిధాత్రి డెస్క్‌:  

‘‘నన్ను మోసం చేశాడు’’ అని అనడం తప్పు. ఎందుకంటే నువ్వు మోసపోయే అవకాశం పక్కవాడికి ఇచ్చావు కనుక మోసంచేసాడు. అంటే లోపం నీదగ్గరే వుంది. అందువల్ల మోసపోయేవాడున్నప్పుడు మోసం చేసేవాడు ఎప్పుడూ వుంటాడు! మోసపోవడానికి ప్రధాన కారణం ‘ఆకర్షణ’. సహేతుకంగాలేని ‘ఆకర్షణ’కు లోబడటం మానవుల సహజ బలహీనత! దీన్నే మోసగాళ్లు సావ కాశంగా తీసుకుంటున్నారు. ఇటువంటి ప్రలోభపూరిత ‘ఆకర్షణలకు’ మహిళలే తేలిగ్గా ఎరగా మారుతుంటారు. ఇందుకు ఉదాహరణగా ప్రస్తుతం కేరళలో స్వచ్ఛంద సంస్థ ముసుగులో 26ఏళ్ల యువకుడు మొత్తం 14 జిల్లాలకు చెందిన ప్రజలను రూ.వెయ్యికోట్ల మేర మోసం చేసిన సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. విచిత్రమేమంటే అతనికి ప్రచారం విపరీతంగా వస్తున్న నేపథ్యంలో, అతనితో కలిసి ఫోటోలు దిగిన లేదా సన్నిహితంగా మెలిగిన రాజకీయ నాయకులల మెడకు కూడా ఇది చట్టుకోవడంతో కేరళను ఈ స్కాం కుదిపేస్తోంది. కేరళ హైకోర్టు మాజీ న్యాయమూర్తి సి.ఎన్‌. రామచంద్రన్‌ పేరు ఈ కేసులో మూడో నిందితుడిగా వుండటం మరో విచిత్రం! అయితే రాజకీయ నాయకులు, ఈ మాజీ న్యాయమూర్తి తమకు ఈ స్కాంతో ఎటువంటి సంబంధంలేదని చెబుతున్నారు. ఈ మొత్తం స్కాంకు మూలకారకుడు 26 సంవత్సరాల యువకుడు అనందు కృష్ణన్‌. మువ్వత్తుప్ఫూజ సామాజిక`ఆర్థిక అభివృద్ధి సొసైటీ పేరుతో ఇతను నడిపిన స్వచ్ఛంద సంస్థ (ఎన్‌జీఓ)కు సంబంధించిన 21 బ్యాంకు ఖాతాలను ఇప్పుడు కేరళ క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు పరిశీలిస్తున్నారు. ప్రారంభంలో 34 కేసులు క్రైం బ్రాంచ్‌కు బదిలీ చేసినప్ప టికీ ఇవి 30వేలు దాటవచ్చని, బాధితుల సంఖ్య లక్షవరకు వుండవచ్చునని అంచనా వేస్తున్నారు. ఈ స్కాం విలువ రూ.వెయ్యికోట్లు దాటడంతో కేరళ స్టేట్‌ పోలీస్‌ చీఫ్‌ (ఎస్‌పీసీ) షేక్‌ దర్వేష్‌ సాహెబ్‌ కేసును క్రైమ్‌ బ్రాంచ్‌కి అప్పగించారు. 

సగం ధరకే వస్తువులు

మొదట్లో సగం ధరకే స్కూటీలు, ల్యాప్‌టాప్‌లు, కుట్టుమిషన్లు అందజేస్తానని అనందు కృష్ణన్‌ విపరీతంగా ప్రచారం చేశాడు. ‘‘తనవద్ద కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్‌ (సీఎస్‌ఆర్‌)లు వున్నాయని, మీరు సగం ధర చెల్లిస్తే, మిగిలిన సగం ధరను తనవద్ద ఉన్న సీఎస్‌ఆర్‌ నిధులనుంచి చెల్లిస్తానని నమ్మబలికాడు. దీనికి విపరీత ప్రచారం కల్పించడంతో జనాలు తాము కష్టపడి సంపాదించిన డబ్బును ఇతని చేతిలో పెట్టి చివరకు నిండా మునిగినట్టు తెలుసుకొని ఇప్పుడు లబోదిబో మంటున్నారు. ఇప్పుడు అనందు కృష్ణన్‌ స్కామ్‌ కేరళలోని ప్రధాన రాజకీయ ఫ్రంట్‌ల మెడకూ చుట్టుకుంది. అధికార సీపీఐ(ఎం) నేతృత్వంలోని లెఫ్ట్‌ ఫ్రంట్‌, కాంగ్రెస్‌ నేతృత్వంలోని యుడీఎఫ్‌ మరియు బీజేపీలకు చెందిన పలువురు రాజకీయ నాయకులకు అనందు కృష్ణన్‌ నుంచి నిధులు అందాయని ఆరోపణలు రావడంతో ఇప్పుడు ఆయా పార్టీల్లో కలకలం రేగింది. ఇప్పుడు కృష్ణన్‌తో బహిరంగ కార్యక్రమాల్లో పాల్గన్న ఆయా పార్టీల నేతల గొంతులో పచ్చివెలక్కాయ పడ్డ చందంగా మారింది. 

కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వివరణ

కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మ్యాథ్యూ కుజల్‌నందన్‌కు ఏకంగా రూ.7లక్షలు కృష్ణన్‌ నుంచి అందాయని మళయాలం టీవీ ఛానల్‌ సోమవారం కథనాన్ని ప్రసారం చేయడంతో అసెంబ్లీలో దుమారం రే గింది. దీంతో ఆయన టీవీ ఛానల్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని అసెంబ్లీలో ప్రకటించారు. ‘‘ఈ సంస్థలో కొంత మొత్తం డిపాజిట్‌ చేశామని, దీనికి సంబంధించి సంస్థ ఇచ్చిన హా మీ మేరకు తమకు వస్తువులు అందలేనది, నా సన్నిహితుడు తెలిపాడు. ఆయనతో పాటు మరి కొందరు కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారని నాకు చెప్పాడు’’, నాకు ఇంతవరకే తెలుసని ఆ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వివరణ ఇచ్చారు. ఇక కేరళలో సాయి ట్రస్ట్‌ ఛైర్మన్‌ కె.ఎన్‌. ఆనంద్‌కుమార్‌కు అనందు కృష్ణన్‌తో ఉన్న సన్నిహిత సంబంధాల నేపథ్యంలో ఇంటెలిజెన్స్‌ వర్గాలు ఆయనపై నిఘా పెట్టాయి. ఈయన కేరళలో చాలా పేరున్న సామాజికవేత్త! ‘‘నేనెక్కడికీ పారిపోలేదు. వచ్చిన నిధులన్నింటికీ సక్రమంగా లెక్కలున్నాయి. అన్నీ చట్టపరిధిలోనే జరిగాయి’’ అని ఆయన తెలిపారు. ఇక ఈకేసులో కేరళ హైకోర్టు మాజీ న్యాయమూర్తి సి.ఎన్‌. రామచంద్రన్‌ నాయర్‌ పేరుకూడా వుండటంతో, ‘‘కృష్ణన్‌ సంస్థకు తాను ప్యాట్రన్‌గా ఎప్పుడూ వ్యవహరించలేదని, ఒకప్పుడుసంస్థకు సలహాదారుగా వ్యవహరించినప్పటికీ, ఆ పోస్ట్‌కు ఎప్పుడో రాజీనామా చేశాను’’ అని చెప్పారు.

హాఫ్‌ ప్రైజ్‌ాస్కామ్‌ 

కేరళను కుదిపేసిన ఈ రూ.1000కోట్ల స్కామ్‌ను ఇప్పుడు ‘‘హాప్‌ ప్రైజ్‌ాస్కామ్‌’’గా పిలుస్తున్నా రు. సగంధరకే వస్తువులు అందిస్తామని ప్రచారం చేయడంతో దీనికి ఈ పేరు స్థిరపడిపోయింది. స్కూటీలు, ల్యాప్‌టాప్‌లు, గృహోపకరణాలను సగం ధరకే ఇస్తామని, మిగిలిన సగం మొత్తా న్ని కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ ఫండ్‌ (సీఎస్‌ఆర్‌)నుంచి చెల్లిస్తామని ప్రచారం చేయడంతో ప్రజలు నమ్మారు. ప్రజలను నమ్మించడానికి కృష్ణన్‌ రాష్ట్రంలోని ఇతర ఎన్‌.జి.ఒ.ల పలుకుబడినికూడా చక్కగా ఉపయోగించుకోవడం, ప్రజల్లో విశ్వసనీయత రావడానికి ప్రధాన కారణం. అసలు సీఎస్‌ఆర్‌ నిధులు లేనేలేవని విచారణాధికార్లు స్పష్టం చేశారు. 

ఎవరీ అనందు కృష్ణన్‌

అనందు కృష్ణన్‌ ఇడుక్కి జిల్లా తొడుప్పుజాకు చెందినవాడు. ప్రస్తుతం అతనిపై అనేక కేసులు నమోదు కావడంతో పోలీసులు అరెస్ట్‌ చేశారు. కృష్ణన్‌కు గతంలో మోసపూరిత చరిత్ర వున్నదని, ఇప్పుడు దాదాపు 30వేల మంది బాధితులనుంచి డబ్బును సేకరించేందుకు రెండు డజన్లకు పై గా బ్యాంకు ఖాతాలు ఉపయోగించినట్టు విచారణాధికార్లు నిర్ధారించారు. మీడియా కథనాల ప్ర కారం ఇడుక్కిలో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసిన అనందు కృష్ణన్‌, తన స్థానిక పరిచయాల నేపథ్యం లో కొన్ని స్వచ్ఛంద సంస్థలను ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ఒక పంచాయతీ సభ్యుడు చెప్పిన ప్రకారం కృష్ణన్‌ తన స్వచ్ఛంద సంస్థలకు సర్దార్‌ పటేల్‌, అబ్దుల్‌ కలాం వంటి ప్రముఖుల పేర్లు పెట్టేవాడు. ఇతని తండ్రి కార్పెంటర్‌. తల్లి రాష్ట్ర పౌరసరఫరా విభాగంలో పనిచేస్తున్నారు. ఎన్‌.జి.ఒ.ను ప్రారంభించిన తర్వాత కృష్ణన్‌ జీవనశైలి ఒక్కసారిగా మారిపోయింది. లగ్జరీ కార్లు, ఆ స్తులు కొనుగోలు చేశాడు. ఒక్క డిసెంబర్‌ నెలలోనే అనందు కృష్ణన్‌ ఢల్లీి ప్రయాణాలకు రూ.338,000, అక్కడ విలాసవంతమైన హోటళ్లలో బసకు రూ.366,000 ఖర్చు చేసినట్టు విచారణ అధికార్లు వెల్లడిరచారు. కృష్ణన్‌, అతని సంస్థలకు సంబంధించిన 21 బ్యాంకు ఖాతాలను అధికార్లు గుర్తించారు.

తన గ్రామంలోని వారికి స్కూటీలు, ల్యాప్‌టాప్‌లు అందజేశాడు. ఆవిధంగా ఒకపక్క పెరుగుతున్న సంపదతో పాటు ఫిర్యాదులు కూడా పెరగడం మొదలైంది. కృష్ణన్‌ స్కీమ్‌ ప్రాథమికంగా ‘సీడ్‌ సొసైటీలు’, ‘కన్సల్టెన్సీల’ ద్వారా జరిగింది. మొదట్లో కొత్త అప్లికేషన్ల ద్వారా వచ్చిన మొత్తంతో ఏకమొత్తంగా స్కూటీలు, గృహోపకరణాలు, ల్యాప్‌టాప్‌లు కొనుగోలు చేశాడని, ఈ కొనుగోళ్లకు అతనికి కమిషన్‌ కూడా ముట్టిందని పోలీసులు తెలిపారు. 

నేషనల్‌ ఎన్జీఓస్‌ ఫెడరేషన్‌కు తాను కొఆర్డినేటర్‌గా కొనసాగడం కూడా ప్రజల్లో అతనిపట్ల వి శ్వాసం పెరగడానికి మరో కారణం. ఈ హోదాలోనే సీఎస్‌ఆర్‌ ఫండ్స్‌ తనకు వస్తాయని ప్రజలకు నమ్మబలికాడు. అందుకనుగుణంగా తొలినాళ్లలో అందరికీ వారికి కావలసిన ఉత్పత్తులను సరఫరా చేసి స్కీమ్‌ పట్ల నమ్మకాన్ని కలిగించాడు. క్రమంగా కృష్ణన్‌ ప్రజలకు ఉత్పత్తులను అందించలేకపోవడంతో, ఫిర్యాదుల సంఖ్య పెరుగుతూ పోయింది. ఇదిలావుండగా స్థానిక రాజకీయ నాయకులతో ఇతనికున్న సంబంధాలపై పోలీసులు ఆరాతీస్తున్నారు. కృష్ణన్‌ దెబ్బకు రాష్ట్రంలోని ప్రముఖ వ్యక్తులు, నేషనల్‌ ఎన్జీవో కాన్ఫిడరేషన్‌ సభ్యులు, రాజకీయనాయకులు ప్రస్తుతం పోలీసుల నిఘాలో వున్నారు. విచారణలో తాను రాజకీయ నాయకులకు డబ్బులు ఇచ్చానని కృష్ణన్‌ ఒప్పుకోవడంతో కేసు మరింత సంక్లిష్టంగా మారింది. ఇందులో సీఎస్‌ఆర్‌ ఫండ్స్‌ను వినియోగించామని చెప్పినప్పటికీ, వీరు చెబుతున్న కంపెనీలకు అసలీవిషయమే తెలియకపోవడం విశేషం. చివరకు అసలు సీఎస్‌ఆర్‌ నిధులనేవే లేవని పోలీసులు తేల్చారు.

డి.ఎం.కె. మెడకు స్కంథమలై ఉచ్చు!

మరో అయోధ్యగా మారనున్న తిరుపరన్‌కుండ్రం ఆలయ వివాదం

తమిళనాడులో వచ్చే ఏడాది ఎన్నికలు

ప్రజలకు సెంటిమెంట్‌ పెరిగితే డిఎంకె అధికారానికి ముప్పే

సెంటిమెంట్‌ సునామీని నాస్తికవాదం ఎదురొడ్డటం కష్టం

 

హిందువులపై కఠినచర్యలు ప్రభుత్వానికి ఆత్మహత్యా సదృశమే

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

బాహ్య ప్రపంచానికి పెద్దగా తెలియని, ఒక ప్రాంతానికే పరిమితమైనవని భావించే కొన్ని సంఘటనలు ఒక్కసారి విస్ఫోటం చెంది చరిత్రగతిని మార్చిన సంఘటనలు చరిత్రలో కోకొల్లలు. అయితే అవి కొన్ని వర్గాల విశ్వాసాలను ప్రభావితం చేసేవిగా వుంటే వాటి పరిణామం చాలా తీవ్రం గావుంటుందనేది అక్షరసత్యం. ఇందులో ప్రభుత్వాలతో సంబంధం లేకుండా కేవలం ప్రజలే నాయకులుగా తమ విశ్వాసాలను కాపాడుకుంటారు. ఇప్పుడు తమిళనాడులో సరిగ్గా ఇదే జరుగు తోంది. ఇప్పటివరకు దేశంలోని ఇతర ప్రాంతాలకు పెద్దగా పరిచయంలేని తిరుపరన్‌కుండ్రం మురుగన్‌ దేవాలయం వివాదం ఒక్కసారిగా పతాక శీర్షికలకెక్కింది. ఉత్తరాదిలో అయోధ్య ఉద్యమంలాగా దక్షిణాది రాజకీయాలను సమూలంగా మార్పుచేసే దిశగా ఈ ఉద్యమం రూపుదిద్దు కుంటుందేమోనని తమిళనాడు డి.ఎం.కె.సర్కార్‌ భయపడుతోంది. పూర్తి నాస్తిక వాదులుగా చె ప్పుకునే డి.ఎం.కె నాయకులు ఎన్నికలప్పడు మాత్రం మురుగన్‌ దేవాలయాల చుట్టూ తిరిగి, వేలాయుధాన్ని చేతుల్లో పట్టుకొని ఫోటోలకు ఫోజులిస్తూ ప్రచారం చేసుకుంటూ వస్తున్నారు. కానీ ద్రవిడవాదం ముసుగులో మైనారిటీల బుజ్జగింపు, హిందువుల పట్ల వివక్ష కొనసాగిస్తూరావడం వీరి ప్రవృత్తి. దక్షిణాది రాజకీయాలను ఇప్పుడు తిరుపరన్‌కుండ్రం ప్రభావితం చేయనున్నదని ద్రవిడవాదాన్ని భుజాన వేసుకున్న డి.ఎం.కె నాయకులే చెబుతున్నారు. తిరుపరన్‌కుండ్రం దేవాలయ వివాదం తమిళనాడు వ్యాప్తంగా హిందువుల్లో చైతన్యం కలిగిస్తే తమ పుట్టి మునగడం ఖా యమనివారు భయపడుతున్నారు. ఫిబ్రవరి 4న మదురైలోని పాలంగనాథమ్‌ కూడలివద్ద ఈ ఆలయవివాదంపై 50 హిందూ సంస్థల ఆధ్వర్యంలో పెద్ద నిరసన ప్రదర్శన జరిగింది. లక్షలాది మంది స్వచ్చందంగా ఈ నిరసనలో పాల్గనడం ఇప్పుడు డి.ఎం.కె. ప్రభుత్వానికి మింగుడు పడటంలేదు. ముఖ్యంగా వేల సంవత్సరాలకాలంగా తిరుపరన్‌ కుండ్రం కొండపై మురుగన్‌ దేవాలయం వుంది. ఇప్పుడు ఈ కొండను కొందరు ఇస్లామిస్టులు తమకు చెందినదిగా వాదిస్తుండ టం ఉద్రిక్తలకు కారణమవుతోంది. ప్రస్తుతం ఈ వివాదాన్ని తమిళనాడు వ్యాప్తంగా ఉధృతం చేయాలన్న ఉద్దేశంతో బీజేపీ ముందుకెళుతోంది. మరో ఏడాదిన్నర కాలంలోగా తమిళనాడులో ఎన్నికలు జరుగబోతున్న తరుణంలో స్కంధమలై వివాదం డిఎంకె మెడకు ఉరితాడు కాబోతున్నదా లేక పూలహారం కాబోతున్నదా అనేది కాలమే చెబుతుంది.

 అసలు వివాదమేంటి?

2024 డిసెంబర్‌ చివరివారంలో మలైయదిపట్టికి చెందిన సయ్యద్‌ అబు దహీర్‌ (53) అనే వ్యక్తితన కుటుంబంతో సహా దర్గావద్దకు మొక్కుబడి చెల్లించుకోవడానికి వచ్చాడు. ఒక గొర్రె, రెండు కోడిపుంజులను ఇక్కడ బలివ్వడానికి తనతో కూడా తీసుకువచ్చాడు. అయితే కొండ దిగువభా గంలో పోలీసులు వారిని అడ్డుకొని, జంతువులను బలివ్వడానికి పైకి తీసుకెళ్లకూడదని చెప్పారు.సరిగ్గా అప్పుడే స్థానిక 20 ముస్లిం కుటుంబాలు అక్కడికి చేరుకొని, సయ్యద్‌ అబు దహీర్‌కు మద్దతుగా నిరసనకు దిగారు. జంతువులను బలిచ్చి, వాటి మాంసాన్ని వండుకొని తినడం తమ సంప్రదాయమని వారు వాదించారు. ఇందుకోసం ఒక ఫిర్యాదు ఇచ్చినట్లయితే తగిన నిర్ణయం కోసం ప్రభుత్వానికి పంపుతామని అధికార్లు నచ్చజెప్పినా వారు వినకుండా తమ నిరసనను కొ నసాగించారు. చివరకు పోలీసులు ఆ జంతువులను తెచ్చినవారితో సహా పదిమందిని అదుపులోకి తీసుకొని తర్వాత విడుదల చేశారు. అయితే ఈ సంఘటన ఈ ప్రాంతంలో ఉద్రిక్తలకు దారి తీసింది. ముస్లింలెవరూ బలివ్వడానికి కొండపైకి తీసుకెళ్లడానికి వీల్లేదని జనవరి 22న మదురై పోలీసులుకచ్చితమైన ఆదేశాలు జారీచేశారు. వండిన మాంసాన్ని తీసుకెళ్లి దర్గావద్ద భుజించవ చ్చునని వారు స్పష్టం చేశారు. ఆ తర్వాత కొండపై కొందరు వ్యక్తులు మాంసాహారాన్ని తింటున్న ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో మళ్లీ వివాదం రగిలింది. ఈ నేపథ్యంతో తమిళనాడులో బలంగా వున్న హిందూ మున్నాని సంస్థ తిరుపరన్‌ కుండ్రం సుబ్రహ్మణ్యస్వామి ఆలయం వద్ద ఫిబ్రవరి 4ననిరసన ప్రదర్శనలుచేపట్టాలని నిర్ణయించింది. అధికార్లు ఇందుకు అనుమతినివ్వలేదు సరికదా ఆలయ చుట్టుపక్కల ప్రాంతాలో నిషేధాజ్ఞలు విధించారు. దీంతోమదురై ప్రాంత హిందూమున్నాని గ్రూపు ప్రధాన కార్యదర్శి ఎస్‌. కళానిధిమారన్‌ మద్రాసు హైకోర్టుకు చెందిన మదురై బెంచ్‌కు ఒక పిటిషన్‌ దాఖలు చేస్తూ ఫిబ్రవరి 4న మధ్యాహ్నం 3గంటలనుంచి రాత్రి 9.45 గంటలవరకు ‘‘16 కాల మండపం’’ వద్ద తాము నిర్వహించ తలపెట్టిన నిరసనకుఅనుమతినివ్వాలని అభ్యర్థించారు. హైకోర్టు బెంచ్‌ ఆలయానికి ఐదు కిలోమీటర్ల దూరంలోని పాలంగనాథమ్‌ కూడలివద్ద సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్యకాలంలో నిరసనలు తెలుపుకోవడానికి అనుమతించింది. రెచ్చగొట్టే ప్రసంగాలు, నినాదాలు చేయకూడదని కోర్టు హెచ్చరించింది. అనుకున్న ప్రకారమే లక్షలాది హిందువులు పాలంగనాథమ్‌ కూడలివద్ద తమనిరసనలనుతెలియజేశారు. కాగా ఈ నిరసరన ప్రదర్శనల్లో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌, హిందూ ము న్నాని, హిందూ ఫ్రంట్‌, విశ్వహిందూ పరిషత్‌కు చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గన్నారు.తిరుపరన్‌ కుండ్రం కొండను ఇస్లామీకరణ చేయడానికి చేస్తున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా వీరు నినా దాలిచ్చారు. ఈ నిరసన ప్రదర్శన సాయంత్రం ఆరుగంటలకు ముగిసింది. ఈ సందర్భం గా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తమిళనాడు ప్రభుత్వం సుమారు నాలుగువేలమంది పోలీసులను మోహరించింది. 

డీఎంకే వర్సెస్‌ బీజేపీ

ప్రస్తుతం ఈ ప్రదర్శన వివాదంపై తమిళనాడులో డిఎంకె వర్సెస్‌ బీజేపీ రాజకీయ యుద్ధం కొనసాగుతోంది. తమిళనాడులో హిందూ ముస్లింలు సహోదరుల్లాగా మెలుగుతున్నారని, బీజేపీ మత విద్వేసాలను రెచ్చగొడుతున్నదంటూ రాష్ట్ర హిందూ రిలిజియస్‌ అండ్‌ చారిటీస్‌ ఎండోమెంట్‌ మంత్రి పి.కె. శేఖర్‌బాబు ఆరోపించారు. 1931నాటి బ్రిటిష్‌ ప్రీవీ కౌన్సిల్‌ ఇచ్చిన తీర్పుతో పా టు ప్రస్తుతం 2023 నుంచి రెండు కేసులు కోర్టులో పెండిరగ్‌లోవున్న విషయాన్ని గుర్తుచేశారు.తమ ప్రభుత్వం కోర్టు ఆదేశాల మేరకు నడుచుకుంటుందని స్పష్టం చేశారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు అన్నామలై ర్యాలీ శాంతియుతంగా జరిగిందని, ఎక్కడా అల్లర్లు లేదా బస్సు దహనాలు, వి ధ్వంసం వంటివి చోటుచేసుకోలేదన్న సంగతిని గుర్తుచేశారు. 1931నాటి బ్రిటిష్‌ ప్రీవీ కౌన్సిల్‌ హిందువులకు అనుకూలంగా తీర్పునిచ్చిన సంగతిని గుర్తుచేస్తూ, (అప్పటి ప్రీవీకౌన్సిల్‌ కొండపై మాంసాహారాన్ని వండటం, తినడం, జంతువుల బలి ఇవ్వడం నిషేధమని స్పష్టంగా తీర్పు చె ప్పింది. స్వాతంత్రానంతరం ద్రవిడ ప్రభుత్వాలు కొండపైకి మాంసాన్ని తీసుకెళ్లడాన్ని అనుమతి స్తూ వచ్చాయి) ప్రభుత్వం అసలు విషయాన్ని మరుగున పరచవద్దని చురకలంటించారు. ర్యాలీ లో పాల్గనకుండా తమిళనాడు వ్యాప్తంగా 350ప్రదేశాల్లో బీజేపీ నాయకులను అరెస్ట్‌ చేశారని, ప్రజాస్వామ్యం ఎక్కడుందని ప్రశ్నించారు. రామనాథపురం ఎం.పి. నవాజ్‌ఖని గ్రూపుకు చెందినవారే ఈ వివాదానికి కారణమని ఆయన ఆరో పించారు.అయితే ఖని ఈ ఆరోపణలను ఖం డిరచారు.ఇదిలావుండగా కలెక్టర్‌ ఎం.ఎస్‌. సంగీత మాట్లాడుతూ, స్థానిక ప్రజలు శాంతియుతంగానే వున్నారని, బాహ్య శక్తులవల్లనే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని పేర్కొన్నారు. ఆలయం ఎగువన కొండపై వున్న దర్గావద్ద ‘కందూరి’ (జంతుబలి)కి అనుమతినివ్వాలని గతంలో రెండు సార్లు ముస్లింలు కోరినా అందుకు అనుమతించలేదన్న సంగతి గుర్తుచేశారు. మాతా నల్కినక్క అమైప్పుగళ్‌(మతసామరస్యానికి కృషిచేస్తున్న గ్రూపు) సంస్థ మతసామరస్యాన్ని చెడగొట్టాలని ప్రయత్నిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు అప్పీల్‌ చేసింది. కాగా అడ్వకేట్‌ ఎస్‌. ముత్తుకు మార్‌, 2012లో కొండపైబాంబులు దొరికిన కేసుతో సహా జంతుబలి, మాంసాహర సేవనానికి సంబంధించిన అన్ని కేసులను ఎన్‌.ఐ.ఎ.కు బదిలీచేయాలని కలెక్టర్‌ను అభ్యర్థించారు. ఇక బీజేపీ సీనియర్‌ నాయకుడు సుబ్రహ్మహణ్యస్వామి మాట్లాడుతూ కొండపైనుంచి దర్గానుమరో ప్రదేశానికి తరలించడమే సమస్యకు పరిష్కారమన్నారు. నమాజ్‌ ఎక్కడైనా చేయవచ్చునని, ప్రజాప్ర యోజనార్థం ప్రభుత్వం మసీదులను వేరేచోటికి తరలించడానికి లేదా కూలగొట్టడానికి షరియాచట్టం అనుమతిస్తుందన్న సంగతిని గుర్తుచేశారు. అంతేకాదు దర్గాను ఎక్కడికి తరలి స్తే బాగుంటుందో సలహా ఇచ్చే బాధ్యతను కలెక్టర్‌కు అప్పగించాలని కూడా ఆయన కోరారు. రామనాథపురం ఎం.పి. నవాజ్‌ఖని మాట్లాడుతూ ‘దశాబ్దాలు గా ముస్లిం భక్తులు గొర్రెలు, మేకలు, కోళ్లను కొండపైకి తీసుకెళ్లి బలిస్తుండటం కొనసాగుతోంది. వండిన మాంసం తీసుకెళ్లడమనేది కేవలం తాత్కాలిక ఆదేశాలు మాత్రమే. నేను మదురై పోలీసులతో మాట్లాడతాను. అదీకాకుండా కొండ పై ఉన్న ఈ దర్గా వక్ఫ్‌ ఆస్తి’ అని స్పష్టం చేశారు. ఈ వివాదం నేపథ్యంలో ముస్లింలు ఈ కొండపేరును ‘‘సికిందర్‌ మలై’’గా మార్చాలన్న తమ డిమాండ్‌ను మళ్లీ పైకి తీసుకొచ్చారు. 

తిరుపరన్‌కుండ్రం చరిత్ర

తిరుపరన్‌ కుండ్రం లేదా తిరుప్పరన్‌ కుండ్రం దేవాలయం మదురై నగరానికి సమీపంలో వుంది. మదురైలోని పెరియార్‌ సెంట్రల్‌ బస్టాండ్‌కు సరిగ్గా ఏడుకిలోమీటర్ల దూరం. తిరుపరన్‌కుండ్రం 1028 అడుగుల ఎత్తైన ఏకశిలతో ఏర్పడిన కొండ. ఈ పర్వతాన్ని హిందువులు అతి పవి త్రమైనదిగా పరిగణిస్తారు. ఇక్కడ ప్రాచీన శైవమతానికి చెందిన గుహలున్నాయి. ఈ కొండను హిందువులు ‘స్కందమలై’గా పిలుస్తారు. ఈ ప్రాంతంలో శైవం ప్రాచుర్యంలో ఉన్న కాలంలో క్రీ.శ.7 నుంచి క్రీ.శ15వ శతాబ్దం మధ్యకాలంలో ఈకొండ ఉత్తరభాగంలో మండపాలు, ఆలయాలను పలు హిందూ రాజవంశాలు నిర్మించాయి. ఆవిధంగా నిర్మితమైన అతిపెద్ద దేవాయలయ సముదాయం తిరుపరన్‌కుండ్రం మురుగన్‌ ఆలయంగా ప్రసిద్ధిపొందింది. తమిళనాడులోని ఆరు ప్రముఖ మురుగన్‌ దేవాలయాల్లో (అరుపడై వీడు) దీన్ని మొట్టమొదటిగా పరిగణిస్తారు. మదురై వెళ్లినవారు మీనాక్షి అమ్మవారి దర్శనం తర్వాత తప్పకుండా ఈ మురుగన్‌ ఆలయాన్ని దర్శిస్తారు. ఇదే కొండ పై క్రీస్తుపూర్వం 2వ శతాబ్దం నుంచి క్రీ॥శ. 2వ శతాబ్దం మధ్యకాలం నాటి జైనుల తమిళ బ్రహ్మీలిపి శాసనాలు కూడా ఇక్కడ వున్నాయి. కొండకు దక్షిణాన సరస్వతీ తీర్థం వుంది. ఇక్కడే తిరుప్పరన్‌కుండ్రం రాతి గుహాలయాలున్నాయి. ఇక్కడ ప్రాచీన జైనదేవాలయాన్నే క్రీ॥శ ఏడవ శ తాబ్దంలో శివాలయంగా మార్చి, 13వ శతాబ్దం నాటికి దీన్ని పూర్తిగా విస్తరించారని చెబుతారు. కొందరు హిందువులు ఈ కొండచుట్టూ ప్రదక్షిణం చేయడం సర్వపాపాలను హరిస్తుందని నమ్ముతారు. 

ఢల్లీి సుల్తానులు తిరుపరన్‌కుండ్రరామదురై ప్రాంతాల్లో లూటీలుాదహనాలకు పాల్పడి విచ్చల విడి విధ్వంసం సృష్టించారు. 14వ శతాబ్దం తర్వాత తమిళనాడులో ఇస్లామిక్‌ సుల్తానేట్‌ను ఏ ర్పాటు చేయాలని ఢల్లీి సుల్తానులు ప్రయత్నించారు. దీన్నే మదురై సుల్తానేట్‌గా వ్యవహరించారు.అయితే ఈ సుల్తానేట్‌ ఎక్కువకాలం మనుగడలో లేదు. ఈ సుల్తానేట్‌కు చెందిన చివరి పాలకుడు సికిందర్‌ షా అతని సైనికాధికార్లను 1377లో విజయనగర రాజులు తిరుపరన్‌కుండ్రమ్‌లో వధించి, వారి పాలనకు అంతం పలికారు. అయితే సికిందర్‌ షాకు ఇక్కడ సమాధిని నిర్మించు కోవడానికి విజయనగర పాలకులు అప్పట్లో అనుమతించారు. దీంతో ఈ సమాధి నిర్మాణం తి రుపరన్‌ కుండ్రం ఉత్తరభాగంలో 14, 15శతాబ్దాల్లో జరిగింది. క్రమంగా 17, 18 శతాబ్దాల కాలంలో ముస్లింలు ఈ సమాధిని క్రమంగా దర్గాగా మార్పుచేసి మరింత విస్తరించారు. దీన్నే ఇప్పుడు తిరుపరన్‌కుండ్రం దర్గా అని పిలుస్తున్నారు. 

కార్తీకదీపానికీ అనుమతి లేదు

ఇక్కడ కాశీవిశ్వనాథర్‌ దేవాలయం వద్ద వున్న స్థూపంపై కార్తీకదీపాన్ని పెట్టే సంప్రదాయానికి అనుమతివ్వాలని హిందువులు డిమాండ్‌ చేస్తున్నారు. రెండో ప్రపంచ యుద్ధకాలానికి ముందు వరకు ఇక్కడి స్థూపంపై కార్తీకదీపం పెట్టేవారు. ఆ యుద్ధకాలంలో దీపం పెట్టడం కొన్ని కారణాలవల్ల నిలిచిపోయింది. శాంతిభద్రతల సమస్య వస్తుందన్న కారణంగా తమిళనాడు ప్రభుత్వం ఇక్కడ దీపం పెట్టడానికి అనుమతించలేదు. మరెక్కడైనా పెట్టుకోవచ్చని చెప్పినా అది ఆగమశాస్త్ర విరుద్ధమని హిందువుల వాదన. అయితే ఈ విశ్వనాథర్‌ దేవాలయానికి వెళ్లే దారిలో నమాజ్‌లు చేసిన సంఘటనలు కూడా పెరిగాయి. ఆవిధంగా ఆలయానికి వెళ్లే దారిలో నమాజ్‌లు చేయకుండా ఉత్తర్వులు ఇవ్వడానికి మద్రాస్‌ హైకోర్టు ఇటీవల తిరస్కరించింది. ఇదిలావుండగా, క్రమంగాకొండపై ఆక్రమణలు పెరుగుతున్నాయని హిందువులు ఆరోపిస్తున్నారు. ఇదిలావుండగా శివగంగలోని కరైక్కుడికి చెందిన అన్నానగర్‌ల ఫిబ్రవరి 3న జరిగిన ఆలయ ప్రతిష్ట కార్యక్రమంలో కొందరు ముస్లిం మహిళలు పాల్గనడం విశేషం. ‘‘లలితా ముత్తుమారియన్‌ ములైకొట్టు తిన్నై’’ దేవాలయంలో ‘‘సీర్‌వారిసై’’ పేరుతో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గనడం వీరికి హిందువులు ఆహ్వానం పలకడం కొసమెరుపు!

తెలంగాణ బిజేపికి!

ఆంద్ర జనసేనకు!!

`బిజేపి, జనసేన రహస్య ఒప్పందం?

`అన్నతో తెలంగాణలో ఆట!

`తమ్ముడుతో ఆంద్రాలో వేట!!

`బిజేపి వెనకుండి రాజకీయం?

`ఇదే అదునుగా మళ్ళీ ఒకసారి చిరు ప్రయత్నం!

`మరోసారి రాజకీయ భవిష్యత్తు కోసం ఆరాటం.

`అటు సినిమాలు..ఇటు రాజకీయాలు.

`ప్రజా రాజ్యానికి కొనసాగింపే జనసేన అన్నారు.

`కాంగ్రెస్‌ కు ఇంత కాలం ఎందుకు రాజీనామా చేయలేదు?

`ప్రజా రాజ్యం ఏర్పాటు తర్వాత ఇక సినిమాలు చేయను అన్నారు!

`జెండా పీకేసిన తర్వాత ఇక సినిమానే నా ప్రపంచం అన్నారు.

`ఇక రాజకీయాల జోలికి వెళ్లే ప్రసక్తే లేదని ప్రకటించారు.

`మళ్ళీ ఆశలు చిగురించినట్లున్నాయి.

`ప్రజా రాజ్యం కలలింకా కదులుతున్నట్లే వున్నాయి.

`జనసేన తో మళ్ళీ తన ప్రయాణం మొదలుపెట్టనున్నారు.

`దక్షణాదిన బిజేపికి వెన్నుదన్నుగా నిలువనున్నారు.

పార్లమెంటు చరిత్రలో 1985 తర్వాత పూర్తి స్దాయి మెజార్టీతో 2014, 2019 ఎన్నికల్లో రెండుసార్లు వరుసగా, మూడోసారి కూడా దాదాపు పూర్తి మెజార్టీకి దగ్గరగా గెలిచిన భారతీయ జనతాపార్టీకి దక్షిణాదిలో బలపడేందుకు ఏదో ఒక ప్రాంతీయ పార్టీ తోడు కావాలా? ఆ పార్టీ దక్షిణాదిలో ఒంటరిగా బలపడే అవకాశమే లేదా? గతంలో సంగతి వదిలేద్దాం..ఇప్పుడు కూడా ఏదో ఒక పార్టీ తోడుగా నిలిస్తే తప్ప ఉనికిని చాటుకోలేదా? ఇలా అయితే ఇంకా ఎంత కాలానికి బిజేపి దేశమంతా విస్తరించగలదు? అనే ప్రశ్నకు సమాదానం ఎవరి వద్దా లేదు. దక్షిణాదిన బిజేపి ఇప్పటికీ ఎందుకు బలపడడం లేదన్నదానిపై నిజానికి ఇప్పటి వరకు ఆ పార్టీలో పూర్తి స్ధాయి అధ్యయనం జరగలేదన్నది ముమ్మాటికీ వాస్తవం. పైగా ఆ పార్టీ పూర్తి స్ధాయిలో ఉత్తరాదినే ఎక్కువగా దృష్టిపెట్టిందనే చెప్పాలి. కనీసం ఈ పదేళ్లలో దక్షిణాది అభివృద్దిపై కేంద్ర ప్రభుత్వం మరింత దృష్టిపెడితే బాగుండేది. ఎంత సేపు ఉత్తరాది రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాలలో ఎలా బలపడాలన్నదానిపైనే బిజేపి దృష్టిపెడుతూ వచ్చింది. అందుకే దక్షిణాదిన కొంత వెనుకబాటులోవుంది. కాకపోతే ఉత్తరాధి రాజకీయ పరిస్దితులు వేరు. దక్షిణాది రాజకీయాలు వేరు. ఎవరు ఔనన్నా, ఎవరు కాదన్నా దక్షిణాది ప్రజలు ఎంతో చైతన్య వంతులు. ప్రతి అంశాన్ని శ్రాస్త్రోత్తరంగా కాకుండా శాస్త్రీయంగా ఆలోచిస్తారని చెప్పడంలో కూడా సందేహం లేదు. అందుకే బిజేపి లాంటి పార్టీలకు దక్షిణాదిలో చోటు పూర్తి స్ధాయిలో దక్కకుండా పోయింది. ఇప్పుడిప్పుడే దిక్షిణాదిలో కూడా బిజేపికి అనుకూలమైన పరిస్ధితులు ఏర్పడుతున్నాయి. వాటిని ఆసరాగా చేసుకొని బిజేపి ఎదగాలనుకుంటోంది. అయితే జనసేన లాంటి పార్టీని నమ్ముకొని బిజేపి ఎదగడం అన్నది అంత ఈజీ కాదు. ప్రధానంగా ప్రాంతీయ పార్టీలు తన మనుగడ కోసం ఆలోచిస్తాయే గాని, జాతీయ పార్టీల ఎదుగుదలను ఎక్కడా అంగీకరించిన దాఖలాలు లేవు. ఒక్కసారి జాతీయ పార్టీ పాగా వేస్తే ప్రాంతీయ పార్టీలకు చోటు లేకుండా చేస్తాయన్నది అందరూ అంగీకరించాల్సిన అంశం. కాని ప్రాంతీయ పార్టీలు కూడా ఇటీవల కాలంలో స్వంత బలాన్ని నమ్ముకొని రాజకీయం చేయడం లేదు. ఉభయ కుశలోపరిగా జాతీయ పార్టీలతో కలిసి పోటీ చేస్తున్నాయి. గతంలో ప్రాంతీయపార్టీలు కలిసి రాజకీయం చేసేవి. కాని ఇప్పుడు ప్రాంతీయపార్టీలలో ఏకచ్చత్రాధిపత్యం ఎక్కువైంది. అసలు మరో ప్రాంతీయపార్టీ పుట్టుకనే అంగీకరించలేకపోతున్నాయి. ఇలాంటి సమయంలో ప్రాంతీయ పార్టీలకు, జాతీయపార్టీలకు మధ్య సయోధ్య ఎక్కువైంది. అంత మాత్రాన జాతీయ పార్టీలను పూర్తిగా పాగా వేసేందుకు ఏ ప్రాంతీయ పార్టీ కూడా ఇష్టపడదు. అందులోనూ జనసేన లాంటి పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ను నమ్ముకొని బిజేపి రాజకీయం చేయాలనుకోవడం కూడా అంత కరక్టు కాదు. కాని అవసరం రెండు పార్టీలకు వుంది. పైగా మరో అవకాశం లేని కారణంగా ఇద్దరూ సర్ధుకుపోతున్నారు. బిజేపికి దక్షిణాది రాష్ట్రాలలో కర్నాటకలో తప్ప, తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, కేరళ రాష్ట్రాలలో పార్టీని నడిపించేంత శక్తి వున్న నాయకులు ఎవరూ లేరు. గతంలో కూడా అంత బలమైన నాయకత్వాలు ఇక్కడ ఎదగలేదు. పార్టీ పేరు చెప్పుకొని మాత్రమే రాజకీయం చేస్తే తప్ప మనుగడలో వుంటారు. రాష్ట్రంలో గాని, దేశంలో గాని ఆ పార్టీకి అనుకూల పవనాలు వీస్తే బిజేపి నాయకులు గెలుస్తారు. ఏదొ ఒక ప్రాంతీయ పార్టీతో పొత్తు పెట్టుకుంటే సీట్లు సాధిస్తారు. అంతే తప్ప బిజేపి తలరాత మార్చే నాయకులు దక్షిణాదిలో ఎవరూ లేరు. ముఖ్యంగా తెలంగాణ, ఏపి రాష్ట్రాలలో పార్టీని నడిపించి ఓట్లు పొంది, సీట్లు సాధించి, అధికారంలోకి తీసుకొచ్చేంత శక్తి వంతమైన నాయకులు లేకపోవడం మూలంగానే ఇతర పార్టీలపై ఆధారపడి రాజకీయాలు చేస్తున్నారు. ఏపి కన్నా, తెలంగాణ కొంత బెటర్‌. ఇక్కడ కొంత మంది బలమైన నాయకులు వున్నారు. కాని వాళ్లు కూడా జాతీయ స్ధాయిలో వున్న స్దితిగతుల ఆధారం చేసుకొని గెలిచే నాయకులు మాత్రమే. అందుకే ఏపి, తెలంగాణలలో బిజేపి ఇప్పటి వరకు ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాన్‌ను అక్కున చేర్చుకున్నది. ఇప్పుడు ఆయన అన్నయ్య చిరంజీవిని దగ్గరకు తీసుకుంటోంది. జనసేనను తెలంగాణలో విస్తరింపజేసేలా సహకరిస్తే, తమకు లాభం చేకూరుతుందని బిజేపి బావిస్తోంది. అందుకు బిజేపి, జనసేనల మధ్య రహస్య ఒప్పందం జరిగినట్లు ప్రచారం కూడా జరుగుతుంది. కాని అది సాధ్యమా? అన్నది కూడా బిజేపిలో చర్చ జరగాల్సిన అవసరం వుంది. అయితే తమ్ముడు పవన్‌ కల్యాణ్‌ పార్టీ జనసేన గ్రాఫ్‌ బాగా పెరిగినట్లు సంకేతాలు అందుతున్న వేళ, తాను కూడా మళ్లీ ఒకసారి తన రాజకీయ జీవితంపై జాతకం ఎలా వుంటుందో చూసుకోవాలనుకుంటున్నారు. ఆ విషయం ఈ మధ్య ప్రజారాజ్యం కొనసాగింపే జనసేన అంటూ కీలక వ్యాఖ్య చేశారు. అంటే తాను రాజకీయాలకు దూరంగా లేను అని చెప్పకనే చిరంజీవి చెప్పినట్లైంది. కాని ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలను కూడా ప్రజలు పరిగణలోకి తీసుకుంటారు. ఉమ్మడి రాష్ట్రంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు చేశారు. 180సీట్లు గెల్చుకుంటున్నామని గొప్పలకు పోయారు. 18 సీట్లతో సరిపెట్టుకున్నారు. అయినా చిరంజీవిలో పోరాట పటిమ వుంటుందని అందరూ అనుకున్నారు. కాని ఆయన కనీసం ఓ ఐదేళ్లపాటు కూడా పార్టీని నడపలేకపోయారు. ఎన్టీఆర్‌ చరిత్రను తిరగరాయాలని కలలు గన్నారు. కాని కుదరలేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఆయన సామాజిక తెలంగాణ అంటూ తనకు తెలియని రాగం అందుకున్నారు. అసలు సామాజిక న్యాయం అంటే ఏమిటని ఓ రిపోర్టుర్‌ ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక నీళ్లు నమిలాడు. అయినా కాలం కలిసిరాలేదు. కాని అవకాశాలను సద్వినియోగం చేసుకున్నాడు. జెండా పీకేశాడు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌ పార్టీలో విలీనం చేశాడు. ప్రతిగా రాష్ట్ర క్యాబినేట్‌లో తన అనుచరుడైన గంటా శ్రీనివాస్‌రావును మంత్రిని చేశారు. తాను రాజ్యసభ సభ్యత్వం స్వీకరించి, కేంద్రంలో స్వతంత్ర హోదాలో మంత్రి పదవి తీసుకున్నారు. తాను సినిమాలు వదిలి, రాజకీయ ప్రవేశం చేసిన సమయంలో ఇక తన జీవితం ప్రజలకే అంకితం. ఇకపై ముఖానికి రంగు వేసుకునేది లేదని ప్రకటించారు. రాజకీయాలకే తన పూర్తి సమయం కేటాయిస్తానని, సినిమాలను వదిలేస్తున్నట్లు చెప్పారు. అయితే పరిస్ధితులు అనుకూలించలేదు. చిరంజీవి చెప్పిన మాట మీద నిలబడలేదు. రాజకీయాలు అచ్చి రాలేదని మళ్లీ సినిమాలు మొదలు పెట్టారు. కాని అక్కడ కూడా అనుకున్నంత సక్సెస్‌ కనిపించడం లేదు. సినిమాలైతే చేస్తున్నాడే గాని, ఒకప్పటి ఆదరణ ఇప్పుడు ఆయన సినిమాలకు లేదు. గతంలో చిరంజీవి సినిమా ముందు ఏ ఇతర హీరోల సినిమాలు నిలిచేవి కాదు. ఇప్పుడు ఆ హీరోల సినిమా ముందు చిరంజీవి సినిమాలు ఆడడం లేదు. ఇతర హీరోల సినిమా రేంజ్‌ను చిరంజీవి సినిమాలు అందుకోవడం లేదు. అటు రాజకీయం లేక, ఇటు సినిమాల్లో విజయాలు లేక కొంత ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం. కాకపోతే ఆయనకు వున్న మెగాస్టార్‌ కుర్చీ మాత్రం అలాగేవుంది. ఇలాంటి సమయంలో పవన్‌ కళ్యాణ్‌ రాజకీయ జీవితం ఒక దారిలో పడిరది. ఆయన సినిమాలతోపాటు, రాజకీయం కూడా సక్సెస్‌ బాటలోనే నడుస్తోంది. ఇప్పుడు అన్నకు తమ్ముడి జనసేన బాటలు వేస్తోంది. మొన్నటి వరకు నువ్యు ఒక పార్టీలో ,నేను ఒక పార్టీలో అంటూ ఒకే ఇంటి మీద రెండు జెండాలు ఎగిరే రాజకీయం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ నానాటికీ తీసి కట్టు నాగం బొట్టు అన్నట్లు ప్రయాసపడుతోంది. అందవల్ల కాంగ్రెస్‌లోవుండడం కన్నా, జనసేనలో చేరడం ఉత్తమమని చిరంజీవి బావిస్తున్నారు. పైగా బిజేపి కూడా తోడు కోరుతోంది. ఈ సయోధ్య రెండు పార్టీలకు కలిసి వస్తుందన్న నమ్మకం రెండు పార్టీలలో వుంది. కాని తెలంగాణలో చిరంజీవి వల్ల బిజేపికి ప్రయోజనం కలుగుతుందని మాత్రం చెప్పలేం. ఈ తరానికి చిరంజీవి గురించి తెలిసిన యువతరం తక్కువ. వారికి తెలంగాణలో వున్న బిజేపి నాయకుల కన్నా, చిరంజీవి వారి దృష్టిలో పెద్ద నాయకుడు కాదు. పాలల్లో మజ్జిగ చుక్కలా కలిసి ఘనతంతా నాదే అని చెప్పుకునేందుకు చిరంజీవి ఏ మాత్రం వెనుకాడడు. అయినా చిరంజీవి ఎప్పుడో సమైక్య వాదిగా తనుకుతానుగానే ముద్రవేసుకున్నారు. తెలంగాణను ఆయనే కాదనుకున్నారు. జై తెలంగాణ అనలేదు. తెలంగాణ ఏర్పాటును స్వాగతించలేదు. సమైక్యాంద్ర కోసం రాజీనామా చేసి, తెలంగాణ ప్రజా రాజ్యం నాయకుల ఆత్మగౌరవం దెబ్బ తీశాడు. అలాంటి నాయకుడిని పొరపాటును బిజేపి తెలంగాణ మీద రద్దితే మొదటికే మోసం వస్తుందని చెప్పడంలో సందేహం లేదు.

2009లో కాంగ్రెస్‌ చేసిన తప్పే కొంప ముంచింది!

`మన్మోహన్‌ సింగ్‌ను రెండోసారి ప్రధాని చేయడం తీరని నష్టం చేసింది.

`దేశంలో కాంగ్రెస్‌ కు గడ్డుకాలం ఎదురైంది.

`2009లో ప్రణబ్‌ ముఖర్జీని ప్రధాని చేస్తే కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి మరోలా వుండేది.

`గతంలో రాజీవ్‌గాంధీ చేసిన తప్పే తర్వాత సోనియా గాంధీ చేశారు.

`1984లో రాజీవ్‌ గాంధీ ప్రధాని కాకుండా అడ్డుకున్నారని అపవాదు ఎదుర్కొన్నారు.

`రాష్ట్రీయ సమాజ్‌ వాదీ పార్టీ ఏర్పాటు చేశారు.

`1989 అసలు విషయం తెలిసిన తర్వాత రాజీవ్‌ గాంధీ తో కలిసి పనిచేశారు.

`కాంగ్రెస్‌ పార్టీ కోసం జీవితమంతా కృషి చేశారు.

`ఇందిరాగాంధీకి అత్యంత నమ్మకమైన నాయకుడు.

`రాజకీయ దురంధరుడు.

`ప్రధాని కావాలన్నది ప్రణబ్‌ బలమైన కోరిక.

`ప్రణబ్‌ ముఖర్జీ వల్ల రాజకీయ నష్టం జరుగుతుందని భయపడ్డారు.

`ఇప్పుడు కాంగ్రెస్‌ కోలుకోకుండా పోవడానికి కారకులయ్యారు.

`చరిత్రలో రాజకీయ తప్పటడుగులు సహజమే.

`చెప్పుడు మాటలు విని రాజకీయ పార్టీ తమ పార్టీ కోలుకోకుండా చేసుకోవడమే

మునగడం తేలడం కాంగ్రెస్‌కు కొత్తకాదు. తనను తానే ముంచుకోవడం కూడా కాంగ్రెస్‌కు కొత్తేమీకాదు. కాని మునిగినా తేరుకోవడం ఇంత కాలం పట్టడం అన్నది ఇప్పుడే ప్రధమం. కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భావం చెందింది 1889లో..అప్పటి నుంచి దేశంకోసం పోరాటం చేస్తూనే వుంది. అసలు దేశం కోసం పోరాటం చేసిన ఏకైక పార్టీ కాంగ్రెస్‌. బ్రిటీష్‌ వారికి వ్యతిరేకంగా ఆ రోజుల్లో రాజకీయం నెరపడమే ఎంతో దైర్యంతో కూడుకున్న పని. అయినా దేశం కోసం తెగించి పోరాటం చేసింది ఒక్క కాంగ్రెస్‌ పార్టీయే. ముఖ్యంగా మహాత్మాగాందీ 1917లో దక్షిణాప్రికా నుంచి వచ్చి స్వాతంత్య్రం సంగ్రామంలో అడుగు పెట్టక ముందు ఒకచరిత్ర..తర్వాత ఒక చరిత్ర. ఎందుకంటే కాంగ్రెస్‌లో 1910కి ముందు మితవాదులు ఎక్కువగా వుండేవారు. దాదాబాయి నౌరోజీ లాంటి వారు ఎలాగైనా సాతంత్య్రం సముపార్జనకోసం అర్జించండి అన్న తరహాలో ఉద్యమాలు చేశారు. 1910 తర్వాత లాలాలజపతి రాయ్‌, బాల గంగాదర్‌ తిలక్‌, బిపిన్‌ చంద్రపాల్‌ లాంటి వారు స్వాతంత్య్ర సంగ్రామాన్ని అతి వాద దశకు తెచ్చారు. దాంతో దేశంలో కొంత హింసాత్మక ఉద్యమ వాతారణం నెలకొన్నది. అదే సమయంలో ఇండియాకువచ్చిన గాందీజీ సత్యాగ్రహంతో ఉద్యమం మొదలైంది. అప్పట్లో గాంధీజీ అనుసరిస్తున్న విధానాలను తప్పుపట్టిన వారున్నారు. కాని చివరకు గాంధీ మార్గమే.. గెలిచింది. అయితే మన దేశంలో మొదటిసారిగా 1934 ఎన్నికలు జరిగాయి. ఈ సంగతి చాలా మందికి తెలియదు. అప్పటికే నాయకుడిగా జవహర్‌లాల్‌ నెహ్రూ నాయకత్వం మొదలైంది. 1947 స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా ఆయనే స్వాతంత్య్రం జెండా ఎగురవేశారు. ఇది నేటి తరానికి చెప్పడంలో కాంగ్రెస్‌ పార్టీ పూర్తిగా విఫలమౌతోంది. భారతీయ జనతాపార్టీ రకరకాల ప్రచారాలు సాగిస్తోంది. నాటి ప్రధాని జవహర్‌ లాల్‌ నెహ్రూ దేశ విభజనకు కారణమైతే, వల్లభాయ్‌ పటేల్‌ దేశాన్ని ఏకం చేశారంటూ చరిత్రను వక్రీకరిస్తున్నారు. నాటి ప్రధాని నెహ్రూ ఆదేశాల మేరకు మాత్రమే హోం మంత్రిత్వ బాద్యతలు నిర్వహించారన్న విషయాన్ని కాంగ్రెస్‌ చెప్పుకోవడం లేదు. నిజానికి ఆ ప్లేస్‌లో ఏ నాయకుడు వున్నా, అదే పనిచేసేవారు. కాని స్వాతంత్రోద్యమంలో నెహ్రూ కాకుండా మరో నాయకుడు వుండేవారేమో? అనడానికి ఆస్కారమే లేదు. అంతటి బలమైన పునాదులున్న కాంగ్రెస్‌ పార్టీ ఇందిరాగాందీ వున్నంత వరకు ఆ పార్టీ తిరుగులేని శక్తిగా, ఎదురులేని రాజకీయం చేసింది. ఎప్పుడైతే ఇందిరాగాంధీ మరణించిందో అప్పటి నుంచే కాంగ్రెస్‌ పార్టీ పతనం అంచులకు చేరుకున్నది. ఇందిరాగాంధీ మరణం తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్నది. కాని ఆ గెలుపును, ఆ బలాన్ని నిలుపులేకపోయింది. అప్పటికి బిజేపి కూడా అంత బలంగా లేదు. బోఫోర్స్‌ కుంభకోణం కాంగ్రెస్‌ను పట్టి పీడిరచింది. తర్వాత కాంగ్రెస్‌ పార్టీ ఓటమికి కారణమైంది. బిజేపి బలపడేందుకు మార్గం వేసినట్లైంది. తర్వాతనైనా పార్టీని కాపాడుకునే ప్రయత్నం బలంగా జరగలేదనే చెప్పాలి. పివి. నర్సింహారావును పూర్తిగా నమ్మలేదు. ఆయన నాయకత్వాన్ని బలపర్చలేదు. తర్వాత 2004లో కాంగ్రెస్‌ పార్టీ ఊపియే1 గెలిచింది. అప్పుడు సోనియాగాంధీ ప్రధాని అవుతారని అనుకున్నారు. కాని మన దేశ సార్వభౌత్వం విషయంలో రాజ్యాంగ సూత్రాలు అడ్డు తగిలాయి. సోనియాగాందీ ప్రధాని కాలేకపోయారు. అప్పుడే బలమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం వుండేది. రాజనీతి తెలిసిన నాయకుడికి ప్రధాని బాద్యతలు అప్పగిస్తే ఎంతో బాగుండేది. అప్పటికి బిజేపిలో బలమైన నాయకులు లేరు. ఆ పార్టీకి క్ష్రేత్ర స్దాయి నిర్మానం పూర్తిగా లేదు. మౌన మునిగా పేరున్న మన్మోహన్‌ సింగ్‌ను ప్రధానిని చేస్తే, తన రాజకీయానికి ఇబ్బందులు వుండవన్న ఆలోచనతో సోనియాగాంధీ నిర్ణయం తీసుకున్నారు. కాని ఆ స్దానంలో ఎవరున్నా సోనియాగాందీకి ఎదరు చెప్పే అవకాశం వుండేది కాదు. కాని సోనియాగాందీ ఎవరినీ నమ్మలేదు. సరే 2004లో మన్మోహన్‌ సింగ్‌ ప్రధాని చేశారు. తర్వాత 2009లోనైనా మరో నాయకుడిని ప్రధాని చేసినా కాంగ్రెస్‌కు ఈ పరిస్ధితి వచ్చేది కాదు. ఆ సమయంలో రాహుల్‌ గాంధీని ప్రధానిని చేసినా పెద్దగా పార్టీలో అభ్యంతరాలు వుండేవి కాదు. కాని చేయలేదు. 2004లో రాహుల్‌ గాంధీకి మంత్రి వర్గంలో చోటు కూడా కల్పించలేదు. అది సోనియాగాందీ చేసిన మొదటి తప్పు. ఆ సమయంలో రాహుల్‌ గాంధీని కేంద్ర మంత్రిని చేస్తే పాలన మీద ఆయనకు కొంత పట్టు వచ్చేది. 2009లో ఆయన ప్రధాని అయ్యేందుకు ఇబ్బంది వుండకపోయేది. సరే తర్వాత 2009లో కూడా మంత్రిని చేయలేదు. 2013లో మన్మోహన్‌ సింగ్‌ను రాజీనామా చేయించి, రాహుల్‌ను ప్రధానిని చేసినా బాగుండేది. అ పని చేయలేదు. 2009 ఎన్నికల తర్వాత మన్మోహన్‌ సింగ్‌ను కాకుండా ఎంతో రాజకీయ అనుభవం వున్న చాణక్యుడు ప్రణబ్‌ ముఖర్జీని ప్రధానిని చేస్తే కాంగ్రెస్‌ పార్టీకి ఈ పరిస్దితి అసలే వుండేది కాదు. ఎందుకంటే కాంగ్రెస్‌ పార్టీకి ఆ సమయంలో ప్రణబ్‌ ముఖర్జీ లాంటి మరో చాణక్యుడు లేడు. కాని ఆయనను ప్రధానిని చేస్తే ఎక్కడ తన చేతుల్లో పవర్‌ వుండకుండాపోతుందో అన్న భయంతో సోనియా గాందీ నిర్ణయం తీసుకోలేదు. దాంతో ఇప్పుడు ఇంత కాలం పార్టీ అధికారానికి దూరమయి వుండేది కాదు. దీపముండగానే ఇల్లు చక్కదిద్దుకునే ఆలోచన ఆనాడు చేయలేదు. ఇప్పుడు పదవి కోసం ఎంత ప్రయత్నం చేసినా కాలం కలిసిరావడం లేదు. ప్రణబ్‌ ముఖర్జీ ఇందిరాగాంధీకి ఎంతో నమ్మకమైన నాయకుడు. ఆమె హాయాంలోనే ఆయన ఆర్ధిక శాఖ నిర్వహించారు. రాజకీయ వ్యూహాలు పన్నడంలో ఆయనను మించిన వారు లేదు. పివి.నర్సింహారావు హాయాంలో కూడా ఆయన నెరిపిన విదేశీ వ్యవహరాల మూలంగా దేశానికి, ఆర్ధికాభివృద్దికి ఎంతో మేలు జరిగింది. అయితే ఇందిరాగాందీ మరణం తర్వాత రాజీవ్‌ గాందీని ప్రదాని చేయడం కొంత మందికి నచ్చలేదు. ఎలాంటి పాలనానుభవం లేని రాజీవ్‌ గాందీ వల్ల కాంగ్రెస్‌ నష్టపోతుందని అనుకున్నారు. అందులో ప్రణబ్‌ ముఖర్జీవున్నారనేది అప్పుడు ప్రచారం జరిగింది. దాంతో రాజీవ్‌గాంధీ ఆయనను పక్కన పెట్టారు. ఆయనకు పార్టీలో ప్రాధాన్యత తగ్గించారు. ఇక పార్టీలో వుండి లాభం లేదనుకున్న ప్రణబ్‌ ముఖర్జీ రాష్ట్రీయ సమాజ్‌వాదీ పార్టీని ఏర్పాటు చేశారు. అయితే కొంత కాలానికి రాజీవ్‌ గాంధీకి అసలు నిజం తెలిసింది. ప్రణబ్‌ ముఖర్జీ అంటే గిట్టని వాళ్లు చేసిన ప్రచారం మూలంగానే అపోహపడినట్లు గ్రహించి, మళ్లీ ప్రణబ్‌ను పార్టీలోకి ఆహ్వానించారు. అప్పటి నుంచి ఆయన కాంగ్రెస్‌ పార్టీకి ఎంతో అండగా వుంటూ వచ్చారు. పివి. నర్సింహారావును ప్రధాని చేయడంలో కూడా కీలకభూమిక పోషించారు. ఇప్పటికీ కాంగ్రెస్‌ పార్టీ ఇంకా బతికి వుందంటే ప్రణబ్‌ ముఖర్జీ లాంటి నాయకులే కారమని చెప్పకతప్పదు. 2004 ప్రధాని అయ్యే అవకాశం వున్నా సోనియాగాంధీ ఆయన పేరు ప్రస్తావించలేదు. ఇందుకు కూడా కొన్ని కారణాలున్నాయి. ఆనాడు రాజీవ్‌ గాంధికి లేనిపోనివి చెప్పినట్లే, తర్వాత సోనియా గాందీకి కూడా అదే నూరిపోశారు. దాంతో ఆమె ప్రణబ్‌ను ప్రదాని చేయడానికి ముందుకు రాలేదు. కాని తాను ప్రధాని కావలన్నా కోరికను ప్రణబ్‌కు ఎంతో వుండేది. గాంధీ కుటుంబాన్ని కాదని ఆయన ప్రదాని పదవి కోరలేదు. ఆ కుటుంబంలో రాహుల్‌ ప్రధాని కానప్పుడు తనకు అవకాశం వస్తుందని ఆశించారు. అయినా సోనియాగాంధీ కనికరించలేదు. కాకపోతే 2012లో ఆయనను రాజకీయాలను నుంచి దూరం చేసి, రాష్ట్రపతి పదవిని ఇచ్చారు. నిజానికి ఆ పదవి ప్రణబ్‌కు ఇష్టం లేదు. ఆనాడు ప్రణబ్‌కు రాష్టపతి చేయకుంటే కూడా కాంగ్రెస్‌ పార్టీ పరిస్ధితి మరోలా వుండేది. రాష్ట్రపతిని చేసి పార్టీ కోసం పనిచేసేనాయకుడు లేకుండా చేసుకున్నారు. స్వయంకృతాపరాధంతో పార్టీని చెడగొట్టుకున్నారు. రాజకీయ పార్టీలు ఆరోపణలు చేయడం, నాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ స్పందించడం, స్పెక్ట్రమ్‌ లాంటి కేసులపై ముందూ వెనుకు ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకోవడం కూడా కాంగ్రెస్‌ కొంప ముంచింది. చివరికి ఏం తేలింది? స్పెక్రమ్‌లో ఎలాంటి అవినీతి జరగలేదని సుప్రింకోర్టు కేసు కొట్టి వేసింది. అప్పటికే కాంగ్రెస్‌కు జరగాల్సినంతనష్టం జరిగిపోయింది. ఇలా మన్మోహన్‌ సింగ్‌ హయాంలో వేసిన తప్పటడుగులు, కాంగ్రెస్‌కు శాపాలుగా మారాయని చెప్పడంలో సందేహం లేదు.

‘ఆప్‌’ను ముంచిన అవినీతి వరద!

ఢల్లీి ఎన్నికల్లో కాషాయ ప్రభంజనం

అవినీతి ప్రవాహంలో కొట్టుకుపోయిన ఆప్‌ అగ్రనేతలు

ఓడి గెలిచిన రాహుల్‌

ఆప్‌ ఓటమికి ఆరు కారణాలు

ఉద్యమ నేత నియంతగా మారితే ఫలితం ఇదే

ఆప్‌ ఓటమితో విపక్షాల్లో నైరాశ్యం

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

శనివారం జరిగిన ఢల్లీి ఎన్నికల ఫలితాల్లో 48 స్థానాల్లో తన బలాన్ని నిరూపించుకున్న భారతీ యజనతా పార్టీ 27 సంవత్సరాల తర్వాత ఢల్లీి పీఠాన్ని కైవసం చేసుకుంది. ఆమ్‌ ఆద్మీ పార్టీ 22 స్థానాలకు పరిమితం కాగా రాహుల్‌ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ‘సున్నా’ సీట్లతో మరో చెత్త రికార్డు సృష్టించింది. ఆప్‌ అగ్రనేతలైన కేజ్రీవాల్‌, సిసోడియా, సత్యేంద్రజైన్‌ వంటి నాయకులు ఓడిపోయారు. వీరుముగ్గురూ లిక్కర్‌ స్కామ్‌లో జైలుకెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే. వీరి ఓటమితో ఆప్‌కు ఊహించని దెబ్బ తగిలింది. ముఖ్యమంత్రి అతిశి, కల్కా నియోజకవర్గం నుంచి గెలవడం గుడ్డిలో మెల్ల. ఢల్లీి ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీపార్టీ ఓటమి నేపథ్యంలో లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢల్లీి సచివాలయాన్ని సీజ్‌ చేయాలని నిర్ణయించారు. ముందస్తు అనుమతి లేకుండా ఫైళ్లు, రికార్డులు తరలించవద్దని ఆదేశాలు వెళ్లాయి. 

ఆప్‌ ఉత్థాన పతనాలు

ఆమ్‌ ఆద్మీ పార్టీ స్థాపన జరిగిన కొద్ది నెలల్లోనే అంటే 2013లో ఢల్లీి అసెంబ్లీకి జరిగిన ఎన్నిక ల్లో 28 సీట్లు గెలుచుకొని అందరినీ ఆశ్చర్య పరచింది. కాంగ్రెస్‌ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పా టు చేసినా కొద్దిరోజుల్లోనే ప్రభుత్వం కూలిపోవడంతో, 2015లో ఢల్లీి అసెంబ్లీ 70 స్థానాల కు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ ఏకంగా 68 సీట్లు గెలుచుకోవడంతో మిగిలిన రాజకీయపార్టీలు ఆశ్చర్యంతో పాటు అయోమయంలో వుండిపోయాయి. 2020 ఎన్నికల్లో 62 సీట్లు గెలుచుకుంది. ఈసారి తమదే విజయం అన్న విశ్వాసంతో వున్న ‘ఆప్‌’కు ఓటమి రూపంలో గట్టి దెబ్బ తగిలింది. అసలు ఆప్‌ పార్టీ ఓటమి పాలవడం రాజకీయాల్లో సహజమనుకు న్నా, ఈసారి ఆప్‌ అగ్రనాయ కులంతా ఓటమిపాలవడం కోలుకోలేని దెబ్బ! రాహుల్‌ చద్దా పార్టీలో ఉన్నారో లేదో తెలియదు. ఈ ఓటమి దెబ్బకు ఇప్పటివరకు కేజ్రీవాల్‌కు ఎన్నికల ప్రచారానికి హెలికాప్టర్‌ సమకూర్చి చేతులు కట్టుకొని నిలబడిన పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌్‌ మాన్‌ ఇక ముందు మాట వింటారా? ఇప్పుడు ఎన్నికైన వారు, ఓటమిపాలైన అగ్రనాయత్వం మాట ఎంతవరకు వింటారనేవి పెద్ద ప్రశ్నలు.

అగ్రనేతల ఓటమి

ఢల్లీి మాజీ ముఖ్యమంత్రి, ఆప్‌ జాతీయ కన్వీనర్‌ కేజ్రీవాల్‌ ఢల్లీి స్థానం నుంచి భాజపా అభ్యర్థి పర్వేశ్‌ వర్మ చేతిలో 4089 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఉపముఖ్యమంత్రి మనీష్‌ సిసోదియా జంగ్‌పూరలో 675 ఓట్ల తేడాతో భాజపా అభ్యర్థి తర్వీందర్‌ సింగ్‌ చేతిలో ఓడిపోయారు.ఢల్లీి ముఖ్యమంత్రి అతిశి కాల్‌కాజీ నియోజకవర్గం నుంచి 3521 ఓట్ల మెజారిటీలో భాజపా అభ్యర్థి రమేష్‌ బిదూరీపై విజయం సాధించారు. మొదటి రౌండ్‌ నుంచీ వెనుకంజలో వున్న ఆమె చివర్లో పుంజుకొని విజయబావుటా ఎగురవేశారు. ఆప్‌ సీనియర్‌ నేత సత్యేంద్ర జైన్‌ షాకూరి బస్తీలో ఓటమి పాలయ్యారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి కర్నాల్‌ సింగ్‌ 20998 ఓట్ల తేడాతో గెలిచా రు. మరో ఆప్‌ ముఖ్య నేత సౌరభ్‌ భరద్వాజ్‌ గ్రేటర్‌ కైలాష్‌ స్థానంలో పరాజయం పాలయ్యారు.ఇక్కడ బీజేపీ అభ్యర్థి శిఖారాయ్‌ 3188 ఓట్ల తేడాతో గెలిచారు. బిజ్వాసన్‌ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి కైలాష్‌ గెహ్లోత్‌ విజయం సాధించారు. ఆప్‌ అభ్యర్థి సురేందర్‌ భర ద్వాజ్‌పై 9833 ఓట్ల తేడాతో గెలిచారు. గాంధీనగర్‌ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి అర్వీందర్‌సింగ్‌ లవ్లీ, ఆప్‌ అభ్యర్థిపై 12748 ఓట్ల మెజారిటీతో గెలిచారు.

ఓడి గెలిచిన రాహుల్‌

ఒకవిధంగా చూసుకుంటే ఢల్లీి ఎన్నికల్లో రాహుల్‌ గాంధీ ఓడి గెలిచారనుకోవాలి. ఎందుకంటే భవిష్యత్తులో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాన అభ్యర్థిగా రాహుల్‌కు పోటీగా కేజ్రీవాల్‌ సు స్థిరమయ్యేందుకు పావులు కదుపుతున్నారు. ఇందుకోసం ఆయన ఒకపక్క ఇండీ కూటమితో మరోపక్క కాంగ్రెస్‌తో అవసరానికి అనుగుణంగా డబుల్‌గేమ్‌ ఆడుతూ వస్తున్నారు. దీనికితోడు మహారాష్ట్ర, హర్యానా, ఢల్లీి వంటి రాష్ట్రాల్లో వరుస ఓటములతో కునారిల్లుతున్న కాంగ్రెస్‌ పార్టీకిరాహుల్‌ గాంధీ ప్రధాని అభ్యర్థిగా పెద్ద ‘గుదిబండ’గా మారారనే చెప్పాలి. ఈ నేపథ్యంలో ఇండీ కూటమిలోని ప్రాంతీయ పార్టీల నేతల్లో ప్రధానిపదవిపై ఆశలు పెరిగాయి. వీరిలో మమతా బెనర్జీ, అఖిలేష్‌ యాదవ్‌, అరవింద్‌ కేజ్రీవాల్‌ తదితరులున్నారు. ఇప్పుడు కేజ్రీవాల్‌ ఓటమి పుణ్యమాని రాహుల్‌కు ఒక పోటీదారు రంగంనుంచి తప్పుకున్నట్లయింది.

ఆదినుంచీ ప్రధాని పదవిపైనే కన్ను

ప్రస్తుత ప్రధాని నరేంద్రమోదీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా వుంటూ, తర్వాత దేశ ప్రధాని అయ్యా రు. ఆయన పేరును భాజపా ప్రధాని అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత దేశం ఒక్కసారి ఆయనవైపుచూడటం మొదలుపెట్టింది. గుజరాత్‌ అభివృద్ధి నమూనా దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమం త్రులకు ఒక దిక్సూచిగా మారింది. ఇదిలావుంటే కేజ్రీవాల్‌ కూడా ఢల్లీి పీఠం అధిష్టించిన దగ్గరి నుంచి ప్రధానిపదవికి అభ్యర్థిగా ఎదగాలన్న బలీయమైన ఆకాంక్షతో ముందుకు సాగారు. ఈ నేపథ్యంలోనే తన పార్టీలో మరొకరిని ఎదగనివ్వలేదు, మహారాష్ట్ర, గోవా, పంజాబ్‌, హర్యానా వం టి రాష్ట్రాల్లో బలమైన నాయకుడుగా ఎదుగుతారని అనుమామున్నవారినల్లా తొక్కేసుకుంటూ వచ్చారు. కాంగ్రెస్‌ను గాంధీల కుటుంబం ఎట్లా శాసిస్తుందో, ఆప్‌ను ‘అతడే ఒక సైన్యం’ మాదిరిగా శాసించాలనుకున్నారు. ఈ కలలన్నీ ఇప్పుడు కల్లలైపోయాయి. ఒకరకంగా చెప్పాలంటే దేశాధినేతగా ఎదగాలన్న ఆతృతలో పార్టీలో నాయకులను ఎదగనీయకుండా తన గొంతు తానే కోసుకున్నారని చెప్పాలి. ఆప్‌ పార్టీకి ప్రారంభంలో విద్యావంతులు విపరీతంగా మద్దతు ఇచ్చారు. ఆ పార్టీ సభ్యులుగా గర్వంగా చెప్పుకునేవారు. ఉద్యోగులుగా ఉన్న యువత తమ జీతాల్లో కొంత శాతం పార్టీ ఫండ్‌గా ఇచ్చిన రోజులున్నాయి. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేజ్రీవాల్‌ మారిపోయారు. అవకాశాలు దొరకనంతవరకు ‘నీతి’గా వుంటూ, అవకాశం దొరికినతర్వాత ‘అవినీతికి’ తెరలేపారు. ఏటా మీడియా మేనేజ్‌మెంట్‌కు సుమారు రూ.400కోట్లు ఖర్చుచేయడం, సం క్షేమం పేరుతో పరిధికి మించి ‘ఉచితాలు’ ప్రకటించడం వంటివి ఆయనకు మొదట్లో మద్దతి చ్చిన విద్యావంతులను దూరం చేశాయి. ‘సంక్షేమం’ కూడా ఒక పరిమితి వరకే అధికారానికి దోహదం చేస్తుంది. మితిమీరితే వికటిస్తుంది. ఇప్పుడు జరిగిందిదే! చివరకు కేంద్ర ప్రభుత్వ పథకాలను తనవిగా ప్రచారం చేసుకోవడానికి వెనుకాడలేదు. ఆవిధంగా అన్నీ తానే చేసానని చెప్పుకోవడానికి తహతహలాడారు. మరి నిజాలెప్పుడూ నిప్పుమాదిరిగానే వుంటాయి. ఏది నిజమో తెలిసొచ్చిన ప్రజలు ఇప్పుడాయన్ను పక్కనపెట్టారు. 

మోదీ బ్రహ్మాస్త్రం

అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆశలకు ఏవిధంగానైనా గండికొట్టాలన్న వ్యూహంతో బీజేపీ ముందుకెళ్లింది. ప్రధాని నరేంద్రమోదీ ఢల్లీి ఎన్నికల్లో తన చివరి ‘బ్రహ్మాస్త్రాన్ని’ ప్రచారం చివరిదశలో గురిచూసి వదిలారు. బడ్జెట్‌లో ఆదాయపుపన్ను మినహాయింపు 12లక్షలకు పెంచడమే ఆ బ్రహ్మాస్త్రం. ఢల్లీిలో మూడొంతులవరకు వేతనజీవులే వుండటం విశేషం. ఇంతస్థాయిలో ఐ.టి. మినహాయిం పునిస్తారని ఎవరూ ఊహించలేదు. ఇది మోదీ వదిలిన తురుపు ముక్కగా అప్పుడే రాజకీయ విశ్లేషకులు పేర్కొన్నారు. గత శనివారం అంటే ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారా మన్‌ ఈమేరకు చేసిన ప్రకటన ఎన్నికల్లో తప్పక ప్రభావం చూపుతుందన్న అందరి అంచనా నిజమైంది. నిజానికి కేజ్రీవాల్‌ మధ్యతరగతిని ప్రధానంగా ఆకర్షించే ఉద్దేశంతో ఐ.టి.ని రూ.10లక్షలకు పెంచాలని డిమాండ్‌ చేశారు. కానీ మోదీ ప్రభుత్వం దీన్ని ఏకంగా రూ.12లక్షలకు పెం చింది. ఆవిధంగా కేజ్రీవాల్‌ కంటే రెండాకులు ఎక్కువగానే చదివానని భాజపా నిరూపించుకుంది.

మధ్యతరగతివారే అధికం

ఢల్లీిలో ఎగువ మధ్యతరగతి పదిశాతం, దిగువ మధ్యతరగతి 48 నుంచి 50శాతం వరకు వుంటే మిగిలినవారు ఇతర వర్గాల ప్రజలు. వీళ్లను ఆకట్టుకోవడానికి ఆప్‌, భాజపాలు తీవ్రంగా ప్రయత్నించాయి. పదేళ్లపాటు సామాన్యులు, అల్పాదాయవర్గాలే లక్ష్యంగా సంక్షేమ, అభివృద్ధి పథ కాలు అమలు చేస్తూ వచ్చిన ఆప్‌ ఈసారి ప్రభుత్వ వ్యతిరేకత, కేజ్రీవాల్‌పై అవినీతి ఆరోపణల తో సతమతమైంది. ఇదే సమయంలో బీజేపీ వ్యతిరేక ఓటు ఈసారి ఆప్‌కు కాకుండా కాంగ్రెస్‌ కు పడటం ఆప్‌ దారుణంగా దెబ్బ తినడానికి మరో కారణమని చెబుతున్నారు. దేశ రాజధాని నగరంలో వెయ్యికి పైగా మురికివాడలున్నాయి. గతంలో బంగ్లాదేశ్‌నుంచి, పాక్‌నుంచి వలసలు వచ్చి వివిధ ప్రాంతాలను ఆక్రమించుకొని అక్రమ నిర్మాణాలు చేపట్టిన వర్గాల పూర్తి మద్దతుతో ఆమ్‌ ఆద్మీ పార్టీ గెలుపు సాధిస్తూ వచ్చింది. ఈ వర్గాలకే కేజ్రీవాల్‌ వెన్నుదన్నుగా నిలిచారు. రాయితీలు, ప్రయోజనాలు ఈ వర్గాలకే కల్పిస్తూ వచ్చారు. ఈ వర్గాల మతపెద్దలను ఎప్పటికప్పుడు సంతృప్తిపరచే విధంగా ప్రవరిస్తూ, హిందువులను తీవ్ర వివక్షకు గురిచేసిన చరిత్ర కేజ్రీవాల్‌ది. కరోనా కాలంలో కూడా ఆయా మతవర్గాలకే ప్రాధాన్యం ఇచ్చాడు తప్ప హిందువులకు ప్రత్యేకంగా ఒరగబెట్టిందేమీ లేదు. చివరకు దీపావళి కూడా జరుపుకోకుండా ఆంక్షలు విధించి ఘనత కేజ్రీవాల్‌ది. నూతన సంవత్సర వేడుకల్లో, విజయోత్సవాల సందర్భంగా, ఇతర మతాల వేడుకల్లో బాణాసంచా కాల్చుకోవచ్చు. అదే హిందువులు బాణాసంచా కాలిస్తే కేసులు నమోదయ్యేవి. పౌర సవరణ చట్టం, ఎన్‌ఆర్‌సీ వద్దంటూ తీవ్రంగా వ్యతిరేకించారు. హిందూవర్గాలను చీల్చి మైనారిటీల పేరుతో నడిపిన రాజకీయం నేపథ్యంలో ఢల్లీిలో భాజపా భవితవ్యం ఒక దశలో ప్రశ్నార్థకంగా మారిన మాట నిజం! కేజ్రీవాల్‌ పాలన క్రమంగా ఢల్లీిని మినీ పాకిస్తాన్‌, మినీ బంగ్లాదేశ్‌గా మారుస్తున్న విషయాన్ని గ్రహించిన ప్రజలు ఇచ్చిన తీర్పు ఇది. 

చెప్పిందొకటి చేసింది మరొకటి

కేజ్రీవాల్‌ ఓటమికి లిక్కర్‌ స్కామ్‌ ప్రధాన కారణమన్న వాదన బాగా వినబడుతున్నప్పటికీ, ఆమ్‌ ఆద్మీ పార్టీ ఓటమికి అదొక్కటే కాదు, అధికారంలో వుండగా కేజ్రీవాల్‌ చెప్పిన మాటలకు, చేసినచేతలకు పొంతన లేకపోవడం మరో కారణం. పైకి నీతులు చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో అవినీతి భయంకరంగా తాండవమాడటానికి కేజ్రీవాల్‌ వైఖరే కారణం. సంక్షేమ పథకాలకు మేధావి వర్గం ఎప్పుడూ వ్యతిరేకమే. కేజ్రీవాల్‌ వాళ్లకు అనుకూలంగా వున్నప్పటికీ, ఆయన ప్రకటించిన సంక్షేమ పథకాలే అధికారాన్ని కట్టబెట్టాయి. ఇప్పుడు భాజపా ఎంతో సంయమనంతో, సమ తుల్యంతో వ్యవహరించాల్సివుంటుంది. తానిచ్చిన సంక్షేమ వాగ్దానాలను అమలు పరుస్తూనే, ఢల్లీి పాలనను అట్టగుస్థాయి నుంచి మరింత క్రమబద్ధీకరించాల్సి వుంటుంది. రాబోయే ఐదేళ్ల కాలంలో భాజపా ప్రభుత్వ పనితీరుపై ప్రజలు ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తారు. ఇది గుర్తెరిగి పాలన సాగించాలి. 

కేజ్రీవాల్‌ ఆరు తప్పులు 

నిజం చెప్పాలంటే కర్ణుడు చావుకు ఆరు కారణాలు అన్నట్టు, కేజ్రీవాల్‌ పతనానికి ఆయన చేసిన ఆరు తప్పులు ప్రధాన కారణం. కేజ్రీవాల్‌ నిజానికి అన్నాహజారే మొదలుపెట్టిన అవినీతి వ్యతి రేక ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చారు, నాయకుడిగా ఎదిగారు. జన్‌లోక్‌పాల్‌ వ్యవస్థను తీసుకురావాలన్నది అన్నాహజారే ఆకాంక్ష. అయితే కేజ్రీవాల్‌ పార్టీ పెట్టాలని ఉత్సాహం చూపి నప్పుడు అన్నాహజారే వారించారని చెబుతారు. ఆయన మాట వినకుండా కేజ్రీవాల్‌ ‘ఆమ్‌ ఆద్మీ పార్టీ’ (సామాన్యుల పార్టీ)ని స్థాపించారు. కానీ రెండోసారి ఎన్నికైన తర్వాత ఆయన నియంతగా వ్యవహరించడం మొదటి తప్పు. ఆయన పార్టీ తరపున ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఎంపీల్లో 70శాతం మందికి ఆయన్ను కలవడం సాధ్యమయ్యేది కాదు. కేజ్రీవాల్‌ పి.ఎ. విభవ్‌కుమార్‌ వద్దకు మాత్రమే వారికి అవకాశం వుండేది. ఇందుకు ఉదాహరణ స్వాతీ మాలివాల్‌. ఆమె కేజ్రీవాల్‌ ను కలవడానికి వస్తే చావుదెబ్బలు బహుమానంగా లభించాయి. ఇటువంటి కారణాలవల్ల కేజ్రీవాల్‌ పార్టీ నాయకులకు, కేడర్‌కు దూరమైపోయారు. ఎన్నికలకు రెండు మూడు రోజుల ముందు ఏడు గురు ఆప్‌ ఎమ్మెల్యేలు భాజపాలో చేరారంటే, కేజ్రీవాల్‌ నియంతృత్వం ఏస్థాయికి చేరుకుందో అర్థం చేసుకోవచ్చు. తనకు పార్టీలో ఆప్తమిత్రులుగా వున్న వారిని ఒక్కొక్కరిగా దూరం చేసుకున్నారు. స్వాతీ మాలివాల్‌కు మహిళల్లో గట్టి పట్టుంది. ఈమె మహిళా కమిషన్‌ మాజీ ఛైర్‌పర్సన్‌, ప్రస్తుత రాజ్యసభ సభ్యురాలు. ఈమెను శీష్‌మహల్‌లో కేజ్రీవాల్‌ పి.ఎ. విభవ్‌కుమార్‌ చితకబా దారు. దీంతో ఆమె పార్టీకి దూరమైంది. ఆమె పట్టుపట్టి మరీ కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా ప్రచారాన్ని ఉద్యమం రూపంలో చేసింది. కుమార్‌ బిశ్వాస్‌ తొలి టర్మ్‌లో ఆమ్‌ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన గొప్పకవి, వ్యంగ్యంగా చతురోక్తులు విసరడంతో దిట్ట. ఈయన్ను కూడా దూ రం పెట్టడంతో ఆయన తన కవిసమ్మేళనాలు, సమావేశాల ద్వారా మధ్యతరగతి, ఎగువ మధ్య తరగతి ప్రజలకు ఎంతో చేరువయ్యారు. తన సమావేశాల్లో ఆయన కేజ్రీవాల్‌ను వ్యంగ్యోక్తులతోచేసిన విమర్శలు ప్రజల్లోకి బాగా వెళ్లాయి. స్వాతీమాలీవాల్‌, కుమార్‌ బిశ్వాస్‌లు ఆప్‌కు కంచు కోటగా వున్న మధ్యతరగతి ఓటర్లను దూరం చేయడంలో కీలకపాత్ర పోషించారు. వీరిని దూరంచేసుకోవడం కేజ్రీవాల్‌ రెండో తప్పు. ఇక మూడోతప్పేమిటంటే, తనపై లిక్కర్‌ స్కామ్‌ ఆరోపణ లు వచ్చినప్పుడు తక్షణం రాజీనామా చేసివుండాల్సింది. అలా చేయలేదు సరికదా, ముఖ్యమంత్రిపదవిలో కొనసాగుతూనే జైల్లోకి వెళ్లి చరిత్ర సృష్టించారు. ఈ స్కామ్‌లో కేజ్రీవాల్‌తో పాటు కొందరు ఆయన మంత్రివర్గ సహచరులు కూడా జైలుకెళ్లారు. దీంతో ఆయనతో పాటు మంత్రుల అవినీతి ప్రజలకు బాగా తెలిసొచ్చింది. ఇది ఆయన ప్రతిష్టను బాగా దెబ్బతీసింది. ఇక నాల్గవ తప్పు శీష్‌మహల్‌ విషయంలో ఆ యనపై వచ్చిన ఆరోపణలను తిప్పికొట్టడంలో విఫలం కావడం. ఆయన కట్టుకున ్నశీష్‌మహల్‌ వైభవంపై ఆరోపణలు వచ్చినప్పుడు, మీడియాను తీసుకెళ్లి మొ త్తం చూపించి వుండాల్సింది. అట్లా చేయలేదు. రూ.33కోట్ల ప్రజాధనం ఖర్చుచేసి శీష్‌మహల్‌కు మరమ్మతులు చేయించారని కాగ్‌ నివేదిక పేర్కొనడంతో దుమారం చెలరేగింది. భాజపా దీ న్ని ప్రధాన ఆయుధంగా మలచుకుంది. మధ్యతరగతి ప్రజల్లోకి ఇది బాగా వెళ్లింది. ఫలితంగా కేజ్రీవాల్‌పై ఢల్లీివాసుల్లో అనుమానాలు పెరిగాయి. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం పేరుతో అధికారంలోకి వచ్చిన పార్టీయే అవినీతిలో కూరుకుపోవడం అప్పట్లో మీడియాలోవిపరీతంగా చర్చలకు దారితీసింది. ఐదో ప్రధాన తప్పిదం ముస్లింల ఓట్లు ఎక్కడ కాంగ్రెస్‌, ఎం.ఐ.ఎం.లు చీల్చుకుంటాయన్న భయంతో ఈసారి ఆయన పూర్తిగా హిందూ ఓటర్లను విస్మరించడం. గతంలో బీజేపీ జై శ్రీరామ్‌ అంటే ఆయన జై హనుమాన్‌ అని నినాదమిచ్చి హిందువులకు తాను అనుకూలమని చెప్పుకునే ప్రయత్నం చేశారు. కానీ ఈ ఎన్నికల్లో ఆయన పూర్తిగా ముస్లింల భజనకే పరిమితమయ్యారు. ఆయన చేసిన తప్పుల్లో అత్యంత కీలకమైందిగా దీన్ని పరిగణించాలి. దీంతోపాటు ఢల్లీి ఓటర్లలో క్రమంగా పెరుగుతున్న మతపరమైన పోలరైజేషన్‌ను గుర్తించడంలో ఆయన విఫలమయ్యారు. ఇక ఆరవ తప్పు ముందుగానే అభ్యర్థులను ప్రకటించడం. ఆవిధంగా ప్రకటించిన తర్వాత వీరిని మార్చటం సాధ్యంకాదు. అట్లాచేస్తే ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళతా యి. లాక్కోలేని, పీక్కోలేని దుస్థితి ఇది. ప్రకటించిన వారిలో కొందరు ఓటమి పాలవుతారన్నది ఖాయంగా తెలిసిపోయింది. ఈ నేపథ్యంలో 20మందిని మార్చడంతో, అసంతృప్తి చెలరేగింది. ఇక భాజపా తన అభ్యర్థులను అందరికంటే చాలా ఆలస్యంగా ప్రకటించింది. ముఖ్యంగా ఆమ్‌ఆద్మీ పార్టీలో పరిణామాలను గమనిస్తూ, ఎప్పటికప్పుడు గెలుపు అచంనాలు వేస్తూ, అభ్యర్థులనుఎంపిక చేసింది. ఒకరకంగా కేజ్రీవాల్‌ ముందుగా అభ్యర్థులను ప్రకటించి భాజపాకు మేలు చేశారనే చెప్పాలి. దీంతో పాటు తాను అమలు చేయబోయే సంక్షేమ పథకాలను ముందుగానే ప్రకటించడం, బీజేపీ, కాంగ్రెస్‌లు తాము మరింత ఎక్కువ సంక్షేమాన్ని అందిస్తామని ప్రకటించడానికి దోహదం చేసింది.

గెలిచేది నేనే: నరేందర్‌ రెడ్డి.

`నాకు ఎవరూ పోటీ కాదు.

`కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్‌ రెడ్డి తో నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు ప్రత్యేక ఇంటర్వూ..

`సమాజాన్ని ,సామాజిక స్థితిగతులు అధ్యయనం చేశాను.

`ఉన్నత విద్యావంతుడిగా తెలంగాణలో విద్యాభివృద్ధికి కృషి చేస్తాను.

`నిరుద్యోగులకు అండగా వుంటూ ఉద్యోగ కల్పన కోసం శ్రమిస్తాను.

`సామాజిక సమస్యలపై అవగాహన వుంది.

`విద్యా వ్యవస్థ మీద పూర్తి అవగాహన వుంది.

`రేపటి తరం గురించి ఆలోచించే శక్తి వుంది.

`రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వం

`ఉద్యోగులకు మెరుగైన జీతాలను సకాలంలో అందించేది కాంగ్రెస్‌ ప్రభుత్వం.

`బిజేపి తో గతంలో ఒరిగింది లేదు.

`ఇప్పుడు కొత్తగా జరిగే మేలు లేదు.

`పదేళ్ల క్రితం 2 కోట్ల ఉద్యోగాలిస్తామని దేశ ప్రజలను మోసం చేసింది బిజేపి.

`తెలంగాణ రాష్ట్రమంటేనే బిజేపికి చిన్న చూపు.

`బడ్జెట్‌ లో తెలంగాణ ప్రస్తావన కూడా వుండదు

`తెలంగాణకు అదనంగా రూపాయి ఇచ్చేది వుండదు.

`తెలంగాణ ప్రజలు 8 మంది ఎంపిలను గెలిపిస్తే రూపాయి తెచ్చింది లేదు.

`తెలంగాణకు ఒక్క ప్రాజెక్టు ఇచ్చింది లేదు.

`తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్‌.

`తెలంగాణ అభివృద్ధి చేసేది కాంగ్రెస్‌.

`ఎన్నికల ముందు నిరుద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం.

`తొలి ఏడాదిలో 60 వేల ఉద్యోగాలిచ్చాం.

`జాబ్‌ క్యాలెండర్‌ ద్వారా ఏటా ఎప్పటికప్పుడు ఉద్యోగాలు భర్తీ చేస్తాం

హైదరాబాద్‌,నేటిధాత్రి:

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేది నేనే..ఇది అతి విశ్వాసంతో చెబుతున్న మాట కాదు…పూర్తి ఆత్మవిశ్వాసంతో చెబుతున్న మాట. ఎందుకంటే ఇప్పటికే నేను నాలుగు ఉమ్మడి జిల్లాలైన కరీంనగర్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, మెదక్‌ జిల్లాల ప్రచార పర్యటనల్లో తెలిసిన అంశం. తెలుసుకున్న విషయం. పైగా నేను దాదాపు ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఎక్కువగా సుపరిచితమైన విద్యావేత్తను. నా విద్యా సంస్దలు నా గెలుపుకు ఒక కారణమైతే, రాష్ట్ర ప్రభుత్వ పనితీరు, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పాలనపై ప్రజల్లో వున్న నమ్మకం మరో కారణం. దానితోపాటు అంకితభావం కల్గిన కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేయోభిలాషులు కలిగిస్తున్న విశ్వాసం కూడా నాలో మరింత నమ్మకాన్ని పెంచింది. ఎక్కడికెళ్లినా కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తల ఆదరణ మర్చిపోలేనది. నాలుగు జిల్లాల్లో వున్న పట్టభద్రులు స్పందన కూడా నాకు ఎంతో బలాన్ని ఇస్తోంది. అందుకే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు నాదే..గెలిచేదినేనే అనే నమ్మకం మరింత నాలో బలపడిరది. అయితే ఇంకా నేను మరింత ప్రచారం కొనసాగించాల్సిన అవసరం వుంది. ప్రత్యర్ధులకు అవకాశమివ్వకుండా ముందుకు సాగాల్సి వుంది. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీల మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉద్యోగాల కల్పన నా విజయానికి బాటలు వేస్తుందని బలంగా నమ్ముతున్నానంటున్న కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్ది డాక్టర్‌. వి. నరేందర్‌ రెడ్డి నేటి ధాత్రి ఎడిటర్‌ కట్టారాఘవేంద్రరావుకిచ్చిన ప్రత్యేక ఇంటర్యూలో అనేక అంశాలు పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే…
తెలంగానలో కాంగ్రెస్‌ పార్టీ బలంగా వుంది. కాంగ్రెస్‌ పార్టీకి సమీపంలో కూడా ఏ పార్టీలేదు. పైగా తెలంగాణ యువతకు కాంగ్రెస్‌ పార్టీ మీద అచెంచలమైన విశ్వాసం వుంది. గత పదేళ్ల కాలంలో పది ఉద్యోగాలు కూడా కల్పించలేని బిఆర్‌ఎస్‌ను ప్రజలు ఓడిరచి కాంగ్రెస్‌ పార్టీని గెలిపించారు. ఆ నమ్మకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెలల నుంచే నిలబెట్టుకుంటూ వస్తోంది. ఒక్క ఏడాది కాలంలోనే సుమారు 60వేలకు పైగా ఉద్యోగాలు కల్పించిన ప్రభుత్వాలు దేశంలోనే ఎక్కడా లేవు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా చూడలేదు. గత పదేళ్ల బిఆర్‌ఎస్‌ పాలనలో అసలే చూడలేదు. గత ఏడాదే ఇంకా అనేక ఉద్యోగాలు కల్పించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రయత్నం చేశారు. కాకపోతే తర్వాత వెంటనే వచ్చిన పార్లీమెంటు ఎన్నికల సమయానికే మూడు నెలల సమయం పట్టింది. అయినా ఇంత తక్కువ సమయంలోనే 60వేలకు పైగా ఉద్యోగాలు ఇవ్వడం అంటే మాటలు కాదు. అసాధ్యాన్ని సైతం సుసాధ్యం చేసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వల్లనే ఇన్ని ఉద్యోగాలు ఇంత తక్కువ సమయంలో ఇచ్చేందుకు దోహడపడిరది. అందువల్ల తెలంగాణలో యువత, నిరుద్యోగులు అంతా కాంగ్రెస్‌ మీద అనేక ఆశలు పెట్టుకున్నారు. ఉద్యోగాలు ఇస్తారని ఎదురుచూస్తున్నారు. ఇంకా కొన్ని వేలకుపైగా ఉద్యోగాల నోటిఫికేషన్లు కూడా వేయడం జరిగింది. ఇలా ఏటా జాబ్‌ క్యాలెండర్‌ ప్రకారం యువతకు పెద్దఎత్తున ఉద్యోగాల కల్పన చేస్తూ నిరుద్యోగ సమస్యను లేకుండా చేయడమే కాంగ్రెస్‌ పార్టీ లక్ష్యం. అందువల్ల ఈ ఎన్నికల్లో తన గెలుపు పెద్ద కష్టం కాదు. పైగా నా ప్రత్యర్ధులెవరూ నాకు సమీపంలో కూడా వుండే అవకాశం లేదు. బిజేపి పార్టీకి తెలంగాణలో చోటు లేదు. బిజేపి కేంద్ర నాయకత్వానికి తెలంగాణ మీద ప్రేమే లేదు. ఈ పదేళ్ల కాలంలో తెలంగాణకు బిజేపి చేసిందేమీ లేదు. ప్రత్యేకంగా ఒరగబెట్టిందేమీ లేదు. కనీసం బడ్జెట్‌లలో తెలంగాణ పదానికి కూడా చోటు వుండడం లేదంటే తెలంగాణ ప్రజలు బిజేపిని ఎందుకు నమ్మాలి? తెలంగాణ నుంచి గత పార్లమెంటు ఎన్నికల్లో 8 మంది ఎంపిలను గెలిపిస్తే, అందరూ కలిసి 8 రూపాయలు కూడా తీసుకురాలేదు. అలాంటి పార్టీని తెలంగాణ పట్టభద్రులు నమ్మడం అనేది కల. 2014 ఎన్నికల్లో బిజేపి గెలిస్తే ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పింది. అంటే ఈ పదేళ్ల కాలంలో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. కాని కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీని ఏనాడో మర్చిపోయింది. రైటైర్‌ అయిన ఉద్యోగాలను కూడా నింపలేకపోతోంది. దేశంలో నిరుద్యోగ సమస్యను పెంచింది. పదేళ్ల క్రితం వున్న నిరుద్యోగ సమస్యకు ఇప్పటికీ పొంతన లేదు. బిజేపి పాలిత రాష్ట్రాలలో నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోతోంది. ఆ మధ్య ఉత్తర ప్రదేశ్‌లో రెండు ఉద్యోగాలకు 2లక్షల మంది ధరఖాస్తులు చేసుకున్నారన్న వార్త విన్నాం. అది కూడా ప్యూన్‌ పోస్టు అని అందరం ముక్కున వేలేసుకున్నాం. అంటే దేశంలో బిజేపి పాలిత రాష్ట్రాలలో నిరుద్యోగ సమస్య ఎలా వుందో అర్ధం చేసుకోవచ్చు. ఇక కనీసం ప్రైవేటు రంగంలోనైనా ఉద్యోగ కల్పన చేపట్టారా? అదీ లేదు. దేశంలో బిజేపి పార్టీ ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల మూలంగా పెట్టుబడులు పెట్టేందుకు కూడా ఎవరూ ముందుకు రావడంలేదు. జిఎస్టీని తెచ్చిన పారిశ్రామిక రంగాన్ని మొత్తం దివాళా తీయించారు. చిన్న చిన్న వ్యాపారులను నిలువునా ముంచారు. ప్రజల మీద పన్నుల భారం వేసి ప్రజలను హడలగొడుతున్నారు. కష్టపడి రోజూ కూలీ సంపాదించుకునే సామాన్యుడు బతకలేని పరిస్దితులు తెచ్చిపెడుతున్నారు. అయినా బారత్‌ వెలిపోతోందని, వికసిత్‌ భారత్‌ అంటూ ప్రజలను మతం మత్తులో మభ్యపెడుతూ రాజకీయం చేయడం తప్ప బిజేపి ప్రజలకు చేస్తున్నదేమీ లేదు. యువత భవష్యత్తుకుబాటలు వేస్తున్నదేమీ లేదు. అందుకే తెలంగాణలో బిజేపికి చోటు లేదు. ఇతర పార్టీలకు అసలే చోటు లేదు. ఇక వ్యక్తిగతంగా నా విషయానికి వస్తే నాకు సమాజం తెలుసు. సామాజిక సమస్యలు తెలుసు. ప్రజల జీవన విధానం తెలుసు. పల్లె జీవితాలు ఎలా వుంటాయో తెలుసు. పల్లెలో జీవనోపాధి ఎంతవరకు వుంటుందోతెలుసు. నిజానికి ఉపాధి, ఉద్యోగాల కోసం ఎక్కువగా ఎదరుచూసేది గ్రామీణ విద్యావంతులే. వారికి గ్రామంలో సరైన ఉపాది వుండదు. ఎలాగైనా మంచి ప్రభుత్వ ఉద్యోగమో..లేక అంతకు సమానమైన ప్రైవేటు ఉద్యోగమైనా పొందాలని ఎంతో కష్టపడుతుంటారు. వారికి భరోసా ఇచ్చేవారు వుండరు. వారి ఆశలను గత ప్రభుత్వం నెరవేర్చింది లేదు. దాంతో పల్లె యువతలో నిరుద్యోగం పెరిగిపోయింది. వారికి ఒక దారి చూపాల్సిన అవసరం వుంది. పల్లె యువతకు ఉపాధి అవకాశాలను ఏర్పాటు చేయడంలో స్వయం ఉపాధి రంగాలలో వారిని ప్రోత్సహించాలి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం వేచి చూసే వారికి ఉద్యోగాలు వేసేలా ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు సంప్రదించే ప్రయత్నం నిరంతరం చేయాలి. ఇక ప్రైవేటు రంగంలో కూడా అనేక అవకాశాలు వస్తుంటాయి. అందులో ప్రతి పరిశ్రమలోనూ తెలంగాణ వారికి ప్రత్యేక అవకాశాలు కల్పించేలా చూడాల్సి వుంటుంది. ఇవన్నీ వాటిపై అవగాహన వున్న నాలాంటి వారికి మాత్రమే సాద్యమౌతుంది. నా విద్యా సంస్దల్లో కూడా ఎంతో మందికి ఉపాది అవకాశాలు కల్పిస్తున్నాను. భవిష్యత్తులో కూడా ఎంతో మందికి ఉపాధి కల్పించేందుకు వీలు కూడా వుంది. విద్యారంగం, వ్యవస్ద మీద కూడా పూర్తి అవగాహన వుంది. పరిజ్ఞానం వుంది. ప్రపంచ విద్యా విధానంలో వుస్తున్న మార్పులను ఎప్పటికిప్పుడు అద్యయనం చేయడం, అవగాహన చేసుకోవడం, మన విద్యా విధానంలో మార్పులకు శ్రీకారం చుట్టడం వంటివి చేయాలంటే నా లాంటి విద్యావేత్తకు కొంత వెసులుబాటు వుంటుంది. మిగతా వారికి ఈ అవకాశం వుండదు. ఎందుకంటే విద్యా సంస్ధల అదినేతగా వున్నందున దేశంలోని విద్యా విదానం, విదేశాలలో విద్యా విధానాలపై ఎప్పటికప్పుడు సమాచారం వుంటుంది. మన విద్యార్ధులకు ప్రపంచ పరిజ్ఞానం అందించే విద్య అందించేందుకు ఎలా ముందుకు సాగాలన్నదానిపై ప్రభుత్వానికి నివేదికలు, సూచలునలు ఇచ్చేందుకు వీలుంటుంది. ఇలా ఏ రకంగా చూసినా ఈ ఎమ్మెల్సీ ఎంపికకు తాను మాత్రమే అర్హుడనని చెప్పగలను. విద్యావంతులైన నిరుద్యోగులు రేపటి వారి భవిష్యత్తు కోసమే కాకుండా, వచ్చే తరాలకు సంబంధించిన మేలు కూడా కోరుకోవాల్సిన అవసరం వుంది. అందువల్ల పట్టభద్రులంతా తనను గెలిపించి, రేపటి తెలంగాణ భవితకు నా తోడ్పాటును అందించేందుకు వీలు కలగాలంటే, నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను.

మైలేజీ మాయం..డ్యామేజీ ఖాయం.!

 

`పడిపోయిన పవన్‌ ర్యాంకు!

`ఆర్భాటమెక్కువ..ఆచరణ తక్కువ!

`ఆవేశమెక్కువ..ఆలోచన తక్కువ

`పవన్‌తో మేలు కన్నా, నష్టమే ఎక్కువ?

`కొంత మంది మంత్రుల కన్నా తగ్గిన పని పవన్‌ పనితనం

`రాజకీయం వేరు..పరిపాలన వేరు

`రోజూ రాజకీయాలే చేస్తామంటే జనం ఒప్పుకోరు

`పవన్‌ దూకుడులో ఇప్పటికీ నోటి దురుసు

`రాజ్యాంగ బద్దమైన పదవిలో వుంటూ అడ్డగోలు వ్యాఖ్యలు

`ప్రభుత్వానికి మైలేజ్‌ తేకపోగా డ్యామేజ్‌ అవుతోంది

`పదే పదే డబ్బులు లేవంటూ పవన్‌ మాటలు ప్రభుత్వానికి ఇబ్బందికరం

`సాటి మంత్రులు ఇరుకున పడేలా పవన్‌ వ్యాఖ్యలు

`మొదటి సారి ర్యాంకుతో రెచ్చిపోయిన పవన్‌

`పదో ర్యాంకుతో అంతా సైలెన్స్‌

`దూకుడు ఎన్నికలలో మేలు చేసింది

`ఎల్లకాలం పని చేయదని పవన్‌కు తెలిస్తేనే మంచిది

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

 ఆంధ్ర ప్రదేశ్‌ రాజకీయాల్లో ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌పాత్రపై రకరకాల సందేహాలు, అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఇటీవల కాలంలో పవన్‌ తన పంథాను మార్చుకొని తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారన్న సంగతి స్పష్టంగా కనిపిస్తోందంటున్నారు. ఎందుకంటే పవన్‌ కళ్యాణ్‌ రాజకీయాన్ని ఆది నుంచి గమనిస్తే, మొదట్లో ఆయన చెప్పిన మాటలకు, ఇప్పుడు ఆయన మాట్లాడుతున్న మాటలకు ఎక్కడా పొంతనవుండదు. ఎప్పటికప్పుడు తన మార్గం మార్చుకోవడంలో పవన్‌ కళ్యాన్‌ను మించిన నాయకుడు లేడని చెప్పొచ్చు. పవన్‌ కళ్యాన్‌ రాజకీయం మొదలు పెట్టినప్పుడు చెగువేరా సిద్దాంతం అన్నాడు. తిరుగుబాటు విధానంతో ముందుకు సాగాడు. తన అభిమానులంతా చెగువేరా టీషర్టులు వేసుకునేదాకా వచ్చింది. మోటార్‌ సైకిళ్లు,కార్లమీద చెగువేరా బొమ్మతోపాటు పవన్‌ ఫోటోలు పెట్టుకున్నారు. ఇదే సమయంలో తనలో కమ్యూనిజం బావాలున్నాయన్నారు. గద్దర్‌ పాటలంటే తాను చెవికోసుకుంటానన్నారు. గద్దర్‌ లాంటి వారి బావజాలంతో తాను చైతన్యం పొందానన్నారు. పవన్‌ కల్యాణ్‌ తండ్రి ఓసారి నెల్లూరు గద్దర్‌ వచ్చినప్పుడు వెళ్లి ఆయన పాటలు వినమని చెప్పారని కూడా చెప్పుకున్నారు. అలా సాగినంత కాలం పవన్‌ కళ్యాన్‌ రాజకీయం ముందుకు సాగలేదు. దాంతో ఆయన తన రాజకీయ పంధాను మార్చుకున్నారు. ఒక్కసారిగా బిజేపికి దగ్గరయ్యారు. 2014 ఎన్నికల్లో బిజేపితో పొత్తు పెట్టుకున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీ, బిజేపి, జనసేన మూడు పార్టీలు కలిసి విజయంసాదించాయి. కాని ఆ ఎన్నికల్లో జనసేన పోటీ చేయలేదు. కాని కూటమికి మద్దతు పలికి ఆనాడు తెలుగుదేశం పార్టీ విజయానికి దోహదరపడ్డారు. కాకపోతే అతి కొద్ది రోజుల్లోనే ఆయన తన మద్దతుతోనే తెలుగుదేశం గెలిచిందని అంటూ వచ్చారు. కొద్దికాలానికి బిజేపితో కూడా తెగదెంపులు చేసుకున్నారు. రాష్ట్ర భవిష్యత్తును బిజేపి నాశనం చేసిందంటూ విమర్శలు చేశారు. ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి, ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి మోసం చేశారని ఎలుగెత్తారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక సభలు నిర్వహించారు. తనపార్టీ బలోపేతం కోసం ప్రయత్నం చేసుకున్నారు. కాని అటు సినిమాలు, ఇటు పార్టీ రెండిరటినీ ఏక కాలంలో మేనేజ్‌ చేయలేకపోయారు. పార్టీని పటిష్టం చేయలేకపోయారు. కాని పవన్‌ ఎక్కడికి వెళ్లినా జనం తండోపతండాలుగా వచ్చారు. దాంతో 2019 ఎన్నికల్లో పవన్‌ ఒంటరిగా పోటీ చేశారు. స్వయంగా ఆయన రెండు చోట్ల పోటీ చేశారు. కాని ఆయన గెలవలేదు. పార్టీ మాత్రం ఒక్కటే సీటు గెలిచింది. దాంతో పవన్‌కు జ్ఞానోదయమైంది. ఇప్పుడున్న రాజకీయ పరిస్దితులకు తిరుగుబాటు సిద్దాంతం కరక్టు కాదని తెలుసుకున్నాడు. దేశ వ్యాప్తంగా బిజేపికి పెరుగుతున్న ఆదరణ చూసి తన పంథాను అటు వైపు మల్చుకున్నారు. సనాతన ధర్మంలో గొప్ప దనం గుర్తించారు. అటు వైపు అడుగులేశారు. వైసిపిని బిజేపికి దూరం చేయగలిగారు. తర్వాత కొంత కాలానికి తెలుగుదేశాన్ని బిజేపితో కలిపి, మళ్లీ తన రాజకీయం మొదలు పెట్టారు. తన ప్రాదాన్యత పెంచుకుంటూ వచ్చారు. జనంలో ఆకాంక్షల కన్నా, రాజకీయంలో సరికొత్త ఆలోచనలకు పదునుపెట్టారు. ఎన్నికల్లో గెలవడమే రాజకీయం అనుకున్నారు. సిద్దాంతాలను నమ్ముకుంటే సీట్లు రావని తెలుసుకొని పొత్తుతో పోతే తప్ప జనసేన గెలవలేదని గ్రహించి తెలుగుదేశం పార్టీకి గొడుగు పట్టుకున్నారు. మళ్లీ 2014 నాటి రోజులను ఆవిష్కరించారు. కాకపోతే ఆయన ఎంచుకున్న దారిని మార్చుకున్నారే గాని, తనలోని ఆశలకు రెక్కలు తొగడం మాత్రం వాయిదా వేసుకోలేదు. వేసుకునేందుకు సిద్దంగా లేరు. నిజం చెప్పాలంటే లక్ష్యం లేకుండా ఏ నాయకుడు రాజకీయాలు చేయలేడు. అధికారం సాధించాలన్న కోరిక లేకుండా ఏ నాయకుడు రాజకీయ పార్టీని నడపలేడు. ఇప్పుడు పవన్‌ చేస్తున్నది అదే. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తన రాజకీయాన్ని విస్తరించాలనుకుంటున్నాడు. ఎందుకంటే ఇక వేళ తాను ఆదమరిచి వున్న సమయంలో ఎక్కడ లోకేష్‌ను ముఖ్యమంత్రిని చేస్తారో అన్న భయం పవన్‌లో పట్టుకున్నది. తన స్దానంలో మార్పు వస్తుందేమో అన్న ఆలోచన మొదలైంది. చంద్రబాబు నాయకత్వంలో ఇంకా పదిహేనేళ్లయినా పనిచేస్తానని అన్నారు. అంటే చంద్రబాబు నాయకుడుగా వుండే పాలనలోనే తాను వుంటానని స్పష్టం చేసినట్లైంది. కాని లోకేష్‌ నాయకత్వం, తనపై పెత్తనాన్ని అంగీకరించని పవన్‌ సూటిగానే చెప్పినట్లైంది. అసలు పవన్‌ అసలైన స్వరూపం అదే. అందులో తప్పులేదు. పొత్తు దర్మం కుదుర్చుకున్నది చంద్రబాబు కోసమే కాని, లోకేష్‌ కోసం కాదు. అందువల్ల పవన్‌ ఆలోచన తప్పు కాదు. ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తప్పు పట్టాల్సిన పనిలేదు. కాని లోకేష్‌కు ప్రమోషన్‌ను అడ్డుకునే హక్కు పవన్‌కులేదు. లోకేష్‌ పార్టీ వేరు. పవన్‌ పార్టీ వేరు. తెలుగుదేశం పార్టీకి ఏపిలో సంపూర్ణమైన మెజార్టీ వుంది. పవన్‌కు ప్రతిపక్ష హోదాకు అవరమైన సీట్లు మాత్రమే వున్నాయి. అంతకు మించి సీట్లు లేవు. అయినా ఆయన కూటమి అధికారంలోకి వచ్చినప్పుడే తన మనసులోని మాట చెప్పేశారు. జనసేన చూపించిన దారిలో కూటమి ప్రయాణం సాగని పక్షంలో ప్రతిపక్ష పాత్ర కూడా మనమే పోషిస్తామని ముందే చెప్పేశారు. దాన్ని గత కొంత కాలంగా అనుసరిస్తూనే వస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తొలి రోజుల్లోనే తిరుమల తిరుపతిలో లడ్డూ వివాదాన్ని పూర్తిగా తన భుజాల మీద మోసి, క్రెడిట్‌ కొట్టేయాలనుకున్నాడు. నానా యాగీచేశారు. తిరుమలలో అపవిత్రం జరిగిపోయిందని గత ప్రభుత్వం చేసిన నిర్వాకం మూలంగా సనాతన దర్మానికి విఘాతం కల్గిందని అగ్రహోదగ్రుడయ్యాడు. కాని అదే సమయంలో చంద్రాబాబుగాని, లోకేష్‌ గాని తమ పని తాను చేసుకుంటూపోయారు. ఎందుకుంటే అది అటు తిరిగి, ఇటు తిరిగి ఎటు వెళ్తుందో చెప్పలేమని ముందే చంద్రబాబు అంచనా వేశారు. కాని పవన్‌ కళ్యాణ్‌ అంత దూరం ఆలోచించలేదు. ఎందుకంటే సహజంగా ఆయనకు ఆవేశం ఎక్కువ. ఆలోచన తక్కువ. క్రెడిట్‌ అంతా తన ఖాతాలో వేసుకుందామనుకుంటే కుదరలేదు. సుప్రింకోర్టు ప్రశ్నలకు ప్రభుత్వం వద్ద సమాదానం లేకపోవడంతో, భక్తుల మనోభావాలు దెబ్బతీయొద్దని చెప్పడంతో పవన్‌ దూకుడుకు కళ్లెం వేసినట్లైంది. తర్వాత రాష్ట్రంలో కూటమి పాలన సాగుతున్నా వైసిపీ నాయకుల ఆగడాలు ఆగడం లేదంటూ హోంశాఖ మంత్రి పనితీరును ప్రశ్నించారు. తాను హోం మంత్రిని అయి వుంటే పరిస్ధితి మరో రకంగా వుండేదంటూ కొత్త బాష్యాలు చెప్పారు. అయినా తెలుగుదేశం పార్టీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సర్ధుకుపోయారు. కొత్తలో ఇలాగే వుంటుంది లే అనుకున్నారు. ఇక కాకినాడ పోర్టు విషయంలో షిప్‌ద సీజ్‌ అన్నది కొంత కాలం బాగా ట్రెండిరగ్‌ అయ్యింది. ఎందుకంటే మన దేశం నుంచి ఇతర దేశాలకు బియ్యం రవాణ వాణిజ్యం అనేది సర్వసాదారణం. అందుకు కేంద్ర ప్రభుత్వ అనుమతులు కూడా వుంటాయి. అయితే ఆ షిప్‌లలో డ్రగ్స్‌ సరఫరా అవుతున్నాయేమో అని అనుమానం వ్యక్తం చేశారు. దాంతో విచారణ కూడా జరిపించారు. సముద్ర వ్యాపారమంతా కేంద్ర ప్రభుత్వం చేతిలో వుంటుంది. అవసరమైతే డిల్లీకి వెళ్లి నేను మాట్లాడతా? అన్నారు. వెళ్లారు. అసలు విషయం తెలుసుకొని సైలెంట్‌ అయ్యారు. తన మంత్రిత్వ శాఖలో పనులు వదిలేసి, ఇతర మంతిత్వ శాఖలలో వేలు పెట్టుడం మొదలు పెట్టారు. తన శాఖ ఫైళ్ల క్రియరెన్స్‌ పక్కనపెట్టారు. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన ర్యాంకుల్లో పదో ర్యాంకుతో సరిపెట్టుకున్నారు. మొదటిసారి ర్యాంకు మొదటిర్యాంకును సాధించిన పవన్‌ ఇప్పుడు పదో ర్యాంకు తెచ్చుకున్నారు. దీనంతటికీ ఈ మధ్య ఆయన పరిపాలన మీద దృష్టి పెట్టకుండా రాజకీయాల మీద కేంద్రీకృతం చేస్తున్నారనేది అందరికీ తెలిసిందే. ఎప్పుడైతే లోకేష్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని తెలుగుదేశం శ్రేణుల నుంచి డిమాండ్‌ మొదలైందో అప్పటి నుంచే పవన్‌ తన పంధాకు మరింత పదును పెట్టారు. తనకు తానుగానే ప్రత్యేకతను సంతరించుకునేలారాజకీయం చేయాలనుకున్నాడు. లోకేష్‌ మూలంగా కాలం కలిసొసొచ్చేలా వుందని అనుకుంటున్నాడు. లోకేష్‌కు ప్రమోషన్‌ ఇవ్వడాన్ని సాకుగా చూపి పక్కకు తప్పుకోవాలన్నదే పవన్‌ ఆలోచన. అదే సమయంలో ప్రభుత్వం మీద విమర్శలు చేసి, లక్కి బాస్కర్‌ సినిమాలో బాస్కర్‌ తప్పుకొని సానుభూతిని పొందినట్లు పొందాలని చూస్తున్నారు. ఇదే పవన్‌ నయా రాజకీయం. ఎప్పుడైనా ఆయన వేరు కుంపటి ఖాయం. అందువల్ల ముందే తెలుగుదేశం తేరుకోవడం అవసరం.

అంకెల గారడీలు తప్ప తెలుగు రాష్ట్రాలకు తప్పని వివక్ష

రైల్వే బడ్జెట్‌లో కొత్తగా తెలుగు రాష్ట్రాలకు కేటాయింపులు లేవు

కొన్నేళ్లుగా సాగుతున్న ప్రాజెక్టులకే కేటాయింపులు

నూటికి నూరుశాతం విద్యుద్దీకరణ సాధించిన ద.మ.రైల్వే

హైదరాబాద్‌ మెట్రోరైల్‌ విస్తరణకు మొండి చేయి

అవసరాలకు అనుగుణంగా లేని కేటాయింపులు

హైదరాబాద్‌,నేటిధాత్రి:

ఈసారి రైల్వే బడ్జెట్‌లో దక్షిణమధ్య రైల్వేకి (రెండు తెలుగు రాష్ట్రాలు) రూ.14,754కోట్లు కేటా యింపులు జరిగాయి. వీటిలో రూ.9417కోట్లు ఆంధ్రకు, రూ.5337కోట్లు తెలంగాణకు కేటా యించారు. రైల్వేమంత్రి అశ్వనీ వైష్ణవ్‌ తెలిపిన సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే ప్రాజెక్టులకు పెట్టుబడులు రూ.84,559కోట్లకు చేరుకోగా అదే తెలంగాణలో రూ.41677 కోట్లతో రైల్వే ప్రాజెక్టులు కొనసాగుతున్నాయని తెలపడం గమనార్హం. దక్షిణమధ్య రైల్వే పరిధి ఆంధ్ర, తె లంగాణ రాష్ట్రాల్లో విస్తరించింది. ఇప్పటివరకు నూటికి నూరుశాతం విద్యుద్దీకరణ పూర్తికావడమే కాదు, కవచ్‌ అమలు చేయడంలో దేశంలోనే మిగిలిన రైల్వేలతో పోలిస్తే లీడర్‌గా కొనసాగు తోంది. ప్రస్తుతం తెలంగాణలో ఐదు వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌లు నడుస్తున్నాయి. ఇవి ఏడు జిల్లా లను అనుసంధానిస్తూ 9 స్టాపేజ్‌లు కలిగివున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌కు కేటాయింపులు

ఈసారి రైల్వే బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు ఏకంగా రూ.9417కోట్లు కేటాయించినట్టు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ విలేకర్లకు చెప్పడం ఒకింత ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే ఇందులో అంకెల గారడీ తప్ప కొత్తగా రాష్ట్రానికి ఇచ్చిన ప్రాజెక్టులు లేదా రైల్వే లైన్లు లేవని, గతంలో కొనసాగుతున్న వాటి ఖర్చును కలిపి ఇంతమొత్తం కేటాయించామని చెప్పినట్టు బాగా పరిశీలిస్తే అర్థమవుతుంది. తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెప్పుకున్న నంబూరు`ఎర్రుపా లెం రైల్వేలైన్‌ నిర్మాణానికి రూ.2245కోట్ల ఖర్చుతో కేంద్రం ఆమోదం తెలిపిందని ఎంతగానో ప్రచారం చేసుకున్న సంగతి తెలిసిందే. విచిత్రంగా ఈ బడ్జెట్‌లో దీనికి కేటాయింపుల ఊసే లేదు. అంటే కేంద్రం ఈ రైల్వేలైన్‌ పట్ల సానుకూలంగా లేదన్న సత్యం అవగతమవుతుంది. వచ్చే నాలుగేళ్ల కాలంలో ఈప్రాజెక్టు పూర్తవుతుందని ఏపీలోని కూటమి ప్రభుత్వం ఊదరకొడుతోంది.మరి కేటాయింపుల దగ్గరికి వచ్చేసరికి ఈ ప్రాజెక్టు ఎప్పుడు పట్టాలెక్కేదీ స్పష్టం కావడంలేదు. నిజం చెప్పాలంటే దీర్ఘకాలంగా పెండిరగ్‌లో ఉన్న ప్రాజెక్టులకే నిధులు కేటాయించలేదు..ఇక కొత్త ప్రాజెక్టులకు దిక్కెక్కడ అనేది స్పష్టమవుతోంది.

విజయవాడాఖరగ్‌పూర్‌, విజయవాడానాగ్‌పూర్‌ ఫ్రైట్‌ డెడికేటెడ్‌ కారిడార్లు, తిరుపతి కేంద్రంగాబాలాజీ డివిజన్‌ ఏర్పాటు, విజయవాడాగూడూరు నాలుగోలైన్‌, కడపాబెంగళూరు రైల్వేలైన్‌ అలైన్‌మెంట్ల గతేంటో ఎవరికీ అర్థం కాని పరిస్థితి! ఇక విజయవాడ, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి రైల్వేస్టేషన్లను రూ.1132.43కోట్లతో ఆధునికీకరిస్తున్నట్టు చెప్పారు. నిజమే ఇవి నేటి బడ్జె ట్‌కు సంబంధించినవి కావు. రెండేళ్ల క్రింతం నుంచే వీటి ఆధునికీకరణ పనులు కొనసాగుతు న్నాయన్న సత్యం గుర్తించాలి. రాష్ట్రంలో 1700 కిలోమీటర్ల పరిధిలో కవచ్‌ ప్రాజెక్టులు చేపడతామని, ఇప్పటికే 130 కిలోమీటర్ల పరిధిలో కవచ్‌ పూర్తిచేసినట్టు చెప్పారు. ఈ ప్రాజెక్టు కూడా గతకాలం నుంచి అమలు చేస్తున్నదే. ప్రస్తుతం రూ.85వేల కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులను కొనసాగిస్తున్నందువల్ల ఆంధ్రప్రదేశ్‌కు ఇక కొత్త ప్రాజెక్టులేవీ ఇవ్వడంలేదన్న సత్యాన్ని ఆయన స్పష్టంగా చెప్పారు. ఈ నేపథ్యంలో కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి కేటాయించిన రూ.9417కోట్లు 2024ా25 రైల్వే బడ్జెట్‌లో కేటాయించిన రూ.9138 కోట్లతో పోలిస్తే కేవలం రూ.279 కోట్లు అదనం అంతే! నిజానికి ఈ మొత్తం ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న రైల్వే ప్రాజెక్టులను ఈ ఏడాది కొనసాగించేందుకు సరిపోతాయి అంతే!

కాకినాడాపిఠాపురం, మాచర్లానల్గండ, కంభరాప్రొద్దుటూరు, గూడూరుాదుగ్గరాజపట్నం, కొండపల్లిాకొత్తగూడెం, భద్రాచలరాకొవ్వూరు, జగ్గయ్యపేటామేళ్లచెర్వు లైన్లకు కేటాయింపులు ఎక్కడ? కడపాబెంగళూరు (255కి.మి.) రైల్వేలైన్‌ విషయంలో కూడా కేంద్రం ముఖం చాటేసింది. కోటిపల్లిానర్సాపురం, నడికుడిాశ్రీకాళహస్తి, డోన్‌ాఅంకోలా రైల్వేలైన్ల ఊసేలేదు. ఇక రైల్వే మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో 73 రైల్వే స్టేషన్లను అమృత్‌భారత్‌ స్టేషన్లుగా అభివృద్ధి చేస్తున్నా మని చెప్పారు. నిజమే కాని ఇవి కూడా గత రెండేళ్లుగా కొనసాగుతున్నవే. ఏతావాతా చెప్పాలం టే ఈఏడాది రైల్వేబడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం మొండిచెయ్యి చూపిందనే చెప్పాలి.

తెలంగాణ పరిస్థితి అంతే…

గత ఏడాది రైల్వే బడ్జెట్‌తో పోలిస్తే తెలంగాణకు కేవలం ఒక్క కోటి రూపాయలు అదనంగా కే టాయింపు జరిగింది. అంటే గత ఏడాది రూ.5336 కోట్లు కేటాయిస్తే, ఈసారి రూ.5337కోట్లు కేటయించి చేతులు దులుపుకుంది. ఆంధ్రప్రదేశ్‌కే గుడ్డిలో మెల్ల అన్నట్లు గత ఏడాదితో పోలిస్తే రూ.279కోట్లు అదనంగా కేటాయిస్తే, తెలంగాణకు ఘోరంగా రూ.కోటి మాత్రమే అదనంగా కేటాయించింది. రాష్ట్రంలో నూటికి నూరుశాతం విద్యుదీకరణ పూర్తయిందని చెబుతూనే గత కొన్నే ళ్లుగా తెలంగాణకు కేటాయింపులు స్థిరంగా పెరుగుతున్న సంగతి గుర్తుచేశారు. కానీ పెరుగు తున్న జనాభా అవసరాలకు ఈ కేటాయింపులకు ఎంతమాత్రం పొంత వుండటంలేదు. మంత్రి చెప్పిన ప్రకారం తెలంగాణలో మౌలిక సదుపాయాల విస్తరణకు ఇప్పటివరకు రూ.41677 కో ట్లు కేంద్రం ఖర్చు చేసింది. ఈ మొత్తాలు గత కొన్నేళ్లుగా చేపడుతున్న ప్రాజెక్టులకు సంబంధించినవి తప్ప కొత్తవి కాదన్న సంగతి గుర్తుంచుకోవాలి. ప్రస్తుతం తెలంగాణలో 627 కిలోమీటర్ల మేర కవచ్‌ అమలు జరుగుతుండగా మరో 1100 కిలోమీటర్లకు టెండర్లను ఆహ్వానించగా, ఇంకా 1326 కిలోమీటర్లకు కవచ్‌ మంజూరైంది. తెలంగాణలో 2529 కిలోమీటర్ల మేర, 22 ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయి. వీటికి అయ్యే ఖర్చు రూ.39,300 కోట్లు. తెలంగాణలో 40 రైల్వే స్టేషన్ల అభివృద్ధి రూ.1992కోట్లతో కొనసాగుతోంది. 7వేల కిలోమీటర్ల రైల్వే ట్రాక్‌ను ఆధునికీకరించారు. ఇవన్నీ గత కొన్నేళ్లుగా కొనసాగుతున్న ప్రాజెక్టులే. కానీ రాష్ట్రానికి ఈ బడ్జెట్‌ లో కొత్త ప్రాజెక్టులకు ఆమోదం లభించిందేమీ లేదు. బడ్జెట్‌ కేటాయింపులు కూడా ఆయా ప్రాజెక్టులకు అయ్యే ఖర్చులో భాగంగానే ఈ మంజూరయ్యాయి.

పుణ్యక్షేత్రాలకు అనుసంధానత ఏదీ?

భద్రాచలం, మేడారం, రామప్ప వంటి పుణ్యక్షేత్రాలున్న జిల్లాలకు, వనపర్తి, సూర్యాపేట, నాగర్‌ కర్నూల్‌, కొడంగల్‌, పరిగి, నారాయణపేట, అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్‌ వంటి వెనుకబడిన ప్రాంతాలకు, నిర్మల్‌, ఇచ్చోడ వంటి అటవీ ప్రాంతాలకు ఇంతవరకు రైలు అనుసంధానతే లేదు. రాష్ట్రంలో లక్షకు పైగా జనాభా వున్న పట్టణాలను రైల్వేలతో అనుసంధానిస్తానని కేంద్రం గతంలో చేసిన ప్రకటన ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటయ్యాక కేంద్రం మంజూరు చేసిన ఫైనల్‌ లకేషన్‌ సర్వే (ఎఫ్‌ఎల్‌ఎస్‌) ప్రాజెక్టుల సంఖ్య గత పదేళ్లలో చాలా పెరిగింది. నిధుల కేటాయింపులు పెరుగుతున్నా పెరుగుతున్న అవసరాలకు వీటికి అసలు పొంతనే వుండటంలేదు.

2010లో వికారాబాద్‌ాకృష్ణా (నారాయణపేట జిల్లా) 121 కిలోమీటర్ల మేర రైల్వే ప్రాజెక్టుకు స ర్వే మంజూరైంది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.787కోట్లు ఖర్చవుతుందని అంచనా. 2012మార్చిలో రైల్వే బోర్డుకు నివేదిక ఇచ్చారు.2023 సెప్టెంబర్‌ 23న సర్వే మంజూరైంది. ఇప్పుడు ప్రాజెక్టు ప్రాథమిక అంచనా రూ.2196కోట్లకు చేరుకుంది. ఇది పూర్తయితే దక్షిణ తెలంగాణ లోని కొత్త ప్రాంతాలకు రైలు అందుబాటులోకి వస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్‌కు ప్రయాణ సదుపాయం, తాండూరు సిమెంట్‌ పరిశ్రమకు సరఫరాలు సులభతరం కాగలవు. అంతేకాదు వికారాబాద్‌ నుంచి హుబ్లి, కొల్హాపూర్‌, గోవాలకు దూరం తగ్గుతుంది. మంజూరై ఇంతకాలమైనా ఇంకా సర్వేకు అతీగతీ లేదు. శంషాబాద్‌ావిజయవాడ సెమీ హైస్పీడ్‌ కారిడార్‌కు రైల్వేబోర్డు ఆమోదం తెలిపింది. ఇది పూర్తయితే రైళ్లు గరిష్టగా రూ.220కి.మీ వేగంతో ప్రయాణించగలవు. దీని సర్వే కొనసాగుతోంది. కరీంనగర్‌ాహసన్‌పర్తి రైల్వేలైన్‌ (62కి.మీ) కొత్త రైల్వే మార్గం కోసం 2011లో మంజూరైతే 2013లో రైల్వే బోర్డుకు చేరింది. అప్పటి అంచనా వ్యయం రూ.464 కోట్లు. మరి ఇప్పుడు రూ.1116 కోట్లకు పెరిగింది. ఇదెప్పుటకి పూర్తయ్యేనో తెలియదు. రీజనల్‌ రింగ్‌ రోడ్డుకు అనుబంధంగా రీజినల్‌ రింగ్‌ లైన్‌ను కేంద్రం ప్రకటించింది. దీని సర్వే కోసం రూ.14కోట్లు కేటాయింపు కూడా జరిగింది. ఇది ఇంకా మొదలు కాలేదు. 564 కిలోమీటర్ల ఈ ప్రాజెక్టు ంచనా వ్యయం రూ.12408కోట్లు!

హైద్రాబాద్‌ రెండోదశ మెట్రో ఆశలపై నీళ్లు

కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో హైదరాబాద్‌ రెండో దశ మెట్రో ఊసే లేకపోవడంతో తెలంగాణ వాసులు తీవ్ర నిరాశకు గురయ్యారు. గత బడ్జెట్‌లో చెన్నై మెట్రో విస్తరణకు నిధులు కేటాయించారు. ఈసారి హైదరాబాద్‌ మెట్రో విస్తరణకు నిధులు,అనుమతులు వస్తాయనుకున్న వారి ఆశ లపై నీళ్లు చల్లుతూ ఎటువంటి కేటాయింపులూ జరపలేదు. రాష్ట్ర ప్రభుత్వం 74.6 కిలోమీటర్ల మెట్రో కేరిడార్‌తో డి.పి.ఒ. రూపొందించింది. దీని తర్వాత ఫోర్త్‌ సిటీ, నార్త్‌సిటీల ప్రాజెక్టులను కూడా రెండో దశలో బాగంగా చేర్చి 161.4 కిలోమీటర్ల మేర నిర్మించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్లు రూపకల్పన చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్‌ వెంచర్‌ కింద ఈ ప్రాజెక్టులను ప్రారంభించాల్సి వుంది. మొదటి ఐదు కారిడార్లకు రూ.24వేల కోట్లు (సుమారుగా) ఖ ర్చు కాగలదని అంచనాలు వేశారు. వీటికి కేంద్రం సావరిన్‌ గ్యారంటీతో పాటు రూ.4230కోట్లు తన వాటాగా కేటాయించాల్సి వుంది. కానీ రెండో దశ ప్రాజెక్టుకు కేంద్రం ఇప్పటివరకు ఆమోదం తెలపలేదు. గతంలో చెన్నైకి అడగకుండానే నిధులు కేటాయించిన కేంద్రం, ఇప్పుడు తెలం గాణ పట్ల తీవ్ర వివక్షను చూపుతున్నదన్న అభిప్రాయం ఏర్పడుతోంది. అయితే అధికార్లు చెప్పే ది మరోలా వుంది. మెట్రో గురించి కేంద్రం ప్రత్యేకంగా బడ్జెట్‌లో ప్రస్తావించాల్సిన అవసరం లేదంటున్నారు. ఒక్కసారి కేంద్రం ఆమోదం లభిస్తే అన్నీ ఆటోమేటిక్‌గా జరిగిపోతాయంటున్నారు. రెండోదశ కేరిడార్‌ నిధులు సమస్యే కాదని, కేవలం సావరిన్‌ గ్యారంటీ రావడమే కష్టమని చె బుతున్నారు. నిజానిజాలు బయటపడాలంటే వేచి చూడాల్సిందే!

సజావు పాలనకు ప్రధాన అడ్డంకిగా స్వార్థపూరిత ఎమ్మెల్యేలు

పార్టీల కొంప ముంచుతున్న ఫిరాయింపులు

ప్రజాస్వామ్యానికి జాడ్యంగా మారిన ఫిరాయింపులు

ప్రజల పేరు చెప్పి అడ్డగోలు రాజకీయం

ఉన్న ప్రశాంతతను ధ్వంసం చేయడంలో సిద్ధహస్తులు

నడిచేవారికి కాళ్లడ్డం పెట్టే రాజకీయం

రాష్ట్ర ప్రగతికి వీరే ప్రధాన అడ్డంకి

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం దగ్గరినుంచి ఇప్పటివరకు పార్టీ ఫిరాయింపులు యదేచ్ఛగా కొనసా గుతుండటం గమనార్హం. చేరికలు కొనసాగిన పార్టీ మరింత బలంగా, వలసలకు గురైన పార్టీ బలహీనపడటం సహజంగా జరిగే ప్రక్రియ. అయితే ఈ ఆయారాం గయారాంల సమస్య మన రాష్ట్రానికే కాదు, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో, జాతీయ రాజకీయాల్లో జరుగుతున్న తంతే! అ యితే రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన బి.ఆర్‌.ఎస్‌. ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి మారడం సర్వత్రా చర్చనీయాంశమైంది. నిజానికి కె.సి.ఆర్‌.అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వలసనలనుబాగా ప్రోత్సహించి తెలుగుదేశం ఆనవాళ్లు రాష్ట్రంలో లేకుండా చేయగలిగారు. అదేవిధంగా కాంగ్రెస్‌నుంచి కూడా తమపార్టీలోకి పెద్దసంఖ్యలో నాయకులను చేర్చుకోవడం ద్వారా ఆపార్టీని దెబ్బతీయాలనుకున్నారు కానీ, దీని ఫలితం బి.జె.పి.రూపంలో కనిపించింది. కాంగ్రెస్‌ పూర్తిగా బలహీనపడిన స్థితిలో బి.ఆర్‌.ఎస్‌.కు. ఆశ్చర్యకరంగా భారతీయ జనతాపార్టీ బలమైన ప్రత్యర్థిగా ఎదగడం చూశాం. తర్వాత అనూహ్య పరిణామల్లో రేవంత్‌ నాయకత్వంలో కాంగ్రెస్‌ పుంజుకో వడమే కాదు ఏకంగా అధికారాన్ని హస్తగతం చేసుకోవడం, బి.ఆర్‌.ఎస్‌. తీవ్రంగా నష్టపోవడం కూడా తెలంగాణ రాజకీయాల్లో ఎవరూ ఊహించని పరిణామాలు.

ఇక గతంలో కె.సి.ఆర్‌. అనుసరించిన వైఖరినే, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌ కూడా అనుసరిం చారు. ఫలితంగా బి.ఆర్‌.ఎస్‌. ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరడంతో కేవలం నలుగురు ఎమ్మెల్యేల మెజారిటీ వున్న కాంగ్రెస్‌ తన అధికారాన్ని సుస్థిరం చేసుకుంది. ఏపార్టీ అధికారంలో వున్నప్పటికీ అవకాశ వాద ఎమ్మెల్యేల కారణంగా ఆయా పార్టీల సుస్థిరతకు, సజావుపాలనకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. వీరివల్ల ప్రభుత్వాన్ని ఏర్పరచిన పార్టీ అధికారం నిలబెట్టుకోవడానికే ఎక్కువ గా దృష్టి పెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడి పాలన కుంటుపడటం సర్వసాధారణమైపోయింది. ఇదిలావుండగా ఈవిధంగా ఎమ్మెల్యేలు తమ స్వార్థం కోసం పార్టీలు మారడం ఎంతవరకు సబబు అన్నది ప్రశ్న. తాము ఎన్నికల్లో పాల్గన్నప్పుడు ఒక పార్టీ తరపున పోటీచేసి తర్వాత మరో పార్టీలోకి చేరిపోవడమంటే నియోజకవర్గ ప్రజలను మోసం చేయడమే! ఎందుకంటే ప్రజలు ఒక పార్టీపట్ల అభిమానంతో ఓట్లు వేస్తే, వారి విశ్వాసాన్ని వమ్ము చేయడం తప్ప మరోటి కాదు. ఎన్నికల్లో ప్రతి పార్టీ ప్రజలకు కొన్ని హామీలనిస్తుంది. ఏ పార్టీ హామీలు నచ్చుతాయో దానికి ప్రజలు ఓట్లేస్తారు. మరిక్కడ జరుగుతున్నదేంటి? తాము గెలిపించిన ఎమ్మెల్యే వేరే పార్టీలోకి జంప్‌ అయితే తాము వేసిన ఓట్లకు విలువెక్కడుంది? తమ అభిప్రాయాన్ని తుంగలో తొక్కినట్టే కదా అన్న భావన ప్రజల్లో తప్పక కలుగుతుంది. ఈ నేపథ్యంలోనే 52వ రాజ్యాంగ సవరణ ద్వారా పార్టీ మార్పిడుల వ్యతిరేక చట్టాన్ని 1985లో ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. రాజ్యాంగంలోని పదవ షెడ్యూలు ప్రకారం, ఒక పార్టీనుంచి రాజీనామా చేసిన, పార్టీ విప్‌కు వ్యతిరేకంగా ఓటు చేసి నా, ఇండిపెండెంట్‌గా ఎన్నికై వేరే పార్టీలో చేరినా అటువంటి ప్రజాప్రతినిధులు తమ పదవులకు అనర్హులవుతారు. ఒక పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల్లో 1/3వ వంతుమంది వేరే పార్టీలో చేరాలనుకుంటే అప్పుడు వారికి ఈ చట్టం నుంచి మినహాయింపు లభిస్తుంది.వీరి విషయంలో స్పీకర్‌దే నిర్ణయాధికారంగా షెడ్యూలు పేర్కొంది. ఈ ‘మినహాయింపు’ను అడ్డం పెట్టుకొని అధికారం లో వున్న పార్టీలు స్పీకర్‌ సహాయంతో విపక్షాలనుంచి ఫిరాయింపులను ప్రోత్సహిస్తుండటం ప్రస్తుత రాజకీయాల్లో సర్వసాధారణమైపోయింది. ఈ నేపథ్యంలోనే బి.ఆర్‌.ఎస్‌.నుంచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో ఈ చట్టం యొక్క ప్రభావశీలత చర్చనీయాంశంగా మారింది. మొత్తంమీద చెప్పాలంటే ఫిరాయింపుల చట్టంలోని లసుగులు, చర్యలు తీసుకోలేని విపక్షాలబలహీనత, కోర్టు తీర్పుల్లో విపరీత జాప్యం వెరసి ఈ ఫిరాయింపులు యదేచ్ఛగా కొనసాగడానికిదోహదం చేస్తున్నాయి.

ప్రజాప్రతినిధులు ఎవరైనా తాను ఏ ‘వేదిక’ (పార్టీని) ఆధారంగా చేసుకొని ఎన్నికల్లో పోటీచేసి గెలుస్తారో ఆ పార్టీకే కట్టుబడి వుండాలన్నది ప్రజాస్వామ్య సూత్రాల్లోని కీలక అంశం. కానీ ఈ ఫిరాయిపులు ఓటర్ల నమ్మకాన్ని, ప్రజాస్వామిక విలువలను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నాయి. ఒక పార్టీనుంచి మరో పార్టీకి అలవోకగా మారిపోయే ఎమ్మెల్యేల విషయంలో కఠినంగా వ్యవహరించేలా చట్టాలకు మరింత పదును పెట్టాలని ఇటు పౌరులు, పౌరసంఘాల నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. ముఖ్యంగా తమకు ఒక పార్టీపట్ల విశ్వాసాన్ని లేదా నమ్మకాన్ని తామెన్నుకున్న ఎమ్మెల్యేలు పూర్తిగా ధ్వంసం చేస్తున్నారన్న ఆగ్రహావేశాలు ఆయా నియోజకవర్గాల పౌరుల్లో క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. ఇది నిజంగా ప్రజల్లో పెరుగుతున్న అవగాహనకు నిదర్శనం. 

పార్టీలు మారేసమయంలో, తమన నియోజకవర్గ అభివృద్ధికోసమే పార్టీ మారుతున్నామంటూ గంభీర ప్రకటనలు ఇవ్వడం రివాజుగా మారింది. కానీ అసలు కారణం మాత్రం, వ్యక్తిగత కాంట్రా క్టులు, వ్యాపారాలను రక్షించుకోవడం, తమ దందాలను నిరాటంకంగా కొనసాగించుకోవడం. ఇదే వారి దృష్టిలో నియోజకవర్గ అభివృద్ధి! తమ వ్యక్తిగత లాభనష్టాలను బేరీజు వేసుకొని పార్టీలు మారేవారిని ప్రజలు ఎన్నుకోకూడదు. ఎందుకని అది జరగడంలేదంటే…చాలామంది తమ ఓటును అమ్ముకోవడంవల్ల! ఓటు అమ్ముకున్నవాడికి ఎమ్మెల్యేను ప్రశ్నించే అధికారం వుండదన్న కొత్త సిద్ధాంతం పుట్టుకొచ్చింది. అంటే ఓట్లకోసం ఖర్చురూపంలో పెట్టిన పెట్టుబడిని, ఎన్నికైన త ర్వాత లాభంతో సహా రాబట్టుకోవాలి. ఇది చాలామంది ఎమ్మెల్యేల వైఖరి! ఇక్కడ సిద్ధాంతం లే దా పార్టీ అనేది ముఖ్యం కాదు. తాము పెట్టిన పెట్టుబడిపై ఇబ్బడి ముబ్బడి లాభాలు ఎట్లా పొందాలనేది కీలకం. ఇంకెక్కడి ప్రజాస్వామ్య విలువ? ఆవిధంగా అది ‘పెట్టుబడి`లాభం’ అనే సి ద్ధాంతం కింద భూస్థాపితమైపోయింది. 

1967లో హర్యానాకు చెందిన గయారాం లాల్‌ అనే ఒక ఎమ్మెల్యే పదిహేను రోజుల్లో మూడు పార్టీలు మారి రికార్డు సృష్టించాడు! అప్పటినుంచి ‘ఆయారాం గయారాం’ అనే నానుడి ప్రచా రంలోకి వచ్చింది. కొన్ని రాష్ట్రాల రాజకీయాల్లో కులాలు బలమైన పాత్ర పోషిస్తున్నప్పటికీ అంతిమంగా డబ్బుదే ఆధిపత్యం. దీనిముందు తన`పర అనే భేదం వుండటంలేదు. కులం అధికారా న్ని తెచ్చిపెడితే, డబ్బుపై వ్యామోహం, స్వార్థపరత్వం, అధికారంతో వచ్చిన కిరీటానికి ‘అవినీతి`అక్రమాలు’ కలికితురాయిగా వున్నాయి! ఒకరకంగా చెప్పాలంటే ఈ పార్టీ ఫిరాయింపులు, ప్రజాస్వామ్యమనే పొట్లకాయకు పట్టిన ‘బచ్చుపురుగు’ (గొంగళిపురుగు) మాదిరిగా తయారయ్యాయి. ఇది ఒక్క తెలంగాణకే పరిమితం కాదు మిగిలిన రాష్ట్రాలు/దేశ రాజకీయాల్లో కూడా జరుగుతున్నదిదే. కొందరు ఎమ్మెల్యేలు తమ స్వార్థంకోసం లేదా తమ స్వప్రయోజనాల పరిరక్షణకోసం, నియోజకవర్గ అభివృద్ధి పేరుతో పార్టీ ఫిరాయించినప్పుడు, సదరు పార్టీ అధికారాన్ని కోల్పోతే పరిస్థితేంటి? అప్పటివరకు ఆ పార్టీ అమలు జరుపుతున్న సంక్షేమ/అభివృద్ధి పథకాలు, విధానాలు ఒక్కసారిగా నిలిచిపోతాయి. ఈ కప్పదాటు ఎమ్మెల్యేల పుణ్యమాని మరోపార్టీ అధికారంలోకి వస్తేఆపార్టీ తనవంటూ కొత్త విధానాలు మొదలుపెడుతుంది. అప్పుడు పరిపాలనకు ఒక అర్థమం టూ వుండదు. ప్రజాస్వామ్యంలో వున్న ప్రధాన లోపమిది. ‘తోక శరీరాన్ని ఊపిన చందంగా’ ఇటువంటి ఫిరాయింపుదార్లు ప్రభుత్వాలను శాసించే స్థితి కొనసాగడాన్ని మించిన దౌర్భాగ్యస్థితి మరోటుండదు!

ప్రజలకోసమే, అభివృద్ధి కోసమే పార్టీలు మారుతున్నామని చెప్పుకునే ఇటువంటి ఎమ్మెల్యేలకు ఎప్పుడు ఏ పార్టీ అధినేత దేవుడవుతాడో లేక దయ్యమవుతాడో వాళ్లకే తెలియదు. తమకు ఇబ్బంది లేకుండా చూసుకునే పార్టీ అధినేత వీరికి దేవుడు! మరి అదే నాయకుడు కొంచెం కఠినమైన విధానాలు తీసుకొస్తే రాత్రికి రాత్రే ఆయన వీరి దృష్టిలో ‘దయ్యమై’పోతాడు. ప్రస్తుతం తెలంగాణ లో ఇష్టంవచ్చినట్టు పార్టీలు మారుతున్న ఎమ్మెల్యేలు ఇందుకు గొప్ప ఉదాహరణ. బీఆర్‌ఎస్‌లో ఉన్నంతకాలం ‘కె.సి.ఆర్‌’ వీరికి దేవుడు! ఇప్పుడు కాంగ్రెస్‌లోకి వచ్చిన తర్వాత ‘రేవంత్‌’ దేవుడు. మరి రేవంత్‌ దేవుడు హైడ్రాను తీసుకొచ్చి కచ్చితంగా విధానాలను అమలు చేస్తుంటే వీరికి ‘ఎక్కడో’ గుచ్చుకుంది. ఇంకేం ఇక ముంచుడు రాజకీయాలు షురూ! ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఇదే రాజకీయం నడుస్తోంది! మరి కాంగ్రెస్‌లోకి వచ్చిన ఎమ్మెల్యేలు తిరిగి బీఆర్‌ఎస్‌లోకి వెళతారా? అది తప్ప మరోపార్టీ దిక్కులేదు! ఒకప్పుడు కె.సి.ఆర్‌.ను దేవుడని పొగిడి, కాంగ్రెస్‌లో చేరినతర్వాత ఆయనపై దుమ్మెతిపోసి, ఇప్పుడు మళ్లీ ‘నువ్వు తప్ప దిక్కులేదు’ అని ఏ ముఖం పెట్టుకొని వెళతారు? ఇదిలావుండగా ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి హుటాహుటిన ఢల్లీికి వెళుతున్నారు. అధిష్టానం ఏం చెబుతుందో, వీరేం వింటారో అక్కడే తేలుతుంది. అధిష్టానం చెప్పుడు మాటలకే ప్రాధాన్యమిస్తే పార్టీ పుట్టిమునగడం ఖాయం! రేవంత్‌ వంటి సమర్థ నాయకుడు పార్టీలో లేడు! చెప్పుడు మాటలు మోసే నాయకులకు పార్టీని నడిపే సత్తా అసలు లేదు. 

ఇక కె.సి.ఆర్‌. విషయానికి వస్తే కాంగ్రెస్‌లో జరుగుతున్న పరిణామాలు నిద్రబోతున్న సింహాన్ని తట్టిలేపాయి. ఆయన చిన్నగా జూలు విదిల్చి దెబ్బకొడితే తిరుగుండదని హెచ్చరించడమే కాదు, బహిరంగ సభలకు ప్రణాలికలు సిద్ధం చేసుకుంటున్నారు. మాటల మాంత్రికుడు రంగంలోకి దిగితే పరిస్థితి వేరుగా వుంటుంది! రేవంత్‌ కూడా సమర్థవంతమైన మడమతిప్పని నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన్ను తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. మరి ఈ ఇద్దరు దిగ్గజాలు ఢీ అంటే ఢీ అంటూ వచ్చే స్థానిక ఎన్నికల్లో తమ మంది మార్బలంతో రంగంలోకి దిగితే తెలంగాణ రాజకీయాల్లో ఆ కిక్కే వేరబ్బా!

సర్పంచ్ ల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలి

అరెస్ట్ లు ప్రభుత్వ పరాకాష్టకు నిదర్శనం

నర్సంపేట,నేటిధాత్రి:

తాజా మాజీ సర్పంచులు గ్రామాల అభివృద్ధి చేసిన పనులకు సంబంధించి పెండింగ్ బిల్లులు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని సర్పంచ్ ల ఫోరం వరంగల్ జిల్లా నాయకులు తిమ్మంపేట మాజీ సర్పంచ్ మోడెం విద్యాసాగర్ గౌడ్ డిమాండ్ చేశారు.ఆ బిల్లులు ప్రభుత్వం విడుదల చేయాలని కోరుతూ హైదరాబాద్ లో సచివాలయం వద్ద శాంతియుతంఘా జరిగే నిరసన రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కార్యక్రమానికి హైదరాబాద్ మాజీ సర్పంచ్లు బయలుదేరారు.ఈ నేపథ్యంలో వారిని దుగ్గొండి పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు.ఈ సందర్భంగా జిల్లా నాయకులు తిమ్మంపేట మాజీ సర్పంచ్ మోడెం విద్యాసాగర్, తొగర్రాయి సర్పంచ్ ఓడేటి తిరుపతి రెడ్డి, ముద్దునూర్ సర్పంచ్ రేవూరి సురేందర్ రెడ్డి ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు. సర్పంచులను ముందస్తు అరెస్ట్ చేసి గొంతును నొక్కిపట్టి మా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లకుండా పోలీసులు వ్యవహరించడం తీరు మంచిది కాదని అన్నారు.ఇప్పటి ప్రభుత్వం అధికారంలోకి వస్తే వెంటనే పెండింగ్ బిల్లు చెల్లిస్తామని మోసపూరితమైన వాగ్దానాలు చేసి నేడు మంత్రి సీతక్క కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలో సుమారు 12,000 మంది సర్పంచులు పెండింగ్ బిల్లుల కోసం ఎదురుచూస్తూ రోజుకు ఒకచోట ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు ఏర్పడుతున్న పట్టింపు లేనట్టు ముసలి కన్నీరు కారుస్తుందని ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇప్పటికైనా సోయి తెచ్చుకొని సర్పంచ్ ల పెండింగ్ బిల్లులు చెల్లించి స్థానిక సంస్థ ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుందని లేని పక్షంలో తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు.

క్రమంగా పెరుగుతున్న పురుషుల ఆత్మహత్యలు

`ఇప్పటికీ మహిళల ఆత్మహత్యలే అధికం

`స్త్రీపురుషుల ఆత్మహత్యలు పెరిగితే సమాజానికి నష్టం

`గృహహింసను అరికట్టేందుకు మరో మార్గం అవసరమేమో?

`మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా చట్టాల్లో మార్పులు అవసరం

`ఆధిపత్య ధోరణే అనర్థాలకు మూలం

`ఆనందం కావాలంటే కుటుంబంలో ప్రేమ అవసరం

`ప్రేమ మాత్రమే కుటుంబాన్ని బంధించే బలీయమైన బంధం

`అహంకారాన్ని వదిలేస్తే మిగిలేది సంతోషమే

`దీన్ని గుర్తిస్తే జీవితం స్వర్గమయం లేదంటే నరక ప్రాయం
హైదరాబాద్‌,నేటిధాత్రి:
వైవాహిక సంబంధాల సమస్యల కారణంగా ఏటా సగటున మనదేశంలో లక్షమంది పురుషులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. రెండు నెలల క్రితం బెంగళూరులో అతుల్‌ సుభాష్‌ (35) ఆ త్మహత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి సోషల్‌మీడియామరియు టెలివిజన్‌ యాంకర్లు పెరుగుతున్న పురుషుల ఆత్మహత్యలపై ఆందోళన వ్యక్తం చేస్తూ కథనాలు రూపొందించడం, ప్రసారం చేయడం జరుగుతోంది. ముఖ్యంగా పురుష హక్కుల కా ర్యకర్తలు (మెన్స్‌ రైట్స్‌ యాక్టివిస్ట్స్‌) ఈ పెరుగుతున్న ఆత్మహత్యలకు దేశంలో లింగ వివక్షతో కూడి, స్త్రీ అనుకూల చట్టాలే ప్రధాన కారణమని ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం భారతీయ న్యాయసం హిత (బీఎన్‌ఎస్‌)లోని 85, 86 సెక్షన్లను (పూర్వపు ఇండియన్‌ పీనల్‌కోడ్‌లోని 498ఎ సెక్షన్‌)ను ‘లింగ తాటస్త్యం’ (జండర్‌ న్యూట్రల్‌)గా మార్పు చేయాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. మహిళలపై, భర్త మరియు అతని కుటుంబ సభ్యులు పాల్పడే గృహహింసకు సంబంధించి ఈ సెక్షన్లను రూపొందించారు. ‘స్త్రీవాదం’, ‘మహిళా సాధికారత’ అనేవి ఇప్పుడు వికృతస్థాయికి చేరుకొని,ఏకంగా భార్యలే, భర్తలను ఆత్మహత్యలు చేసుకునేలా పురిగొల్పే దశకు సమాజాన్ని తీసుకెళ్లాయని వారు గగ్గోలు పెడుతున్నారు.
అయితే భారత ప్రభుత్వం చెబుతున్న లెక్కలు వీరు చెబుతున్న అంశాలకు భిన్నంగా వుండటం గమనార్హం. ఇప్పటికీ దేశంలో సింహభాగం మహిళలు తీవ్ర వివక్షకు గురవుతూనే వున్నారని ప్ర భుత్వం వాదిస్తోంది. లైంగిక దాడులు, పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులు, బహిరంగ ప్రదేశాల్లోమహిళల వేధింపులు, గృహహింస, వరకట్నహత్యలకు సంబంధించిన గణాంకాలను పరిశీలిస్తే దేశంలో మహిళలపై జరిగే హింసాత్మక సంఘటల్లో పెద్దగా మార్పు లేదన్న సంగతి స్పష్టమవు తుంది.
ఆత్మహత్యలకు కారణాలు
పరిశీలిస్తే సాధారణంగా ఆత్మహత్యలకు ఏదో ఒక్క బలీయమైన అంశం మాత్రమే కారణంగా వుంటుంది. సామాజిక, సాంస్కృతిక, వ్యవస్థీకృత మరియు ఆర్థిక కారణాలు ఇందుకు ప్రేరేపిస్తా యి. నేషనల్‌ క్రైం రికార్డ్స్‌ బ్యూరో (ఎన్‌.సి.ఆర్‌.బి) రికార్డులను పరిశీలిస్తే పై కారణాల్లో ఏదో కొటి ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నట్టు తెలుస్తుంది. ఎన్‌.సి.ఆర్‌.బి. డేటాను పరిశీలిస్తే ఈ ఆత్మహత్యల సంఘటనల విషయంలో విభిన్న పోకడలు కనిపించడం ఆశ్చర్యం కలిగిస్తుంది.
2015-22 మధ్య కాలంలో అంటే ఎనిమిదేళ్ల కాలంలో ఏటా సగటున 1,01,188 మంది పు రుషులు ఆత్మహత్యలకు పాల్పడితే, 43,314 మంది మహిళలు మాత్రమే బలవన్మరణాలకు గురికావడం గమనార్హం. ప్రతి లక్షమంది పురుషుల్లో ఈ ఆత్మహత్యల రేటు 14.2% వుంటే, మహిళల్లో ప్రతి లక్షమందికి 6.6%గా వుంది. భారత్‌లో చోటుచేసుకుంటున్న ఈ ఆత్మహత్యలకు ప్రధాన కారణం కుటుంబ సమస్యలే! మొత్తం ఆత్మహత్యల్లో ఈ కారణంగా జరిగే ఆత్మహత్యలు 23.06%గా వుంటున్నాయి. అయితే ఈవిధంగా ప్రేరేపిస్తున్న కుటుంబ సమస్యలేంటో ఎన్‌.సి.ఆర్‌.బి. స్పష్టంగా నిర్వచించలేదు. ఫలితంగా వీటిపై ఎవరికి అనుకూలమైన వ్యాఖ్యలు వారు చేస్తున్నారు. ఆత్మహత్యలకు రెండో అతిపెద్ద కారణం అనారోగ్యం. దీనివల్ల 23% ఆత్మహత్యలు జరుగుతున్నాయి.
వైవాహిక సంబంధాలు
ఇక ఆత్మహత్యలకు కారణాల్లో వైవాహిక సంబంధాలు మూడోస్థానం ఆక్రమిస్తున్నాయి. వీటివల్ల పురుషుల్లో 3.28%, మహిలల్లో 9.66% ఆత్మహత్యలు నమోదవుతున్నాయి. ఈ వైవాహిక సంబంధ ఆత్మహత్యలను ఎన్‌.సి.ఆర్‌.బి ఐదు సబ్‌గ్రూపులుగా విడగొట్టింది. అవి వరుసగా పెళ్లి కు దరకపోవడం, వరకట్న వివాదాలు, వివాహేతర సంబంధాలు, విడాకులు మరియు ఇతరాలు. ఈ సమస్యల కారణంగా ఈ ఎనిమిదేళ్ల కాలంలో (2015`22) 26,588మంది పురుషులు, 33,480మంది మహిళలు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వీటిల్లో మహిళల్లో అత్యధిక సంఖ్యాకులు (14,250) మంది ఆత్మహత్యలు చేసుకోవడానికి ప్రధాన కారణం వరకట్నం! ఇక పురుషుల్లో పెళ్లి కుదరకపోవడం అత్యధిక ఆత్మహలకు (10,119) కారణమవుతోంది. ఇక్కడ పెళ్లి కుదరక పోవడం అనేదానికి స్పష్టమైన నిర్వచనం లేదు. అంటే అవివాహితులని అర్థం. తప్పుడు వాగ్దానాలు, మోసం లేదా ఆర్థికపరమైన దోపిడీ, వరకట్న డిమాండ్‌లు, బెదిరిపుంలు లేదా వేధింపులు వంటి కారణాలవల్ల వివాహం కాకపోవడం లేదా రద్దు జరిగినప్పుడు ఈ పెళ్లి కుదరక పోవడం అనే పదాన్ని ఉపయోగిస్తుంటారు. 2015`22 మధ్యకాలంలో దేశవ్యాప్తంగా 8,09,506 మందిపురుషులు ఆత్మహత్యలు చేసుకో గా వీరిలో రైతులు, రైతు కూలీల సంఖ్య 10%అంటే81,402. రైతుల్లో ఆత్మహత్యలకు ప్రధాన కారణం పంటలు దెబ్బతినడం. ఇక ఇందులో సబ్‌ కేటగిరీలేమీ లేవు.
ప్రమాదకరమైన పద్ధతులు
ఒక పరిశోధనా పత్రం ప్రకారం పురుషులు ఆత్మహత్యలకు అత్యంత ప్రమాదరకరమైన పద్ధతు లు అనుసరిస్తే, స్త్రీలు తరచుగా ఆత్మహత్యలకు పాల్పడినప్పటికీ ఉన్నంతలో త్వరగా, తక్కువ క ష్టంతో ప్రాణంపోయే పద్ధతులను అనుసరిస్తున్నట్టు తేలింది. పురుషులో ఎంచుకునే ప్రమాదకర మైన విధానాల్లో రైలుకింద పడటం, సజీవదహనం వంటివి వుంటున్నాయి. ఇటువంటి కేసుల్లో తిరిగి బతికే అవకాశాలు చాలా తక్కువ. ఆత్మహత్యలకు పాల్పడానికి స్త్రీపురుషులు అనుసరించే విధానాల్లో తేడాలను స్పష్టంగా అవగాహన చేసుకుంటే, ఆత్మహత్యలనుంచి వారిని కాపాడే వ్యూ హాల్లో మార్పుల తేవడం లేదా కొత్త వ్యూహాలను అనుసరించడం చేయవచ్చు. నిద్రమాత్రలు, నీళ్ల లో దూకడం, విషం తాగడం వంటి ప్రక్రియల ద్వారా పదిమంది మహిళల్లో మరణాలు సంభవిస్తే, ఇవే పద్ధతుల్లో మరణించే పురుషుల సంఖ్య 21గా (10:21)గా వుంటోంది. ఇక వాహనాల కింద మరణించేవారి నిష్పత్తి 10:65 కాగా విద్యుత్‌ షాక్‌ వల్ల సంభవించే మరణాలు 10:35గా వుంటున్నాయి. ఈ నిష్పత్తులను పరిశీలిస్తే అధికశాతం మంది పురుషులు ఆత్మహత్యలకు మరింత హింసాత్మక పద్ధతులను అనుసరిస్తున్నట్టు తెలుస్తుంది. వీరిలో మరణాలరేటు అధికంగా నమోదు కావడానికి ఇదే ప్రధాన కారణం. ఈ నేపథ్యంలో పురుషుల్లో ఆత్మహత్యలను నివారించ డం ఒక సవాలుగా మారింది.
498ఎ సెక్షన్‌
ఇండియన్‌ పీనల్‌కోడ్‌లో 498ఎ సెక్షన్‌ను ప్రభుత్వం 1983లో చేర్చింది. వైవాహిక పరమైన హింసనుంచి మహిళలకు రక్షణ కల్పించడమే ఈ సెక్షన్‌ను ప్రవేశపెట్టడం యొక్క ముఖ్యోద్దేశం. ముఖ్యంగా మహిళలపై భర్త, అతని కుటుంబ సభ్యులు, వేధింపులకు పాల్పడటం, భౌతిక హిం సలనుంచి రక్షణకల్పించడానికి ఈ సెక్షన్‌ను చేర్చారు. మరోరకంగా చెప్పాలంటే పితృస్వామ్య వ్య వస్థలో మహిళలకు రక్షణ కల్పించడం దీని ప్రధాన ఉద్దేశం. తర్వాత ప్రవేశపెట్టిన భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌)లో ఈ సెక్షన్‌ను రెండుగా అంటే 85,86గా విడగొట్టారు. 85వ సె క్షన్‌ భర్త లేదా అతని బంధువు, హింసకు పాల్పడటాన్ని పేర్కొంటే, 86వ సెక్షన్‌ పాల్పడే వివిధ రకాల హింసల వివరాలను తెలియజేస్తుంది. ఏటా 498ఎ సెక్షన్‌ కింద లక్ష కేసులు నమోదవు తున్నాయి. ఎన్‌.సి.ఆర్‌.బి. డేటా ప్రకారం కేవలం 2022లో దేశంలో 1,40,019 కేసులు నమోదయ్యాయి. ఈ ఎనిమిదేళ్ల కాలంలో మహిళలపై భర్త అతని బంధువులు పాల్పడే హింస క్రమంగా పెరుగుతూ రావడం గమనార్హం. అయితే నేర నిరూపణ కేవలం 15.7% కేసుల్లో మాత్రమే జరుగుతోంది. మహిళా హక్కుల కార్యకర్తలకు ఈ 498ఎ సెక్షన్‌ ఆనందం కలిగించినా, నేర ని రూపణ కేసులు చాలా స్వల్పంగా వుండటం నిరుత్సాహం కలిగిస్తోంది. వ్యవస్థలో లోపమే ఇందుకు ప్రధాన కారణమన్నది వారి వాదన. అయితే పురుష హక్కుల కార్యకర్తలు చెప్పేదేమంటే, చాలా తక్కువ కేసుల్లో నేర నిరూపణ కావడం, పురుషులపై మహిళలు పెడుతున్న తప్పుడు కేసులు,వారిని వేధింపులకు గురిచేస్తున్నారనడానికి నిదర్శనంగా పేర్కొంటున్నారు.
సాక్ష్యాధారాల లేమి
నేర నిరూపణ కాకపోవడానికి ప్రధాన కారణం స్పష్టమైన సాక్ష్యాధారాలు లేకపోవడం. ముఖ్యం గా మానసిక హింసకు సంబంధించిన ఆధారాలు వుండటంలేదు. ఇతర సెక్షన్లు హత్య (సెక్షన్‌ 302), వరకట్న హత్య (సెక్షన్‌ 304బి)కు సంబంధించిన కేసుల్లో మాత్రమే నేర నిరూపణ జరుగుతోంది. 498ఎ సెక్షన్‌ కింద మహిళలు కేసు పెట్టాలంటే, వారికి సామాజికపరమైన సమస్య లు మరో అడ్డంకిగా వున్నాయి. ప్రధానంగా వీరిని అత్తగారింటికి రానీయరు. ఆర్థికపరమైన మద్దతు, ప్రత్యామ్నాయ వసతి లేనప్పుడు వారు నిలువనీడలేని దుస్థితిని ఎదుర్కొనాల్సి వుంటుంది. మరికొన్ని కేసుల్లో విడాకులు తీసుకోవడం ద్వారా వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నా రు. దీనివల్ల తమకు జరిగిన అన్యాయంపై పోరాడే పరిస్థితిలేకుండా పోతున్నది. ఇటువంటి పరిస్థితులు మహిళలను ముందుకెళ్లనీయడంలేదు.
కుటుంబాన్ని బంధించేది ‘ప్రేమ’ మాత్రమే
మొత్తంమీద చెప్పాలంటే భారతీయ సమాజంలో ఆలోచనా ధోరణులు, పోకడల్లో మార్పులు వస్తు న్నాయి. స్త్రీ లేదా పురుషుడు ఎవరికి అవకాశాలు వుంటే వారు తమ ఆధిపత్యాన్ని, హింసాత్మక ధోరణిని ప్రదర్శించడానికి వెనుకాడటంలేదు. వైవాహిక బంధంలో ప్రేమకు బదులు ఆధిపత్యం, అహంకార ధోరణులు పెరుగుతుండటం కూడా ఇందుకు కారణంగా చెప్పవచ్చు. మానసిక బలహీనులు, మానసికంగా దృఢంగా వుండేవారు స్త్రీపురుషులిద్దరిలో వుంటారు. సమాన ఆర్థిక స్వాతంత్య్రం కలిగిన వైవాహిక జంటల సంఖ్య పెరుగుతున్న కొద్దీ, విడాకులు, పరస్పర హింస అనేవి క్రమంగా పెరుగుతూ రావడం గమనార్హం. పితృస్వామ్యంలో పురుషులవల్ల, మాతృస్వా మ్యంలో మహిళల వల్ల హింసాత్మక ధోరణులు పెరుగుతుంటాయి. ఇక్కడ ఎవరు గొప్ప లేదా ఎవరి వల్ల ఎవరు బాధపడుతున్నారనేది కాదు ప్రశ్న! ఇద్దరిలో ఎవరు బలీయంగా, మానసికంగా దృఢంగా వుండి విపరీత ఆధిపత్య ధోరణిని ప్రదర్శిస్తారో వారివల్ల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఇందులో స్త్రీ పురుషుడు అనే తేడా లేదు. మానసిక పరమైన భావోద్వేగాలు ఇద్దరికీ సమా నమే! జీవితంపై దృఢవిశ్వాసం వున్నవారు ఎదుటివారిని లెక్కచేయరు. ఫలితం సంఘర్షణ. ప్రస్తుతం వైవాహిక సంబంధాలు దెబ్బతినడానికి ప్రధాన కారణం ఇదే! ‘ప్రేమ’, ‘కుటుంబం పట్ల మమకారం’, ఒకరి సంతోషంలో మరొకరు ఆనందం పొందే ప్రవృత్తి మాత్రమే ఈ హింసా ప్రవృత్తికి విరుగుడు. ఆధిపత్యం స్థానాన్ని సమర్పణభావం, హింస స్థానాన్ని అహింస, కోపం స్థానాన్ని ప్రేమ ఆక్రమిస్తే కుటుంబాలు శాంతిగా, ఆనందమయంగా కొనసాగుతాయి.

40 రోజుల కోడి..రోగాల పుట్ట!

`40రోజుల కోడీలో నాణ్యతఎంత? దానితో ఆరోగ్యమెంత?

`ఆరు నెలలకు ఎదగాల్సిన కోడి 40 రోజులకే కోతకొస్తోంది.

`జనాలకు రోగాలను మోసుకోస్తోంది.

`భయంకరమైన వ్యాధుల బారిన పడేలా చేస్తోంది.

`ఒకప్పుడు బయిలర్‌ కోడి దశ 180 రోజులు.

`తర్వాత కొంత కాలానికి 120 రోజులు.

`మరింత కాలం గడిచాక 80 రోజులు.

`ఇప్పుడు కేవలం 40 రోజులు.

`అదెలా సాధ్యం? ప్రాణాలతో చెలగాటం?

`గుడ్డు నుంచి కోడి వచ్చే కాలం పోయింది.

`గుడ్డే లేని పిల్ల తయారౌతోంది.

`భయంకరమైన మందుల వాడకంతో నెలకే కోతకు రెడీ అవుతోంది.

`ఆ మందుల ప్రభావం మన మీద పడుతోంది.

`ముఖ్యంగా ఆడ పిల్లల జీవితాలపై అధిక ప్రభావం చూపుతోంది.

`హార్మోన్ల సమతూకాన్ని అస్తవ్యస్తం చేస్తోంది.

`క్లినికల్‌గా నిరూపణ అయ్యింది.

`అయినా మనమెందుకు ఊరుకుంటాం!

`కోడి కూర కొనుక్కొని తెచ్చుంటూనే వుంటాం.

`బిపి, షుగర్‌ల బారిన చిన్న వయసులోనే పడుతున్నాం.

`ఫ్యాట్‌ లెస్‌ వైట్‌ మీట్‌ అనుకుంటున్నాం!

`క్యాన్సర్‌ బారిన పడిపోతున్నాం!

`పేర్లు కూడా తెలియని రోగాలను తెచ్చుకుంటున్నాం.

`మటన్‌ ధరకు భయపడి చికెన్‌ అలవాటు చేసుకున్నారు.

`తక్కువ ధరకు వస్తోందని చికెన్‌ కోసం ఎగబడిపోతున్నాం.

`పౌల్ట్రీ లో చిరు రైతులు ఎప్పుడో చితికిపోయారు.

`కార్పోరేట్‌ పౌల్ట్రీకి భయపడి కోళ్ల పెంపకమే మానేశారు.

`ఏవి వైరస్‌ సోకిన కోళ్లో, ఏవి మంచి కోళ్లో కూడా చూసుకోకుండా కొంటున్నాం?

`షాపు వాడు ఇచ్చిందే చికెన్‌ అని రోజూ లొట్టలేసుకొని తింటున్నాం

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

  నాకు ముక్కలేనిదే ముద్ద దిగదు..ఈ మాట చాలా అనడం వింటుంటాం. అది ఎంతో గొప్పగాచెప్పుకుంటారు. సంపాదన దండిగా వున్నవారే కాదు,జిహ్వ చాపల్యం వున్న ప్రతి ఒక్కరూ ఇలాంటి మాటలను చెబుతూవుంటారు. ఈ ముక్క చాలప్యంలో రకరకాలుంటాయి. మాంసాలలో రకరకాలు వున్నాయి. కాని వచ్చిన చిక్కల్లా కోడి మాంసంతోనే వస్తోంది. తంట అంతా ఆ ఫౌల్ట్రీ చికెన్‌తో వుంటోంది. చికెన్‌ మంచిది కాదనుకునేవారు ఎక్కువగా ఆది వారాలలో మటన్‌ తెచ్చుకుంటారు. కాని ఎక్కువ మంది చికెన్‌ ప్రియులుంటారు. ధర మటన్‌తో పోలిస్తే తక్కువ. ఒక్కసారి మటన్‌ తెచ్చుకునే ఖర్చుతో వారంలో మూడు రోజులు చికెన్‌ తినొచ్చనే ఆలోచన వున్నవారు కూడా చాలా మంది వుంటారు. ఆ మూడు రోజులతోపాటు మిగతా నాలుగు రోజులు కూడా ముక్కను భోజనంలోకి చేర్చుకుంటున్నారు. ఒకప్పుడు బంధువులొస్తేనో..లేక పంగడలొస్తేనో..గ్రామ దేవతలకు మొక్కుల కోసమో కోడి కూర తినేవారు. కాకపోతే అది నాటు కోడి. కాని ఇప్పుడు ఆ నాటు కోళ్ల జాడలేదు. పల్లెలు పెరిగి, పట్నాలు విస్తరించిన తర్వాత ఇంట్లో కోళ్లను పెంచుకునే పరిస్దితి లేదు. ప్రజలు వుండడానికే చోటు లేక అంతస్దుల మీద అంతస్తులతో నిర్మాణాలు చేసే అప్పార్టుమెంట్లలో జీవిస్తున్నారు. ఇలాంటి వారికి కోళ్లను పెంచుకోవడమేమో కాని, చూడడం కూడా కుదరదు. అలాంటి వాళ్లు ఖచ్చితంగా పౌల్ట్రీ చికెన్‌ మీద ఆదారపడతప్పదు. అదే తినక అసలే తప్పదు. నగరాల్లో నాటు కోళ్లు అమ్మకాలు ఎంత సాగినా, వాటి ధర కూడా మేక మాంసంతో సమానంగా వుంటుంది. అందువల్ల చికెన్‌ ప్రియులంతా పౌల్ట్రీ చికెన్‌ తినకతప్పదు. మరి మనం తింటున్న చికెన్‌ ఎంత మేలైంది. ఆరోగ్యానికి ఎంత ఉపయోగపడేది. రుచి కోసం తింటున్నామా? లేక తినాలని తింటున్నామా? అన్నదికూడా తెలియకుండానే రోజూ ముక్క మీద ముక్క లాగిస్తున్నాం. కాని ఆ చికెన్‌ మూలంగా ఎన్ని అనర్ధాలు ఎదురౌతున్నాయో తెలిసిన వాళ్లే ఎక్కువా తింటున్నారంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. ఒకప్పుడు పౌల్రీ కోడి కూడా షెడ్డులలో ఆరు నెలలకు కోతకు వచ్చేది. ఆరు నెలల కాలం పాటు అది అన్ని రకాల జాగ్త్రత్తలో పెంచేవారు. కాని ఆ రైతులకు అది గిట్టుబాటు పెద్దగా లేకుండాపోయింది. పైగా డిమాండ్‌ అండ్‌ సప్లయ్‌లో వెనుకబడి పోయింది. దాంతో ఎప్పటికప్పుడు జరిగే పరిశోధనల్లో నాలుగు నెలల కోడి తయారైంది. దాంతో పౌల్ట్రీ షెడ్లను వ్యాపారులు పెంచుకున్నారు. పెట్టుబడికి తగిన లాభం వస్తుండడంతో చాలా మంది పౌల్ట్రీ వ్యాపారంలోకి దిగారు. తర్వాత కొంత కాలానికి మూడు నెలల కోడి పుట్టుకొచ్చింది. ఇంకేముంది రోగాలను కొంచెంకొంచెం మోసుకొచ్చే కోడి మన ఇంటికొచ్చింది. మన ఒంట్లోకి చేరడం మొదలైంది. ఒక దశలో మార్కెట్‌లో పప్పుదరల కన్నా చికెన్‌ధర తగ్గింది. ఆఖరురు ఉల్లి పాయల ధరకనా, కొన్ని సార్లు టమాట దరలకన్నా చికెన్‌ తక్కువ ధరలకు అందుబాటులోకి వచ్చింది. బ్లాక్‌ మార్కెట్‌ దారులు ఉల్లిపాయలు, టమాటలను బ్లాక్‌ చేయడమేమో కాని, ప్రజలకు చికెన్‌ తినడం మరింత అలవాటుగా మారింది. మూడు నెలల కోడి కాస్త రెండు నెలలకు వచ్చేసింది. రెండు నెలల్లో పెరిగి తినడానికి వీలుగా ఎదిగింది. ఇంకేముంది చికెన్‌ మార్కెట్‌ల్లో కార్పోరేట్‌ శక్తులు దూరిపోయాయి. కోడి పదిరోజుల్లో పెరిగే అవకాశం వున్నా పెంచే దుర్మార్గపు ప్రయత్నాలు చేసేందుకు గిజగారుతున్నారు. ఒకప్పుడు కోడి గుడ్డు నుంచి వచ్చే కోడి, ఇప్పుడు కృత్రిమంగానే పుడుతోంది. పెరిగిపెరక్క ముందే మార్కెట్‌లో మాయమైపోతోంది. వ్యాపారుల పంట పండిస్తోంది. జనం ప్రాణాల మీదకు తెస్తోంది. కోడి పిల్ల వ్యాపారుల చేతికి రాకముందు నుంచే మందులతో దాని జీవనం, పెంపకం మొదలౌతోంది. హోలిస్టిన్‌ అనే ఆంటి బయాటిక్‌ విపరీతంగా వినియోగించడం వల్ల మూడు నాలుగు నెలల్లో పెరగి, కోతకు రావాల్సిన కోడి నెలకే చేతికొస్తుంది. నలభై రోజుల్లో అమ్మకం జరిగిపోతుంది. ఇలాంటి చికెన్‌లకు బర్డ్‌ ఫ్లూ అనే భయంకరమైన జబ్బులు వస్తుంటాయి. కాని వాటిని వ్యాపారులు కప్పివుంచుతారు. బైట ప్రపంచానికి తెలియకుండా చేస్తారు. వాటిని తక్కువ ధరలకు మార్కెట్‌లోకి పంపిస్తారు. రిటైల్‌ వ్యాపారులు మనకు అంటగడుతూనే వుంటారు. మనం మటన్‌ షాపుల్లో మనకు ఎలాంటి మటన్‌ ఇస్తున్నారో మన కళ్లముందే కనిపిస్తుంది. దాని వాలకం చూసి కొనుక్కొవాలో వద్దో కూడా తేల్చుకునే అవకాశం వుంటుంది. ఎదురుగా వేళాడదీసిన మటన్‌కు చెందిన అవయవాలను మనం చూసి, అవసరమైతే క్షుణ్ణంగా పరిశీలించి కొనుగోలు చేసుకుంటాం. కాని చికెన్‌లో ఆ అవకాశం వుండదు. ఆ చికెన్‌ ఎలా వుందనేది ఇంటికెళ్లి చూసుకుంటే కాని కనిపించదు. అందులోనూ లోపాలు మనకు అసలు తెలియవు. ఇలా ఆంటిబయాటిక్స్‌ విచ్చలవిడిగా కోళ్లకు ఇప్పించి పెంచే చికెన్‌ తినడం వల్ల మనలో అనేక అనారోగ్య సమస్యలు తయారౌతున్నాయి. ముఖ్యంగా అమ్మాయిల విషయంలో అనేక అనర్దాలు జరుగుతున్నాయి. క్లినికల్‌గా రుజువు కూడా చేశారు. ఆడపిల్లల్లో హార్మోన్ల ఇన్‌బ్యాలెన్స్‌ ఎక్కువగా జరుగుతుందని తేలింది. అయినా మా పిల్లలకు చికెనే తింటారు. మటన్‌ తెస్తే తినరు అంటూ కొత్త కథలు కూడా చెబుతుంటారు. తాజాగా మన తెలుగు రాష్ట్రాలలో బర్డ్‌ ఫ్లూ విపరీతంగా పెరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఏపిలో ఉభయగోదావరి జిల్లాలో లక్షల కోళ్లను చంపేసి పూడ్చిపెడుతున్నారు. కొంత మంది వ్యాపారులు పంట కాలువల్లో వదిలేస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. వ్యాపారులు తీరని నష్టం ఏర్పడిరదని అంటున్నారే గాని, తమ వక్ర బుద్ది మూలంగా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నామని మాత్రం అనుకోడం లేదు. లాబాపేక్ష తప్ప, ప్రజల ప్రాణాలు పౌల్ట్రీ వ్యాపారులకు పట్టడం లేదు. కార్పోరేట్‌ పౌల్ట్రీ రంగం విస్తరించడంలో చిన్న చిన్న పౌల్ట్రీ రైతులు కనుమరుగయ్యారు. ఆ వ్యాపారం మీద బతికిన వాళ్లంతా దివాలా తీశారు. ఇతర వ్యాపారాలను ఎంచుకొని బతుకులీడుస్తున్నారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో గత పది రోజులుగా కోళ్లకు కొక్కెర వ్యాధి సోకినట్లు తెలుస్తోంది. కొన్ని లక్షల కోళ్లు మృత్యు వాతపడ్డాయంటున్నారు. చికెన్‌ ప్రియులు జాగ్రత్తగా వుండాల్సిన అవసరం వుంది. ఎందుకంటే పాలకులు ఏదైనా శృతి మించేదాకా మేలుకొనరు. అనర్ధాలు జరిగేదాకా జాగ్రత్తపడరు. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటారు. జనం ప్రాణాల మీదకు వచ్చినప్పుడే స్పందిస్తారు. వ్యాపారుల కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు మన ముందు చికెన్‌ తింటూ వారికి మేలు చేసే ప్రయత్నాలు చేస్తారు. గతంలో ఇలాంటి సంఘటనలు అనేకం చూస్తూనే వున్నాయి. రాష్ట్రంలో కొక్కెర వ్యాధి తీవ్రంగా ప్రబలినట్లు తెలుస్తోంది. కొన్ని గంటల వ్యవధిలోనే కొన్ని లక్షల కోళ్లు చనిపోతున్నాయి. అయితే సహజంగా కోళ్లను రాత్రిళ్లు మాత్రమే రవాణా చేస్తుంటారు. చికెన్‌సెంటర్లుకు చేర్చుతుంటారు. తెలంగాణలోని ఖమ్మం జిల్లా ఏపిలోని ఉభయగోదావరి జిల్లాలతో సంబందం వుంటుంది. దాంతో అక్కడి నుంచి ఖమ్మం జిల్లాకు కొక్కెర వ్యాధి సోకిందంటున్నారు. కొన్ని కిలోమీటర్ల దూరంలో వున్న పామ్‌లకు కూడా ఈ వైరస్‌ సోకుతుంది. ఆ చికెన్‌ తినడం ఎంత మాత్రం మంచిది కాదు. మీడియా కూడా ఫౌల్ట్రీకి నష్టం జరుగుతుందనే చెబుతుందేతప్ప, ప్రజలను చైతన్యం చేయాలని చూసే రోజులు పోయాయి. అందువల్ల ప్రజలు అప్రమత్తంగా వుండడం ఎంతో మంచిది. కొంత కాలం చికెన్‌ తినపోతే జరిగే నష్టమేమీ లేదు. ఇప్పటికే చికెన్‌ మూలంగా సర్వ దరిద్రాలు మన ఒంట్లోకి వచ్చి చేరుతున్నాయి. గతంలో ఎవరికైనా బిపిలు, షుగర్‌లువుండేవి కాదు. మన వైద్యులు కూడా వైట్‌ ఆహార పదార్దాలు తినకూడదంటారు. అసలు బియ్యం, గోదుమలే తినకూడదంటారు. కాని రకరాల మందులతో తయారైన చికెన్‌ తినడం వల్ల కొలెస్ట్రాల్‌ రాదంటారు. కాని ఆ చికెన్‌ వల్లనే చిన్న వయసుల్లోనే బిపిలు, షుగర్‌లు వస్తున్నాయన్న సంగతిని దాచి పెడతారు. ఇలాంటి వారికి ఫార్మ కంపనీలు తోడౌతాయి. ఆ మందుల అమ్మకాలను పెంచుకుంటాయి. శరీరాలను గుళ్ల చేసే చికెన్‌ లాంటి ఆహారం తినమని నిపుణులే చెబుతుంటారు. రోగాలువచ్చాక ఫలానా మందులు తీసుకోవాలని సూచిస్తుంటారు. ప్రజల జీవితాలతో అందరూ కలిసి ఆడుకుంటారు. ఇదే మన ఖర్మ.

‘‘డాలర్‌’’ కలలు ‘‘ఢమాల్‌’’!

ఆవిరైన ఆశలు..కరిగిపోయిన కలలు.

-అమెరికా కలల్లో చేదు నిజాలను మిగిల్చుకున్నారు.

usa trump effect on Indians

-బరువెక్కిన గుండెలతో దేశం తిరిగి వస్తున్నారు.

-ఇష్టంగా కష్టాలు పడినా మిగిలిన కన్నీళ్లు.

-సప్త సముద్రాలు ఆవల సంపాదన.

-దూరపు కొండల నునుపు ఆలోచన.

-చెల్లా చెదురైన యువత భవిష్యత్తు.

-కడుపు కట్టుకొని తల్లిదండ్రులు రూపాయి రూపాయి పోగేసుకున్నారు.

-అప్పులు చేసి పిల్లలను అమెరికా పంపించారు.

-పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం కలలుగన్నారు.

-మా పిల్లలు అమెరికాలో వున్నారని గొప్పగా చెప్పుకున్నారు.

-గంపెడాశలతో వెళ్ళిన పిల్లలు వట్టి చేతులతో వస్తున్నారు.

-అమెరికాలో జీవితం అని కలల్లో తేలియాడారు.

-ఒక్కసారిగా కలలు చెదిరి తిరిగి వస్తున్నారు.

-ట్రంప్‌ వస్తే మరింత మేలనుకున్నారు.

-మొదటికే మోసం తెచ్చాడు.

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

  ఓ మనిషి ఏమిటి నీ ఆలోచన. ఎక్కడికి నీ ప్రయాణం. అంటూ ఎవరి మనసైనా ఎప్పుడైనా అడుగుతూనే వుంటుంది. నా మనసలు అమెరిక చుట్టూ తిరుగుతుంది. నా ప్రయాణం అమెరికా వైపు వెళ్లమంటోందని సమాధానం చెప్పుకుంటూ జీవితం గడిపేవారు కొంత మంది. తమకు జీవితంలో దక్కని అవకాశం తన పిల్లల ద్వారా నైనా నెరవేర్చుకొని వారి సంతోషంలో తన ఆనందాన్ని చూసుకోవాలనుకునే ప్రతి తల్లిదండ్రులు అనుభవిస్తున్న సమస్యే. కాకపోతే ఒక దశలో తండ్రి ఆలోచన..చివరి దశలో అదే తండ్రి ఆవేదన ఎలా వుంటుందో కూడా అందరూ తెలుసుకోవాలి. గత ఓ ముప్పై సంవత్సరాల కాలంగా అమెరికా పిచ్చి అందరికీ పట్టుకున్నది. అది అన్ని వర్గాలకు పాకింది. ఏం చేస్తున్నాడు మీ అబ్బాయి అంటే అమెరికా వెళ్లడానికి ప్రిపేర్‌ అవుతున్నాడు. ఇంజనీరింగ్‌ అయిపోయింది. ఎంఎస్‌ చేయాలనుకుంటున్నాడు. అమెరికాకు వెళ్లే ఏర్పాట్లుచేస్తున్నాం అని కొందరు. మా అబ్బాయిని ఎలాగైనా అమెరికా పంపించాలి. మా పక్కింటి వాళ్ల పిల్లలు ఇద్దరూ అమెరికాలోనే వుంటున్నారు. మా ముందు వాళ్లు ఫోజులు కొడుతున్నారు. మా పిల్లలను కూడా పంపించి వారికంటే మేమే గొప్ప అనిపించుకోవాలి అనుకుంటున్న తల్లిదండ్రులు. ఇక పిల్లల మందు బాగా చదువుకో…మన ఆ బంధువులు పిల్లలు అమెరికా వెళ్లారు. ఈ బంధువుల పిల్లలు అమెరికా వెళ్తున్నారు. వాళ్లను చూసైనా బుద్ది తెచ్చుకో..బాగా చదవుకో..నా పరువు నిలబెట్టు..అంటూ పిల్లలను చిన్నప్పటి నుంచే అమెరికా ఆశల పల్లకిని ఎక్కిస్తున్నాం. వాళ్లను చూసి మరి కొందరు…ఇలా పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు అందరూ అమెరికా జపం తప్ప, ఇక్కడే వుంటాం..ఇక్కడే చదువుకుంటాం..ఇక్కడే గొప్పగా బతుకుతాం అనేవారు లేకుండాపోతున్నారు. ఇక్కడ ఎంత గొప్పగా బతుకున్నా అది బతుకు కాదన్నంతగా జనం మారిపోతున్నారు. అమెరికాలో అంట్లు తోముకుంటూ బతికినా సరే అంత బంగారమైన బతుకు మరొకటి లేదన్నంతగా గొప్పలకు పోతున్నారు. రూపాయిలకన్నా, డాలర్‌ కలలు గొప్పగా వుంటాయనుకుంటారు. కనిపించని దేశాల వెంట పరుగులు తీస్తున్నారు. ఓ నలభై సంవత్సరా క్రితం అమెరికా అంటే అబ్బో అనుకునేవారు. కాని ఇప్పుడు గ్లోబలైజేషన్‌ మూలంగా అమెరికా కూడా మన పక్క ఊరే అన్నంత మాటల దూరం తగ్గిపోయింది. ఇబ్బంది కర కాలం మళ్లీ వచ్చింది. ట్రంప్‌ రూపంలో మళ్లీ చిక్కులు ఎదురౌతున్నాయి. ఇప్పుడు మీ ఊరు మాకు ఎంత దూరమో..మా వూరు మీకు అంతే దూరం అన్న లాజిక్‌ మొదటికి వచ్చింది. మన దేశం నుంచి లక్షలాది మంది వెళ్లి అమెరికాలో చదువుకునే వారు చదువుకుంటున్నారు. వ్యాపారాలు చేసే వారు చేస్తున్నారు. ఉద్యోగాలు చేసేవారు వున్నారు. చిరు వ్యాపారుల నుంచి పెద్ద పెద్ద కంపనీలు పెట్టిన వారున్నారు. కాని చదువుకోవడానికి వెళ్లినా ఇక్కడి నుంచి పంపే సొమ్ము సరిపోక, అమెరికాలో బారీ బతుకులు బతకాలంటే కూలీ పనులు చేసుకోవాల్సిందే. ఇంట్లో వున్నప్పుడు ఇటు పుల్ల తీసి అటు పెట్టని వాళ్లయినా సరే..అంట్లు కడిగైనా అక్కడ బతకాల్సిందే. ఆ పని కోసం బతిమిలాడుకొని ఆ పని చేసుకొని సంపాదించుకొని బతకాల్సిందే..ఇదే అమెరికా జీవితం కాని..దూరపు కొండలు నునుపు. అక్కడ సంపాదించి విదేశీ మారకద్రవ్యం చెల్లించి, పన్నుల మీద పన్నులు అటూ, ఇటు కట్టి చివరకు చేతిలో కనిపించేది ఎంతైనా సరే అమెరికాలోనే బతకాలనుకునే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోవడమే ఇందుకు కారణం. ఇండియాలో తరతరాలు కూర్చొని సరిపడ ఆస్దులున్నా సరే అమెరికాకే వెళ్లాలి. అక్కడే బతకాలి. అక్కడే ఎంజాయ్‌ చేయాలని అనుకునే వారి కధ వేరు. కాని రెక్కాడితే గాని డొక్కాడని పేదలు కూడా అమెరికా వైపు చూసుకుంటూ మబ్బుల్లో నీరు ఒలకబోసుకుంటున్నారు. తమ పిల్లలను కూడా అమెరికా పంపాలన్న ఆలోచనలతో అందిన కాడికి అప్పులు చేస్తున్నారు. కడుపు కట్టుకొని కూడబెట్టుకుంటున్నారు. ఉద్యోగాలు చేసే తల్లిదండ్రులు కూడా మిగతా సమయాల్లో మరో పని చేస్తున్నారు. ప్రతి రూపాయిని ఆదా చేసుకుంటున్నారు. ఇలా రూపాయి రూపాయి కూడబెట్టి అమెరికా పంపిస్తే తమ తల్లిదండ్రుల మీద ప్రేమ వున్న పిల్లలు ఎంత మంది వున్నారు. అసలు తమను అమెరికా పంపించిన తల్లిదండ్రులను గుర్తుంచుకుంటున్న పిల్లలు ఎంత మంది వున్నారు. తల్లిదండ్రులు బతికి వున్నారా..లేదా అని తెలుసుకుంటున్న వాళ్లు ఎంత మంది వున్నారు. రోజూ కాకపోకపోయినా వారానికో..నెలకో తల్లిదండ్రులను పలకరిస్తున్నారా? అంటే అదీ లేదు. ఎప్పుడూ బీజీ..బిజీ..అన్న సమాదానలతో సరిపెట్టుకుంటున్నారు. తమ పిల్లలు అమెరికా వెళ్తే ప్రయోజకులౌతారు. గొప్పవాళ్లవుతారు. గొప్పగా బతుకుతారు. మమ్మల్ని కూడా గొప్పగా చూసుకుంటారని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. కాని తమను తల్లిదండ్రులను మర్చిపోతున్న పిల్లలు వున్నారని తెలిసినా తల్లిదండ్రులు అమెరికా కలలు కనకుండా వుండడం లేదు. తమ పిల్లలను అమెరికా పంపించకుండా వుండలేకపోతున్నారు. కష్టాలు కొని తెచ్చుకుంటూనే వున్నారు. కష్టాలు వస్తాయని తెసినా దైర్యం చేస్తున్నారు. సమస్య తమ దాకా వచ్చేవరకు తల్లిదండ్రులు బోరు మంటున్నారు. అమెరికా వెళ్లిన పిల్లల వల్ల ఎదురయ్యే సమస్యలపై సీతారామయ్య మనవరాలు అని ఓ సినిమా వచ్చింది. కంటే కూతుర్నే కనాలి అనే సినిమా తీశారు. ఇలాంటివి అనేకం వచ్చాయి. అయినా సినిమా చూస్తారు. కాసేపు కళ్ల నీళ్లు పెట్టుకుంటారు. మర్చిపోతారు. తమ పిల్లల్ని అమెరికా పంపేందుకు రకరకాల కష్టాలు పడుతూనే వుంటారు. అవసాన దశలో పదిహేను నిమిషాలు సినిమా చూస్తూ పెట్టుకున్న కన్నీళ్లు జీవితాంతం పెట్టుకుంటున్నారు. అయినా ఎవరూ ఆగడం లేదు. ఇప్పటికైనా మనలో మార్పు వస్తుందని ఆశించాద్దాం. విదేశాలలో గొప్ప గొప్ప చదవులు చదువుకొని దేశానికి సేవ చేయడం పక్కన పెడితే, కనీసం కన్న తల్లిదండ్రులకు అవసాన దశలో చూసుకునే దిక్కులేకుండాపోతోంది. కడసారి చూపులు చూడడానికి కూడా వీలు లేకుండాపోతోంది. అడ్డాల నాడు బిడ్డలు కాని, గడ్డాల నాడు బిడ్డలు కాదన్న సామెతలు నిజం చేస్తున్నారు. అయినా ఫరవాలేదని, తమ పిల్లలుతమను చూసుకోకపోయినా సరే..ఆఖరి దశలో తమ వద్దకు రాకపోయినా సరే అని కూడా పిల్లల్ని అమెరికా పంపించాలనే తల్లిదండ్రులే పెరుగుతున్నారు. అందుకే ఈ పరిస్దితి వస్తోంది. ఇప్పుడు ట్రంప్‌ ఆమెరికాకు వెళ్లిన వారిని తిరిగి పంపించేస్తున్నారు. లక్షలు ఖర్చు పెట్టుకొని అమెరికా వెళ్లిన వారిని దోషులుగా చూస్తున్నారు. దొంగలుగా ముద్రలు వేసి పంపిస్తున్నారు. నిజానికి మన దేశం నుంచి వెళ్లిన వాళ్లెవరూ అక్రమ మార్గల ద్వారా వెళ్లిన వారు కాదు. కాకపోతే అక్కడికి వెళ్లిన తర్వాత అక్రమంగా అక్కడ నివాసముంటున్నారు. అది కూడా తప్పే..ఆ దేశ చట్టాల ప్రకారం నేరమే..అందుకే అమెరికా నుంచి తిరిగి పంపిస్తున్నారు. అమెరికాలో వుండడానికి వారికి అర్హత లేదని బలవంతంగా పంపిచేస్తున్నారు. ఇది మంచి పరిణామమేనా కాదా? అన్నది ఇప్పటికిప్పుడు తెలియపోయినా రేపటి తరం ఆశల ఆవిరయ్యాయనే చెప్పాలి.. కన్నకలలు కల్లలయ్యాయనే అనుకోవాలి. అమెరికా ఆశల మీద ఇంకెవరు మోజు పెంచుకోవద్దని కూడా గుణపాఠంగా తీసుకోవాలి. అమెరికా కలల్లో చేదు నిజాలున్నాయని గమనించాలి. ఆ చేదు గుళిక ఇప్పటికప్పుడు గొంతు దిగకపోయినా, ఇక్కడ సంపాదించి అమెరికా అప్పుడప్పుడూ చూసి వచ్చే కల నెరవేరేందుకు ఉపయోపడాలని కోరుకోవాలి. అక్కడే వుండాలి. అక్కడే బతకాలి. అక్కడే భవిష్యత్తు వెతుక్కొవాలి అనేది ఆశే అయినా, అత్యాశ కాకుండా చూసుకోవాలి. స్ధోతమను ఇక్కడ కూడా పెంచుకోవచ్చు. ఇక్కడ కూడా అవకాశాలు వెతుక్కోవచ్చు. ఇక్కడ కూడా ఆదాయ వనరులను సృష్టించుకోవచ్చు. బరువెక్కిన గుండెలతో దేశం వస్తున్నామని అనుకోకండి. బరువు దించుకొని వస్తున్నామని సంతోషంగా రండి. లక్షలాది రూపాయలు వృధా అయ్యాయని అనుకోకండి. అంతకు మించి సంపాదించుకునేందుకు కూడా ఇక్కడ అవకాశాలు వెతుక్కొండి. లేకుంటే నిపుణులులైన విద్యావంతులుగా ఉన్నత చదువులు చదువుకున్న వాళ్లు అవకాశాలు సృష్టించండి. మీరే పది మందికి ఉపాది కల్పించేలా ముందుకు సాగండి. అందుకు బ్యాంకులు కూడా సహకారం అందించే అకాశాలున్నాయి. సంపద మీరే సృష్టించండి. ఎవరిమీదో ఆధారపడుకుండా మీ కాళ్ల మీద నిలబడి, దేశానికి ఆదాయం సమకూర్చండి. ఆల్‌దిబెస్ట్‌.

ఏకు మేకైతే..’’పికే’’ యడం కష్టం!

`‘‘పికే’’ బలపడితే బలహీన పడేది టిడిపియే.

`‘‘పికే’’ బలం.. ‘‘లోకేష్‌’’కు రాజకీయ సంకటం.

`‘‘పికే’’ చాణక్యం… చంద్రబాబు రాజకీయానికి చెలగాటం.

`‘‘పికే’’కు ఓ లెక్కుంది..సమయమొస్తే చంద్రబాబును కూడా లెక్క చేయడు.

 

`‘‘పికే’’ లెక్క వేరు..టిడిపికి చాపకింద నీరు!

`‘‘పికే’’కు ఓ లెక్కుంది…ఆ లెక్క తేలేందుకే టిడిపి పక్కన చేరింది.

`‘‘పికే’’తో దోస్తీ..పులిమీద స్వారీ!

`చిరులా జెండా పీకేసుకునే రకం కాదు!

`పొత్తు జెండాను ఎలా పీకేయాలో ఆలోచిస్తున్నారు.

`ఎలా ‘‘పీకేస్తే’’ మేలు కలుగుతుందని మంతనాలు సాగిస్తున్నారు.

`‘‘పీకేస్తే’’ ఎలాంటి సమాధానాలు చెప్పాలో కూడా కసరత్తు చేస్తున్నారు.

`అభిమానుల చేత ‘‘పికే’’ సత్తా ప్రచారం చేయించాలని చూస్తున్నారు.

`ప్లీనరీతో ‘‘పికే’’ పవర్‌ ఏమిటో కూడా చూపించాలకుంటున్నారు.

`గెలిచిన మరునాడే ‘‘పికే’’ పలికిన పలుకులు మర్చిపోడు.

`పవర్‌ పంచుకున్నంత మాత్రాన ‘‘పికే’’ సర్థకు పోడు.

`ప్రతిపక్ష పాత్రను కూడా ‘‘పికే’’ పాలనలోనే చూపిస్తున్నాడు.

`ఎక్కడ తగ్గాలో కూడా ‘‘పికే’’కు తెలుసు.

`సమయమొస్తే ఎలా పీక పట్టుకోవాలో కూడా తెలిసిందే ‘‘పికే’’ మనసు.

`అంతా బాగుంటే ‘‘పికే’’ ఎల్లకాలం దోస్తీ అంటాడు.

`జనం కోసం తప్పుకుంటున్నానని చెప్పడానికి ఎప్పుడైనా వెనుకాడడు.

`ఒక్కసారి పవర్‌ చూసిన తర్వాత ‘‘పికే’’ తన పవర్‌ వదులుకోవాలనుకోడు

 

రాజకీయాల్లో ప్రతి దానికి ఒక లెక్కుంటుది. కూడికలు కొన్సిసార్లు మైనస్‌లుకావొచ్చు. కొన్ని సార్లు మైనస్‌లే ప్లస్‌ కావొచ్చు. ఏ ఈక్వేషన్‌కు సరైన లెక్క వుండకపోవచ్చు. అవే రాజకీయాలు. అందువల్ల డిప్యూటీసిఎం. పవన్‌ కళ్యాణ్‌కు ఒక లెక్కుంది. ఆ లెక్కను ఎంత ఒద్దికగా సరిదిద్దుకుంటూ పోతున్నారో చాలా మందికి అర్దం కావడం లేదు. పైకి పవన్‌ కళ్యాణ్‌ ఆవేశాన్నే చూస్తున్నారు. కాని ఆ ఆవేశంలో కూడా లోతైన ఆలోచన వుంది. అది నెరవేరుతుందా? లేదా? అన్నది ఇప్పటికిప్పుడు సమాదానం దొరక్కపోయినా, ఖచ్చితంగా భవిష్యత్తులో లాభమే జరుగుతుంది. నిజానికి పవన్‌ కల్యాణ్‌ సీజనల్‌ నాయకుడు అని అందరూ అనుకున్నారు. కాని ఆయన సీరియస్‌ రాజకీయాలు చాలా భిన్నంగా చేస్తూ వచ్చారు. ఆ భిన్నమే వైసిపి ప్రభుత్వాన్ని నిండా ముంచేదాక తెచ్చింది. పాలు ఎన్ని వున్నా పెరుగు కావాలంటే పెరుగు చుక్క కావాల్సిందే. అదే పాలు చెడిపోవాలంటే ఒక్క ఉప్పురాయి చాలు. రాజకీయాల్లో లెక్కలు కూడా సరిగ్గా ఇలాగే వుంటాయి. ప్రతి క్షణం అప్రమత్తంగా వుండడమే రాజకీయం. ఏమర పాటు ఎవరికీ మంచిది కాదు. అందువల్ల పవన్‌ చెప్పే మాటలన్నీ నిజం కాదు. అందులో అబద్దాలు వెతికినా దొరక్కపోవచ్చు. అంత పకడ్భందీగా రాజకీయాలు చేస్తున్నారని చెప్పడంలో సందేహం లేదు. ఈ విషయం అపర చాణక్యుడైన చంద్రబాబుకు తెలియదా? అంటే తెలుసు. కాని కొన్ని సార్లు ఎంత చాణక్యుడైనా ఏం చేయలేని రాజకీయాలు ఎదుర్కొవాల్సి వస్తుంది. ఎందుకంటే చంద్రబాబు ఆవేపూరితమైన రాజకీయాలు చేసే వ్యక్తి కాదు. ఆలోచనాపూర్వకమైన రాజకీయాలు మాత్రమే చేస్తుంటారు. ఈ తరం రాజకీయాలు అందుకు భిన్నంగా సాగుతున్నాయి. దేశ ప్రధాని నరేంద్ర మోడీ లాంటి వారు కూడా ఆలోచనాపూర్వకమైన రాజకీయాల్లో ఆవేశపూరితమైన అంశాలను మేలవిస్తున్నారు. ప్రతి అంశానికి రాజకీయాన్ని జోడిస్తుంటారు. ప్రతి సారి సెంటిమెంటు రాజేయకుండా రాజకీయం చేయరు. ఎంతటి విపత్కరమైనపరిస్దితుల్లో నైనా కూల్‌గానే వుంటారు. అంతే కూల్‌గా మాట్లాడుతూ నిప్పు రాజేస్తారు. అందుకే బిజేపి ఇప్పుడు ఆ స్ధానంలో వుంది. ప్రధాని మోడీ రాజకీయం తిరుగులేని శక్తిగా మారింది. తన సమకాలీకుడైన మోడీ రాజకీయాన్నే చంద్రబాబు అంచనా వేయలేకపోతున్నారు. ఆయన దూకుడును అందుకోలేకపోతున్నారు. అదే జరిగితే 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయేదే కాదు. నిజానికి చంద్రబాబు అంచనాలు గతం తాలూకు చరిత్రకు సాక్ష్యాలు. అంతే కాని ఆయన విజయాలు చరిత్రకు పాఠాలుగా ఎప్పుడూ మారలేదు. అందుకే ప్రస్తుతం ఏపి రాజకీయాల్లో పాలనాపరమైన కీలక భూమికలో తెలుగుదేశం పార్టీ వున్నా, జనసేన మాత్రమే దూసుకుపోతోంది. పవన్‌ కళ్యాణ్‌ రాజకీయాలకే ప్రాదాన్యత కనిపిస్తోంది. ఇది ఎప్పటికైనా తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది కరమే. ఇప్పటికిప్పుడు సమస్యలు ఎదురుకాకపోయినా, భవిష్యత్తులో జగన్‌ కంటే పవన్‌ వల్లనే తెలుగుదేశం కొంప మునుగుతుందని చెప్పడంలో సందేహంలేదు. ఇక్కడ చంద్రబాబు ఒక్కొ మెట్టు ఎక్కిన నాయకుడు కాదు. ఒక్కసారిగా కాలం కలిసి వచ్చి అధికారం అందుకున్న నాయకుడు. కాని ఆయన రాజకీయ పరిణతి వల్ల అందలం చూశారు. ముఖ్యమంత్రి అయ్యారు. జగన్‌ కూడా ఇంచు మించి అలాంటి రాజకీయాల వల్లనే ఎదిగారు. జగన్‌ పాదయాత్ర చేసినా, ఇంకేది చేసినా ఆయన వారసత్వ రాజకీయాలను ముందు పెట్టి రాజకీయం చేసిన నాయకుడే. చెట్టుపేరు చెప్పుకొని ముఖ్యమంత్రి అయిన నాయకుడే. కాని పవన్‌ అలా కాదు. సినిమా రంగంలో వారసత్వంగా పైకి వచ్చినా, రాజకీయ రంగంలో ఆయన స్వశక్తి మీదనే ఆదారపడి వచ్చారు. తెలుగుదేశం పార్టీకి మద్దతు పలకడంలో కూడా ఆయన స్వంత నిర్ణయాల మీదనే ఆదారపడి రాజకీయాలు చేస్తూ వచ్చారు. 2014లో తెలుగుదేశం, బజేపిలతో కలిసి రాజకీయం చేశారు. కాని రాజకీయంగా ఎదగాలనుకున్నా కాలం కలిసి రాలేదు. ప్రజా సమస్యలే తన రాజకీయ ఎజెండా అనుకున్నారు. కాని రాజకీయ ఎజెండా వేరు, ప్రజా సమస్యలు వేరు అని తెలుసుకోవడానికి కొంత సమయం పట్టింది. ఇప్పుడు పవన్‌ కళ్యాణ్‌కు పూర్తిగా క్లారిటీ వచ్చింది. ఎలాంటి అడుగులు వేస్తే రాజకీయాల్లో ఒక్కొ ఇటుక పేర్చుకుంటూ వెళ్లాలో దారి కనుక్కున్నాడు. ఆ దారినే ఎంచుకున్నాడు. ఎందుకంటే 2019లో ఆయన ఒంటరి పయనం అనేక పాఠాలే, కాదు గుణపాఠాలు,అనుభవాలు నేర్చుకునే అవకాశం ఏర్పడిరది. వ్యక్తిగతంగా రాజకీయాల్లో తనస్దానమేమిటో తెలిసింది. అభిమానులతోనే రాజకీయాలు సాద్యం కాదని పూర్తిగా తెలుసుకున్నాడు. నిజానికి ప్రజారాజ్యమప్పుడే ఆ విషయం అర్ధమైనా అప్పటి ఉమ్మడి రాజకీయాలను అంచనా వేయలేకపోయారు. అందుకే చిరంజీవి రాజకీయాలు జెండా పీకేసేదాకా తెచ్చుకున్నారు. కాని పవన్‌ అలా కాదు. తన జెండాను ఎవరూ పీకేంత శక్తి వంతులు ఎదురుగా లేకుండా చేసే రాజకీయాలు చేయాలనుకున్నారు. అది ఆయనకు ఎంత మేలు చేస్తుందో..అంతే నష్టం తెలుగుదేశం పార్టీకి జరుగుతుంది. ఒక ఒరలో రెండు ప్రాంతీయ పార్టీలు ఇమడలేదు. ఇమిడినా ఎంతో కాలం కలిసి రాజకీయాలు చేయలేరు. ఎన్నికల సమయం వచ్చినప్పుడు వాటి రంగులు బైట పడిపోతాయి. ఎందుకంటే పవన్‌ ఎళ్లకాలం తెలుగుదేశం పార్టీకి గొడుగు పట్టే రాజకీయాలు చేస్తారనుకోవద్దు. ఆయన రాజకీయ లక్ష్యం ఆయనకు వుంది. ఎప్పటికైనా ముఖ్యమంత్రి కావాలన్న కోరిక కూడా పవన్‌కు బలంగా వుంది. కాకపోతే ఆ అవకాశం కోసం ఎంత కాలమైనా ఎదురుచూడొచ్చు. చూడకపోవచ్చు. రాజకీయాల్లో అవకాశం వచ్చినప్పుడు గద్దలా అధికారాన్ని తన్నుకుపోయే రాజకీయాలకే విలవెక్కువ. లేకుంటే మరో పార్టీ పాగా వేస్తుంది. ఇక ఏపిలో రెండు భిన్న దృవాలే ప్రత్యర్ది రాజకీయాలు భవిష్యత్తులో చేసే ఆస్కారం వుంది. ఎవరు ఔనాన్నా, ఎవరు కాదన్నా చంద్రబాబు ఆరోగ్యంగా వున్నంత కాలమే తెలుగుదేశం పార్టీ ఆధిపత్య రాజకీయాలు చేసే అవకాశం వుంటుంది. ఎందుకంటే మర్రి చెట్టు లాంటి చంద్రబాబు నాయకత్వంలో లోకేష్‌ లాంటి నాయకత్వం కూడా ఎదుగుతుందని అనుకోలేం. ముఖ్యమంత్రి చంద్రబాబు లోకేష్‌కు పూర్తి స్వేచ్చనిప్పుడే తెలుగుదేశంలో కొత్త తరం రాజకీయాలు ఆవిషృతమౌతాయి. తాను వేలు ఎల్లకాలం వేలు పట్టుకొని నడిపిస్తానని అనుకుంటే లోకేష్‌ రాటు దేలలేరు. ఏ రాజైనా ఆరోగ్యంగా వున్నప్పుడే వారసులకు యువరాజు పట్టాభిషేం చేస్తారు. దాంతో ఆటోమెటిక్‌గా రాజు వున్నా, యువరాజు మాటలే చెల్లుతాయి. మహాభారతం మనకు గొప్ప రాజనీతిని అందిస్తుంది. దృతారాష్ట్రుడు రాజైనప్పటికీ దుర్యోధనుడే రాజ్యబారం మోశాడు. రాజకీయం నెరిపాడు. అందుకే ఇప్పుడు చంద్రబాబు ఆ పాత్రను పోషిస్తేనే లోకేష్‌ రారాజౌతారు. లేకుంటే రాజకీయాల్లో తండ్రి చాటు బిడ్డగానే మిగిలిపోతారు. ఎప్పుడైనా స్వయం ప్రకాశానికే విలువ ఎక్కువగా వుంటుంది. ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు స్వయం ప్రకాశమే. లోకేష్‌ కూడా అదే స్వయం ప్రకాశాన్ని అందుకోవాలి. అప్పుడే పార్టీకి మరో అర్ధ దశాబ్దమైన మనుగడలో వుంటుంది. లేకుంటే పవన్‌ ముందుకొస్తారు. తెలుగుదేశం రాజకీయాలను హైజాక్‌ చేస్తాడు. ఎన్నటికైనా పవన్‌ కళ్యాణ్‌ చీల్చగలిగేది తెలుగుదేశం పార్టీ ఓటు బ్యాంకునే తప్ప, వైసిపి ఓట్లను టచ్‌ చేయలేరు. కూమిటి ఓట్లనే పవన్‌ తన వైపు తిప్పుకుంటారు. ఇది ముఖ్యంగా లోకేష్‌ గమనించాలి. లేకుంటే పికే ఏకు మేకౌతాడు. తెలుగుదేశం పార్టీకి ఎర్తవుతాడు. పవన్‌ కల్యాన్‌ ఇంకా పదేళ్లయినా తెలుగుదేశంతో వున్నా, చంద్రబాబు నాయకత్వంలో కలిసి పని చేయడానికి ఇష్టపడతాడే గాని, లోకేష్‌ను ముఖ్యమంత్రిని చేయాలని కలలో కూడా అనుకోడు. అందువల్ల లోకేష్‌ను ముఖ్యమంత్రిని చేయకపోతే, పవన్‌ ఏనాటికైనా ఏపికి ముఖ్యమంత్రి అవుతారు. పవన్‌ ముఖ్యమంత్రి కావొద్దంటే ముందు లోకేష్‌ను ముఖ్యమంత్రి చేయాలి. ఎందుకంటే ఎల్ల కాలం మంత్రిగానో, ఉప ముఖ్యమంత్రిగా వుండడం పవన్‌ లక్ష్యంకాదు. రాజకీయాల్లో ఎవరు శాశ్వత మిత్రులు కాదు. ఎవరూ శాశ్వత శత్రువులు కాదు. అందరూ అవకాశవాదులే. అందరిదారి అధికారం సొంతం చేసుకోవడమే.. పార్టీ పెట్టి, పదిహేనేళ్లు కొట్లాడిన పవన్‌ పవర్‌ కావాలని కోరుకోవడంలో తప్పు లేదు. తెలిసి,తెలిసి తెలుగుదేశం మేలుకోకపోతే తప్పు.

బీసీలకోసం గళమెత్తుతున్న తీన్మార్‌ మల్లన్న

నేడు వరంగల్‌లో బీసీల సభ

కులాల మధ్య పొత్తులుంటేనే బీసీల ఐక్యత సాధ్యం

జనం వుంటే ఏం లాభం? పదవులకు దూరం!

అధికారం ఒకరిచ్చేది కాదు…సాధించుకునేది

బీసీలు తమ సామర్థ్యం తెలుసుకోవాలి

సామర్థ్యం, వనరులు పెంచుకుంటే రాజ్యాధికారం బీసీలదే

వెనుకబడిన తరగతుల వారికే రాజ్యాధికారం రావాలన్న లక్ష్యంతో తన రాజకీయ పోరాటాన్ని తీన్మార్‌ మల్లన్న తాను ఏ పార్టీలో వున్నా బీసీల వాణిని వినిపించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగానే వరంగల్‌లో ఫిబ్రవరి 2న బీసీల సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు రెండు నుంచి మూడులక్షలమంది హాజరు కాగలరని నిర్వాహకుల అంచనా. బీసీల ఐక్యత కోసం తీన్మార్‌ మల్లన్న మొదట్నుంచీ కృషి చేస్తున్నారు. బీసీలు కలిసిపోతే రాజ్యాధికారం సాధించవచ్చునన్నది ఆయన దృఢ విశ్వాసం. ఈదిశగానే ఆయన బీసీల్లో వున్న అనేక కులాలవారిని ఒక్కతాటి మీదకు చేర్చి రాజ్యాధికారాన్ని ఈ వర్గాలకు వచ్చేలా చేయాలన్నది ఆయన ఆకాంక్ష. ఇందుకోసంఆయన అవసరమైన అన్ని రకాల సమాచారాన్ని సేకరించి బీసీల సాధికారతో కోసం అలుపెరుగ కుండా శ్రమిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయన బీసీల కులాలవారీగా జనసంఖ్యను వివరిస్తూ వారి బలమెంతో తెలియజేసేందుకు యత్నిస్తున్నారు. కులాలుగా విడిపోవడం కాదు, అంతా ఒక్కటై పోరాటం చేయాలని తెలంగాణలో నిర్వహించే సభల్లో ఆయన బీసీలకు పిలుపునిస్తున్నారు. బలమైన వర్గంగా వున్న బీసీలు, ఓసీల్లోని పేదలను కూడా ఆదుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పడం ఆయనలోని విశాల భావాన్ని తెలియజేస్తోంది.

ఇక తెలంగాణ జనాభా విషయానికి వస్తే 2024 జులై 1 నాటికి మొత్తం తెలంగాణ జనాభా 3.83 కోట్లు. 2016 సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారం బీసీల మొత్తం జనాభా 18159732 మంది. వీరిలో బీసీ(ఎ) గ్రూపు మొత్తం జనాభా 3040376 కాగా బీసీ(బి) గ్రూపుకు చెందినవారు 5602786, బీసీ(డి) గ్రూపు 6635939 మంది వున్నారు. ఈవిధంగా జనాభా పరంగా బలీయంగా వున్న బీసీలకు తమ సొంత బలాన్ని తెలియజేస్తూ, రాజకీయాలను శాసించాలని ఆయన గట్టి పిలుపునిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగా ఆయన ప్రధాన డిమాండ్‌ బి.సి.లకు 42శాతం రిజర్వేషన్‌ వర్తింపచేయాలని. ఎప్పటికైనా బీసీలకే రాజ్యాధికారం దక్కు తుందన్న ప్రగాఢ విశ్వాసం ఆయనది. జనాభాలో అంతపెద్ద సంఖ్యలో బీసీలున్నప్పుడు వారికి రాష్ట్ర బడ్జెట్‌లో కేటాయించేది కేవలం రూ.50 కోట్లంటే ఇదేమైనా ముష్టి వేస్తున్నట్టా? అని ఆగ్ర హంగా ప్రశ్నిస్తారు. బీసీలకు రాష్ట్ర బడ్జెట్‌లో రూ.9వేల కోట్లు కేటాయించాలనేది ఆయన ప్రధాన డిమాండ్‌. గత ఏడాది కాజీపేటలో జరిగిన బి.సి.ల శంఖారావం సభల్లో ఆయన మాట్లాడు తూ 42శాతం రిజర్వేషన్‌ సదుపాయాన్ని కల్పించకపోతే వెనుకబడిన వర్గాల వారి ఆధ్వర్యంలో పెద్ద భూకంపమే సృష్టిస్తానని హెచ్చరించారు. కేవలం బీసీల ఓట్లతోనే తాను గెలిచానన్న సంగతి గుర్తుచేశారు. అంతేకాదు బలమైన వర్గాలుగా వున్న బీసీలు, ఓసీల్లోని నిరుపేదలపై కూడా దృష్టిపెట్టాలని ఆయన ఉద్దేశం. కులాలవారీగా బీసీల ఓట్లు చీలిపోయిన నేపథ్యంలో, ఈ కులాలమ ధ్య పొత్తులు కుదరాలి. ఆవిధంగా పొత్తు కుదిరిన తర్వాత బీసీ కులాలన్నింటిలో ఉన్న వివిధ నిపుణులతో కలిసి ఒక జేఏసీ ఏర్పాటు చేయాలని తీన్మార్‌ మల్లన్న ఆకాంక్ష. ముఖ్యంగా వెనుకబడిన అన్ని కులాల మధ్య పొత్తు కుదిరితే అవి బలమైన వర్గంగా మారి రాజకీయాలను శాసించగలు గుతాయి. ఇప్పటివరకు ‘మేమెంతో మాకంత’ అనే దశనుంచి ‘మీరెంతో మీకంత’ అని ఓసీలకు చెప్పే స్థాయికి బీసీలు ఎదగాలి. అంటే జనాభా లెక్కల ప్రకారం బీసీల జనాభా ఎంతో స్పష్టమైంది. ఓసీలు, ఎస్సీలు, ఎస్సీలు కలిసి పావు షేరు వుంటే, మిగిలినవారంతా బీసీలే. అందుకనే ‘మీరెంతో మీకంత’ అనేది! బీసీల ఉద్యమంపై ఏ ఒక్క రాజకీయపార్టీ నోరు మెదపడానికి భయపడుతున్నదంటే, ఈ ఉద్యమం ఎంత బలంగా ఉన్నదో అర్థం చేసుకోవాలని మల్లన్న అంటా రు. ఉద్యమం బలంగా వుంటేనే ఎవ్వరూ నోరెత్తరనేది ఆయన అభిప్రాయం.

బీసీలకు ఏవిధంగా అన్యాయం జరుగుతున్నదో ఆయన ఉమ్మడి ఖమ్మం జిల్లాను ఉదాహరణగా తీసుకొని వివరించిన విధం విశ్లేషణాత్మకంగా వుండటం గమనార్హం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 9,42,312 మంది బి.సి. జనాభా వుంటే ఒక్క బీసీ ఎమ్మెల్యే కూడా లేడు. అదే 2,97,659 ఓసీలుంటే వారికి మూడు సీట్లు ఇవ్వడం ఎంతవరకు న్యాయం? అసలు ఇంతమంది బీసీ జనాభా ఉన్నప్పటికీ వారికి సీట్లెందుకు కేటాయించలేదు? గెలవడం గెలవకపోవడం తర్వాతి ముచ్చట. ఇది అన్యాయం కదా. అంటే రాజకీయ పార్టీలు కొంతమంది తమకోసం పెట్టుకున్నారు కనుక బీసీలకు సీట్లు ఇవ్వలేదు. అసలు వీరి సంగతే వాళ్లకు పట్టదు. అదీకా కుండా మనం ఎన్నికల్లో పార్టీ గుర్తులకు మాత్రమే ఓటేస్తాం. అందువల్ల మనకు బీసీల సంఖ్య, బలం, జనాభా అనే సంగతులు మనకు తెలియవు. ఇదీ ఆయన విశ్లేషణ.

నాయీ బ్రాహ్మణుల చరిత్ర

1947ా2024 మధ్యకాలంలో నాయీ బ్రాహ్మణుల (మంగలి)కు చెందిన వారు ఎవ్వరూ మండలి, అసెంబ్లీ, పార్లమెంట్‌కు ఎన్నికవలేదు! అసలు వాళ్లకు అవకాశం కల్పిస్తేనే కదా? సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం రాష్ట్రంలో నాయీ బ్రాహ్మణుల జనాభా 309798. వీరిజనాభాలో సగం కంటే తక్కువ జనాభా వున్న వెలమ సామాజిక వర్గం నుంచి 14 మంది అసెంబ్లీకి వెళ్లారు. ఇ దేం విచిత్రం! తక్కువ జనాభా ఉన్న జాతులు క్రమంగా అంతరించి పోతాయన్నది అంబేద్కర్‌ సి ద్ధాంతం. కానీ ఇక్కడ అందుకు పూర్తి భిన్నంగా జరుగుతోంది. నిజానికి నాయీ బ్రాహ్మణుల రాజ్యపాలన చరిత్ర క్రీ.పూ.362నాటిది. అదే సంవత్సరంలో మగధ సామ్రాజ్యాన్ని పరిపాలించిన చక్రవర్తి నాయీ బ్రాహ్మణుడే. ఆయన పేరు మహాపద్మానందుడు. ఆయన చక్రవర్తి ఎట్లా అయ్యాడంటే శిశునాగులు పరిపాలిస్తున్న కాలంలో వారికి క్షవరం, వైద్యపరమైన సపర్యలు చేయడానికి ఈ మహాపద్మనందుడు వుండేవాడు. ఈయన్ను శిశునాగులు ప్రతిరోజు అవమానించారు. చివరకు ఈ అవమానం భరించలేక తనవద్దనున్న కత్తితో ఆ కుటుంబాన్ని మొత్తాన్ని చంపేస్తాడు. తనను తాను చక్రవర్తిగా ప్రకటించుకొని, చుట్టుపక్కల రాజులను ఓడిరచి చక్రవర్తిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నా డు. ఆయన వద్ద లక్షకోట్ల కిలోల బంగారం వుండేదట. దాన్ని గంగానది గర్భంలో దాచిపెట్టాడన్నది చారిత్రక కథనం. కరీంనగర్‌ జిల్లా రామడుగు వద్ద ఇటీవల ఒక పు రాతన విగ్రహం బయటపడిరది. ఇది మహాపద్మనందుడి కాలం నాటిది. అటువంటి చరిత్ర నా యీ బ్రాహ్మణులది. స్వాతంత్య్రానికి పూర్వం వీరిని ఎస్సీ వర్గంగా నాటి బ్రిటిష్‌ ప్రభుత్వం గు ర్తించింది. స్వాతంత్య్రానంతరం వీరిని జనరల్‌ కేటగిరీలోకి చేరిస్తే, అనంతరామన్‌ కమిషన్‌ సిఫారసు మేరకు వీరిని బీసీాఎ గ్రూపులో కలిపారు. ఇదీ వారి చరిత్ర. తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేసిన కరుణానిది ఒక నాయీ బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడు. అంటే ప్రస్తుత ముఖ్యమంత్రి స్టాలిన నాయీబ్రాహ్మణుడు. మరి మన తెలంగాణలో మంగలివారి పరిస్థితేంటి?

ప్రతి కులంలో ప్రతిభ అనేది దాగివుంటుంది. అటువంటి వారిని వెలికి తీసి ప్రాధన్యత ఇస్తే త ప్పక పైకొస్తారు. కానీ అగ్రకులాలు బీసీలను ఎదగనీయకుండా చేయడంతో వీరిలోని ప్రతిభ అణగారిపోయింది. తమ సామర్థ్యం తాము తెలుసుకోలేని దుస్థితికి దిగజారారు. ఈ దీన స్థితినుం చి బయటపడి, రాజ్యాధికారం కోసం పోరాటం చేయడం, అందుకు అవసరమైన సామర్థ్యాన్ని, వనరులను పెంపొందింపజేసుకోవడం బీసీల తక్షణ కర్తవ్యమని తీన్మార్‌ మల్లన్న వారిలో చైతన్యాన్ని ఉద్దీప్తం చేస్తున్నారు. ఒక గట్టి బీసీ నేతగా తనను తాను నిరూపించుకునే ప్రయత్నం చేస్తు న్నారు. మరి బీసీల రాజ్యాధికార సాధనలో ఆయన ఎంతవరకు కృతకృత్యులవుతారన్నది కాలమే నిర్ణయించగలదు.

ప్రచారంలో దూసుకుపోతున్న నరేందర్‌ రెడ్డి

`కాంగ్రెస్‌ అభ్యర్థిగా పార్టీ అధికారిక ప్రకటన

`ఇతర పార్టీల అభ్యర్థులు ఎవరూ నరేందర్‌ రెడ్డికి పోటీ అసలే కాదు

`ఆరు నెలల నుంచే నరేందర్‌ రెడ్డి విసృత ప్రయత్నాలు

`పార్టీ అధిష్టానంతో గతంలోనే చర్చలు

`అధిష్టానం సూచన మేరకే రంగంలోకి దిగిన నరేందర్‌ రెడ్డి

`పట్టభద్రుల ఎన్‌రోల్‌ మెంట్‌లో అందరికంటే ముందున్నారు

`ఈ ఏడాదిలోనే ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు నరేందర్‌ రెడ్డికి కలిసి వచ్చే అంశం

`ప్రభుత్వం మీద పట్టభద్రులలో మరింత నమ్మకం

`నరేందర్‌ రెడ్డి కి ఉద్యోగాల కల్పన బాగా కలిసొచ్చే అంశం

`నరేందర్‌ రెడ్డి విద్యా సంస్థల విద్యార్థులే లక్షల్లో వుంటారు

`వాళ్లంతా నరేందర్‌ రెడ్డి నాయత్వాన్నే బలపరుస్తారు

`నాలుగు ఉమ్మడి జిల్లాలలో అత్యధిక శాతం పట్టభద్రులు కరీంనగర్‌ జిల్లాలోనే వున్నారు

`తెలంగాణలో విద్యా సంస్థల అధినేతగా గుర్తింపు

`కరీంనగర్‌లో అందరికీ సుపరిచితులు

`విద్యా వ్యవస్థపై పూర్తిగా పట్టున్న విద్యా వేత్త

`నిరుద్యోగ సమస్యలపై పూర్తి అవగాహన వున్న వ్యక్తి

`ఏ రకంగా చూసినా గెలిచేందుకు అన్ని రకాల దారులున్న నాయకుడు

`పార్టీలకతీతంగా వ్యక్తిగతంగా అందరివాడు

`ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్నారు

`ఇతర అభ్యర్థుల కన్నా ముందున్నారు

`ఇతర పార్టీల అభ్యర్థుల ఎవరూ నరేందర్‌ రెడ్డికి సమీపంలో వున్నట్లు కూడా లేదు

`నరేందర్‌ రెడ్డి విజయం ముందే నిర్ణయం జరిగినట్లే అని చర్చించుకుంటున్నారు

హైదరాబాద్‌,నేటిధాత్రి:

కరీంనగర్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, మెదక్‌ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్దిని కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించింది. ఆల్‌ఫోర్స్‌ విద్యా సంస్దల అదినేత డాక్టర్‌. వి. నరేందర్‌రెడ్డి పేరును కాంగ్రెస్‌ పాఈ్ట అధిష్టానం ఖరారు చేసింది. కాంగ్రెస్‌ పార్టీలో అన్ని వర్గాలకు అనువైన, అనుకూల వ్యక్తిగా నరేందర్‌ రెడ్డికి పేరుంది. వ్యక్తిగా అందరి తలలో నాలుకలా వుండే నాయకుడు నరేందర్‌ రెడ్డి. అందుకే కాంగ్రెస్‌ పార్టీ నరేందర్‌ రెడ్డిని ఎంపిక చేస్తే పట్టభద్రులు ఎమ్మెల్సీ గెలుపు మరింత సునాయాసమౌతుందని నిర్ణయం తీసుకున్నది. అయితే నరేందర్‌ రెడ్డి పేరు ఇప్పుడు ప్రకటించినా గతంలోనే ఆయనను పార్టీ అధిష్టానం పిలిపించుకొని వివరాలు కనుగొన్నది. ఆయనతో అనేక విషయాలు చర్చించింది. విద్యా రంగం, యువత, నిరుద్యోగ, ఉపాది వంటి అనేక అంశాలపై నరేందర్‌ రెడ్డికి వున్న అవగాహన చూసి అదిష్టానం మెచ్చి ఎట్టకేలకు ఆయనను ఖరారు చేసింది. విద్యారంగంలో సుమారు 40 సంవత్సరాల విశేష అనుభవం నరేందర్‌రెడ్డికి వుంది. నరేందర్‌ రెడ్డిని పిలిపించుకున్నప్పుడే గ్రౌండ్‌ వర్క్‌ చేయమని అధిష్టానం ఆదేశించింది. దాంతో ఆయన గత ఆరు నెలలుగా విశేషమౌన కృషి చేస్తూ వస్తున్నారు. పార్టీలో ఎలాంటి చర్చలు జరుగుతున్నా పార్టీ అదిష్టానంపై నమ్మకంతో, అంకితబావంతో పెద్దఎత్తున పట్టభద్రుల ఎన్‌రోల్‌ మెంట్‌ నాలుగు జిల్లాలో చేపట్టారు. అందరింటే ముందున్నారు. అంతే కాకుండా నరేందర్‌రెడ్డికి పార్టీపై వున్న అపారం నమ్మకంతో తన ప్రచారాన్ని కూడా ఎప్పుడో ప్రారంభించారు. నాలుగు జిల్లాలకు చెందిన కాంగ్రెస్‌ పార్టీపెద్దలు, నాయకులు, ఆయా జిల్లాలో వున్న పట్టభద్రులను కలిసి తనను గెలిపించాలని కోరడం జరిగింది. వాళ్లందరికీ రెగ్యులర్‌గా టచ్‌లో వుంటూ వారితో సంప్రదింపులు జరుపుతున్నారు. తాను ఎమ్మెల్సీ అయితే సమాజానికి ఎలాంటి మేలు జరుగుతుందో కూడా వారిని ఒప్పించే ప్రయత్నాలు ఎప్పటి నుంచో చేస్తున్నారు. దాంతో ప్రచారంలో అందరికన్నా నరేందర్‌ రెడ్డి ముందున్నారని చెప్పడంలో సందేహం లేదు. పైగా పట్టభద్రుల సంఖ్య ఎక్కువగా వున్న కరీంనగర్‌ జిల్లాలో పట్టున్న ఏకైక నాయకుడు నరేందర్‌ రెడ్డి. ఉమ్మడి ఆదిలాబాద్‌, కరీంనగర్‌ జిల్లాలో ఆయన పేరు తెలియని వారు, ఆయన పరిచయం లేని వారంటూ ఎవరూ వుండరు. అంతలా ఆయన పేరు సుపరిచితం. కొన్ని లక్షల మంది ఇప్పటికే ఆయన విద్యా సంస్ధలలో చదువుకొని జీవితాల్లో స్ధిరపడిన వారున్నారు. వాళ్లంతా అనేక రంగాలలో గొప్ప గొప్ప స్ధాయిలో వున్నారు. వాళ్లు ఆయన విద్యార్ధులే. సమాజానికి సేవ చేస్తున్నవారే. అందువల్ల నరేందర్‌ రెడ్డికి ఆ ఓట్లు ఎంతో కీలకం. ఆ ఓట్లే ఆయన గెలుపును సునాయాసం చేస్తాయని చెప్పడంలో సందేహం లేదు. ఇక ఇతర పార్టీల నుంచి పోటీ చేసే ఏ అభ్యర్ది నరేందర్‌కు పోటీ కాలేదు. సాటి రాలేరని చెప్పొచ్చు. ఎందుకంట సుధీర్ఘమైన అనుభవం నరేందర్‌రెడ్డికి విద్యారంగంలోనే వుంది. అంటే సమాజమంతా విద్యారంగంతోనే ముడిపడి వుంటుంది. విద్యా రంగ నిపుణులకు సామాజిక సమస్యల మీద వున్నంత అవగాహన ఇతర రంగాలలో వుండేవారికి వుండదు. అందువల్ల రేపటి తరానికి ఏం కావాలి? ఇప్పుడు మన దేశంలో విద్యారంగం ఎలా వుంది? ప్రపంచ దేశాలలో విద్యా రంగ పరిస్దితులు ఎలా వున్నాయన్నదానిపై సంపూర్ణమైన అవగాహన వున్న ఏకైక నాయకుడు నరేందర్‌ రెడ్డి. అందువల్ల ఆయనకు తెలంగాణ నిరుద్యోగుల సమస్యలను ఎలా పరిష్కరించాలన్నదానిపై అనేక మార్గాలను అన్వేషించగలిగే ఆలోచనలు, ఆచరణలు చూపించగల నాయకుడు నరేందర్‌రెడ్డి. ఎందుకంటే ప్రస్తుతం మన దేశం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్యలలో నిరుద్యోగం ఒక పెద్ద విపత్తు అని చెప్పాలి. ఎంతో ఉన్నతమైన చదువులు చదువుకున్న వారికి కూడా ఉపాది అవకాశాలు తగ్గుతున్నాయి. కారణం మన విద్యా వ్యవస్ధలో వున్న లోపం. మన విద్యా విధానంలో అనేక రకాల, రూపాలలో రకరకాల కోర్సులు వున్నాయి. కాని వాటిపై రాజకీయ నాయకులకు పూర్తి అవగాహన వుండదు. పాలకులతో చర్చించేందుకు వారికి వెసులుబాటు వుండదు. వాటిపై పట్టు వుండదు. కాని విద్యా రంగంలో వున్న నిపుణులైన నరేందర్‌రెడ్డి లాంటి వారికే విద్యా రంగ సమస్యలు, తీసుకురావాల్సిన మార్పులు, ఇప్పటి తరానికి అవసరమైన మార్పులపై సమగ్రమైన అవగాహన ఆ రంగంలో వుండేవారికి మాత్రమే వుంటుంది. విద్యా రంగంలో ఎంతో నిష్ణాతుడైన నరేందర్‌ రెడ్డిని పట్టభద్రులు ఎన్నుకుంటే పెద్దల సభలో అర్ధవంతమైన చర్చ జరిగే అవకాశం వుంటుంది. ప్రభుత్వానికి విలువైన సూచనలు చేసే అవకాశం ఏర్పతుంది. ప్రభుత్వానికి మార్గదర్శనం చేసే వెసులుబాటు ఏర్పడుతుంది. విద్యా రంగ నిపుణుడైన నరేందర్‌ రెడ్డి ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు ఇవ్వడానికి వీలౌతుంది. ఇక ఎన్నికల ప్రచారం విషయానికి వస్తే ఆయన ఒకటి రెండు దఫాల ప్రచారం కూడా పూర్తిచేసుకున్నారు. తాను ఎమ్మెల్సీ అయితే విద్యా రంగంలో వినూత్నమైన మార్పులు తీసుకొచ్చేందుకు కృషిచేస్తానని చెబుతున్నారు. నిరుద్యోగ సమస్యకు పరిష్కారాలు వెతికే ప్రయత్నం చేస్తానన్నారు. ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేలా, ఎలాంటి వాయిదాల లేకుండ ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడేలా చేస్తానని నరేందర్‌ రెడ్డి మాట ఇస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికే సుమారు 55వేలకు పైగా ఉద్యోగాలను ఈ ఏడాది కాలంలోనూ భర్తీ చేసింది. కొత్తగా అనేక నోటిపికేషన్లు కూడా విడుదల చేసింది. ఎంతో మంది యువకులు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. గత ప్రభుత్వ హాయంలో పదేళ్లపాటు ఉద్యోగాలు లేక ఎంతో మంది యువతకు ఉపాది కరువైపోయింది. వారి జీవితంలో పదేళ్ల విలువైన సమయం వృధా అయ్యింది. కాంగ్రెస్‌ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం అదికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగ కల్పనపై దృష్టిపెట్టింది. వెంట వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన అన్ని రంగాలలో పెండిరగ్‌లో వున్న ఉద్యోగాలకు పరీక్షలు నిర్వహించి వెంటనే ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కూడా కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వానికే దక్కుతుంది. అందువల్ల తెలంగాణలో వున్న మొత్తం నిరుద్యోగులు, యువత కాంగ్రెస్‌ వైపే వున్నారని చెప్పడంలో సందేహం లేదని నరేందర్‌ రెడ్డి బలంగా నమ్ముతున్నారు. ముఖ్యంగా కరీంనగర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, మెదక్‌ జిల్లాల నిరుద్యోగులకు ఎప్పుడూ అందుబాటులో వుంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయగల సమర్దుడు నరేందర్‌రెడ్డే అని నిరుద్యోగులు బలంగా నమ్ముతున్నట్లు తెలుస్తోంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిసిన వెంటనే నిరుద్యోగ సమస్యపై తాను నిరంతరం కృషి చేస్తానని చెబుతున్నారు. ముఖ్యంగా ప్రైవేటు విద్యా సంస్ధలలేవైనా వాటిలో పనిచేసే ఉద్యోగుల హక్కుల పరిరక్షణకు కోసం ప్రయత్నం చేస్తానంటున్నారు. ప్రైవేటు స్కూళ్లలో పనిచేసే అద్యాపకుల సమస్యలే కాదు, వారికి ఆరోగ్య భీమా అందిస్తానంటున్నారు. ప్రైవేటు రంగాలలో ఉద్యోగ కల్పన కోసం కృషి చేస్తామంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే సదుపాయాలతో కంపనీలు స్ధాపించే పారిశ్రామిక వెత్తలతో మాట్లాడి తెలంగాణ యువతకు ఉద్యోగాలు అందేందుకు ప్రయత్నం చేస్తానంటున్నారు. ఇలా తెలంగాణ విద్యారంగంలో మరింత ముందుకు సాగేందుకు కృషి చేస్తానని నరేందర్‌ రెడ్డి చెబుతున్నారు. దాంతో పెద్దఎత్తున యువత నరేందర్‌ రెడ్డి అభ్యర్దిత్వాన్ని బలపర్చుతున్నారు. నరేందర్‌ రెడ్డిని గెలిపించుకుంటామని ప్రతిజ్ఞలు చేస్తున్నారు. ఇప్పటి వరకైతే ఇతర పార్టీలకు చెందిన ఏ అభ్యర్ది నరేందర్‌ రెడ్డితో సమానమైన సామాజిక సృహ వున్నవారు కాదు. అందుకే నరేందర్‌ రెడ్డి ఎక్కడికి ప్రచారానికి వెళ్లినా పట్టభద్రులు బ్రహ్మరథం పడుతున్నారు. తాము దగ్గరుండి గెలిపించుకుంటామని భరోసా ఇస్తున్నారు. ఇక ప్రచారం విషయంలో కూడా అందరికంటే నరేందర్‌ రెడ్డే ముందున్నారు. నాలుగు జిల్లాలు కలియ చుట్టేశారు. అన్ని వర్గాల ప్రజలతో మమేకమయ్యారు. పట్టభద్రులతో ప్రత్యేకమైన సమావేశాలు ఇప్పటికే అనేకం ఏర్పాటు చేశారు. వారి సమస్యలను సావదానంగా విన్నారు. తాను గెలిస్తే ఎలాంటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారో కూడా చెప్పి, పట్టభద్రులల్లో నమ్మకం నింపారు. అందుకే ఎవరి నోట విన్నా ఒకటే మాట..నరేందర్‌ రెడ్డిదే గెలుపన్నదే వినిపిస్తున్న చర్చ.

పుట్టి ముంచుతున్న అలవికాని హామీలు

సంక్షేమం ముసుగులో సోమరులను తయారుచేస్తున్న పార్టీలు

విద్య, వైద్యానికి ప్రాధాన్యం ఇస్తేనే సమాజానికి మనుగడ

సంక్షేమం ఉత్పత్తికి దోహదం చేసేదిగా వుండాలి

శ్రమైక జీవనంలోనే జీనవ సౌందర్యం

సంక్షేమం మాటున పరాన్నభుక్తులను తయారుచేయొద్దు

సంక్షేమం అభివృద్ధి సమతుల్యమైతేనే సమర్థపాలన

రాజకీయ పార్టీలు అధికారాన్ని హస్తగతం చేసుకోవడమే పరమావధిగా ఎన్నికల్లో హద్దూపద్దూ లేని హామీలు ఇవ్వడం పరిపాటిగా మారిపోయింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితేంటి? అప్పులు, ఆదాయ వివరాలు తెలుసో తెలియదో కానీ హామీలు మాత్రం కోటలు దాటే స్థాయిలో వుంటున్నాయి. తీ రా అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను అమలు చేయలేక కప్పదాటు రాజకీయాలు చేయడం దేశంలో ఒక రివాజుగా మారిపోయింది. క్రమంగా దిగనాసిల్లుకుపోతున్న కాంగ్రెస్‌ పార్టీ ఇటీవలి కాలంలో ఈ ఉచితాలపై ఎక్కువ హామీలు గుప్పించి కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో అధి కారంలోకి రాగలిగింది. కానీ ఇచ్చిన హామీల అమలులో ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ప్రస్తుతం ఢల్లీిలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ కూడా కాం గ్రెస్‌ తన ఉచితాలను ‘అనుచిత’ రీతిలో ప్రకటిస్తుండటం విస్తుపోయేలా చేస్తోంది. ఢల్లీి ఎన్నిక ల్లో ప్రధాన పోటీ ఆమ్‌ఆద్మీ`బీజేపీల మధ్యే వుంటుందని వార్తలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేప థ్యంలో గెలుస్తామన్న ధీమా లేకపోయినప్పటికీ, ‘తెగించి’ మరీ హామీలు ఇస్తోంది. వీటిల్లో 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌, రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ హామీలు ఇప్పటికే తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. అయితే ఢల్లీిలో ప్రతి మహిళకు రూ.2500, వృద్ధ వితంతు వులు, వికలాంగులకు నెలకు రూ.5000, యువతకు రూ.8500 స్టైఫండ్‌ ఇస్తామని కొత్త హామీలను ఇచ్చింది. ఇప్పటివరకైతే కాంగ్రెస్‌కు గాలి అనుకూలంగా లేదు. ఎట్లాగూ ఓడిపోతున్నాం కదా ‘కొండకు వెంట్రుక కట్టాం’ అన్నరీతిలో ఈ హామీలను గుప్పిస్తున్నదేమో తెలియదు. ఎందుకని ఇట్లా అనాల్సి వస్తున్నదంటే, మహిళలకు ఉచితబస్సు సదుపాయం వీటిల్లో లేదు! దీన్ని అమలు చేస్తున్న కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలు ఆర్టీసీకి డబ్బులు కట్టలేక నానా అగచాట్లు పడుతున్నాయి. ఈ బాధలను చూసే ఢల్లీి ఎన్నికల్లో ఈ హామీపట్ల మొగ్గు చూపలేదనుకోవాలి. అయితే మిగిలిన హామీల మాటేంటి? ఒకవేళ అధికారంలోకి వస్తే అమలు చేసే పరిస్థితి కాంగ్రెస్‌కు వుం టుందా? అనేది ఇప్పటికైతే సమాధానం దొరకని ప్రశ్న.

ఉచిత బస్సు కర్ణాటకలో విఫలమైందనే చెప్పాలి. ఈ ఉచిత బస్సు పథకం పుణ్యమాని కెఎస్సార్టీసీ దివాలా తీసే పరిస్థితి ఏర్పడిరది. ‘ఉచిత బస్సు’లోటును పూడ్చడానికి ప్రభుత్వం వద్ద నిధులు లేవు. అట్లాగని పథకాన్ని ఎత్తేయాలంటే భయం! ఈ నేపథ్యంలో టిక్కెట్‌ రేట్లు ఎడాపెడా పెంచేసి ప్రభుత్వం చేతులు దులుపుకున్నది. ప్రస్తుతం పరిస్థితి ఏంటంటే, డబ్బులు పెట్టి టిక్కెట్‌ కొను క్కున్నవాళ్లు నిలబడి ప్రయాణిస్తుంటే, ఉచిత సౌకర్యం పొందేవారు దర్జాగా సీట్లలో కూర్చొని ప్రయాణిస్తున్నారు! తెలంగాణలో కూడా పరిస్థితి భిన్నంగా ఏమీ లేదు. కాకపోతే ప్రభుత్వం పంటి బిగువున ఈ పథకాన్ని అమలు చేస్తున్నదనుకోవాలి. అంతేకాదు తెలంగాణలో ఆరు హామీలు ఇప్పటికీ పూర్తిగా అమలు కావడంలేదంటే అందుకు ప్రధాన కారణం ప్రభుత్వంపై మోయలేని భారమే! ఇది ప్రభుత్వానికి మింగలేని, కక్కలేని పరిస్థితి! మరి ఢల్లీిలో కాంగ్రెస్‌ ప్రకటించిన నెలకు రూ.5000, రూ.2500, యువతకు రూ.8500 స్టైఫండ్‌ పథకాలు తెలంగాణ, కర్ణాటకల్లో అమలు కావడంలేదు. అక్కడ అమలైతే ప్రజలు నమ్మేవారేమో! ఇప్పుడు నమ్మితే మాత్రం ముక్కుమూసుకొని యమునా నదిలో దూకినట్టే! ఇక ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ఆరు హామీల విషయంలో చేతులెత్తేసి, ‘రాష్ట్రం 15శాతం వృద్ధి నమోదు చేస్తే వీటిని అమలు చేస్తామని’ ఎవరికీ అర్థంకాని రీతిలో తనదైన శైలిలో గణాంక వివరాలు చెప్పి ‘కాడి కిందపడేసి’ మమ అనిపించారు. ఆయన చెప్పిన లెక్కలు సామాన్యుడికి అర్థమయ్యేసరికి మళ్లీ ఎన్నికలస్తాయి! పనిలో పనిగా ఆస్తిపన్నుమాత్రం 40`50శాతం పెంచేసి ‘సంక్షేమాలు’ అమలు కావడం లేదన్న పరేషాన్‌లో ఉన్న సామాన్యులపై ‘కర్రు’ కాల్చి వాతపెట్టారు. రాష్ట్రం 15శాతం వృద్ధి చెందేదెప్పుడో చంద్రబాబుకే తెలియాలి. కానీ ఆస్తిపన్ను రూపంలో ఆయన పెట్టిన ‘వాత’ మాత్రం తక్షణం అమల్లోకి వచ్చేసింది. తన ప్రతి వైఫల్యానికి జగన్‌ ‘బూచి’ని చూపి జనాలను భయపెట్టడం ఏపీలో అధికార పార్టీకి అలవాటైపోయింది. రోడ్లు వేయని జగన్‌ను జనం మరచిపోతే, రోడ్లేసిన చంద్రబాబు జనానికి ‘వాత’ల రూపంలో తనను మరచిపోకుండా జాగ్రత్త పడుతున్నారు.

ప్రజాస్వామ్యంలో సంక్షేమం, అభివృద్ధి సమతుల్యంగా సాగాలి. కానీ అధికారంలోకి రావాలన్న ఒకే ఒక్క లక్ష్యంతో పార్టీలు అదుపులేని స్థాయిలో సంక్షేమ హామీలిచ్చేసి, అభివృద్ధిని పట్టించుకో వడంలేదు. ఇక్కడ ఒక్కటి గుర్తుంచుకోవాలి. అధికారంలోకి వచ్చిన పార్టీలు తమ సొంత డబ్బు లు ఈ సంక్షేమాలకు ఉపయోగించడంలేదు. ఈ నిధులన్నీ పన్ను చెల్లింపు దార్లనుంచి వసూలు చేసినవి! ఆవిధంగా ఇతర వర్గాల వారినుంచి ముక్కుపిండి మరీ వసూలు చేసే ఈ నిధులను, ఇష్టం వచ్చిన రీతిలో పప్పుబెల్లాల మాదిరిగా సంక్షేమాలకోసం పంచిపెట్టే అధికారం ప్రభుత్వానికి లేదు. ఎందుకంటే కేవలం కొన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకొని ఓట్లకోసం అమలు చేసే ఈ ఉచితాల వల్ల జనాల్లో పనిచేసే అలవాటు కనుమరుగయ్యే అవకాశాలే ఎక్కువ. మానవుడి ఆశకు అంతుండదు. ఒక కోర్కె తీరగానే మరో కోర్కె నెత్తిన నాట్యం చేస్తుంది. ఇప్పుడు కర్ణాటకలో ఇదే పరిస్థితి! హామీలు ఇచ్చిన సంక్షేమ పథకాలే అమలు చేయలేక ప్రభుత్వం దివాలా తీసే దుస్థితి లో వుంటే, ఇంకా మరిన్ని సంక్షేమాలు కావాలని ప్రజలు కోరుతున్నారట! ఇది సాక్షాత్తు కాంగ్రెస్‌నాయకుడు డి.కె. శివకుమార్‌ అన్న మాటలు! ఈ మితిమీరిన సంక్షేమాల వల్ల పార్టీలు అధికా రంలోకి వస్తున్నాయేమో కానీ, సామాజికంగా తీవ్ర నష్టాలు కలుగుతున్నాయి. ఉచితాలతో కడుపు నిండుతున్నవారు పనులకు పోవడం మానేయడం పల్లెల్లో కనిపిస్తోంది. ఫలితంగా సామాజిక ‘అల్లిక’ దెబ్బతినడం మొదలైంది. అందరూ అన్ని పనులు చేయలేరు. పరస్పర సహకారమే స మాజ మనుగడకు పరమావధి. కానీ సంక్షేమాలు అందే కొన్ని వర్గాలు తాము చేయాల్సిన పనులు చేయకపోవడంతో వ్యవస్థ దెబ్బతినడం మొదలైంది. శ్రామిక ఉత్పత్తి ద్వారా అభివృద్ధి, సంక్షేమం బాటన నడవాల్సిన సమాజాల్లో, ప్రభుత్వాలు సోమరులను ‘ఉత్పత్తి’ చేస్తున్నాయి. ఇది తి రోగమనం తప్పమరోటి కాదు.

ట్రేడ్‌ యూనియన్లు, కమ్యూనిస్టు భావజాలం బాధ్యతలు లేని ‘హక్కు’లను నూరిపోయడంతో ప్ర భుత్వరంగ సంస్థలు పెద్ద గుదిబండలుగా మారాయి. ఇది ప్రైవేటీకరణకు దారితీసి ఉత్పాదకత బాగా పెరగడంతో ఉపాధి అవకాశాలతో పాటు, ప్రజల జీనవ నాణ్యత పెరిగింది. కేవలం ‘హ క్కులు’ మాత్రమే ప్రబోధించిన కమ్యూనిస్టులు కనుమరుగైపోయారు. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ‘సంక్షేమం’ పేరుతో ఇటువంటి బాధ్యతారాహిత్యాన్ని ప్రోత్సహిస్తున్నాయి. ఇది కూ డా ‘బాధ్యతలు’ లేని ‘హక్కుల’ వంటిదే! కాకపోతే దీనికి సంక్షేమం అనే అందమైన ముసుగును వేస్తున్నారు. ఇక్కడ మరో విషయం గుర్తుంచుకోవాలి. ప్రజలు గతంలో మాదిరిగా లేరు. వారి జీవన నాణ్యత పెరిగింది. వాళ్ల ఆలోచనా తీరు కూడా మారింది. తిండి, గుడ్డ, ఇల్లు అనే రోజులుపోయాయి. సంపాదించే తీరుతెన్నులు, సంపద సృష్టిలో ప్రభుత్వ ప్రమేయం లేకుండానే ప్రజలు మారుతున్న కాలానికి అనుగుణంగా తమను తాము మార్చుకొని ముందుకు సాగుతున్నారు. అందువల్ల అధికారంలోకి వచ్చే పార్టీలు ముఖ్యంగా ఆలోచించాల్సింది అర్థంపర్థంలేని హామీలకు కాకుండా, ఉచితవిద్య, ఉచిత వైద్యంపై దృష్టి కేంద్రీకరిస్తే ప్రజలకు అంతకు మించి చేసే మేలు మరోటుండదు.

విద్య, వైద్యం నేడు ఎంతో ఖరీదైనవిగా మారాయి. మనిషి ఆరోగ్యంగా వుంటేనే పనిచేయగలడు.పనిచేస్తేనే ఉత్పాదకత పెరికి ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుంది. వైద్యానికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన కారణం ఇదే. సామాన్యులు తమ ఆదాయంతో అప్పులు చేయకుండా ప్రశాంతంగా జీవించాలంటే, విద్యను ఉచితంగా అందించాలి. తల్లిదండ్రులకు తమ పిల్లల చదువు పెద్ద భారం కారాదు. అప్పుడు మాత్రమే వారు తమ జీవితాలకు భరోసా లభించినట్టు భావించగలరు. ఎందుకంటే తమ పిల్లలకు గౌరవప్రద స్థానాన్ని కల్పించే విద్య, అనారోగ్యానికి అందుబాటులో చికిత్స వున్నప్పుడు వారు తమ మిగిలిన అవసరాలపై దృష్టి కేంద్రీకరిస్తారు. ఫలితంగా వారి జీవనగమనం సాఫీగా సాగుతుంది. ప్రజల సంక్షేమం పట్ల నిజమైన నిబద్ధత కలిగిన రాజకీయ పార్టీలు ప్రధానంగా చేయాల్సింది ఇదీ! ఆరోగ్యశ్రీ అమలు చేస్తున్నాం కదా అని చెప్పవచ్చు. ప్రభుత్వ బకాయిలు పేరుకుపోవడంతో కార్పొరేట్‌ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీని అమలు చేయడానికి కొన్ని సందర్భాల్లో ముందుకు రావడంలేదు. ప్రభుత్వం బకాయిలు పడటానికి ప్రధాన కారణం ఇతర సంక్షేమ పథకాల భారం! ఈ భారాన్ని మోయలేరు, తీసేయలేరు! ఇదొక విచిత్ర సంకట స్థితి! ఒక రకంగా చెప్పాలంటే ‘ఉచితాలు’ ప్రకటించి అధికారంలోకి వచ్చిన పార్టీలు ప్రశాంతంగా లేవు. ‘ఉచి తాలు’ అందని మెజారిటీ ప్రజలు సుఖంగా లేరు. అందువల్ల ఉచితాలు కాదు కావలసింది ఉపాధి. ఒక వర్గంవారిపై భారంవేసి మరో వర్గంవారిని పైకి తేవాలనుకోవడం సముచితం కాదు! ఎందుకంటే ఆ వర్గాలకు డబ్బులు ఊరికే రావడంలేదు! ఎంతో కష్టపడితేనే వస్తున్నాయి! అటు వంటి తమ కష్టార్జితాన్ని పన్నులపేరుతో ముక్కుపిండి వసూలు చేసి సంక్షేమాల పేరుతో అభివృ ద్ధిని నిర్లక్ష్యం చేయడం సమర్థపాలన అనిపించుకోదు. అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి మాత్ర మే సుపరిపాలన అనిపించుకుంటుంది! మరి ఈ ఓట్ల సుడిగుండంలో చిక్కుకున్న పార్టీలు బయటకు వచ్చి సమర్థపాలన అందించడం ఇప్పట్లో సాధ్యమయ్యేదేనా?

` ఈసారైనా ‘‘దయ’’ చూపమ్మా!

` సామాన్యులు చితికిపోతున్నారు.

` వేతన జీవులు విలవిలలాడుతున్నారు.

` పద్దుకు పన్నులే ముఖ్యమా?

` సామాన్యుల జీవితాలు పట్టవా?

` ఓట్లేసి గెలిపించేది పేద ప్రజలు!

` వాయింపులు అనుభవించేది సగటు జనాలు!

` మద్య తర’గతి’ మారేనా?

` ఈసారి పద్దులో పన్నుల భారం తగ్గేనా?

` ఈసారైనా సామాన్యులపై కనికరం చూపిస్తారా?

` పదేళ్లుగా మధ్య తరగతి నరకం చూస్తున్నారు.

` ఇప్పుడన్నా ఊరట కల్గుతుందేమో అని ఎదురుచూస్తున్నారు.

` ఇంతకాలం నడ్డి విరుస్తూనే వచ్చారు.

` పన్నుల మోత ఇకనైనా తగ్గించండి.

` వాయింపులు వాయిదా వేయండి.

` సామాన్యలను బతకనీయండి.

` పేదల బతుకు బస్టాండు చేయకండి.

` పన్నులు కట్టలేక పడరాని పాట్లు పడుతున్నారు.

` సంపాదించింది మిగలలేక దిగులు పడుతున్నారు.

` కొనుగోలు శక్తి తగ్గి కుదేలౌతున్నారు.

` సంపాదన తిండికే సరిపోవడం లేదు.

` దేశమంతటా వలసలు పోతున్నారు.

` ఉత్తరాధి నుంచి దక్షణాదికి కడుపు కట్టుకొని వస్తున్నారు.

` కూలీ నాలి చేసుకొని బతుకుతున్నారు.

` పిల్లలను కనీసం చదివించుకునే దిక్కులేదు.

` రోగమొస్తే వైద్యానికి దిక్కులేదు.

` గంభీరంగా జనం బతుకుతున్నారు.

` బలహీనంగా బతుకులీడుస్తున్నారు.

ఈసారైనా తమ కష్టాలు తీరుతాయా? పన్నులు తగ్గుతాయా? జీవితాలు మెరుగు పడతాయా? అంటూ సామాన్యులు కళ్లలో ఒత్తులు వేసుకొని ఎదురుచూస్తున్నారు. కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలమ్మ ఈసారైనా మాపై దయచూపమ్మా అంటూ వేడుకుంటున్నారు. ప్రజలు సమస్యలతో సతమతమౌతున్నారు. ఆర్దిక ఇబ్బందులు తాళలేక ఆగమౌతున్నారు. వచ్చేరూపాయికి, వెళ్లే రూపాయికి పొంతన లేక జనం అవస్ధలు పడుతున్నారు. కొనుగోలు శక్తి లేక ఆకలికి మాడుతున్నారు. కడుపులు మాడ్చుకుంటున్నారు. ఉల్లి ధరలు పెరిగితే తినడం మానేయండి అని చెప్పినంత సులువు కాదు..జీవితాలంటే..ఓ వైపు ధరలు ఆకాశాన్నంటుతుంటే తగ్గించకపోగా, వాయింపులు పెరుగుతున్నాయి. ఏ కొనేటట్టు లేదు. ఏం తినేటట్టు లేదని జనం ఆందోళన చెందుతున్నారు. ప్రజలకు ఉచిత రేషన్‌ ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటే సరిపోదు. ఆ రేషన్‌తో జనం బతుకుతున్నారని పాలకులు లెక్కలేసుకుంటే బాగున్నారని అర్ధం కాదు. సగటు వ్యక్తి తన ఆశలు, కోరికలు అన్నీ చంపుకొని బతుకుతున్నాడు. కంటి నిండా నిద్రపోయే పరిస్ధితి లేదు. కుటుంబమంతా కష్టపడుతున్నా పూట గడవడం లేదు. పదేళ్లు అసంఘటిత కార్మికులు కూలీలు పెరగడం లేదు. వారి జీవితాలకు భరోసా లేదు. జీతాలు పెరగక వేతన జీవులు విలవిలలాడుతున్నారు. కార్మికుల జీవితాలు ఆగమ్య గోచరంగా తయారౌతున్నాయి. చిన్న పరిశ్రమలు లక్షల్లో మూతపడుతున్నాయి. కార్పోరేట్‌ వ్యాపారులు కూడా చేతులేత్తేసున్నారు. ఆర్ధిక వ్యవస్ధ కుదలేలౌతోంది. ఆర్ధిక వ్యవస్ద చిన్నాభిన్నమౌతోందని ఆర్ధిక నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ప్రపంచం ఎటు వెళ్తుందో..మనం ఎటు వెళ్తున్నామో కూడా తెలియకుండానే కాలం గడిచిపోతోంది. డిమాండ్‌, సప్లయ్‌లో సమతూకం లేకుండాపోతోంది. ప్రజల్లో కొనుగోలు శక్తి పూర్తిగా క్షీణిస్తోంది. మార్కెట్‌లో మనీ సర్కులేషన్‌ లేకుండాపోతోంది. డిమాండ్‌ ఎకనామిక్స్‌ను అనుసరించాల్సిన పాలకులు సప్లయ్‌ ఎకనామిక్స్‌కు ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్నారు. అయినా కార్పోరేట్‌ శక్తులు చేతులేత్తేస్తున్నాయి. అయినా పాలకులకు పట్టింపు లేదు. ప్రజల నుంచి ముక్కు పిండి పన్నులు వసూలు చేస్తున్నారు. కార్పోరేట్‌ కంపనీలకు రాయితీల మీద రాయితీలు ఇస్తున్నారు. అయినా ఎక్కడ లోపం జరగుతోంది. పెట్టుబడులు పెట్టి దివాళా తీశామని చెబుతున్నారే గాని, ఉపాది కల్పించి దాఖలాలు కనిపిస్తున్నాయా? నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోతోంది. కరోనా సమయంలో కార్పోరేట్‌ శక్తులకు పదిలక్ష కోట్లు మాఫీ చేశారు. కాని సగటు జనం నుంచి లెక్కకు మించి వసూలు చేస్తున్నారు. వేతన జీవి తన ఏడాది కాలంలో వచ్చే జీతంలో మూడు నాలుగు నెలల జీతంలో కోత పడుతోంది. పన్నుల రూపంలో నేరుగా ఖజానాకు చేరుతోంది. ఉద్యోగి జేబుకు నేరుగా చిల్లు పడుతోంది. ఈ చిల్లు పూడేదెలా? వేతన జీవి కొనుగోలు శక్తి పెరిగేదెలా? ప్రజల మీద వేసిన పన్నుల భారంతో 13శాతం వృద్ది రేటు పెరగుతుందని అంచానా వేశారు. కాని అది 33శాతానికి పెరిగింది. అదే కార్పోరేట్‌ శక్తుల నుంచి ఆదాయం పెరుగుతుందనుకుంటే .5 శాతానికి పడిపోయింది. లోపం ఎక్కడుంది. కార్పోరేట్‌ శక్తుల నుంచి పన్నులు వసూలు చేయడంలో అసత్వం వహిస్తున్నారు. సామాన్యుల నుంచి ఉప్పు, పప్పు, చెప్పు,నిప్పు నుంచి కూడా పన్నుల మీద పన్నులు వేసి వసూలు చేస్తున్నారు. ఖజానా నింపుకుంటున్నారు. కార్పోరేట్‌ శక్తులకు రాయితీలు ప్రకటిస్తున్నారు. జిడిపి 5శాతానికి పడిపోయిందంటున్నారు. యూపియే 2లో 9శాతంగా పెరిగిన జిడిపి ఇంతలా ఎందుకు దిగజారుతోంది. జనం వద్ద కొనుగోలు శక్తిలేక కార్పోరేట్‌ శక్తులు ఉత్పత్తులు తగ్గించాయి. కార్మికులను తొలగిస్తూ వున్నాయి. ఆఖరుకు కంపనీలే మూతపడుతున్నాయి. పన్నుల విధానం నచ్చక ఎంతో మంది దేశం వదిలి వెళ్లిపోతున్నారని నిత్యం వార్తలు వస్తున్నాయి. సగటువ్యక్తులు దేశంలోనే ఉపాధి వెతుక్కుంటూ దేశమంతా తిరుగుతున్నారు. ఇల్లూ, వాకిలి వదిలిపెట్టి వసలు పోతున్నారు. 2014లో బియ్యం ధరలు ఎలా వున్నాయి? ఇప్పుడు ఎలా వున్నాయి? అందుకే ప్రజలు ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం వడ్డింపులపై ప్రశ్నలు కురిపిస్తున్నారు. పాప్‌కార్న్‌ కొన్నా పన్నుల వాయింపులపై నిలదీస్తున్నారు. విద్యార్దులు రాసే పరీక్షల మీద కూడా జిఎస్టీ విధించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయినా జనం గొడు కేంద్రానికి పట్టడం లేదు. పద్దులకు పన్నులే ముఖ్యమా? అని నిలదీస్తున్నారు. ఈసారైనా పద్దులో కనికరం చూపమని కోరుతున్నారు. ఓ వైపు అమెరికా ప్రజలను పన్నుల భారం నుంచి విముక్తి చేస్తామని ప్రకటిస్తోంది. ప్రజలను పన్నుల భారం నుంచి తప్పిస్తామంటోంది. కాని మన దేశంలో పన్నులే అసలైన పద్దులన్నట్లు సాగుతోంది. ఓట్లేసి మూడుసార్లు ప్రజలు ఎన్నుకుంటే సామాన్యులకు ఎప్పుడైనా ఊరట కల్గిందా? ఓట్లేసి సామాన్యులు. గెలిపించేది సామాన్యులు. బాగు పడేది కార్పోరేట్లు. వాళ్లు ఓట్లేసేది లేదు. ఓట్లు వేమయని చెప్పేది లేదు. కాని వాళ్లను కాపాడుతున్నారు. ప్రజలజీవితాలను గాలికి వదిలేస్తున్నారు. ఈసారైనా..ఈసారైనా అంటూ పదేళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడూ కూడా కోటి ఆశలు పెట్టుకుంటున్నారు. మధ్య తరగతి జీవితాలకు ఊరట కలుగుతుందని ఆశపడుతున్నారు. ఈసారి పద్దులో పన్నుల భారం తగ్గుతుందని ఆశిస్తున్నారు. ముఖ్యంగా ఇన్‌కంటాక్స్‌ విషయంలో పది లక్షల నుంచి పదిహేను లక్షలకు వెసులుబాటు కల్పిస్తారని ప్రచారాలు సాగుతున్నాయి. కాని అయినా అనుమానం అందరినీ వెంటాడుతూనే వుంది. ఇంత కాలం వడ్డిస్తూనే వున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు తగ్గుముఖం పట్టినా, మనకు మాత్రం పైసా తగ్గింది లేదు. ఊరట లభించింది లేదు. కాని ధరల పెరుగుదల కనీసం ఆగింది లేదు. పెట్రోలు ధరలు తగ్గించింది లేదు. ఒకప్పుడు పెట్రోల్‌, డీజిల్‌ ధరలకు ఎంతో వ్యత్యాసముండేది. ఇప్పుడు రెండూ సరిసమానమైపోయాయి. ప్రపంచంలో ఎలక్రిసిటీ వాహనాలు పెరుగుతున్నాయంటూ మనం వాటి వెంట పరగులు తీస్తున్నాం. తాజాగా అమెరికాలో ఎలక్రిసిటీ వాహనాలకు స్వస్తిపలికేందుకు సిద్దపడిరది. పెట్రో ఉత్పత్తులను విపరీతంగా పెంచుకునేందుకు ట్రంప్‌ అనుమతులిస్తున్నారు. అంటే పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు చేస్తే మొదటికే మోసం వస్తోంది. ప్రతి వ్యక్తి కనీస అవసరాలు తీరడం లేదు. సామాన్యుడు ఇల్లు కొనుక్కునే దిక్కులేదు. అంతెందుకు కనీసం ఓ ద్విచక్రవాహనం కొనుగోలు చేసుకునే పరిస్దితి లేదు. పెట్రోలు ధరలు పెరుగుతున్నా కొద్ది వాహనాల ధరలు అమాంతం పెరుగుతున్నాయి. సామాన్యులకు అందకుండాపోతున్నాయి. ఉప్పు,పప్పుల పరిస్దితే ఇలా వుంటే ఖరీదైన వస్తువుల ధరలు సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సెల్‌ ఫోన్‌ వాడకం దారులకు నెల రీచార్జికి డబ్బులు వసూలు చేస్తూ, 28 రోజులకు వ్యాలిడిటీ అందిస్తుంటే వాటిని కంట్రోల్‌ చేయలేకపోతున్నారంటే అర్ధమేమిటి? అటు పాలకులకు వడ్డించి, అటు ప్రైవేటు కంపనీలు వాయించుకుంటూ పోతే సామాన్యుడు బతికెదెలా? పూట గడవడమే కష్టంగా మారుతుంటే పిల్లలకు చదువులెట్లా? వారి ఆరోగ్యాలకు భద్రత ఎట్లా? ఓ వైపు కుటుంబాల ఆర్దిక పరిస్దితి చితికిపోతుంటే, పిల్లల్ని కనండి అని ఉచిత సలహాలు ఇస్తూ పోతున్నారు. జనం గోడు వినిపించుకునే పరిస్దితి లేదు. అందుకే సామాన్యులను బతకనీయండి. పేదల బతుకులు బస్టాండ్‌ చేయండి. రాజుల కాలానికి ఇప్పటికీ తేడా ఏముంది? అప్పుడు రాజులు నిరంకుశత్వంగా పాలిస్తూ, ప్రజలను పీడిరచుకుతిన్నారు. మనల్ని పాలించిన ఆంగ్లేయులు పీడన భరించలేకనే స్వాతంత్య్రం తెచ్చుకున్నాము. ఆనాడు ఉప్పుమీద పన్నును భరించలేకనే పోరాటం చేశాము. మరి ఇప్పుడు మన పాలన. మన ప్రజాస్వామ్యం. మరి ఎవరి మేలు కోసం ఈ పన్నుల భారాలుఅని ప్రశ్నలు వినిపించడం లేదా? అభివృ ద్ది కావాలంటే పన్నుల వసూలు చేయాలి. కాని పన్నుల వసూలుకు, అభివృద్దికి సమతూకం లేదు. ప్రజలు పన్నులు కట్టలేక పడరాని పాట్లు పడుతున్నారు. సంపాదించిన దానిలో రూపాయి మిగలడం లేదని దిగులు పడుతున్నారు. అనారోగ్యాల పాలౌతున్నారు. ప్రభుత్వానికి ఖజానా ఎంత ముఖ్యమో..ప్రజలకు తమ ఆర్ధిక స్ధితి కూడా అంతే…కాకపోతే ప్రభుత్వ ఖజానాలో నిలువ వుండదు. జనం జేబులను కూడా అలాగే మార్చుతున్నారు. దీనిని ఆర్ధిక ప్రగతి అనలేరు. దివాళా దిశగా పరుగులు అంటారు. ఇప్పటికైనా అర్దం చేసుకోండి. ప్రజలకు ఊరట కల్గించండి.

హిందూ పునాదులు…యుగాల చరిత్రకు సజీవ సాక్ష్యాలు!

`హిందూ సమాజాన్ని కాపాడేందుకు దేవుళ్లే వున్నారు.

`మానవ మాత్రులు కాపాతున్నామనడం కేవలం రాజకీయం.

`హిందూ జనోద్దరణకు దైవ భక్తులున్నారు?

`రాజకీయ పార్టీలు పని గట్టుకొని హిందుత్వాన్ని నిలబెట్టేదేమీ లేదు?

`రాజకీయ పార్టీలు నిలబెడితేనే హిందూ మతం కొనసాగేది కాదు?

`ఎన్ని యుగాలైనా హిందూ మతం అంతరించేది కాదు!

`ఇతర మతాలు పాలించినా హిందూ ప్రవాహం ఆగిపోలేదు.

`ముస్లిం రాజ్యాలు సాగినా హిందూ వెలుగు ఆరలేదు. ఆపలేదు.

`ఆంగ్లేయుల పెత్తనంలో ఏ హిందూ సమాజం భయపడలేదు.

`ఇప్పటికే కాదు, ఎప్పటికీ హిందూ మతానికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు?

`రాజకీయ పార్టీలు మాత్రమే హిందూ ఉద్దరణ చేసేవి కాదు!

`ఏ పార్టీ అధికారంలో వున్నా హిందువులపై ప్రభావం చూపలేరు.

`హిందూ సమాజం వేల సంవత్సరాల నుంచి మనుగడలో వున్నదే!

`యుగయుగాల చరిత్ర మన కళ్లముందు కదలాడుతున్నదే.

`వేదాలు, ఉపనిశత్తులతో కళకళలాడుతున్నదే.

`మధ్యలో వచ్చిన మతాల గురించి దిగులెందుకు?

`రాజకీయ నాయకుల అండదండలు హిందూ మతానికెందుకు?

హైదరాబాద్‌,నేటిధాత్రి:

ధర్మో రక్షితే రక్షిత: అని పెద్దలన్నారు. ధర్మాన్ని నువ్వు కాపాడితే మతాన్ని ఆ ధర్మమే మతాన్ని కాపాడుతుందంటారు. ఇంతకీ ధర్మాన్ని ఎవరు కాపాడుతున్నారు. సత్యభోధన ఎవరు చేస్తున్నారు. ఉపాసకులు ఎక్కడున్నారు. గురువులు ఏం బోధిస్తున్నారు. ఇవన్నీ పరిగణలోకి తీసుకోవాలి. అంతే కాని దేశాన్ని కాపాడేది పాలకులౌతే, మతాన్ని కాపాడుకునేది ప్రజలే..కాని ఆ ప్రజల రూపంలో వున్న రాజకీయ నాయకులు మేమే కాపాడుతున్నామంటూ ప్రజల మధ్య లేనిపోని విభజనలు చేస్తున్నారు. పాలకులు అందర్నీ పాలించాలి. ధర్మానికి, నీతికి,నిజాయితీకి ఇబ్బంది కలగకుండా చూడాలి. అంతే కాని కేవలం మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయడం అలవాటు చేసుకుంటున్నారు. అందులో ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు. అన్ని పార్టీలు అలాగే వున్నాయి. మైనార్టీల ఓట్లకోసం కొన్ని పార్టీలు, మెజార్టీ ప్రజల ఓట్లకోసమంటూ కొన్ని పార్టీలు రాజకీయాలు చేస్తున్నాయి. మతాలమీద పేటెంట్లు తీసుకుంటున్నాయి. అసలు హిందూ మతోద్దరణ ప్రజలు చూసుకుంటారు. ప్రజలే హిందూ మతాన్ని రక్షించుకుంటారు. పాలకులు ప్రజలను రక్షిస్తే చాలు. వారి యోగక్షేమాలు చూసుకుంటే చాలు. వారికి నాణ్యమైన విద్య, వైద్య ఉచితంగా అందిస్తే చాలు. ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తే చాలు. దేశానికి ఎవరైనా హని కలిగించాలని చూస్తే వారిని శిక్షిస్తే చాలు. మన దేశంలో, ధర్మం, మతం ఇంకా ఎన్ని యుగాలైనా సాగుతుంది. ప్రపంచానికి దారి చూపుతుంది. అంతే కాని ఎవరో వచ్చి, ఏదో చేస్తే హిందూ మతానికి వచ్చే ప్రమాదమేమీ వుండదు. అనాది కాలం నుంచి హిందూ మతాన్ని రాజులేం కాపాడలేదు. ప్రజలే కాపాడుకుంటూ వచ్చారు. హిందూ మతాన్ని ప్రజలే పోషించుకుంటూ వచ్చారు. అందులో రాజులు కూడా వున్నారు. వారి వారి నమ్మకాలను బట్టి గుళ్లు గోపురాలు నిర్మించారు. దైవ కార్యాలు చేశారు. అందుకే హిందూ మతం ఇప్పటిదాక నిలబడుతోంది. ఎన్ని యుగాలైనా నిలబడుతుంది. ఆసేతు హిమాచలం వరకు హిందూ నాదం మోగుతూనేవుంటుంది. అఖండ భారత్‌ అనే పదం ఎన్ని వేల సంవత్సరాలకైనా నిలబడుతుంది. అందుకే రాజకీయ పార్టీలు తమ రాజకీయ అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు మతాన్ని ఏ పార్టీ అడ్డుపెట్టుకోకూడదు. మన రాజ్యాంగ స్పూర్తిని ఆచరించాలి. వేదాలు, ఉపనిశత్తులు వ్యక్తి ఎలా వుండాలి. సమాజం ఎంత ఔన్నత్యంగా వుండాలని చెప్పాయే గాని, ఒకరు ఒకరిపై ఆదిపత్యం సాగించమని చెప్పలేదు. సమాజంలో మంచి చెడు ఎప్పుడూ వుంటాయి. అనాదిగా మన సమాజంలో హెచ్చు తగ్గులెందుకున్నాయి. సమ సమాజ నిర్మాణం ఎందుకు లేదు. మాటల వరకే పరిమితమైన ఆ సూక్తులు ఎందుకు ఆచరించబడలేదనే చర్చ కావాలి. సనాతన దర్మం అంటే అర్ధమేమిటో కూడా తెలియని వాళ్లు మాట్లాడుతున్నారు. అక్షరం ముక్క తెలియని వాళ్లు సనాతన ధర్మం గురించి చెబుతూ తమ ఆధిపత్యాన్ని కొనసాగించాలని చూస్తున్నారు. ఆ దౌర్భాగ్యమే సమాజంలో చీలకలను సృష్టిస్తున్నాయి. హిందువులలో అసమానతలు పెంచి పోషిస్తున్నాయి. ఇప్పటీకి మన సమాజంలో చాలా వర్గాలపై చిన్న చూపు ఎందుకు వుంది? అంటరాని తనం ఒక పాపం అంటూ చెబుతూ వచ్చారు. సమాజంలో చైతన్యం వచ్చిన తర్వాతే అంటరాని తనం ఒక నేరం అని చట్టం తెచ్చుకోగలిగాం. అందుకే విద్యావంతమైన సమాజం నిర్మాణం జరగాలి. విద్య అంటే వేదాలు, ఉపనిత్తులు చదివిన వారే విజ్ఞానవంతులు కాదు. మానవత్వం నిండిన చదువు చదివిన వారు విజ్ఞానవంతులు. తోటి మనిషిని ప్రేమించాలి. గౌరవించాలి. ఆదరించాలి. ఒకరికొకరు సాయ పడాలి అని చెప్పే చదువులు కావాలి. కన్న తల్లికి, తండ్రికి మంచినీళ్లు పోయిని వాడు కూడా దేవుడంటూ కొలుస్తాడు. సనాతన ధర్మం గురించి గొప్పలు చెబుతాడు. ముళ్లోకాలను చుట్టి రమ్మని శివుడు చెబితే, వినాయకుడు తల్లిదండ్రులే ముళ్లోకాలతో సమానమని నిరూపించారు. మరి అదే ప్రజలు తమ తల్లిదండ్రులను దైవంగా చూస్తున్న రోజులున్నాయా? ఒకప్పుడు తల్లిదండ్రులు ముసలి వాళ్లయినా భయంతోనో, భక్తితోనో తల్లిదండ్రులను చివరి వరకు చూసుకున్నారు. కాని నేడు ఆ పరిస్దితి వుందా? తల్లిదండ్రులకు ఒక వయసు వచ్చిందంటే చాలు నేను, నా భార్యా పిల్లలు అంటూ వెళ్లిపోతున్నారు. తల్లిదండ్రులకు దూరమౌతున్నారు. వారిని దూరం చేస్తున్నారు. అలాంటి వారిలో ఎంతోమంది రాజకీయ నాయకులు కూడా వున్నారు. ఎంత మంది రాజకీయ నాయకుల తల్లిదండ్రులు తమ వద్దనే వుంచుకుంటున్నారు. వారికి సేవలు చేస్తున్నారు. అలాంటి వారు సమాజానికి సేవ చేస్తున్నారంటే నమ్మొచ్చా? ప్రజలకు మేలు చేస్తారంటే విశ్వసించొచ్చా? నీతులు చెప్పి గోతులు తవ్వేవారే నీతి వంతమైన సమాజం గురించి చెబుతున్నారు. వాళ్లకు వేదంలో ఏముందోతెలియదు. పురాణాలు ఏం చెప్పాయో తెలియదు. సనాతన దర్మం ఏం సూచించిందో తెలియదు. కాని ఆ పదం మాత్రం పట్టుకున్నారు. తెలిసీ తెలియని జ్ఞానంతో సమాజాన్ని ఇంకా చెడగొడుతున్నారు. ఒక బ్రాహ్మణుడు ఒక దళితుడితో స్నేహం చేస్తాడా? ఒక బ్రాహ్మణుడు దళితుడిని ఇంటికి తీసుకెళ్లగలడా? ఒక ఉన్నత వర్గానికి చెందని వ్యక్తి, దళితులతో స్నేహం చేయడానికి ఇష్టపడతారా? ఇప్పటికీ గ్రామాల్లో సహపంక్తి భోజనాలలో ఏర్పాటు చేసినా సంతోషంగా పాలు పంచుకోగలరా? మతం మౌడ్యమని ఇందుకే అన్నారు. అందుకు హిందూ మతం కారణం కాదు. ఆ హిందూ మతంలో మేమే గొప్ప అని చెప్పుకునే వారు చేసిన అపచారం. పురాణాలలో ఏం రాసిందో ఒక యాభై సంవత్సరాల క్రితం వరకు కోట్లాడి మంది నిరక్ష్యరాస్యులైన హిందూ ప్రజలకు తెలియదు. మహాభారతంలో ఏకలవ్యుడు చాటుమాటుగా విలువిద్యనేర్చుకుంటే, తన శిష్యుడి అర్జునుడిని మించిన విద్య నేర్చిన వాళ్లుండొద్దని బొటన వేలు తీసుకున్న గురువును ఆ సమాజం ప్రశ్నించిందా? వారి ప్రశ్నలు అప్పటి పాలకులకు వినిపించాయా? సనాతన ధర్మం మహిళలకు విద్య అవసరం లేదని చెప్పింది. కాని చదువుల తల్లి సరస్వతిని పూజించమని చెప్పింది. ఇందులో ఎక్కడైనా న్యాయం అన్న పదానికి తావుందా? సాక్ష్యాత్తు సరస్వతీ దేవి అమ్మవారే చదువుల తల్లి అయినప్పుడు పూర్వపు కాలంలో కనీసం రాణులైనా చదువుకున్నారా? కనీసం బ్రాహ్మణ స్త్రీలకైనా చదువు నేర్పారా? పూజలు పురుషులే చేయాలని అంటారు. ఇంట్లో మహిళలు పూజలు చేస్తే అందులో పుణ్యం పురుషులకు దక్కదని ఇప్పటికీ చెబుతుంటారు. అంటే స్త్రీలు పూజలు చేయడానికి కూడా పనికిరారా? మహిళలలు చదువుకుంటే వాతావరణాల్లో మార్పులు వస్తాయిని చెప్పిన వాళ్లున్నారు. మహిళలను కేవలం పిల్లలు కనే యంత్రాలుగా మాత్రమే చూశారు. పురుషాదిక్య సమాజంలో మహిళలను ఇంటికే పరిమతం చేశారు. ఒంటింటికే పరిమితం చేశారు. పడక గదికే పరిమితం చేశారు. వారసులను కనిచ్చే యంత్రాలుగా తయారు చేశారు. అంత దాకా ఎందుకు ఇప్పుడు కూడా పిల్లల్ని కనండి? ఎంత మంది వీలైతే అంత మందిని కనండి? అంటున్నారు. తల్లి కావడం ఆడవాళ్లకు వరం అని చెప్పి, పురిటి గండం అనేది ప్రమాదరకమని తెలియదా? ప్రకృతిలో వున్న జీవులన్నీ, మనుషులమూ ఒకటేనా? అందులో ఆడవాళ్లు కూడా ఇతర ప్రకృతి జీవులతోనే సమనామా? భర్త చనిపోతే చితి మంటల్లో వేసి కాల్చిన దర్మం ఎలా సనాతనమౌతుంది. ఇలాంటి అకృత్యాలు సనాతన ధర్మం నేర్పిందా? అందుకే దర్మం ఏమిటో, సనాతన ధర్మం చెప్పిందేమిటో కూడా నేటి సమాజానికి తెలియాల్సి వుంది. యోగులు, త్యాగులు, సర్వసంగ పరిత్యాగులు పెళ్లిళ్లు చేసుకోరు. బ్రహ్మచర్యంలో వుంటారు. అలాంటి వాళ్లు సంసార జీవితాల గురించి సూక్తులు చెబుతుంటారు. సంసారంలో వచ్చే కష్ట నష్టాలు తొలగిపోయేందుకు మార్గాలు చూపిస్తుంటారు. కామి గాని వాడు మోక్ష గాని కాదని మళ్లీ అదే సనాతన ధర్మం చెబుతుందంటారు. ఒక ఊరికి ఒకే దారి వుండాలని లేదు. కాని ఒక ధర్మం కోసం ఒకటే సూక్తి వుండాలి. పది సూక్తులను చూపించి ధర్మాన్నికి పది మార్గాలు రచించకూడదు. కళ్లు తెరిస్తే వెలుగు లోకం కనిపిస్తుంది. కళ్లు మూసుకుంటే లోకం చీకటి కాదు. చీకటైప్పుడు మాత్రమే లోకం కనిపించదు. అలాగే మనలో చీకటి నిండినప్పుడు మాత్రమే లోకంలో వెలుగు కనిపించదు. నిజాన్ని ఇలా చెప్పడానికి ఎవరూ ఇష్టపడరు. కళ్లు మూసుకొని చీకటైందనుకుంటారు. తన చూసిన కళ్లతోనే వెలుగని, చీకట్లో బతుకుతుంటారు. హిందూ సమాజ ఉద్దరణ మేమే చేస్తున్నామని భ్రమలో బతుకుతుంటారు. సర్వే జనా సుఖినోభవంతు అని చెప్పడం కాదు, అందరి మేలు కోరుకునే వారు మన చుట్టూ ఎంత మంది వున్నారు. పక్కొడి మేలు కోసం సాయం చేయడానికి ఎంత మంది ముందుకొస్తారు. అందుకే ధర్మానికి, మతానికి ముడిపెట్టకండి? మేమే మతానికి కాపాలదారులమని ఎవరూ చెప్పకండి. మన మతాన్ని దేవుడే కాపాడుకుంటాడు. ప్రజలకు వెలుగును ప్రసాదిస్తుంటాడు. అందుకే దేవుడంటారు. ఆ దేవుడిని రాజకీయాలలో బందీ చేయకండి. ప్రపంచంలో వున్న అన్ని మతాలకంటే పురాతనమైనది..గొప్పది హిందూ మతమే. హిందూ మతంలో వున్న గొప్పదనమే ఆ మతాన్ని కాపాడుకుంటుంది. మన దేశ రాజులు ఎంతో మంది మన పొరుగున వున్న రాజ్యాలను పాలించారు. ఇతర దేశాల నుంచి మన దేశానికి వచ్చిన వాళ్లు మన దేశాన్ని పాలించారు. కాని ఎవరూ హిందూ మతంపై పగ పట్టిన వాళ్లు ఎవరూ చరిత్రలో మిగిలిపోలేదు. 674 నుంచి 1773 వరకు ముస్లింలు పాలించారు. అయితే అందులోనూ ఎంతో మంది హిందూ రాజులు కూడా వున్నారు. తర్వాత ఆంగ్లేయులు పాలించారు. మన దేశ సంపదను కొల్లగొట్టుకుపోయారే గాని మన సంస్కృతిని మీద దాడి చేయలేకపోయారు. మన హైందవంపై ఆధిపత్యం సాగించలేకపోయారు. నది పారుతున్నప్పుడు అక్కడక్కడ మురికి కూడా చేరుతుంది. అలాగే కొంత మంది మతాలు మారినంత మాత్రాన హిందూ మతం కొన్ని వేల సంవత్సరాలుగా వెలుగుతూనే వుంటుంది. హిందూ మతం అనేది అఖండ జ్యోతి లాంటిది. దానికి వెలిగించే శ క్తి మనిషికి లేదు. దానిని ఆర్పే శక్తికూడా మనిషికి లేదు. అంతే…

రూ.2లక్షల కోట్లు దాటనున్న మహాకుంభ్‌ ఆదాయం?

ప్రపంచంలో ఏ ఉత్సవమూ దీనికి సాటిరాదు

ఆధ్యాత్మికమే కాదు వేలమందికి ఉపాధి కల్పిస్తున్న మేళా

దిగ్గజ కంపెనీల ప్రకటనల ఖర్చే రూ.3600 కోట్లు!

చిరు వ్యాపారుల నుంచి హెలికాఫ్టర్‌ సర్వీసుల వరకు పుష్కలంగా ఆదాయం

ఖర్చుకు వెనుకాడని భారతీయులు

త్వరలోనే ప్రపంచంలో మూడో వినియోగ మార్కెట్‌గా భారత్‌

పండుగలే పుష్కల ఆదాయం వనరులు

అన్ని వర్గాల వారికి ఉపాధి కల్పిస్తున్న పర్వదినాలు

హైదరాబాద్‌,నేటిధాత్రి:

ప్రయాగ్‌రాజ్‌లో ప్రస్తుతం జరుగుతున్న మహాకుంభమేళా ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక మేళా అన్న సంగతి తెలిసిందే. కానీ ఈ మహాకుంభమేళా నిర్వహించే 45రోజుల కాలంలో జరిగే వ్యాపారాన్ని పరిశీలిస్తే, ఎన్నో వేలమందికి ఇది ఉపాధి కల్పిస్తున్నదన్న సత్యం బోధపడుతుంది. అయోధ్య రామమందిర నిర్మాణం, కాశీవిశ్వనాధుని ఆలయం పునరుద్ధరణ తర్వాత ఉత్తరప్రదేశ్‌కు మతపరమైన పర్యాటకుల సంఖ్య విశేషంగా పెరిగింది. ఫలితంగా ప్రభుత్వ ఆదాయం గణనీయమైన వృద్ధి నమోదు చేసింది.
ఇక ప్రస్తుతం ప్రయాగ్‌రాజ్‌లో జరుగతున్న 144సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహాకుంభమేళావిషయానికి వస్తే, ఈ మేళా పూర్తయ్యే నాటికి ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వనికి రూ.40కోట్ల వరకు ఆదాయం లభిస్తుందని అంచనా. అంతర్జాతీయ క్రీడా పోటీల నిర్వహణలో టిక్కెట్ల అమ్మకాలపై పుష్కలంగా ఆదాయం లభించే విధంగానే, ఆధ్యాత్మిక కుంభమేళాలో కూడా పెద్దఎత్తున ఆర్థిక లా వాదేవీల ద్వారా వ్యాపారం జోరుగా సాగి ఆదాయం పుష్కలంగా లభిస్తుంది. ప్రస్తుతం ఈ మెగాఈవెంట్‌ జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26వరకు కొనసాగుతున్నది. 2013లో జరిగిన మహా కుంభ మేళా ఆదాయం రూ.12వేల కోట్లు కాగా, కాన్ఫిడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ (సీఐఐ)అధ్యయనం ప్రకారం 2019 కుంభమేళా ఆదాయం ఏకంగా రూ.1.2లక్షల కోట్లకు పెరిగింది. విశేషమేంటంటే 2019 కుంభమేళా సందర్భంగా వివిధ రంగాలకు చెందిన ఆరు లక్షల మందికిఉపాధి లభించింది. ప్రస్తుత మహాకుంభమేళా ఆదాయం రూ.1.5లక్షల కోట్ల నుంచి రూ.2లక్షల కోట్ల వరకు వుంటుందని అంచనా. దీన్ని దాటిపోయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ప్రధాని నరేంద్రమోదీ మాటల్లో చెప్పాలంటే ‘‘కుంభమేళా సామాజిక దృఢత్వాన్ని మాత్రమే కాదు ప్రజల ఆర్థిక సాధికారతకు దోహదం చేస్తుంది’’.

రోజువారీ వస్తులావాదేవీల విలువ రూ.17310కోట్లు

ప్రస్తుత మహాకుంభ్‌ మేళాకు వచ్చే భక్తులకు రోజువారీగా అవసరమయ్యే వస్తువుల లావాదేవీలు రూ.17310కోట్లుగా చాప్టర్‌ ఆఫ్‌ కాన్ఫిడరేషన్‌ ఆఫ్‌ ఆల్‌ ఇండియా ట్రేడర్స్‌ (సీఏఐటీ) అంచనా వేసింది.. కుంభమేళా పూర్తయిన తర్వాత వీటి నిజవిలువలు వెలుగులోకి వస్తాయి. ఇక పూజాసామగ్రి వ్యాపారం రూ.2వేల కోట్లు, 45రోజుల్లో జరిగే పూల వ్యాపారం విలువ రూ.800కోట్లని అంచనా. సీఏఐటీ అంచనా ప్రకారం నిత్యావసరుకుల వ్యాపారం రూ.4వేల కోట్లు, వంటనూనెలు రూ.వెయ్యి కోట్లు, కూరగాయలు రూ.2వేల కోట్లు, దుప్పట్లు, చాపలు, ఇతర గృహావసర వస్తువుల వ్యాపారం రూ.500 కోట్లు, పాలు ఇతర డైరీ ఉత్పత్తుల వ్యాపారం రూ.4వేల కోట్ల మేర జరుగుతుందని అంచనా. ఇక హీటర్లు, బ్లోయర్ల వ్యాపారం రూ.50కోట్లు, వంటకట్టెల వ్యాపారం రూ.50కోట్లు, గంగా జలాలను తీసుకెళ్లే ప్లాస్టిక్‌ జెర్రీ క్యాన్ల వ్యాపారం రూ.60కోట్లు, హాస్పిటాలిటీ రంగ వ్యాపారం రూ.2500 కోట్లు, అద్దెకార్లు, ఈ`ఆటో రిక్షాల రవాణా వ్యాపారం రూ.300 కోట్లు, పడవలు నడిపేవారి వ్యాపారం రూ.50కోట్లు, ఇతరత్రా వ్యాపారాలు రూ.300 కోట్ల మేర జరుగుతాయని సీఏఐటీ అంచనా వేసింది.

దిగ్గజ కంపెనీల ప్రకటనల ఖర్చు రూ.3600కోట్లు

దేశంలో దిగ్గజ కంపెనీలు కుంభమేళాలో తమ బ్రాండ్ల ప్రచారం కోసం చేసే ప్రకటనల ఖర్చు రూ.3600 కోట్లు! ఇందులో 25% ఔట్‌ డోర్‌ ప్రకటనలకే ఖర్చు చేస్తున్నారు. ఐటీసీ, కోకాకోలా, ఆదానీ, హిందూస్థాన్‌ యూనిలివర్‌, డాబర్‌, బిస్లరీ, పార్క్‌G, ఇమానీ, రిలయన్స్‌ వినియోగ ఉత్పత్తులు, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, స్పైస్‌ జెట్‌ వంటి సంస్థలు బ్రాండిరగ్‌ హక్కులను పొందాయి. పర్యాటకం, హాస్పిటాలిటీ రంగాలతో పాటు స్పిరిచ్యువల్‌ యాప్‌ల ద్వారా స్టార్టప్‌లు, టెక్‌ ప్లాట్‌ఫా మ్‌లు ఆదాయం పొందుతున్నాయి.

అన్ని వర్గాలకు ఆదాయం

ప్రయాగ్‌రాజ్‌కు భక్తులు సాధారణంగా బస్సులు, రైళ్లు, విమానాల్లో చేరుకుంటారు. హోటళ్లు, అతిథి గృహాలు, ఆహారం కొనుగోళ్లు, మందులు ఇతర అవసరాలకు కూడా వీరు పెద్దమొత్తంలోఖర్చు చేస్తారు. ఈ రంగాలకు చెందిన వేలాదిమందికి ఈవిధంగా జీవనోపాధి లభిస్తున్నది. ఇక పితృకార్యాలు ఇతరత్రా పూజలు నిర్వహించే వెయ్యిమంది పురోహితులకు కూడా కుంభమేళా మంచి ఉపాధిని కల్పిస్తున్నది. ప్రయాగ్‌రాజ్‌, చుట్టుపక్కల ప్రాంతాల్లో 150 హోటళ్లు, సంగం సిటీ వద్ద కొత్తగా నిర్మించిన రెండు ఫైవ్‌స్టార్‌ హోటళ్లు తమ ఆతిథ్య సేవలను కొనసాగిస్తున్నా యి. హోమ్‌ స్టేలు, లగ్జరీ టెంట్‌ సిటీలు, కాటేజ్‌లనుంచి, అత్యంత విలాసవంతమై డోమ్‌ సిటీల్లో కూడా వసతి సదుపాయాలు కల్పిస్తున్నారు. వీటిల్లో రోజుకు రూ.7000 నుంచి రూ.1.10లక్షల వరకు వసూలు చేస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే మహాకుంభమేళా ఏ ఒక్క వర్గానికో ఉపాధిని కల్పించడంలేదు. పాలు అమ్ముకునేవారి వద్దనుంచి, హెలికాప్టర్లు అద్దెకు నడిపే కంపెనీల వరకు అతిపెద్ద ఆదాయవనరుగా కొనసాగుతోంది. హెలికాప్టర్‌ సర్వీసు ద్వారా రోజుకు రూ.3.5కోట్ల మేర వ్యాపారం నడుస్తోంది. ఒక్కొక్క భక్తుడినుంచి ఒక ట్రిప్‌ హెలికాప్టర్‌ సర్వీసుకు రూ.5వేలు వసూలు చేస్తున్నారు. ఆవిధంగా 45 రోజుల్లో 7వేల మందిభక్తులకు ఈ సర్వీసులు తమ సేవలను అందిస్తాయి. ఆవిధంగా హెలికాప్టర్‌ సర్వీసు ఆదాయం రూ.157కోట్లు రాగలదని అంచనా. కొన్ని అంచనాల ప్రకారం ఈసారి మహాకుంభ్‌ మేళా ఆదాయం రూ.2లక్షల కో ట్లు దాటే అవకాశముందని తెలుస్తోంది.

ప్రయాగ్‌రాజ్‌ నావిక్‌ సంఫ్‌ులో నమోదైన పడవల సంఖ్య ఆరువేలు. పడవ ప్రయాణం చేసే వ్య క్తులు ఒక్కొక్కరినుంచి వసూలు చేసే మొత్తం రూ.60 నుంచి రూ.90కి పెంచారు. సగటున ప్రతిరోజు పడవనడిపేవారి ఆదాయం ఒక్కొక్కరికి రూ.800 నుంచి రూ.1000 వరకు వుంటుంది.సాధారణంగా రోజుకు మొత్తం పడవలవారి ఆదాయం రూ.50లక్షల వరకు వుంటుంది. మొత్తం మేళా పూర్తయ్యేసరికి ఈ ఆదాయం రూ.22కోట్లుగా వుండగలదని అంచనా. ఇక వీధివ్యాపార్లు, రిటైల్‌ వ్యాపారులకు సంబంధించి దుప్పట్లు, ఉలెన్‌ వస్త్రాలు, సేమ్యా, చిరుతిండ్లు, స్క్రాప్‌ మా ర్కెట్‌ వ్యాపారంలో లెక్కలోకి రాని పెద్దమొత్తంలో ఆర్థిక లావాదేవీలు జరుగుతాయి. ఒకరకంగా చెప్పాలంటే ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక మేళా అయిన మహాకుంభ్‌ మొత్తం ఆదాయం అంచనా వేయగలం కానీ, వాస్తవ గణాంకాలు వెలికి తీయడం కష్టం. ఇదే సమయంలో విదేశీ భక్తులు కూడా మహాకుంభ్‌ను సందర్శిస్తారు. వీరినుంచి కూడా కనబడని ఆదాయం లభిస్తుంది. ఇంతపెద్దమొత్తంలో ఆదాయం లభిస్తుంది కనుకనే ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం రూ.7వేల కోట్లతో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసింది. 14 రోడ్‌ ఒవర్‌ బ్రిడ్జ్‌లు (ఆర్‌ఓబీ లు) మరియు రోడ్‌ అండర్‌ బ్రిడ్జ్‌లు, 61 రోడ్లు, 14 క్రాస్‌ పాయింట్ల వద్ద సుందరీకరణ చర్యలను ప్రభుత్వం చేపట్టి పూర్తిచేసింది. 2024`25 బడ్జెట్‌లో యు.పి. ప్రభుత్వం మహాకుంభమేళా నిర్వహణకు కేటా యించిన బడ్జెట్‌ రూ.2500 కోట్లు. ఇదేసమయంలో కేంద్రం రూ.2100 కోట్లుగ్రాంట్‌గా అందజేసింది. 2019 కుంభమేళాకు యు.పి. ప్రభుత్వం 4200 కోట్లు కేటాయించగా, 2013 కుంభమేళాకు అప్పటి ప్రభుత్వం కేవలం రూ.1300 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. ఈ ఏడాది కుంభమేళాకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి భక్తుల సౌకర్యార్థం రూ.12,670 కోట్లు ఖర్చు చేసా యి.

హైందవ సంస్కృతి శ్రేష్ఠత

నిజానికి హైందవ సంస్కృతిలో పండుగలు, ఉత్సవాలు, దేవాలయాలు, వివాహాలను పరిశీలిస్తే, ఇవన్నీ ఎన్నో వృత్తులవారికి జీవనోపాధికి మార్గమన్నది మనకు తెలుస్తుంది. అంటే హైందవంలోఅనుసరించే ప్రతి సంప్రదాయం వెనుక ‘జీవనోపాధి’ అనేది అంతర్లీనంగా వుంటుందనేది అక్షర సత్యం. హిందూమతం సర్వశ్రేష్ఠత వ్యక్తమయ్యేది ఇక్కడే. అందువల్లనే పండుగలు చిన్నవైనా పెద్దవైనా భారత ఆర్థిక వ్యవస్థలో ఒక భాగంగా కొనసాగుతున్నాయి. ఎందుకంటే పర్వదినాలకు ప్రధాన ఆదాయ వనరు వినియోగదారులే. ఈ వినియోగం మొత్తం జీడీపీలో 60శాతం వరకు వుంటున్నదంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. సరళీకృత ఆర్థిక విధానాలను అమల్లోకి తెచ్చిన తర్వాత, భారత ఆర్థిక వ్యవస్థ కేవలం వినియోగం పెరగడం వల్లనే అభివృద్ధి చెందింది. ఈ నేపథ్యంలోనే రాబోయే కొద్ది సంవత్సరాల్లో భారత్‌ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద వినియోగ మార్కెట్‌గా రూపొందుతుందని అంచనా. పశ్చిమ దేశాల్లో క్రిస్ట్‌మస్‌ సీజన్‌, చైనాలో ‘సింగిల్స్‌ డే’వంటి షాపింగ్‌ ఫెస్టివల్స్‌లో జరిగే వినియోగాన్ని భారతీయ పర్వదినాల్లో జరిగే వినియోగంతో సమానంగా చెప్పడానికి యత్నిస్తారు. నిజానికి మనదేశంలో పండుగలు ఏడాది పొడవునా జరుగుతాయి కనుక, వీటి సందర్భాల్లో జరిగే వినియోగంతో పోలిస్తే అవెందుకూ సాటిరావు. నిజం చెప్పాలంటే పర్వదినాలు ఉపాధి అవకాశాలను పెంచుతాయి. స్థానిక వ్యాపారం బాగా పుంజుకుంటుంది. నేరుగా వినియోగదార్లతో జరిపే చిరు వ్యాపారం (డీ2సీ) పండుగ రోజుల్లో చాలా పెద్దమొత్తంలో జరుగుతుంది. అదేవిధంగా దేవాలయాలు కూడా స్థానిక పండుగలు, ఉత్సవాల సందర్భంగా వ్యాపారాభివృద్ధికి ఇతోధికంగా దోహదపడుతున్నాయి. దశాబ్దకాలం క్రితం భారతీయులోరోటీ, కపడా ఔర్‌ మకాన్‌ పైనే దృష్టి పెట్టాల్సి వచ్చేది.కానీ ఈ దశాబ్ద కాలంలో ప్రజల జీవనశైలిలో విపరీతమైన మార్పులు వచ్చేశాయి. నేషనల్‌ అకౌంట్‌ స్టాటిస్టిక్స్‌ డేటా`2024 ప్రకారం ప్రస్తుతం వినియోగదార్లు ఖర్చుకు వెనుకాడటం లేదు, తమకు అందే సేవల నాణ్యతపైనే దృష్టిపెట్టే స్థాయికి ఎదిగారు. ఇది మన దేశ పౌరుల ఆర్థికాభివృద్ధికి గొప్ప ఉదాహరణగా చెప్పాలి.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version