Headlines

బీ ఆర్ ఎస్ నియోజవర్గ సమావేశంను విజయవంతం చేయాలి

బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కిషన్ రెడ్డి

ముత్తారం :- నేటి ధాత్రి

బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ముఖ్యమంత్రి కెసిఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ మార్గ నిర్దేశకత్వంలో ,మంథని నియోజక వర్గ ఇంఛార్జి పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ ఆధ్వర్యంలో జరిగే మంథని నియోజకవర్గ బి అర్ ఎస్ పార్టీ సమావేశాన్ని విజయవంతం చేయాలని బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పోతిపెద్ది కిషన్ రెడ్డి తెలిపారు పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి , మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ముఖ్య అతిథిగా 16.04.2024 మంగళవారం రోజున ఉదయం 11.00 గంట లకు పార్లమెంటు ఎన్నికల విషయమై మంథని ఎస్.ఎల్.బి ఫంక్షన్ హాల్ సమావేశం ఉంటుందన్నారు పార్లమెంటరీ ఎన్నికలలో గెలుపు పార్టీ పటిష్టత ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా కార్యకర్తలకు దిశా నిర్దేశం ఉంటుందన్నారు ఈ కార్యక్రమానికి మండలంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు గ్రామ శాఖ అధ్యక్షులు,మండలంలోని వివిధ హోదాల్లో గల యువత, మహిళా బీసీ, ఎస్ సి, ఎస్ టి,మైనారిటీ నాయకులు ప్రజా ప్రతినిధులు మాజీ ప్రజా ప్రతినిధులు అనుబంధ సంఘాల నాయకులు హాజరుకావాలని కిషన్ రెడ్డి తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *