BJP Celebrates Foundation Day in Chityal
దేశం కోసం ధర్మం కోసం ప్రజల శ్రేయస్సు కోసం పనిచేసే పార్టీ బిజెపి.
బిజెపి మండల అధ్యక్షుడు బుర్ర వెంకటేష్ గౌడ్.
చిట్యాల, నేటిదాత్రి :
భారతదేశంలో ఆదర్శాలకు సంస్కృతికి సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్న ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ బిజెపి అని చిట్యాల మండలాధ్యక్షుడు బుర్ర వెంకటేష్ గౌడ్* అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
భారతీయ జనతా పార్టీ జన సంఘ్* , జనతా పార్టీ* నుండి 1980 ఏప్రిల్ 6వ తేదీన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి*, లాల్ కృష్ణ అద్వాని నేతృత్వంలో ఆవిర్భంచి నేటికీ 46 సంవత్సరాలు పూర్తికావస్తున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ జెండాను చిట్యాల మండల కేంద్రంలో గల బీజేపీ కార్యాలయంలో బిజెపి జెండా ఎగరవేయడం జరిగిందిఅని సిద్ధాంతాలకు* కట్టుబడి పనిచేస్తూ ప్రపంచంలోనే* ఎక్కువ సభ్యత్వాలు గలఅతిపెద్ద పార్టీగా బిజెపి అవతరించిందని 2 పార్లమెంటు సీట్లతోనే ప్రారంభమై వరుసగా మూడోసారి కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో అధికారంలో ఉండి అనేక సంక్షేమ పథకాలు అందించిన ఘనత మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దని 500 సంవత్సరాల క్రితం నెరవేరని అనేకమైనటువంటి సమస్యలను పరిష్కరిస్తూ ఈరోజు దేశభక్తిని ప్రతి పౌరునికి అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని దేశం కోసం ధర్మం* కోసం దేశ ప్రజల శ్రేయస్ కోసం బిజెపి పనిచేస్తుందని ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీనీ ఆదరించాలని వెంకటేష్ గౌడ్ అన్నారు
ఈ కార్యక్రమంలో బిజెపి మండల ప్రధాన కార్యదర్శి మైదం శ్రీకాంత్ బిజెపి సీనియర్ నాయకులు గజానాల రవీందర్ ఓదెల శ్రీహరి సాదా సదానందం గుర్రపు రవి రాయిని శ్రీనివాస్ చింతల రాజేందర్ కేంసారపు ప్రభాకర్ పల్లాల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
