Road Safety Awareness for Students in Kodad
రోడ్డు భద్రత పై విద్యార్థులకు అవగాహన.కోదాడ ట్రాఫిక్ ఎస్సై అంజిరెడ్డి
కోదాడ, నేటి ధాత్రి:
పట్టణంలోని పీఎం శ్రీ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాన్ని కోదాడ పట్టణ ట్రాఫిక్ అంజిరెడ్డి విద్యార్థులకు రోడ్డు భద్రత పాటించవలసిన నియమ నిబంధనలను విద్యార్థులు లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే వారి తల్లిదండ్రులకు జైలు శిక్ష పడుతుందని, త్రిబుల్ రైడింగ్ చేయవద్దు, వాహనం నడిపే వారితో పాటు కూర్చున్న వారు కూడా హెల్మెట్ ని ధరించాలని, అతివేగంగా వాహనాలు నడపొద్దు ప్రాణాలను కోల్పోవద్దు అని విద్యార్థులకు కోరుతూ ఆకాక్షించారు. సెల్ ఫోనులో వాట్సప్ ఫేస్బుక్ ఇంస్టాగ్రామ్ లలో పరిచయంలేని వారి రీల్స్ చూడవద్దు, లింకులు తెరవొద్దు, విద్యా విషయ పరిజ్ఞానం కోసమే సెల్ ఫోన్ ఉపయోగించాలని సైబర్ క్రైమ్ దూరంగా ఉండాలని విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టి తల్లిదండ్రులకు సంతోషాన్ని కీర్తి ప్రతిష్టలు తేవాలని ఉజ్వల భవిష్యత్తు కోసం కష్టపడాలని తెలిపినారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు డి. మార్కండేయ, ట్రాఫిక్ సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
