మహబూబ్ నగర్/నేటి ధాత్రి
మహబూబ్నగర్ నియోజకవర్గంలోని దివిటిపల్లి డబుల్ బెడ్రూం కాలనీలో శ్రీ జిట్టా ఆంజనేయ స్వామి, నవగ్రహ దేవతలను, ధ్వజ స్థంభం మరియు బొడ్రాయి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవానికి ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సోమవారం ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామానికి రక్షణగా నిలబడే ఆంజనేయ స్వామి వారిని అలాగే గ్రామాన్ని కంటికి రెప్పలా కాపాడే బొడ్రయిని కాలనీలో అంగరంగ వైభవంగా ప్రతిష్టించుకోవడం సంతోషదాయకంగా ఉందన్నారు. మంచి వాతావరణంలో ప్రతిష్టించుకొన్న ఈ ఆలయ ప్రాంగణంలో నిత్యం భక్తులతో కిటకిటలాడాలని, ఇక్కడ ప్రతిష్టించుకొన్న ఆంజనేయ స్వామి భక్తుల కోరికలు తీర్చాలని, స్వామి దర్శనం చేసుకొంటే మానసిక ప్రశాంతత లభిస్తుందని అన్నారు. ఈ దేవాలయ అభివృద్ధి బాధ్యత నాది కూడా అని ఆయన అన్నారు. రాబోయే రోజుల్లో ఈ దేవాలయాన్ని అందరం కలిసి మరింత అద్భుతంగా అభివృద్ధి చేసుకుందామన్నారు .ఈ కార్యక్రమంలో శివప్రసాద్ రెడ్డి, సురేందర్ రెడ్డి, చర్ల శ్రీనివాసులు, జే.చంద్రశేఖర్ , మురళి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ , మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ షబ్బీర్ అహ్మద్ , మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.