కమ్మపెల్లి పాఠశాలల్లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం..
నర్సంపేట,నేటిధాత్రి:
నర్సంపేట మండలంలోని కమ్మపెల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల 2004-05 సంవత్సరానికి చెందిన పదవ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్యఅతిథిగా ఆనాటి ప్రధానోపాధ్యాయులు అప్పారావు హాజరై మాట్లాడారు.20 సంవత్సరాల తర్వాత విద్యార్థులు అందరూ కలిసి ఉపాధ్యాయులను గౌరవించడం సంతోషంగా ఉందన్నారు. కాగా కమ్మపెల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలతో ఉన్న అనుబంధాలను తీపి గుర్తులను నెమరేసుకున్నారు.ప్రభుత్వ పాఠశాలను జీవితంలో మరిచిపోలేనని ఇక్కడి విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరారని అన్నారు. మీ పిల్లలను కూడా ఉన్నత చదువులు చదివిపించి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసేలా కృషి చేయాలని సూచించారు.అనంతరం పూర్వాపు విద్యార్థులు అందరూ తమ తీపి గుర్తులను అనుభవాలను అందరితో కలిసి పంచుకున్నారు. అనంతరం విద్యార్థులంతా కలిసి ఆట పాటలతో అలరించారు.ఈ కార్యక్రమంలో నాటి ఉపాధ్యాయులు మల్లికార్జున్ వీరయ్య శంకర్ బాయ్ మదన్ మోహన్ లతోపాటు పూర్వపు విద్యార్థులు కాలే రాజు,ఏడేల్లి మహేందర్ రెడ్డి ,భాషబోయిన రాజు,తంగళ్ళపెల్లి గణేష్,తుమ్మ వెంకటేశ్వర్లు,గట్ల రాజు,ఆరేళ్లి గౌతమి తదితర పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.