₹1 Crore Insurance Cheque Given to Deceased Worker’s Family
మరణించిన కుటుంబానికి కోటిరుపాయల భీమా చెక్కు అందజేత
పరకాల,నేటిధాత్రి
పరకాల డిపోకు చెందిన కోచ్ బిల్డర్ దివంగత పి.రవి ఈనెల 1న జరిగిన ప్రమాదంలో మరణించగా ప్రమాద మరణ బీమా క్లెయిమ్ కింద కోటి రూపాయల విలువైన చెక్కును వరంగల్ రీజనల్ మేనేజర్ దర్శనం విజయ భాను సమక్షంలో యూనియన్ బ్యాంక్ హైదరాబాద్ జోన్ జనరల్ మేనేజర్ టి.కామేశ్వర్ రావు మరియు యూనియన్ బ్యాంక్ డిప్యూటీ జనరల్ మేనేజర్ జి.కమలాకర్ తో కలిసి అందజేశారు.ఈ సందర్బంగా రీజనల్ మేనేజర్ దర్శనం విజయ భాను మాట్లాడుతూ ఉద్యోగులు ప్రమాదం జరగకుండా జాగ్రత్తగా ఉండాలని తమ కుటుంబ భద్రత దృష్ట్యా బీమా పథకాలను వినియోగించుకోవడం చాలా అవసరమని తెలిపారు.అలాగే యూనియన్ బ్యాంక్ ద్వారా తక్కువ వడ్డీ రేట్లతో అందిస్తున్న గృహ రుణాలు, వ్యక్తిగత రుణాలు,విద్యా రుణాలను ఉద్యోగులు వినియోగించుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ రీజనల్ మేనేజర్ (ఆపరేషన్స్)భాను కిరణ్, పరకాల డిపో మేనేజర్ రామ్ ప్రసాద్,వరంగల్1డిపో మేనేజర్ అర్పిత,పర్సనల్ ఆఫీసర్ సైదులు,అకౌంట్స్ ఆఫీసర్ రవీందర్ తదితర అధికారులు పాల్గొన్నారు.
