
BRS Leaders Arrest Sparks Controversy in Shyampet
బిఆర్ఎస్ పార్టీ నాయకుల ను అరెస్టు చేయడం సిగ్గు చేటు
వారికి భేషరతుగా క్షమాపణ చెప్పాలి
శాయంపేట నేటిధాత్రి;
శాయంపేట మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులు గంగుల మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో టేకుమట్ల మండల కేంద్రంలో అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులే రోడ్డె క్కి తమ ఎమ్మెల్యే అవినీతి, అక్రమాలపై, అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలంటు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షు లు నిన్న ధర్నా చేయడం, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయ ణ రావు ఇసుక అక్రమ రవా ణాను అడ్డుకుంటానని బహిరం గంగా చెబుతూనే తన అనుచరులతో ఈ అక్రమ రవాణాను కొనసాగిస్తున్నా డంటూ కాంగ్రెస్ నాయకులే చెబుతున్నారంటే, అక్రమ ఇసుక రవాణా ఎంత జోరుగా సాగుతుందో అర్థం చేసుకోవ చ్చు.అక్రమ ఇసుక రవాణాను అరికట్టవలసిన అధికారులు చోద్యం చూస్తున్నారంటే వారికి ఏమైనా హామ్యామ్యాలు అందుతున్నాయా విమర్శలు వస్తున్నాయి. అధికారులు ఎమ్మెల్యేకు కొమ్ముకోస్తున్నా రంటూ విమర్శలు వస్తున్నా యి, కాంగ్రెస్ నాయకులే రోడ్డెక్కారంటే అవినీతి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవ చ్చు, ఇకనైనా నియోజకవర్గ ప్రజలు మన ఎమ్మెల్యే అవి నీతి అక్రమాలను అర్థం చేసుకోవాలని, నిన్న టేకుమట్ల మండలంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులను అరెస్టు చేయడం సిగ్గుచేటు అంటూ వారికి బేష రత్తుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులకు సరిపడా యూరియా అందివ్వ లేని అసమర్ధ ఎమ్మెల్యే ఇదే అదనుగా అక్రమంగా ఇసుక తరలిస్తూ పైసలు దండుకుం టున్నాడు. దీన్ని నిశితంగా పరిశీలిస్తున్న నియోజకవర్గ ప్రజలు రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకుల కు తగిన గుణపాఠం ప్రజలు చెప్తారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి, వంగల నారాయ ణరెడ్డి, రామ్ శెట్టి లక్ష్మారెడ్డి, మేకల శ్రీనివాస్, మారపెల్లి నందం, మారపెల్లి మోహన్, అరికెళ్ల ప్రసాద్ దైనంపల్లి సుమన్ , కుసుమ శరత్, మేకల వెంకటేశ్వర్లు, వల్పదా సు చంద్రమౌళి,గడిపే విజయ్, కరుణ్ బాబు, సౌల్ల కిష్టయ్య, నర్రరాజు, రంగు మహేందర్, కృష్ణారెడ్డి, కొమ్మల శివ, అజయ్ కుమార్, కుథాటి రమేష్, వినయ్ సోషల్ మీడి యా మండల కన్వీనర్ దాసి శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.