
Munjur Nagar landowner
ఓదేలు స్వంత అన్నా మాకు భూమి విక్రయించాడు.
బాట స్థలాన్ని బర్ల ఫామ్ గా మార్చుకున్నాడు.
ఆ స్థలాన్ని ఖాళీ చేపించాలని మున్సిపాలిటీ కి పిర్యాదు చేశాం.
ఇందులో ఎమ్మేల్యే కు ఎలాంటి సంబంధం లేదు.
విలేకర్ల సమావేశంలో ముంజూర్ నగర్ భూభాధితుల వెల్లడి.
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి జిల్లా ముంజూర్ నగర్ లో రెండు రోజుల క్రితం
కురాకుల ఓదెలు లలిత దంపతులు తను బర్ల కోసం వేసికున్న షెడ్డు తమ భూమిలోనే ఉన్నాయని భూభాధితుల పేర్కొన్నారు. శనివారం భూపాలపల్లి ప్రెస్ క్లబ్ లో భూమికి సంబందించిన డాకుమెంట్స్ పత్రాలతో వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎలాంటి పత్రలు లేకున్నా తాము కొనుగోలు చేసిన రోడ్డును కబ్జా చేసి ఓదేలు షెడ్డు నిర్మించడని అన్నారు. అయితే ఆ భూమికి సంబంధించి 2010 లొ కొనుగోలు చేసిన దొంతుల వేణుమాధవ్ సర్వే నెంబర్ 192లో అట్టి భూమిని కూరకుల రాజయ్య దగ్గర కొనుగోలు చేయడం జరిగిందని పేర్కోన్నారు. వేణు మాధవ్నుండి 2015 లో 31 గుంటల భూమి ని మేకల రమేష్ కొనుగోలు చేసుకుని రిగిస్ట్రేషన్ చేసుకున్నామని అన్నారు. ఆ భూమి కొనుగోలు అగ్రిమెంట్ లో మెయిన్ రోడ్డు నుండి 33 ఫీట్ల దారిని తీసి ఇచ్ఛారని తెలిపారు. అప్పటి నుండి ఓదేలు దారి భూమిలో బర్ల ఫామ్ వేసుకొని తమను ఇంబందులు పెట్టున్నారని అన్నారు. దింతో జిల్లా ఎస్పీ కి, మున్సిపల్ అధికారులకు పిర్యాదు చేయడంతో సరైన సర్వే చేసి అభూమి రోడ్డుకు ,పక్కనే ఉన్న పాఠశాలకు సంబంధించిన రోడ్డు అని నిర్దారించి,అషెడ్డు ను కులగొట్టాడం జరిగిందన్నారు.
అయితే దీన్ని అదును చేసుకొని స్థానిక ఎన్నికల్లో మెప్పుకోసం… కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి కలిసి కురాకుల ఓదెలు,లలిత దంపతులను తప్పుదోవ పట్టించి ఎమ్మెల్యే ను బాధానాం చేస్తున్నారని అన్నారు. ఆ భూమి కి సంబంధించిన దొంతుల వేణుమాధవ్, మేకల రమేష్ ఆ భూమికి సంబంధించిన అన్ని రకాల లింక్ డాక్యుమెంట్లను మీడియా సమావేశంలో చూపించారు.ఈ సమావేశంలో భూభాధితులు టెంట్ రమేష్ రాపర్తి ఆమర్నాధ్, మోగిలి తదితరులు ఉన్నారు.
ఫొటోస్.