రామలింగేశ్వర స్వామి 4వ వార్షికోత్సవం
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలం లక్ష్మారెడ్డి పల్లి గ్రామంలో నేడు శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో నాలుగవ వార్షికోత్సవ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అర్చకులు బలబత్తుల రాజకుమార్ తెలిపారు.
నాలుగో వార్షికోత్సవం పురస్కరించుకొని గ్రామస్తులు ఆధ్వర్యంలో ఉదయం మంగళవారం రోజున మన రామలింగేశ్వర స్వామి దేవతా మూర్తులకు పంచామృత అభిషేకం,అర్చనాది కార్యక్రమాలను ఘనంగా నిర్వహించడం జరుగుతుంది.
ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు అందరూ కూడా పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులు కాగలరని అర్చకులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.
వార్షికోత్సవ సందర్భంగా రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లను చేయడం జరుగుతుందని ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలందరూ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.