ఇరాన్ పాలస్తీనాలపై ఇజ్రాయిల్ యుద్ధాన్ని తక్షణమే ఆపాలి.

Immediate Immediate

ఇరాన్ పాలస్తీనాలపై ఇజ్రాయిల్ యుద్ధాన్ని తక్షణమే ఆపాలి…

వామపక్ష పార్టీల డిమాండ్

నేటి ధాత్ర:

మహబూబాబాద్ :గత 20 నెలలుగా గాజాలో పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయెల్ నిరంతర బాంబు,వైమానిక దాడులకు పాల్పడుతూ,మారణహోమాన్ని సృష్టిస్తూ యుద్ధానికి పూనుకున్నదని,ఇప్పుడు ఇరాన్ పై యుద్ధం ప్రకటించి జనావాసాలపై రాకెట్ దాడులతో విద్వంసం సృష్టిస్తున్నదని వామపక్ష పార్టీల జిల్లా కార్యదర్శులు గౌని ఐలయ్య, విజయసారధి, సాదుల శ్రీనివాస్, పాయం చంద్రన్నలు అన్నారు.10వామపక్ష పార్టీల పిలుపు మేరకు గురువారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ సెంటర్ లో ఇజ్రాయిల్ యుద్దోన్మాదానికి వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు. ఈధర్నా నుద్దేశించి సీపీఐ ఎం-ఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి గౌని ఐలయ్య,సీపీఐ జిల్లా కార్యదర్శి బి విజయసారధి, సీపీఎం జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్,సీపీఐ ఎం-ఎల్ మాస్ లైన్ జిల్లా కార్యదర్శి పాయం చంద్రన్నలు ప్రసంగిస్తూ,ఇజ్రాయిల్ యుద్దోన్మాదానికి లస్తీనాలో ఇప్పటికే దాదాపు 50వేల మంది మరణించారని, మౌలిక సదుపాయాలు, ఆసుపత్రులు, పాఠశాలలు, మహిళలు, పిల్లలు మరియు శరణార్థుల ఆశ్రయాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయిల్ వేలాదిమందిని పొట్టన పెట్టుకుంటున్నదని విమర్శించారు.పాలస్తీనాలో పుట్టిన పసిపిల్లలను కూడా చంపుతామని ఇజ్రాయిల్ మంత్రి ప్రకటించటం ఆ దేశం యొక్క అమానవీయ యుద్ధ పిపాసతకు నిదర్శనమని పేర్కొన్నారు. కనీసం ఆహారాన్ని అందించడానికి కూడా ఆటంకాలు కల్పిస్తున్నదని, ఐక్యరాజ్య సమితితో పాటు, ప్రపంచవ్యాపితంగా ఈ దుశ్చర్యను వ్యతిరేకిస్తున్నా, అమెరికా దాని కొన్ని మిత్రదేశాల మద్దతుతో ఇజ్రాయిల్ ఈదాడులు కొనసాగిస్తున్నదని అన్నారు.

Immediate

ఇటీవల ఇరాన్ పై కూడా యుద్ధాన్ని ప్రకటించి భీభత్సం సృష్టిస్తున్నదని,అంతర్జాతీయ చట్టాలను, మానవహక్కులను కాలరాస్తున్నదని ఈదురహంకార మారణ హెూమ యుద్ధాన్ని వామపక్ష పార్టీలు తీవ్రంగా ఖండించాలన్నారు.మోడీ ప్రభుత్వం ఇజ్రాయిల్ అనుకూల విధానాలను విడనాడాలని, పాలస్తీనా ప్రజలకు అండగా నిలవాలని, ఇజ్రాయిల్తో అన్ని రకాల సైనిక మరియు భద్రతా సహకారాలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.ఇజ్రాయిల్ దాష్టీకానికి బలౌతున్న పాలస్తీనాకు సంఘీభావంగా నిలబడాలని వారు కోరారు.అనంతరం దురాక్రమణవాది,యుద్దోన్మాది ఇజ్రాయిల్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.ఈకార్యక్రమంలో సీపీఐ, సీపీఎం, సీపీఐ ఎం-ఎల్ న్యూడెమోక్రసీ, సీపీఐ ఎం-ఎల్ మాస్ లైన్ జిల్లా, డివిజన్ నాయకులు అజయ్ సారథి, పెరుగు కుమార్, రేషపల్లి నవీన్, చింతకుంట వెంకన్న, ఎండీ ఫాతిమా, లింగ్యా నాయక్,చిరంజీవి, గునిగంటి రాజన్న, సమ్మెట రాజమౌళి, హేమా నాయక్, ముస్తఫా,రషీద్, నందగిరి వెంకటేశ్వర్లు, గుజ్జు దేవేందర్, హలావత్ లింగ్యా, యస్కే బాబు,తుడుం వీరభద్రం, బోనగిరి మధు,బట్టు చైతన్య,కొత్తపల్లి రవి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!