రైతు బంధు నిధులు విడుదల చేసిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన మాజీ ఎంపిటిసి వాసాల రామస్వామి
జమ్మికుంట :నేటిధాత్రి

రైతుబంధు నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు, మాజీ ఎంపీటీసీ వాసలా రామస్వామి,, ఇ సందర్బంగా మాట్లాడుతూ..ఎకరాలతో సంబంధం లేకుండా రైతులు సాగు చేసిన అన్ని ఎకరాలకు కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి, పంటకు ఎకరాకు 6 వేలు చొప్పున సోమవారం రైతు నేస్తం కార్య క్రమంలో పాల్గొని రైతు బందు నిధులు విడుదల చేయడం పట్ల దన్యవాదాలు తెలుపుతున్నం అని జమ్మికుంట కాంగ్రెస్ నాయకులు, తనుగుల తాజా మాజీ ఎంపీటీసీ వాసలా రామస్వామి మాట్లాడారు.ప్రస్తుత పంట సాగు ప్రారంభించిన రాష్ట్ర వ్యాప్త రైతులకు ఈ బెట్టుబడి సహాయం ఎంతో లబ్ధి చేకూరుతుందని
రామస్వామి అన్నారు. నిజానికి రైతుల పక్షపాతి కాంగ్రెస్ ప్రభుత్వం అని కొనియాడారు.