ఇందిరమ్మ ఇల్లు అర్హులకు ఇవ్వాలి.కార్యకర్తలకు కాదు.
చిట్యాల, నేటి ధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో శుక్రవారం రోజున టిఆర్ఎస్ మండల అధ్యక్షులు అల్లం రవీందర్ మాట్లాడుతూగుంట భూమి కూడా లేని పేదల పేర్లు తొలగించి భూస్వామిని పేరు పెట్టించడం జరిగిందిఅని ఇది ప్రజల ప్రభుత్వం అని గొప్పలు చెప్పి కార్యకర్తల ప్రభుత్వంగా ఇందిరమ్మ ఇల్లు కార్యకర్తలకు,కుటుంబ సంబంధితులకు మాత్రమే ఇల్లు ఇప్పిస్తున్నారు అని ఇది సమంజసం కాదని ఇలా చేస్తే ఒంటెద్దు పోకడ గా వెళ్తే ప్రజలు త్వరలో ప్రజలు బుద్ధి చెప్తారని అర్హులందరికీ న్యాయం చేయాలని అన్నారు మాజీ జెడ్పి టిసి గొర్రె సాగర్ మాట్లాడుతూ. ఇప్పటికి కైనా న్యాయ విచారణ చేసి అర్హులందరికీ ఇల్లు ఇవ్వాలని లేని యెడల దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అని హెచ్చరించారు.నిరుపేదల పక్షాన పోరాటం చేయడానికి బి ఆర్ ఎస్ పార్టీ ఎప్పుడు ముందు ఉంటది అని తెలిపారు. అర్హులు కి ఇల్లు ఇవ్వకుండా నాయకులకు ఇల్లు ఇస్తూ ఇష్టరీతినా వ్యవహరిస్తే తప్పకుండ ప్రజల నుండి శిక్ష అనుభవిస్తారు అని హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పిట్ట సురేష్,బి ఆర్ ఎస్ పార్టీ యూత్ మండల అధ్యక్షులు నవీన్, బి ఆర్ ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శులు ఎరుగొండ రాజేందర్, మడికొండ రవీందర్ రావు, జిల్లా మండల నాయకులు దామెర రాజు, వీరాస్వామి, పెరుమాండ్ల రవి తదితరులు పాల్గొన్నారు.