వార్డుల విభజన నోటిఫికేషన్
జహీరాబాద్ నేటి ధాత్రి:
కోహిర్ మున్సిపాలిటీలో వార్డుల విభజనకు నోటిఫికేషన్ జారీ అయినట్లు మున్సిపల్ కమిషనర్ రమేష్ కుమార్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. మొత్తం పదివేల 10, 859 మంది ఓటర్లకు 16 వార్డులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. చంటి నెంబర్ల ఆధారంగా కొత్త వార్డుల ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ప్రజలకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈనెల 11వ తేదీ వరకు కార్యాలయంలో ఫిర్యాదు చేయవచ్చని వివరించారు.