బైండోవర్ ఉల్లంఘించిన వ్యక్తికి జరిమానా.

bindover bindover

బైండోవర్ ఉల్లంఘించిన వ్యక్తికి జరిమానా

ఎక్సైజ్ సీఐ నరేష్ రెడ్డి..

బైండోవర్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

నర్సంపేట నేటిధాత్రి:

అక్రమ నాటుసారా అమ్ముతూ పట్టుబడి బైండోవర్ ఉల్లంఘించిన వ్యక్తికి జరిమానా విధించినట్లు ఎక్సైజ్ సీఐ నరేష్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాటుసారా నియంత్రణలో భాగంగా నర్సంపేట ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో విస్తృత తనిఖీలను నిర్వహించగా పట్టణంలోని మల్లంపల్లి రోడ్డులో ఏలేటి కృష్ణ అనే వ్యక్తి నాటుసారా అమ్ముతూ పట్టుబడినట్లు తెలిపారు. అతడు గతంలో తహసిల్దార్ ఎదుట బైండోవరై ఉన్నందున బైండోవర్ నిబంధనలను ఉల్లంఘించి తిరిగి నాటుసారా అమ్మినందున నిందితున్ని నర్సంపేట తహసిల్దార్ ఎదుట హాజరుపరచగా అతనికి రూ.50 వేలు జరిమానా విధించగా అతను చలానా రూపంలో చెల్లించడం జరిగిందని పేర్కొన్నారు.ఈ దాడులలో ఎస్సై శార్వాణి, సిబ్బంది పాల్గొన్నారు.

బైండోవర్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

నాటు సారా తయారు చేస్తూ,అమ్ముతూ పట్టుబడిన వారిని వారి ప్రవర్తన మార్చుకోమని హెచ్చరిస్తూ బైండోవర్ చేయడం జరుగుతుంది. అయినప్పటికిని పద్ధతి మార్చుకోకుండా తిరిగి అదే నేరాలకు పాల్పడినట్లయితే ఆరు నెలల జైలు శిక్ష లేదా జరిమానా విధించడం జరుగుతుందని తహసిల్దార్ రాజేష్ హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!